27, డిసెంబర్ 2013, శుక్రవారం

- ||అంకురం ||

కపిలరాంకుమార్ - ||అంకురం ||

'' ప్రణయాంకురం - మోదం ''
'' ప్రళయాంకురం - ప్రమాదం '' -

27.12.2013

22, నవంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

ఆప్ కే కద్మోం మేఁ
షుక్రియా ఆదా కరతా హూఁ హుజూర్
మగర్ కభీభి నజర్
బేజార్ మత్‌కరో!
హజార్ బార్ విచార్‌కె బినా బాత్ మత్ కరో!
తంద్రుస్తు దిమాక్‌సే పైదా హోకర్
ఖుల్లా సఫర్‌మే క్యా ఫాయిదా?
అర్జ్‌ క్యా హైకీ బినా వాయిదా
కామ్‌ సఫల్‌ హుయేతో
సబ్ లోక్ హోతా ఫిదా!
యే మొహబత్ కా వజీర్
స్వీకార కరో హమారా షర్త్
చమక్‌తే రహో సితారా జైసే
హోషియార్‌సే జీత్ హాసిల్‌కరో!
అబ్‌ ఆవో మేరేపాస్
ముజేఁ లేజానేకిలియే
తబ్‌ తక్‌  ఇంతజార్ కరూంగా!
ఆదాబ్ ...జనాబ్‌ ...ఫిర్‌ మిలేంగే!

22.11.2013 సాయంత్రం 3.32

21, నవంబర్ 2013, గురువారం

కపిల రాంకుమార్|| మినీలు ||

కపిల రాంకుమార్|| మినీలు ||

మంచిని పేంచేలోగా - నీ
పంచన  చేరినవారే
వంచనతో
ముంచుతారు!          1

పొట్ట కొట్టే వారిపై
దట్టించి ఎదురుతిరగ
జట్టుకట్టేదెపుడో
పట్టుచిక్కేదెపుడో
పొట్టకూటిగాళ్ళ
గట్టి  సవాలప్పుడే!       2

ఎంతమంది చీ కొట్టినా
ఎంతమంది అభిశంసించినా
కుక్కతోక వంకర తీయలేం కాని
కత్తిరంచవచ్చుగా
ఉన్మాదులాగడాలు
ఆగాలంటే!                   3

10.11.2013 ఉదయం 9.45

15, నవంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్|| మనచేతిలోనే - మన చేతల్లోనే ||

కపిల రాంకుమార్|| మనచేతిలోనే -  మన చేతల్లోనే ||

మంత్రాలర్థంకాకపోయినా
సూత్రాలకు తలవంచే మగువ
సూత్రబద్ధ సంసారంలో
తగు పాత్ర పోషణ చేయడంలో
చెలికాని సహకారముంటే
గృహమే స్వర్గసీమవుతుంది!
ప్రేమైతేనేమి, పునాది లేకపోతే
పురిటిలోనే సంధికొట్టి
పురికొస విడిపోదా!
స్పర్థలు మొలకెత్తి
సౌధం పగుళ్ళు వారితే
పగలే చీకటై
పొగలు, పగలు కమ్ముకోదా
ఒప్పందాలు రద్దై నడిరోడ్డున సంసారం పడదా?
విచ్చిన్నాలకాలవాలమై
కుండ పగిలినట్లు
గుండె పొగిలిపొగిలి విలపించదా!
తెగిన గాలిపటమై
అగమ్యగోచరమై
అభాసుపాలు కాకుండా కాపాడుకోకపోతే
కుక్కలు చింపిన విస్తరి కాదా జీవితం?
ఊకగా మారిన ఊసులకు
చేసుకున్న బాసలకు
కాపుదల లేకపోతే
వృక్షం కూలిపోదా!
వేరు పురుగు చేరి కుళ్ళిపోదా!
అటు యిటు తరాల
అంతరాలు - అంతరంగాలు
బేరీజువేసే కొలమానం లేకపోతే
పర్వవసానం యిదేగా!
సాప్తపదీనం, ఐరేని కుండలు,
మోటైనా, మాట కట్టుబడి
సంబంధాలను కొనసాగించలేకపోతే
కొసలు పురి వీడినట్టే
వివాహబంధం విడిపోదా?
వైవాహిక విధానం యేదైనా
జతగా అడుగులు కలిస్తేనే
సంసారపు మనుగడ
నవ యువ దంపతుల చేతిలోనే
చేతల్లోనే వుందనేది  
మాత్రం నిర్వివాదాంశం!

13.11.2013 సాయంత్రం  3.53

కపిల రాంకుమార్|| మొగ్గలు ||

కపిల రాంకుమార్|| మొగ్గలు ||
పిల్లి మొగ్గలు వేస్తుంటే సరదానే
కాని ( ఆడ) పిల్లకి మల్లె  మొగ్గలిస్తే
బుగ్గలు వాస్తాయిరోయ్!

పిల్లలూ అల్లరి వారు కాకండి
నలుగురిలో పేరు తెచ్చుకునే మెలగండీ!
చదువు, జ్ఞానం యిచ్చే వెలుగులో
పదుగురికి ఆదర్శంగా ఎదగండి!

**
అమ్మా నాన్న లేని అనాథలకు
ఆశ్రయం కల్పించే ఆశ్రమాల
నిర్వహణలో అలసత్వం వహిస్తే
జాతికి ద్రోహం చేసే వారవుతారు!

క్రమశిక్షణపేరుతో క్రమంగా
ప్రమాణాలు దిగజార్చకండి
నిబద్ధత, నిమగ్నత గాలికొదిలి
బిక్షగాళ్ళుగా, సోమరులుగా చేయకండీ

**

బతికే నైపుణ్యం నేర్పండి
బరువుల మోత తగ్గించండి
పరువుగా పేరు నిలిపేలే
పాదుచేసి, నీరుపోసి పెంచండి!

పోకిరీలుగా, దొంగలుగా
జూదరులుగా చేయకండి
అమ్మ, నాన్న, గురువు,
సమాజం ఉమ్మడి బాధ్యత!

**
పసిమొగ్గలను వికసించనివ్వండి
మసిబొగ్గులు కానివ్వకండి
నేటి బాలలే రేపటీ పౌరులు
ఉత్తమ ఉన్నత విలువలందించండి!

కుప్పతొట్టిపాలై
మురికి కూపపు స్నేహంతో
క్రూర నేర లోకంలోకి 
జరకుండా జారులు కాకూడదని కోరుకుందాం!

**( ఇదో పిచ్చి  కోరిక - నెరవేరాలని తపన )

14.1.12013 ఉదయం  10.30

కపిల రాంకుమార్|| చోటీసి బాతేఁ అర్జ్ కర్‌రహాహూఁ ||

కపిల రాంకుమార్|| చోటీసి బాతేఁ అర్జ్  కర్‌రహాహూఁ ||

చోటీసీ బాతేఁ అర్జ్ కర్‌రహాహూఁ
సునో తండా దిమాక్‌సే యే భాయ్!
గుస్సా మత్ కరో
మేరే యారో, జర సునో!

కిసీ పర్ న వజేసే ఉంగ్లీ మత్ ఉఠావో
ఆప్‌కో ఆప్ బేషర్త్  పరదా ఉఠావో!

ఆజ్‌ కల్‌ కీసీ పర్ ' దావా కర్నా '
బహుత్ ఆసాన్‌ హైఁ
మగర్ దియా హువా ' వాదా నిభానా '
బేషక్‌ న ఆసాన్‌ హైఁ

సోచేకె బినా గుస్సా మత్‌కరో
ములాఖత్‌ సే  ఆపస్‌మే సంజోతాకరో

మహబత్‌ కేల్నేకీ కిలోనా నహీఁ
మగర్ మజ్‌బూత్ కర్ నేమే దిల్‌కా తాఖత్ జరూరీహైఁ

ఆదాన్‌ ప్రదాన్‌సే జోడీ హమేషా కాయమ్‌ రఖో
నా మానేసే మజ్‌బూర్‌ హోకర్‌ టూట్‌ మత్ కరో!

గిరావుహా దిల్‌సే కిసీ కో ధోకా మత్‌కరో
పరంతు  ఫూలోంకి కుషుబూ తరహా సహమత్ సీఖో!

15.11.2013 ఉదయం 5.04

10, నవంబర్ 2013, ఆదివారం

కపిలరాంకుమార్|\ సేకరణ ||నజరానా ! (ఉర్దూ కవితలు)

కపిలరాంకుమార్|\ సేకరణ ||నజరానా ! (ఉర్దూ కవితలు)

*ఎంత పదిలంగా చూసుకున్నా
నా హృదయం నాది కాలేకపోయింది
ఒక్క నీ ఓర చూపు తోనే
అది నీ వశమైపోయింది .

-జిగర్ మురాదాబాదీ

*ఎదురు చూపులకైనా
ఓ హద్దంటూ ఉంటుంది
కడకు వెన్నెల కూడా
కరకుటెండలా మారుతోంది.

-బిస్మాల్ సయూదీ

*ఆమె నా ప్రేమ లేఖ చదివి
అది ఇచ్చిన వాడితో ఇలా అంది
'ఈ జాబుకు బదులివ్వక పోవడమే
నా జవాబ'ని చెప్పింది.

-అమీర్ మీనాయీ

*తనని చూడగోరే వారికి
తరుణం లభించింది
ఆమె తన మేలి ముసుగు
అర మోడ్పుగా తొలగించింది

-అర్ష్ మల్సియాని

*నా కెవరైనా ఎరుక పర్చండి
ఆమెకెందుకు జవాబు చెప్పాలని?
ఆమె నన్ను అడుగుతోంది
'తనని ఎందుకు కోరుకున్నాన'ని ?

- షకీల్ బదాయునీ

*వలపు దారిలో అలసి పోయి
ఎక్కడ నేను చతికిలబడ్డానో
అక్కడ నాకంటే ముందే వచ్చిన
బాటసారుల్ని చూశానెందరినో

- బహదూర్ షా జఫర్

అనువాదం : ఎండ్లూరి సుధాకర్
 http://sudhakaryendluri.blogspot.in/2009/01/2.html

shot

Kapila Ramkumar || short shoot shots||

Right
fight
lights.

read
feed
leads.

our
hour
honours.

Lead
Plead
Im-pleads.

