Friday, March 18, 2016

మిన్నేటి పొంగులు || (కవితపై శ్రీ వాచవి ముందుమాట)

Photo: కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం  1961 లో ప్రచురించింది.  దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు. 

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ  కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి,  చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల  కవిత్వమనండి,  దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని  లాక్షణికులు చెప్పారు.  '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్  మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత  ''' మిన్నేటి పొంగులు "  వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు.  అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే ' 
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో  ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని  భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని, 
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత. 
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం  మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది.  '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు  '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ 
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే  ''  మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు  సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961 


హీరాలాల్ మోరుయా - దాశరథి కల ఫొటొ హీరాలాల్ మోరియా - దాశరథి కల ఫొటొ 

కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం 1961 లో ప్రచురించింది. దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు.

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి, చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల కవిత్వమనండి, దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని లాక్షణికులు చెప్పారు. '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్ మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత ''' మిన్నేటి పొంగులు " వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు. అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే '
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని,
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత.
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది. '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే '' మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961