Let
In let
Out lets.

Come
Become
Out comes.

Go
Forgo
Logos.

Air
Fair
Affairs.

Wind
Mind
Binds.

Brain
Rain
Drains.

short
shoot
shots.
........
(continued)
2/11/2013 ....6.29 am

shorts

Kapila Ramkumar || shorts ||
Leisure
assures
pleasure!    .1

Will avoids
pill and reduce
bill              . 2

We
at
her
Weather!     .3

At
ten
dance
Attendance!....4

***
9.11.2013 4.19 pm

కపిల రాంకుమార్|| మినీలు ||

కపిల రాంకుమార్|| మినీలు ||

మంచిని పేంచేలోగా - నీ
పంచన  చేరినవారే
వంచనతో
ముంచుతారు!          1

పొట్ట కొట్టే వారిపై
దట్టించి ఎదురుతిరగ
జట్టుకట్టేదెపుడో
పట్టుచిక్కేదెపుడో
పొట్టకూటిగాళ్ళ
గట్టి  సవాలప్పుడే!       2

ఎంతమంది చీ కొట్టినా
ఎంతమంది అభిశంసించినా
కుక్కతోక వంకర తీయలేం కాని
కత్తిరంచవచ్చుగా
ఉన్మాదులాగడాలు
ఆగాలంటే!                   3

10.11.2013 ఉదయం 9.45

5, నవంబర్ 2013, మంగళవారం

కపిల రాంకుమార్|| అలుపెరుగని ప్రస్థానం||

కపిల రాంకుమార్|| అలుపెరుగని ప్రస్థానం||

అలుపెరుగని ప్రస్థానం - వైఆర్కే ప్రయాణం
ఆదర్శం ఆకర్షణ నింపుకున్న మూర్తిమత్వం
రూపాయి వైద్యుడిగా పేరుపొందినాడు
ఖమ్మానికి వన్నెతెచ్చి ప్రజాసేవకుడైనాడు

నిబద్ధత నిపుణత మేళవింపు వ్యక్తిత్వం
రాజ్యసభలో ప్రజావాణి పాలకులు వణికేలా
సమస్యల జాబులు అందించిన నిగర్వి!
నాయకుడిగా నిలచిన దీటైన చిహ్నం!

సారస్వతం రాదంటూ సాహిత్యపు వేదికపై
సాహిత్యపు మూలాలను తడిమిన  దర్శకుడై
అసామాన్య వీక్షకుడిగా వాసిగాంచి
పదవులకే వన్నె తెచ్చిన ఉపన్యాసకుడు

వినమ్రంగానే ఒదిగిపోతూ - తీక్షణంగానే విమర్శిస్తూ
పాలకులపై రాజీలేని - సమర శీల యోధుడై
ఎందరికో మార్గాలను - సైద్ధాంతిక పాఠాలను
నిర్బంధాలకు వెరవక -అందించిన ఒజ్జయతడు 

నమ్మినదానికై నిలబడి - పౌరహక్కులకై శ్రమించి
శ్రామిక పక్షపాతిగానే సూచనలూ సలహాలిస్తూ
కడకంటా ఆకట్టుకునే ప్రాసంగీకుడిగా
మది దోచిన డా.వై.ఆర్.కే.స్మరణీయుడు

        ***
- కపిల రాంకుమార్
గ్రంథాలయ నిర్వాహకుడు
బి.వి.కె. ఖమ్మం 20.10.2013

కపిల రాంకుమార్|| సమస్యలుంటే సాకులు వెతుకుతుంటారా??||

కపిల రాంకుమార్|| సమస్యలుంటే సాకులు వెతుకుతుంటారా??||

పరిస్థితులను అంచనావేసి
పరిష్కరించే బదులు
మరింత జటిలపరచటంలో
రాజకీయులు బహు దిట్టలు!
ఒకరినిమించొకరు ఎత్తులు వేస్తూ
చిత్తు బొత్తులాటలాడుకుంటూ
కాలయపనచేసి
ఎవరికెంత లాభమో యోచనే తప్ప
అస్తవ్యస్థ వ్యవస్థను సరిదిద్దకపోగా
మరింత అధ్వాన్నంచేయటంలో
సిద్ధహస్తులు!
రాజకీయ ప్రత్యర్థులపై కక్షతో
అమాయక ప్రజలపై
తీసుకుంటారు!
అకాల వర్షాలైనా,
గృహ దహనాలైనా
కుమ్ములాటలైనా
కలహాలేవైనా
కులపంచనామా చేసేందుకు
పావులు కదుపుతారు
బలగాలను మోహరిస్తారు!
అందుకే వారు సమస్యలు పొంగుతుంటే
సాకులు వెతుకుంటారు!
ఎవరైనా నోరెత్తితే దానికో రంగు పూస్తారు
ఎవరితోనో రంకు అట్టకడతారు!
ఎవరైనా ఎదురు తిరిగితే
అట్టడుక్కు అదిమేయచూస్తారు
ఆ సమాధులపునాదులపై కట్టడాలు నిర్మిస్తారు!
ఎంతసేపు ఓట్లు, సీట్ల లెక్కల్లో
నోట్ల ఫీట్లల్లో పడరాని పాట్లు పడతారే తప్ప
జనసామాన్యపు పాట్లు చూడరు!
గోడమీద పిల్లిలా అదునుకోసం చూస్తారే తప్ప
ఎవరికి ఆసరా యివ్వరు పైగా అసహనం చూపుతారు!
నిన్న పొగిడి, నేడు తిట్టి, రేపు గుట్టుగా కౌగలించుకుంటారు
పైపై మరమతులుచేసి తమ గరిసెలు నింపుకుంటారేకాని
శాశ్వత నిర్మాణాలు చేయరు
గుత్తేదారు పదికాలాలు బాగుంటేనే కదా
తమ పబ్బం గడిచేది!
వితరణలో తస్కరణలు చేస్తూ
పారితోషకాలు బొక్కుతారు
ముక్కిన బియ్యం పంచి,
చేతులు దులుపుకుంటారు
జేబులు నింపుకుంటారు!
బక్కజనం యేమైనా వారికి పట్టదు
రాజకీయ అరాచకీయానికి భరత వాక్యం పలికేదెన్నడు?
జనం యోచనతో సొంత బుర్ర పెట్టి
వాళ్ళ బుర్ర రామకీర్తన పాడించేదెన్నడు?
అందుకు ప్రజల సంసిద్ధం చేసే బాధ్యత
కవుల కలాలదే -కళాకారుల గళాలదే!

30,10.2013 ఉదయం 10.30

short shoot shots

Kapila Ramkumar || short shoot shots||

Right
fight
lights.

read
feed
leads.

our
hour
honours.

Lead
Plead
Im-pleads.

Let
In let
Out lets.

Come
Become
Out comes.

Go
Forgo
Logos.

Air
Fair
Affairs.

Wind
Mind
Binds.

Brain
Rain
Drains.

short
shoot
shots.

........ (continued)
2/11/2013 ....6.29 am

26, అక్టోబర్ 2013, శనివారం

కపిల రాంకుమార్|| జుమేదార్ హం||

కపిల రాంకుమార్|| జుమేదార్ హం||
పర్సోం యా కల్
కల్ నహీ హైతో ఆజ్
క్యో అత్యాచార్ కీ కబర్
బార్ బార్ సున్‌నా పడ్‌తాహై?
యా దూర్‌దర్శన్‌ ఇసాఫ్‌సే దేఖ్‌నా పడ్‌తాహై?
క్యోం హమారా కానూనన్‌కా హాత్ బేకార్ హువా?
యా నిస్సార్‌హువా?
నైతో ఇన్‌సానియత్ మరాహువా?క్యా?
వజే క్యాహైకీభీ
ఇసీతరఫ్ ప్రతీదిన్‌ క్యో మ్‌ వ్యాకులతా పైదా హోరహాహై?
చలతారహతాహై!  జలతారహతాహై!
అంత్ కబ్ హోతా మాలూమ్‌ నహీ హై?
హమేషా కయీ దిన్‌ జారీ రహతాహై క్యా?
కౌన్‌ హై ఓ దోష్?
ఔరత్ యా మర్ద్ !
నహీఁ!
మేరే విచార్ సే దోషీకా మతలబ్ తక్‌దీర్ కభీ నహీఁ!
ఓ బాత్ చోఢ్‌ మగర్ మెరే బాత్ సునో
మాఁ, బాప్, గురూ ఔర్ సమాజ్ చారోఁ దోషీ మాన్‌తాహుఁ!
పరివర్తనశీలతా ఇదర్ ఘర్‌సే స్కూల్‌ తక్‌
స్కూల్‌సే సమాజ తక్ ఆధారిత్‌ హై!
ఇస్‌లీయే ఓ చార్ దోషీ మాన్‌తాహూఁ!
సహీ సమయ్ పర్ సహీ శిక్షణా న దేనేకే వాస్తే
బార్ బార్ వహీ దుర్ఘటనాయేఁ పునరావృత హోరహాహైఁ!
జర సోచ్‌ సమజ్‌కర్ ఆజ్‌ సే హమారా బచ్చోంకీ మన్‌మే
సద్బుద్ధిశీలతా పైదాకర్‌నా
హమరా ఫర్జ్‌ బన్‌తాహైఁ!
క్యోం కీ జుమేదార్ హమ్‌ హైఁ!

--25.10.2013. 5.00 am

19, అక్టోబర్ 2013, శనివారం

Poetic Flag

kapila Ramkumar || Poetic Flag||
**
Flow of noble thoughts
flourish in my poetry
Row of joyful plots
Filled in a confident pottery
Wakes up like a Sword
Swinging heart
Pours sweetly blend
Poetic expressions are
Pro-people aspirations
Lit to be a bright Light
Every steps move forward more
Not even looking back
Interest based emotions
Prepare boldness to Fight,
Like a hoisted Poetic Flag
***

19.10.2013 @11.20 am.

18, అక్టోబర్ 2013, శుక్రవారం

|| కరో యా మరో!||

కపిల రాంకుమార్|| కరో యా మరో!||
ఆజ్ కల్ - రోజ్ భర్
నిర్భర్ సే కామ్‌ కర్నేకి బాద్
పూరా పేఠ్ భర్నా
బహుత్ తక్ లీఫ్  హోరహాహైఁ !
ఇస్ కే వూపర్
కుటిల్ అంజానీమే
నేతోంసే నిభానాభీ
బహుత్ ముష్కిల్ హోరహాహైఁ!
గలే పర్ దబావ్ బడ్ జాతారహాహైఁ
గల్లీ పర్ భీ భీతర్
వహీ అసర్ ఇస్త్ మాల్ హోరహాహైఁ
అవాజ్ ఉఠానేకిలియే ఓ మనాకరతారహాహైఁ
జంగిల్, జమీన్‌, జల్ సే - అల్విదా కెహనాపడతారహాహైఁ
జర సోచో! యారో!
కిసీమోడ్ పర్ కదం కదం  మిల్కర్ చలనా హైనా?యా నహీ?
అంకుశ్ కే విరుద్ధ్  అవశ్య  లఢనా హైనా? యా నహీ?
క్యా హం సభీ  మద్దత్ దేనా హై? యా నహీ!
యా చుప్కర్  భైఠేంగీ?
నైతో దురంత్ ఆవాజ్ దేంగే! యా నహీ
సోచ్ సమజ్ కర్ హాత్ మిలాయియే
ఉస్ అన్యాయ్ పర్ లఢనే వాలోంసే!
నిర్ణయ ఆప్కా!..ఉస్కే ఫల్ భీ ఆప్కీ హోగీ!
కరో యా మరో - ఆజ్ నహీ ఇసీ వక్త్  ఫైసలా కరో!
____________________________
18.10.2013 - సాయంత్రం 4.37
_____________________________
చిరు ప్రయత్నం ....ఇందులో నాకు ఓనమాలు, సరిచేసే అవకాశం

హక్కును కవి మిత్రులకే దఖలు చేస్తున్నాను

16, అక్టోబర్ 2013, బుధవారం

ఆశంస

కపిల రాంకుమార్||ఆశంస ||

నా మది గదిలో
అక్షర గరిమలెన్నో
ఎద గుడిసెలో
ఊసుల సరిగమలెన్నో

పరదాల మాటున
సరదా మాటలెన్నో
ఒకరినొకరిని కలిపే
స్నేహానుభూతులెన్నో

పయోముఖ విష కుంభాలకు దూరంగా
అమృతమయ సావాసం నిలుపుకోవాలి!
సంయమనం అందుకో
సంస్కారం పెంచుకో!

కలతల కలల కలుషాల కాసారంలో
కలవరాలకు దూరంగా
కవి ' తల ' లోని కవితల సౌరభాన్ని చేరుకో
సాహిత్య సౌధాన్ని కలకాలం కాపాడుకో!

16.10.2013 ఉదయం 11.45.

6, అక్టోబర్ 2013, ఆదివారం

కపిల రాంకుమార్ || వితంతుపూజ -సంప్రదాయం||

కపిల రాంకుమార్ || వితంతుపూజ -సంప్రదాయం||
మొన్నమొన్నటి వరకు ఉత్తరాలు రాసేటప్పుడు పెద్దలను గౌరవసూచకంగా మహారాజశ్రీ,
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన, అని మగవారిని సంబోధించి వ్రాయటం, అదే విధంగా ఒక వేళ
వితంతువులకు రాసేటప్పుడు గంగా భవానీ సమానురలైన అని పేర్కొనటం మనకు
తెలిసినదే. సాధారణంగా వితంతువులను కొంచెంహీన భావంతో చూడటం, చులకన చేయటం,
వారిచే చాకిరీ చేయించటం, కాస్త అంద విహీనంగ కనబడేలా శిరోముండనం చేయించడం,
పూలు, గాజులు, పసుపు, కుంకుమలకు, రంగు చీరలకు దూరంగావుంచడం ప్రాచీన సంప్రదాయం.
కేవలం తెల్ల ముతకచీర కట్టుకుని, కటికనేలమీద శయనించడం, ఎవరికి ఎదురు పడకుండటం లాంటి
ఆంక్షలు మెండుగావుండేవి. వాటిపై వీరేశలింగం వంటి వారు సంస్కరణ ఉద్యమాలు చేసారనేది,
యిప్పుడూ  ఆనిర్బంధాలు, ఆంక్షలు అంతగాలేవని తెలుసు. అటువంటి పూర్వసువాసినులకు

(వితంతవులకు) పూజర్హత కల్పించి, పూజించి, వారిచే దీవెనలు పొంది సంప్రదాయమొకటివుంది.
అదీ దక్షిణాది తమిళ దేశంలో మనకు కనపడుతుంది. వివరాలలోకి వెడితే ఉత్తరాదికి వచ్చిన స్థిరపడిన ఆర్యులు
కొంతకాలానికి వారిలో కొందరు దక్షిణ భారదేశానికి తరలివచ్చారనేందుకు చారిత్రాఢారాలునాయి.
అలా వచ్చిన వారు సుమారు ఎనిమిదివేలమందికిపైగా గుంపుగా తమిళనాడులో స్థిరపడ్డారు. వారిని
' అష్ట్ర సహర జాతీ అని పిలుస్తారని, అస్ట్రవస్త్రం అనే స్థానిక సంప్రదాయబ్రాహ్మణ వంశాలతో కలిసిపోయారని
తెలుస్తున్నది. కోయంబత్తూర్, ఈరోడ్, సత్యమంగళం ప్రాంతాలలో విస్తరించారని రూఢవుతున్నది.
 ' కౌండిన్యస '  గోత్రీకులైన బ్రాహ్మణ వంశాలలో జరిగే ప్రతీ శుభకార్యక్రమనిర్వహణాలకు ముందుగా
విధిగా వారు నిర్వహించే పూజా విధానమే మనం యిపుడు తెలుసుకొనబోతున్నాం. ప్రతీ శుభకార్యానికి
ముందు ముఖ్యంగా వివాహాది కార్యాలలో వితంతు పూజ తప్పనిసరిగా చేసికానిప్రారంభించరు.
కుటుంబ, లోక శాంతి సౌఖ్యాలకు అభివృద్ధికొరకు జరిపే ప్రార్థనలు సైతం వితంతు పూజలతో
ప్రారంబమవటం ఒక ప్రత్యేకత సంతరించుకున్న సంప్రదాయం. (గణపతి పూజ మాదిరి)
ఒక వితంతువు, ఆమెతో పాటు ఐదుగురు ముత్తైదవులు, ఒక బ్రహ్మచారి ( మొత్తం యేడుగురికి)
పూజలు నిర్వహిస్తారు. ఈ వితంతుపూజ తరువాత సుమంగళిపూజ జరుపుతారు. అందరికీ తాంబూలాలు,
ఫలాలు, సమర్పించి, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుతారు. ముఖ్య అతిథి గౌరవం ఆ వితంతువు
పందుతుంది. గౌరవంగా సంభావన, బహుమతి, దక్షిణ యివ్వటం పరిపాటి. అయితే పూజందుకునే
వితంతువు తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్న వారినే యెంపికచేస్తారు.
సాత్వికాహారం తీసుకునేవ్యక్తి, నియబద్ధ జీవితం గడిపేది, పసుపు, కుంకుమ, రవిక లాంటివాటిని
విసర్జించినదైన వితంతువు మాత్రమే పూజార్హురాలు. ఆమెకు తొమ్మిది గజాల చీర ధరింపచేసి
దైవ పీఠంపై కూర్చుండ పెట్టి, ఆ రోజున జరిపే దుర్గా పరమేశ్వరి పూజలో దేవికి ప్రతినిధిగా పరిగణిస్తారు.
పురోహితులు కాని, యింటి పెద్దగాని, (మగ/ఆడ) ఈపూజా విధానాన్ని నిర్వహిస్తారు. తొమ్మిది గజాల
చీర యిచ్చేముందుకూడ పూజ చేస్తారు. ఆ చీరను పూర్తిగా తడిపి, యెండపెట్టి, ఆరిన తరువాత
మడతపెట్టి దేవతముందు పళ్ళెంలోవుంచిం ఆ చీరకు మాలిన్యం అంటకుండా పైన అరటి ఆకు
(దుమ్ము, ధూళి పడకుండ) కప్పి, అరటి ఆకుపైనే పసుపు, కుంకుమ, పూలతో పూజచేస్తారు. ఆ చీరని
ఆ వితంతువు అందిస్తారు. అపుడామె ఆ చీర ధరించి తిరిగి దైవ పీఠంపై కూర్చుంటుంది. ఆ రోజు
తయారు చేసిన పిండివంటలు ఆమెకే మొదట దేవతగా భావించి నైవేద్యం పెడతారు. తరువాత మహిళలందరు
ఆ దేవతతోపాటు కలిసి భోజనం చేస్తారు. భోజనానంతరం మొదట కుటుంబంలోని పురుషులు వచ్చి
ఆమెకు నమకరించి,ఆమె దీవెనలు తీసుకుంటారు. వివిధ బహుమతులు, రొఖ్ఖం, కానుకలు యిస్తారు.
అందరు అశీర్వచనాలు పొందిన తరువాత ఆమె తనకు యిచ్చిన కాఉకలు, దక్షిణ, కొంత భాగాన్ని తిరిగి
ఆ కుటుంబానికి అందిస్తుంది. అది మహా ప్రసాదంగా స్వీకరిస్తారు..
_______________________________________________.
--చాల సంవత్సరాల క్రితం ఒక పత్రికలో '' మోరపాకుల '' పేరుతో వ్యాసం ప్రచురణ జరిగింది. దానని
జీర్ణ దశలో కాస్త సంస్కరించి(కనపడని అక్షరాలను సరిచేసుకొని) అందరికి ఈ విషయం వ్యాప్తిచేయాలని
వితంతువులను గౌరవించడం ఒక సుసంప్రదాయమని తెలపాలని సేకరించాను. 
_________________________________________________
5.10.2013 సాయంత్రం 4.35

|ఉర్దూ భాషా సాహిత్యాలు||

కపిల రాంకుమార్||ఉర్దూ భాషా సాహిత్యాలు||

భాష: ఉర్దూ  భారతదేశంలో రూపొందిన భారతీయ భాష.ఇది విదేశీ భాష కాదు.ఏదో ఒక జాతికి,
ఒక మతానికి చెందినది కాదు.ఈ  భాషలో భారతీయ భాషా శబ్దాలతో పాటు,ఫార్సీ,అరబ్బీ,తుర్కీ
శబ్దాలు విరివిగా చేరివుంటాయి.దీని కవితా రీతులు, కవితా సామాగ్రి చాలవరకు ఫార్సినుంచి దిగుమతి
అయింది.ముసల్మానుల సంపర్కంవలన, ఆక్రమణలవలన, మనదేశ రాజకీయ సామజిక పరిస్థితుల్లో
విశేషపరివర్తన కలిగింది. ఉర్దూ అనే పదాంకికి తుర్కీ భాషలోని URDU అనే పదం మూలం. ఇంగ్లీషు
లోని HORDE అనే పదాని జన సమ్మర్థం, సైన్యం, సైనిక శిబిరం అనే అర్థాలున్నాయి. సైనిక
సమూహాల సాంకేతిక భాషగా ఉర్దూ ఆవిర్భవించటానికి అవకాశం యేర్పడింది, తప్ప ఇది విదేశీ భాష
యెంతమాత్రం కాదు.18 శతాబ్ది ఉత్తరార్థానికి పూర్వం దీనిని చరిత్రకారులు,సాహిత్యకారులు హిందీ,
హిందునీ, హిందుస్థానీ, జబానె-హిందుస్తాన్‌,ఉర్దూయె-మొఅల్లా, రేఖ్తా అని అనెక్ పేర్లతో చలామణి
అయ్యేది. అనేక భాషల సమ్మేళనం వలన రేఖ్తా అని పిలిచేవారు.

దక్కనులో ఉర్దూ: ఖిల్జీ ఆదుషా కాలంలో దండయాత్ర జరిగిన తర్వాత మొహ్మద్ బీన్‌తుగ్లక్ రాజధానిని
ఢిల్లీ నుండి దేవగిరికి, తదుపరి అది దౌలతాబద్ అయింది. మళ్ళి దౌలత్ బాద్ నుండి ఢిల్లీకి మారింది.
1347 లో దక్కనులో బహమనీ వంశస్థాపన జరగటం చారిత్రిక పరిణామం వలన, పరిణితి చెందిన భాషగా
ఉర్దూ గుజరాతు మీదుగా దక్కనులో వ్యాపించింది.గుజరాత్ పదాలను కూడ కలుపుకొని ' గుజరీ '
అయుందని పరిశీలకుల అభిప్రాయం.  

భాషా వ్యాప్తిలో సూఫీ పకీర్ల పాత్ర యెంతగానో వుంది, ఖ్వాజా మసూద్ సాద్ సల్మాన్‌ (1046-1121)
ఖ్వాజా మొయీనుద్దీన్‌ చిష్తీ (1140-1268) బాబా ఫరీద్ గంజ్ షక్కర్ (1173-1265)
నిజాముద్దీన్‌ ఔల్యా (1238-1325) అమీర్ ఖుస్రూ(1253-1325) ఖ్వాజా బందా నవాజ్
గేసూదరాజ్ (1321-1422) మొదలైన సూఫీ యోగులు ముఖ్యులుగా పేర్కొంటారు.

వలీ దక్కం అహ్మద్ ను ఆదికవి అంటారుిఉర్దూ గజళ్ళకు ఓరవడి దిద్ది,దక్కనీ శబ్దాలు తగ్గించి పారసి
శబ్దాలకు పట్టంకట్టాడని, మన నన్నయ్య చేసిన పనే ( సంస్కృత పదాలు చేర్చినట్టు) ఇతను పార్సీ సంప్రదాయాలను,
భావాలను అందలమెక్కించాడు.చారిత్రకంగా చూస్తే మొదటివాడు కాకపోయినా, భాషకు ,కవిత్వశైలికి
కొత్తరూపాన్నివ్వటం వలన ఆదికవిగా గుర్తింపు పొందాడు. అతనిని అనుసరిస్తూ సిరాజ్ ఔరంగాబాదీ,
1160 పంక్తుల బూస్తానె-ఖ్యాల్ మస్నవీని రెండు రో్జులలో రాసాడు. బహరీ అనే కవి మస్ననీ మన్‌లగన్‌ వ్రాశాడు.

18 వ శతాబ్దిలో  ఉత్తరారిద్లో ఉర్దూ కవిత: సిరాజుద్దీం ఆలీఖాన్‌, షాహిహతిం, సౌదా,మీర్,దర్ద్
మీర్ తఖీమీర్ (1722-1810) మీర్సోజ్,  టేక్చంద్ బహార్,నందరాం ముఖ్లిస్, భికారీలాల్
మొదలైనవారు పేర్కొనవచ్చును.అయోధ్య నవాబులు కూడ సారస్వత పోషణ బాగా చేసారు.షేక్ ఇమాం
బక్ష్ నాసిఖ్ ( 1771-1838) హైదరలీ ఆతిష్ ( 1778-1847)

మస్నవీ = ప్రబంధ కావ్యాలు , మర్సియా = స్మృతి కావ్యాలు, గా ప్రసిద్ధిచెందాయి.ప్రముఖులుగా కొంతమందిని
పరిచయం చేస్తాను.  కవిత్వమంటే ప్రణయ భావాల గజల్ రచనే కాదని, ఏదైనా కవిత్వానికి
అనర్హం కాదని ఆనాడే భావించిన కవిసత్తముడు నజీర్ అక్బరాదీ (1735-1830) అయితే సంప్రదాయ
చాదస్తపు సాహిత్యకారులు ఇతనిని కవిగా గుర్తించలేదు. కాని ఈ నాటి సాహిత్యకారులు, విమర్శకులు ,సాహిత్య
చరిత్రకారులు నజీర్ అక్బరాదీని మహాకవిగా  గుర్తిస్తారు.ఢిల్లీకి చెందిన  మిర్జా సదుల్లా బేగ్ ఖాన్‌ గాలిబ్
(1797-1969) మోమిన్‌ ఖాన్‌, ముస్తఫాఖాన్‌ షేఫ్తా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాం(1817-98)
మౌలానా మొహమద్ హుసేన్‌ ఆజాద్ (1833-1910), ఖ్వాజా అల్తాఫ్ హుస్సేన్‌ హాలీ(1836-1914)

అభ్యుదయ రచనలు: కిషన్‌ చందర్, ఇస్మత్ చొగ్తాయ్, సాదత్ హసం మంటో, రాజేంద్రసింగ్ బేడీ,
రషీద్ జహా, రజియా సజాద్ జహీర్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఖురతుల్ ఐన్‌ హైదర్(1989)
షాయిర్ ఇంఖిలాబ్ గా పేరొందిన జోష్ మలీహాబాద్, ప్రొఫ్ఫెసర్ రఘుపతి సహాయ్ ,ఎహసాన్‌ దానిష్,
ఆదమ్‌, ఫైజ్ అహమద్ షైజ్,ఇస్రారుల్ హఖ్ మజాజ్, సికిందరలీ వజ్ద్, మఖ్దూమ్ మొహియుదీన్‌
సుల్తాంపూరి, కైఫీఅజ్మీ, నజీరలీ అదీల్,సామల సదాశివ, దామోదర్ జకీ, రాఘవేంద్రరావు జబ్జ్ ,
కాళోజీ రామేశ్వర రావు,

పాశ్చాత్య్ల కవులు: బెంజిమన్‌ షుల్జ్, జాన్‌గిల్ క్రయిస్ట్ (1759-1848) గిల్ క్రయిస్టు (లండన్‌)
రాబర్ట్ క్లార్క్, ఈ.హెచ్.ఎం.వాకర్, జోసఫ్ ఎవన్‌, మౌల్వీ ఇమాముద్దీన్‌, జె. అలీబక్ష్
......ఉర్దూ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారెందరో మహానుభావులు అందరికీ వందనాలు.
_________________________________
భారత భారతి - గ్రంథం నుండి సేకరించినది. తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ
__________________________________   
4.10.2013 సాయంత్రం 6.30 

1, అక్టోబర్ 2013, మంగళవారం

|| సోమసుందర్ -వజ్రాయుధం ||

కపిల రాంకుమార్|| సోమసుందర్ -వజ్రాయుధం ||
తొలికూర్పు (1949  విరోధి ఉగాది - మార్చి)
' ఒక వ్యక్తి యొక్క సాంఘిక జీవనమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది '' అని చెప్పాడు కారల్ మార్క్స్
సోమసుందర్ కవిగా పాడటానికి గొంతు సవరించుకుంటూన్న రోజుల్లో చరిత్ర భూస్వామ్య వ్యవస్థ నశిస్తూ,
బూర్జువా వ్య్వస్థ పరిపాలనాధికారాన్ని ఆశిస్తూన్న కాలమని చెబూంది.  ఆనాటి కవిత్వం విరగబడి సనాతన
చైతన్యం తిరగబడి కొత్త కొత్త దారుల్ని త్రొక్కి త్రొక్కి విసిగి వేసారి చివరికి వెగటుగా, వికారంగా,విషాదంగా
ఆత్మఖండన వ్యాపారంగా తయారైంది.  బూర్జువా వర్గపు ఉనికికి అనుకూల వాతావరణాన్ని  వ్యక్తిగత
అహం కలిగిస్తుంది. కనుక ఆ రోజుల్లో కవితకదే నినాదమైంది. కవిత్వం పరిసర నగ్న వాస్తవికతను కళ్ళు
విప్పి చూడలేక నిరంజన కళకోసం ఆకాశపుదారులు పట్టి '' దిగిరాను గిగిరాను దివినుండిభువికి '' అంది.
దానితో ద్రష్ట అయిన  కవి భ్రష్టుదయ్యాడు. అతని అనుభూతి కూడ నశించింది.  దానితో అసంఖ్యాకమైన
ప్రజానీకం కవిత్వాన్నీ చదవటం మానేసింది. కవిత్వం తనకవసరమనే సంగతినే విస్మరించింది. కనీసం
దానిని అర్థం చేసుకోటానికి కూడ అది ప్రయత్నించలేదు. ఎందు చేతనంటే కవిత్వం జీవితానికి అంత
దూరమైపోయింది (అందనంత)కనుక. ఈ సత్యాన్ని కవిగా సోమసుందర్ గ్రహించాడు.
పెద్దాపురం తాలూకా శంఖవరం గ్రామంలో 1924 నవంబరు జన్మించి 1933 నుండి 1945 వరకు పిఠాపురం
రాజా హైస్కూల్ చదువు, కాకినాడ కాలేజి చదివాడు. 1944 నుంది రచనా వ్యాసంగం. అభ్యుదయ రచయితల
సంఘ ఉద్యమ ముఖ్య కార్యకర్తలలో ఒకడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థిర నివాసం.
అందుకే ఈ కవి '' తన చరిత్ర తనే పఠించి ఫక్కున నవ్వింది ధరణి, తన గాథను తనే స్మరించి భోరున
యేడ్చింది ధరణి ' అన్నాడు. అంతటితోనే అతను చెప్పదలచుకొన్నది పూర్తికాలేదు. యథార్థ జీవితాన్ని
సంగ్రహించి " బూర్జువా వర్గం " తమ దోపిడి, తమ పాలన, తమ వర్గస్వలాభాలను సుస్థిరంగా నిలపాలని
 సర్వజనానీకంపై యేలుబడిని సాగిస్తున్నదనే పరమ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు " రెండు ప్రపంచాల
మధ్య, రెండు స్వభావాల మధ్య, రెండే వర్గాల మధ్య సాగుతున్న సంఘర్షణ " ని గుర్తుపట్టి తన పాత్రను
పృచ్ఛించుకొన్నాడు. '' యుగధర్మం :చైతన్యం-జనహృదయం;పోరాటం '' అని తన అంతర్వాణి వినిపించింది.
'' ఉన్నదొక్క జీవితమే, మానవునిగ వీరునిగా బ్రతుకుము, నరుడా! చరిత్ర నీకోసం ప్రసవ బాధ పడుతున్నది;
భవిష్యత్తు నీ కోసం పడిగాపులు కాస్తున్నది, నీ త్యాగం వృధాకాదు.''..అని సంబోధించుకున్నాడు.దానితో
'' దినమంతా రక్తం ధారవోసి పరిశ్రమించే దీనుల ఒక్కటిగా సమీకరించుట  కోసం నిర్దయగా పరాన్న భుక్కుల
హతమార్చుటకోసం '' ఉద్యమించాడు. '' వర్గ రహిత స్వర్గమ్మును స్థాపించుట తనలోపలి కోరిక; తన తీరని
తపస్సు '' కనుకనే ఆవేశంతో ఎలుగెత్తి పిలుస్తున్నాడు ' కదలండి కదలండి -కదలి పోరండి స్వేచ్ఛకై;-
తుది వెలుగు మానవుడు  బ్రతుకు వీడిందాక! '' ముందుకురకమన్నాడు. తనకు ఆశ, నిరాశ లేదు కనుకనే
' ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు ...ఒక నెత్తురు బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు '' నంటాడు.
అంతేకాదు '' ఈ యాగం ఫలిస్తుంది. రాక్షస సంహారోత్సవ మహా క్రతువు ఫలిస్తుంది. తెలుగు గడ్డ సుఖిస్తుంది.
నవ జీవనం సుమిస్తుంది!'' అంటాదు కవి. అవును తప్పదు!
'' రారాజు గాథలకు ఇదె స్వస్థి వాక్యం!
శత్రువుల చరితకిదె అంతిమస్కంధం!
కాల వాహినికిదే నూత్న ఘట్టం ''

'' కమ్యూనిస్తు కవిత్వం సంపూర్ణమైనది. మానవుడు తన ఆవసరాన్ని ఎంత చైతన్యంతో గుర్తిస్తాడో, అంత చైతన్యం
తోటే బాహ్య వాస్తవికతను గుర్తిస్తాడు కనక '' అంటాడి క్రిస్టోఫర్ కాడ్విల్ . ----రాంషా. (సామల్ కోట 2/1949)

1,సమధర్మం: (సమధర్మం, ధ్రువతార, ఖరార్ నామా, మౌనగోష, లోపలి కోరిక, భగత్సింగు, ఫ్యాక్టరీ,
బాడుగ గోడీలు, ఆకలి నాలుకలన్నీ ) 2.బానిసల దండయాత్ర, 3. మలయా ప్రభంజనం
వజ్రాయుధం - ఒక సమాలోచనం - మాదిరాజు రంగారావు విశ్లేషణ
లోపలి కోరిక ( తల్లి - కవి - సంభాషణ)
తల్లి:
నీ హృదయం / నెత్తురు చిందిన గెడ్డయి.తుఫానులో రాలిన/జీర్ణ పత్రమై/ఎగసి ఎగసి, పరితప్తమగుట
దేనికొరకు బిడ్డా?
కవి: నీ బిడ్డలు/దిక్కులేని పిట్టలవలె/చెట్టుకొకరుగా/చెల్లా చెదరీ/గూడులేక, కూడులేక/అల్లాడుట/
చూడలేక తల్లీ!
తల్లి: ఇంత భయోత్పాతంలో/గాఢ నిశాధ్వాంతంలో/ఏగెదవెలాగ బిడ్డా!
కవి: నలుబది కోట్లకు మించిన/సంతానం కన్న తల్లి/ నీ చల్లని దీవెనలో/పురోగమిస్తానమ్మా!
తల్లి: నాపై ప్రస్రించిన/ నీలోపలి కోరిక ఏదో/ చెపుతావా బిడ్డా!
కవి: అమ్మా, చెబుతా వినవమ్మా/ నీ చేతుల బంధించిన/సంకెళ్ళను త్రెంచాలని/నీ సంతతి స్వేచ్ఛలోన/
ఊపిరిపీల్చాలని/దినమంతా ర్క్తం ధారవోసి
పరిశ్రమీంచే దీనుల/ఒక్కటిగా.../సమీకరించుట కోసం తల్లీ!/నిర్దయగా పరాన్నభుక్కుల/హతమార్చుట
కోసం తల్లీ!/ వర్గ రహిత స్వర్గమ్మును/మిర్మించుటకోసం తల్లీ!/ఇది నా లోపలి కోరిక/ఇది నా తీరనీ
తపస్సు!
___________________________________________________
1.10.2013

  

|| గాయబ్ అవుతుంది!||

కపిల రాంకుమార్ || గాయబ్ అవుతుంది!||

తలపులు-తలుపులు
తెరిచినపుడు - వలపులు
తలపులతొ - జతగూడుతాయి

పలికిన - మరులుగ
కులుకులు - మరలుతాయి

పెళసరి - కబురులకు
దళసరి - విరుపులవుతాయి
మరులిక వెడలును
మరలి రావెపుడును!

విసురులు - ఉసురులగు
పరుషపదములగు
సరసము విరసమై
అలకల - ములుకుల
మొలకలగు

మరి అపసవ్యము - హాస్యమైన
చిరలాస్యము - కొరవగు!
చిలువలు - పలువలుగా
పుకారులు - షికారులు చేయ
పడిపోవును - తెగిపోవును!
బంధం యిక  - కనుమరుగై
విరహగీత - ప్రవాహమగు!

కాయమున - గాయము
పూతల మానును
ఎదకు  - గండిపడిన
ఎండినమానై కూలును!

చివురించాలని - అనుకున్నా
త్రుంచాలని  - అనుకున్నా
నీ పైనే ఆధారం
నిలుపుతావో? - నలుపుతావో?
నీ యిష్టం!
నిర్ణీత సమయంలోనే!
నిర్ధిష్ట పర్థిలోనే!
మించితే గాయబ్ అవుతుంది!
________________
30.9.2013 -----సాయంత్రం 5.45

30, సెప్టెంబర్ 2013, సోమవారం

|| శకునపక్షి నాటికలో సామెతలు - నార్ల వెంకటేశ్వరరావు ||

కపిల రాంకుమార్| శకునపక్షి నాటికలో సామెతలు  - నార్ల వెంకటేశ్వరరావు ||
నార్ల వెంకటేశ్వర రావు రాసిన శకున పక్షి నాటిక ఒక రైతు కుటుంబ నేపథ్యమ్ళొ రాసినదైనా
సంభాషణలలో తెలుగు సామెతలు మెందుగా ప్రతీ పాత్ర ద్వారా పలికించిహాస్యం పండింది.
పొద్దున్నే వచ్చావేమిటన్న రామయయ్యతో సీతాపతి '' పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుపోయి 
వచ్చిన చుట్టం పోయేదిలేదని '' దిగులుగావుందా అంటాడు. అయినా నువ్వు వూరికినే రాలేదని
అన్నప్పుడు నీ కొకరి అంటూ సొంటూ గిట్టదు కదా అంటూ సీతాపతి '' నన్ను ముట్టుకోకు నామాల
కాకి '' అంటావు అనే సామెత వాడతాడు. యేం పనిమీదొచ్చావో చెప్పవయ్యా అన్నపుడు '' చల్ల 
కొచ్చి ముంత దాస్తున్నాననేగా'' నీచోద్యం! వూరికినే రావులేవయ్యా వచ్చిందెందుకో చెప్పు అన్నపుడూ
మళ్ళి సామెత వేస్తాడు సీతాపతి రామయ్యతో '' లాభంలేని  సెట్టి వరదను పోడంటావ్ '' బాగా
మాటలు నేర్చావనగానే '' వలచి వస్తే మేనమామ కూతురు వరస కాదనే రకం ' నీది  అని సమాధా
నమిస్తాడు . మనసులో మాట బయట పెడ్తున్నట్లనిపించేలా ' రోహిణీ కార్తెలో రోళ్ళు బద్దలుతా'యని
వురకే అన్నారా. తాగటాని చల్లబొట్టు కూడ లేదేమో అని రామయ్య భార్యతో అంటాడు.  అయ్యో
పాడిలేదేమీ అన్నయ్యా అనగానే '' పాడిలేని యిల్లు పాతాళలోకం కదూ''ఎక్కడైనం వాదికపీటుకో
వచ్చుగా అనగానే  యేమోనమ్మా '' అమ్మాబోతే ఆదివి  కొనబోతే కొరివి '' లాతెచ్చుకున్న అణా
పెరుగుతో కాలం గడువదుకదా. అయినా మీ పాలెం పడ్డ యీనిందనుకుంటాను, మర్మగర్భంగా
ఆరా తీయాలని ఆంటాడు. అందుకు  ''యీని యేం లాభంలే అన్నయ్యా నిన్న పక్కింటావిడ
దిష్టితగిలనట్టుంది ఒక్క చుక్కైఅనా విడివలేదు . వెంటనే అందుకుంటాదు ' నరుడి కంట
నల్లరాయైనా పగుల్తింది ' అని పాటిమీద సాయెబును పిలిచి తావెత్తు కట్టించు సలహా యిస్తాడు.
పిలిపిద్దామని పాలేరుని వెళ్ళమంటే కుదర్దు అని మొరాయించాడు. అంది ఇలాలు.  అలాగటమ్మా
' తిండికి తిమ్మ రాజు పనికి పోతురాజు '' పిదప కాలంలో పాలేరుమాట వినటంలేదు.' పత్తి గింజలు
తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట, మరి గంత కట్టనా అంటే ఊహూ అన్నాడాట '
అలావుమొదన్నమాట వాళ్ళపని. సాయెబుని నే వెళ్ళిపిలుచుకొస్తాగాని ఆ చల్లనీళ్ళు నువ్వే పోద్దువుగాని
 చెల్లమ్మా! అంటాడు. అదా ఆపనిమీద వచ్చావన్నమాట అని రామయ్య అనగానే ఆ ' అయినోళ్ళకు
ఆకుల్లో, కానోళ్ళకు కంచాల్లోను ' అని ఆర్.ఐ.కి సమర్పించుకున్నావు కాని నాకు కుండనీళ్ళడిగితే
ఎలా చదువుతున్నాడో బావ చూడమ్మా అని దెప్పుతాడు. అందుకు రామయ్య '' కాలికేస్తే
మెడకి, మెడకేస్తే కాలి ' వేస్తావు మాటలు నేర్చావుకదా, చల్లకొచ్చాననే విషయం ముందే చెప్పొచ్చుగా
అంటాదు.ఆ వెనుకటికెవడో'' కడుపులో లేందిం కావిలించుకుంటే వొస్తుందా ' అని సమాధానం
వెంటనే అందుకుంటాడు సితాపతి. ఇంకో సందర్భంలో పిల్లవాడు ఇంటికిరాలేదని ఇంటావిడ అనగానే
అందుకుని సీతాపతి '' సముద్రం యీదవచ్చు కాని సంసారం ఈదరాదు. ' ఈ కాలం పిల్లలకి యేం
తెలుస్తాయి, సంసారమ్ళొణి సాధక బాధకాలు వూరిమీద పడి తిరగటమేకదా. ఇంకో సందర్భంలో
సీతాపతీ నువ్వే నయం ఐదురూఅడపిల్లలకి పేళ్ళిళ్ళుచేసావు పైసా అప్పులేకుండా, అని రామయ్య
అనగానే  ఇక నామాటే చెప్పుకోవాలీ ' వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల
కామమ్మ వంకా్యల భారం తూగిందట '  నీకంటే నాలుగెకరాలుపంచుకున్నానే కాని  నాపని
'' నానాటికి తీసికట్టు నాగంభట్లు ' అన్నట్టుగావుంది, చ్వరికి పుగాకు తుంపుకు కూడా ఠికాణా లేదు.
వెనకటికి నాబోటివాడెవదొ '  దశాదశా రమ్మంటే, దరిద్రాన్ని పిలవమన్నదట!.'' దశంటే నీది
పుగాకుకాడొకటి పారెయ్ బావ!, అని మరొక కోరిక వెళ్ళబుచ్చుతాడు సీతాపతి.......
______________________________________________
....నాటిక ఆసాంతం కథా సంవిధానం తో పాటు, సంభాషణలు గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది.
నార్లవారి రచనలు వాల్యూం 2 - సంపాదకుడు :వెలగా వెంకటప్పయ్య- ప్రచురణ- నార్ల కుటుంబం
2004 వెల.200-/- అన్ని పుస్తక విక్రయకేంద్రాలలో
___________________________________________
27-9-2013 - సా. 5.30

కపిల రాంకుమార్||సాహితీ సుమాలు - నలిమెల భాస్కర్ ||

కపిల రాంకుమార్||సాహితీ సుమాలు - నలిమెల భాస్కర్ ||
నలిమెల బాస్కర్ ' సాహితీ సుమాలు ' అనే  పుస్తకానికి ' నిఖిలేశ్వర్ ' ముందుమాట రాస్తూ
' సుమ' సౌరభాలతో సాహిత్య ద్వారాలు తెరిచిన భాస్కరుడన్నారు. 17 వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కవి
మీర్ నుంది 20 వ శతాబ్దానికి చెందిన కొండ జాతి అక్షరమల్లె ' ఛునీ ' దాకా 35 మంది సాహితీవేత్తలతో
కరచాలనం చేయిస్తాడు. ఈ వ్యాసాలన్నీ గతంలో ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలొ 35 వారాలపాటు
సాహితీ సుమాల పరిమళం వెదజల్లాయి. అవి ఒక పుస్తకరూపంలో నయనం ప్రచురణలు, సిరిసిల్ల వారు
వెలుగులోకి తెచ్చారు, డిసెంబరు 2000 లో.  '' సాత్ వలేకర్ మొదలు మనవాడైన ఎలుగు పెద్ద సామల సద్దశివ
గురించి ఈ తరం చదివితే అపారమైన వదుష్యం, కళాత్మక హృదయం, ఆ వ్యక్తిత్వాల్లో ఎంతగా రక్తరంజితమైపోయాయో అర్త్హం చేసుకోగలం. '' అంటారు నిఖిలేశ్వర్.

''ఈ పరిచయ వ్యాసాలుచదువుతూంటే ఓకచోటా అకస్మాత్తుగా ఆగి ఆలోచిస్తాం.' విధి' వక్రీకరించినా ఓడిపోని
అజేయ సంకల్పంతో జీవితాన్ని సార్థకం చేసుకున్న మన కరీంనగర్ (ఊటూరు గ్రామం)(కీ.శే)ముద్దసాని రామిరెడ్డి
గారు పలుకరిస్తారు.గత 33 (2000 నాటికి) సంవత్సరాలుగా మంచంమీద బోర్లా పడుకుని తనకు
తొచినరీతిలో సాహిత్య సేవ చ్స్తూవున్నారాయన. 1967 లో జరిగిన రోడు ప్రమాదంలో వెన్నెముక విరిగి
శయ్యాగతుడుగా శేష జీవితాన్ని అక్షరాయాగం చేస్తూ ఆరాధన కావించాడు. ఇక మన పొరుగున వున్న తమిళ కథాశిల్పి ' పుదుమై పిత్తన్‌ ' కన్నడ అభ్యుదయ రచయితా అశ్వత్థ, మలయాళీ రెబల్ రచయిత ' కోవిలమ్‌' మనలో ఎంతమందికి తెలుసు? చాల మందికి అసలు తెలియదు అని అంగీకరించే పరిస్థితి యీనాటికి నెలకొనివుంది.
భాషాపరమైన యిబ్బందులున్నా, కనీసం ఇంగ్లీషు లేదా హిందీ అనువాదాల ద్వారానైనా మన భారతీయ
రచయితలను మనం ఏమాత్రం చదువుతున్నామనే ఆత్మ పరిశిలన చేసుకోవాలి'' అంటారు నిఖిలేశ్వర్.
'' 1950-70 మధ్య ఆనాటి తరానికి శరత్, ప్రేమ్‌చంద్, రాహుల్ శాంకృత్యాయం తదితరులు అనువాదాల ద్వారా
మనకెంతో దగ్గరైనారు. మరి ఈ రోర్జు ప్రోత్సహిస్తున్నామా?..ఆ కర్తవ్యాన్ని తిరిగి నలిమెల భాస్కర్ ఈ సాహితీ సుమాల ద్వారా గుర్తుచేస్తూ, తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అనువాద యాగం కావిస్తున్న సోమయాజి. అందుకు ఆయనని మనసారామెచ్చుకుంటున్నాను ..అంటు ముగించారు నిఖిలేశ్వర్
డిసెంబర్ 6-2000 న.
___________________________________________
1.10.2013 ఉదయం 6.50

28, సెప్టెంబర్ 2013, శనివారం

|| మన సంస్కృతి- బొడ్డేమ్మ పండుగ||

కపిల రాంకుమార్|| మన సంస్కృతి- బొడ్డేమ్మ పండుగ||
భాద్రపద మాసంలో బహుళ పంచమినాడుప్రారంభించి, మహాలయామవాస్యతో ముగించే ' బతుకమ్మ '
పండుగకు ముందు ఉత్సవంగా ' బొడ్డెమ్మ పండుగ ' తెలంగాణా సంస్కృతిలో ప్రసిద్ధమైనది.
_________________________________________________
మాలుమర్తి మేడ మీద చందమామ - వెండియ్య వేనగిరులు చందమామ
ఇత్తడి చేరలు చందమామ - ఇత్తడి చేరలకు చందమామ
రాగియ్య కడువలు చందమామ - రాగియ్య కడువలకు చందమామ 
ుత్యాల ముగ్గులు చందమామ - ముత్యాల ముగ్గులకు చందమామ
వజ్రాల వాకిండ్లు చందమామ -వజ్రాల వాకిండ్లకు చందమామ
పవడాల పందిళ్ళు చందమామ - పవిడాల పందిళ్ళకు చందమామ
మంచినీళ్ళ బావిబుట్టె చందమామ - మంచినీళ్ళబావి పక్క చందమామ
మంచిమల్లె తీగ బుట్టె చందమామ- మంచిమల్లె తీగకు చందమామ
కోసేవారు లేక పాయే చందమామ - కోసెవారు లేకపోతే చందమామ
కొండెత్తు పెరిగిపోయే చందమామ - కొండెత్తుపెరిగితే చందమామ
కోయించు చందప్ప చందమామ -కోయించి చందప్ప చందమామ
పంచిపెట్టు గౌరమ్మ చందమామ - పంచి పెట్టు చందమామ!

తొమ్మిదో రోజున పరమాన్నము వండి, పంచిపెట్టి, ఒక బావి వద్దకు గూడి

'' బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డాలెందరె
బావిల పడ్డవారికి బారిద్దరమ్మ
చెర్లా బడ్డ వారికి చేరిద్దరమ్మ
కుంట్లబడ్డావారికి కోరిద్దరమ్మ
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ
నిద్రకూ నూరేండ్లు నీకువెయ్యేండ్లు
నినుగన్న తల్లి నిండ నూరేళ్ళు ''
అని పాట పాడి బొడ్డెమ్మని ఆ నీళ్ళలో విడిచిపెడతారు.
____________________________________
జానపద గేయ సాహిత్యం -డా. బిరుదురాజు రామరాజు - పారమార్థిక గేయములు -
నుండిసేకరణ.
____________________________________
27.9.2013 ఉదయం.11.10

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

\ చిరంజీవి హరీష్

కపిల రాంకుమార్|\ చిరంజీవి హరీష్||
కళాకారులెందరో - కన్నీటిదండలై
హృదయాలదోసిళ్ళ - కైమోడ్పులిడగ
అభ్యుదమింటిపేరు - ఆదరణే ఒంటితీరు
హరీష్ వంటివారు - యింకెవరు కానరారు!
కలిగినోడికి కనికరముండుట - కలకాదు సుమా పచ్చినిజం!
అడిగినోడికి కాదనకుండ - ఆదుకొనుటతని నైజం!
‘అరసాలను ' ' విరసాలను '- రకరక భావాలను
సభలలోన మేళవించి - పలురకాల ప్రోత్సహించి
దాన శీలికి ఎముకేలేదు - కార్యశీలికి కునుకేరాదు
ప్రజావైద్యునిగ హస్తవాసి - ప్రజాబంధువై వాసిగాంచె
సామ్యవాద పక్షాలకు - తలలోని నాలుకయై
కళారంగసంస్థలకు - ఆయువై, ప్రాణమై
ఆదర్శిలింటితొనె- అమలుచేసిన మార్గదర్శి
సంప్రదాయ సంకెలలను - ఖండించిన ప్రగతివాది
పుస్తకాలనె్న్నింటినో - వీలునామరూపంగా
బివికేకందించిన - మహామనీషి
కనపడని కథకుదుగా - మంద్రస్వర మాటరిగా
అందరిని అలరించిన - మృదు భాషకుడు
అందలానికేగినా - అందరిమదిలోన
అంబరాన తారలాగ - మందస్మితుడైనాడు
స్తవనీయుడు - అస్మదీయుడు
ప్రాత: స్మరణీయుడు - మరణ రహితుడు.

22. 9. 2013 – డా. కానూరి హరీష్ వర్థంతి.

|| త్రిశంకు స్వర్గం||

కపిల రాంకుమార్ || త్రిశంకు స్వర్గం||

భూమ్యాకాశాలు కలసినట్లు దృశ్యం భ్రమే కాని
నిజం చేసేలా ధరలాకాశాన చెట్టపట్టాలేసుకుంటే
నమ్మకతప్పటంలేదు
జేబులో డబ్బులకు సంచి నిండేదొకనాడు
ఇపుడంతా తారుమారు!
నియంత్రణ చేయాల్సిన
సర్కారు చేతులు కట్టుకుని
చోద్యం చూస్తోంది!
ధర్నాలు చేసినా, రస్తారోకో చేసినా
రాజ్య హింసకైనా సిద్ధమేకాని
రాజ్య క్షేమం పట్టకుంది!
సరఫరాచేసే సంస్థలన్నీ కట్టుకట్టి
గిట్టుబాటు ధర రాకుంటే
చందా నిలుపుదలచేస్తామన్నపుడుల్లా
మూల్యం పెందుకుంటూపోతోంది!
మూలిగేనక్కమీద తాటిపండు పడి
జనం గగ్గోలు పెడుతున్నా
తగ్గిపోతున్న రూపాయి వలువలకు
మాకేం రంకుకడతారేం అంటూ
ఎదురుదాడి చేస్తోంది సర్కారీ కుక్క!
వంటకు గాసూ లేదు గాసునూనె దొరకదు
వండని ప్రకృతి ఫలాలు తిందామంటే
వనాలు లేవు కాంక్రీటు భవనాలు తప్ప!
రెంటికి చెడ్డ రేవళ్ళనుచేసి
రోట్లో తలపెట్టిన తరువాత
రేట్ల పోటు తట్టుకోపోతేయెలా సామెతలేస్తోంది
ఇల్లెక్కి కోట్లకు కోట్లు తినమరిగి
అరిచే కోడిలా యుపియే పుంజు!
సుఖమెరిగిన ప్రాణాలు సౌకర్యాలొదుకోలేక
రేపటి రాజెవడో రెడ్డెవదో తేల్చే ఓట్ల సమరం వరకు!
త్రిశంకు స్వర్గంలో వేలాడటమే మన కర్తవ్యం!
21.9.2013__________________5.10 pm.

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్|| యాదృచ్ఛికం||

కపిల రాంకుమార్|| యాదృచ్ఛికం||

రోజూ బస్కీలు తీసే వాసు
వెలుగురాకముందే
లంగోటి కట్టి
అంగవస్త్రంతో
దోడ్లో సాధన చేస్తుంటే
తూర్పు వెలుగురేఖలు
బద్ధకంగా శ్వేత వర్ణం వదిలి
మంకెనపూరంగేసుకుని
పలుకరించేవేళ
కిలకిలరావాలు
సన్నాయి వాయించే గుడిగంటలకు
తోడిరాగమవుతున్నవేళ
లంగావోణీలో మంగ
చల్లని పచ్చికపై అంగలువేసుకుంటూ
పూలకోసం బావి వెంపు కదులుతున్నవేళ,
పాలేరు వెంకన్న పాలుపితికి
వంటింటి గుమ్మంలో పెట్టి
గడ్డిమోపుతేవటానికి
వాము వెంపు వడివడి నడుస్తున్నపుడు
మువ్వల సవ్వడిచేస్తూ చెంగుచెంగుమనే
లేగదూడ అదాటుగా బావి అంచుకు వస్తున్నపుడు
ముగ్గురి దృష్టి దానివైపే మరలింది
క్షణంలో పడబోయే దూడని
కాపాడే ఆత్రంలో దూడను గెంటారే కాని
వారు మాత్రం బావితో మమేకమయ్యారు!
జీవ ప్రాణరక్షణలో స్వయంరక్షణ మరచి
తామరాకులా బావిలోనే తేలారు!
యాదృచ్ఛికంగా జరిగిందే
కాని మనసును నలిపేసింది.

20.09.2013 ఉదయం 5.59...

కపిల రాంకుమార్‘’|| The uncommitted poet ‘’ ||అద్దేపల్లి వారి కైత|



కపిల రాంకుమార్‘’|| The uncommitted poet ‘’ ||అద్దేపల్లి వారి కైత||

He wakes up in the morning
Offers his prayers to God
And writes a poem of Devotion
As the clock shows noon
Hunger growls in his stomach
He writes a poem on hunger
He goes for an evening walk along the Fields
Charming clouds criss-cross the sky
Birds sing sweet songs on the trees
He remembers Krishna Sastry
And writes a lyrical poem
Before he retires for the night
His beloved tickles his heart
He writes a poem on love
Sighing with satisfaction
At his four poems written that day
His eyes full of thoughts
Of tossing them to the world
He falls asleep
This uncommitted poet.
_____________________________________________________________

And there are 43 poems in this book and all are in simple and free with reachable language.
I need a letter – Telugu poems – translated by Ramana Sonti of Addepalli Ramamohana Rao, October 2011 Rs.75/- in all leading bookshops.
_____________________________________________________________
16.9.2013 సా .4.02

కపిల రాంకుమార్||| మాట - అర్థాలు పరమార్థాలు||

కపిల రాంకుమార్||| మాట - అర్థాలు పరమార్థాలు||

మాట = భాష కాని ఇంకేమైనా అర్థఛాయలు కనపడతాయేమో, చూద్దాం! అవి 
ఎన్నోవున్నాయి. ' ఏ మాటకామాటే చెప్పుకోవాలి ' మాష్టారు పాఠం చెప్పితే చాలా బాగా 
చెప్తారు. అంటే ఆయన పాఠం చెప్పడం అరుదు. కాని చెబితే చాల చక్కగా చెబుతారు 
అని అర్థం.దేశం కాని దేశంలో లేదా మనరాష్ట్రం కాని చోట తెలుగు మాటలు వినబడితే 
అవి తెలుగు పదాలని అర్థం. ఆ మాటలు ఎక్కడో విన్నట్టుంది కళ్ళు నులుంకుని చూచాను.
అంటే శబ్దాలు అని. ఈ ఒక్క సారి నా మాట విను, అటు వెళ్ళడం మానెయ్! చెప్పిన మాట
విన్నావంటే బాగుపడతావు, లేకపోతే నీ ఖర్మ! ఇక్కడ సలహా అని. గురుడు చెప్పిన మాట -
ధర్మ సూక్తి కావొచ్చు, ఆలి చెప్పిన మాట ఆజ్ఞ కూడ కావొచ్చు. నాన్న రాసిన నాలుగుపేజీల
వుత్తరంలో చెల్లెలు పెళ్ళిమాట ఎక్కడా లేదు, డబ్బు పంపమని తప్ప. వాళ్ళకి కట్నం మాట
ఎత్తితే కోపంట! - ఇక్కడ మాట అంటే ప్రస్తావన. వాడు నోటి మాట మీద లక్షలు పుట్టిస్తాడు.
మాట యిక్కడ భరోసాగానేనా? ఆ మాటకు వస్తే నేనూ వంట చెయ్యగలను తెలుసా!
మాట అంటే నిజంగానేనా? మొన్న నేనడిగిన డబ్బు మాట యేంచేసావ్? మాట అంటే
సంగతి/విషయం.ఇస్తానన్న మాట నిజమేగాని కాస్త నా మాట కూడ ఆలోచించు.
రెండు అర్థాలతో మాట. మీరు యెప్పుడు వచ్చేది, యేం చేసేది వేరే మాట, - మాట అనవసరం!
తిట్లమాట అటుంచు, దెబ్బలు కూడ పడ్డాయిగా? మాట విషయం/ సంగతి అవుతుంది
కరెంటు ఎలాదు యిపుడా చదువు మాట లేకపోతే స్విచ్చులన్ని ఆర్పేయరాదూ? మాట ఇక్కడ
ఉద్దేశం/ఆలోచన. నువ్వు వాళ్ళింటికి వెళ్ళే మాట తేలుస్తే, నేను నాకోసం అత్తెసరు వేసుకుంటా
మాట ఇక్కడ నిర్ణయమని/ఖచ్చితమని. ఆయన మాటే ఎప్పుడు పై మాట అంటే ఆయన నిర్ణయమే
ఖరారని. మా పాపకి మాటలు వస్తున్నాయి. వ్యక్తీరణ స్థితి వాడి మాట ఆవిడ దగ్గర యెత్తకు
మాట - ఊసు, ప్రస్థావన. నేను మాట యిచ్చాను తిరిగులేదు. వాగ్దానం. ఇదుగో ఆడిన మాట
తప్పడం మా యింటా వంటా లేదు. వాగ్దాన భంగం/మాట తప్పడం. ఎవరీ చెప్పనని మాటయిస్తే
అసలు విషయం చెబుతా! మాట ఒట్టులాంటిది. ఒరే మాటలు తూలకు! నోరు జారకు, మాట
జారకు అని. నేను మాట పదే వాడిని కాను. మాట ఇక్కడ అపవాదు అని. వాడు వూరకే మాటలు
తేల్చేస్తాడు.చూసావా ఎలా మాటలు నముల్తున్నాడో . నిర్దిష్టంగా లేకపోవటం/ దాటివేయటం.
ఇవాళవున్న పరిస్థితి ఐదురోజుల పెళ్ళంటే మాటలా? అన్నా, హైదరాబాదులొ ఉదయం
9 గంటలపుడు బస్సెక్కడమంటే మాటలా? ..కష్టమైన పని, సాధ్యం కానిది, ప్రయాసతో కూడినది
అనే అర్థాలు - మాటకు చెందుతాయి. మా ఆవిడకు నాకు మాటలు లేవు పొద్దుటినుండి. అంటే
అభిప్రాయ భేదాన్ని సూచిస్తుంది. మా నాన్నకి ఆ వకీలుకి మాటలు లేవు, నేనక్కడికి పోను.
అంటే శతృత్వం సూచిస్తుంది. మాటవరసకి అన్నానే అనుకో అలా చెప్పాపెట్టకూండా వెళ్ళడమే
అంటే ఉదాహరణకి అలా అన్నందుకు వెడతావా అని.'' మాటా మంతీ '' అంటే....సంభాషణ అని,
ఆ అమ్మాయి మాటల పోగు ' . అంటే మాటకారి. కబుర్ల పుట్ట. పని అయేఏసరికి ఎంత టైం అవుతుందో
మంచి మాట చేసుకుని వెళ్ళు......మర్మగర్భంగా భోజనం చేసి వెళ్ళు అని. అందుకే వాడితో స్నేహం
మానేసా మొన్నటినుంచి, నీ గురించే వాడికి నాకు మాటా మాటాఅనుకున్నాం. తగాదా పడ్డాం అని.
మాట .....ఎన్ని అర్థాలను వెదజల్లిందో...
___________________________________________
'' పదుగురాడుమాట పాటియై (పాడియై) ధరచెల్లు ......అని మనం వినేవుంటాం.
మాట అర్థం ఒక్కొక్క సందర్భాలలో ఎలా మారుతువుంటుందో జొన్నలగడ్డ
వెంకటేశ్వరరావు గారు '' తెలుగు పదాలు-అర్థాలు-పరమార్థాలు '' అనే వ్యాసం
' సాహితీ స్రవంతి ' మాసపత్రిక (సి.పి.బ్రౌన్‌ అకాడేమీ ప్రచురణ జనవరి 2012)
_సంచికలో (పేజి 50,51)..ఆధారంగా
__________________________________________
18.9.2013 సా.4.20

11, సెప్టెంబర్ 2013, బుధవారం

కపిల రాంకుమార్|| కవిత్వానికి మానిఫెస్టో!||

కపిల రాంకుమార్ || కవిత్వానికి మానిఫెస్టో||

అనుభవాలను అనుపానంగా అందించే
ముసలాళ్ళను లెక్కచేయం!
పైగా వాళ్ళది చేదస్తమంటాం!
కాని ఒకప్పుడు 
నడిచే దారిలోనో, చేసే పనిలోనో
ఆటంకాలొచ్చినపుడు మాత్రం 
అనిపిస్తుంది వాళ్ళ మాట వినుంటే బావుండునేమోనని!
***
కొత్త  ఒక వింత – పాత ఒక రోతకదా మనకి!
జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ
పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!
***
అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!
***
కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!
ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే
తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా
హృదయస్పందన కలిగించేలా
ఊకను దంచకుండా
ఊహలని పెంచితేనే
పది కలాలు రాసినా
పది కాలాల పాటు నిలిచినా
కవిత్వమనిపించాలి
కవిత్వమై ఆలపించాలి
కవిత్వానికి '' మానిఫెస్టోలా '' !

11.09.2013 సాయంత్రం 4.40

7, సెప్టెంబర్ 2013, శనివారం

కపిల రాంకుమార్ || బఠాణీలు||2||

కపిల రాంకుమార్ || బఠాణీలు||2||

పాప కైనా - కను
పాప కైనా
ప్రాపకమున్నంతవరకే!
**
ధనమైనా - ఇం
ధనమైనా
దగ్ధం కానంతవరకే
**
కారైనా (వయసు)
నీరైనా
కారితే బేకారే!
**
మాటైనా
కోటైనా (భవంతి)
ఓటిపోనంతవరకే!
**
చేతలైనా
నేతలైనా
పాతకాలు కానంతవరకే!
**
చేయి ఇవ్వటానికి
చేయి అందివ్వటానికి
చేంతాడంత బేధంవుంది!
**
7.9.13...ఉ . .10.04

కపిల రాంకుమార్|| భరోసాకు సమాధి||

కపిల రాంకుమార్|| భరోసాకు సమాధి||

సందిట్లో సడేమియాలా, రాజకీయ సంక్షోభాలు
అవినీతి కుంబకోణాలు. ఎడపెడా ఉద్యమాలు
తడిసి మోపెడవుతున్న, ధరాఘాతాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
అచేతనత్వపు అమాయకత్వాన్ని
ఆసరాచేసుకుని తమకు కావలసిన రీతిలో
పార్లమెంటులో బిల్లు చెల్లుబాటయ్యేలా
హాజరైన వారితోనే నెగ్గించుకున్న ఎత్తుగడలో
విజయం సాధింది యు.పి.ఏ.
మద్దతిచ్చింది భా.జ.పా!
వేతన జీవుల వెతలు లెక్కలేదన్నట్టుగా
గుత్తగా బజారుపాలుచేసి
కనీస భరోసాను సమాధిచేసి
కొల్లగొట్టేలా ఒడుదుడుకుల
మార్కెట్ మాయాజూదంలో
బరితెగించే ఆట మొదలయ్యింది!
ఇప్పుడీ విషయం ఎవరికీ పట్టనట్టేవుంది!
యావత్తు ఉద్యోగ సంఘాల నోరు పడిపోయిందా?
రాజకీయపార్టీలమ్ముడుపోయాయా?
ఎప్పటినుండో వామపక్షాలు నెత్తి నోరు బాదుకుంటే
ఎవరికీ తలకెక్కలేదా?
కుక్కతోక పట్టుకు గోదావరీదేవారి చందంగా
ఆశలపై నీళ్ళు చల్లినా చలనంలేదా?
రాబోయే వృద్ధాపం నిరాశామయం చేస్తుంటే
మనకెందుకులే అని మౌనంగా వున్న ఉద్యోగ సంఘాల వారిని
రాక్షసంగా జనాలకు కీడుచేసే యంత్రాంగపు నాయాళ్ళ తొత్తులయ్యారనాలా?
జరగాల్సిన నష్టం జరిగిపోయింది
చట్టమై ఉద్యోగ జీవితాలను చట్ట్రంలో బిగిసిపోయింది!
యదార్థవాది లోక విరోథి కదా మీ అక్కసు వామపక్షాలమీదెందుకు?
చీము నెత్తురుంటే,,భవిష్యత్తంధకారం కాకుండా చేయగలరా?
____________________________
6.9.2013

4, సెప్టెంబర్ 2013, బుధవారం

కపిల రాంకుమార్ ||బడి పిల్లలు - నీ ఒడి పిల్లలు||

కపిల రాంకుమార్ ||బడి పిల్లలు - నీ ఒడి పిల్లలు||

బడిపిల్లలు - నీ ఒడి పిల్లలు
బుడిబుడి నడకల బుడతలు వీరు

మరకలు లేని మరకత మణులు
మర్మాలెరుగని మందారాలు
అక్కున చేర్చి మక్కువ తీర
పాటలతో ఆటలతో
పాఠాలను అందించు!

మొక్కలు వీరు పసి - మొగ్గలు వీరు
అరమరికెరుగని - విరజాజులు వీరు!
ఇష్టపడే రీతి - కష్టపడె తీరు
సష్టవాలు పెంచు స్పష్టత కలిగించు

శిక్షణలో ఔదార్యం రక్షణలో సమతుల్యం

లక్ష్యాల బాటలపై లక్షణంగ నడుపు!
ఇంటివద్ద విసుగును ఇంటివద్దే వదిలి
కంటికి రెప్పలా కాపాడుతు వుండు!

మట్టిలోని మాణిక్యాలను మెరుగు దిద్దె శిల్పివై
మట్టి ఋణం తీర్చగాను వెరపెరుగని రైతువై
శత్రువలను దునుమాడ సరిహద్దుల జవానువై
బాధ్యతలు చేపట్టిన బుద్ధి జీవి నీవయ్య!

నీ జీతం పెరుగుదల నికెంత ముఖ్యమో
వారి జీవితమెదుగుట అదియంతే ముఖ్యం!
జాతికీర్తి నలుదిశలా వ్యాప్తిచేసే శక్తి నివ్వు
తరిగిపోని జ్ఞానమిచ్చే దాతవీవు పంతులయ్య!

సుద్దులెన్నొ నేర్పి పౌరులుగ తీర్చిదిద్ది
నీ పేరును నిలిపేలా శిష్యులను మలచు
గురువంటె దైవమనే భావన మంచిదే
పరువును పరువున పరువులో చేరనీకు!
_____________
(రచనా కాలం 2005)
4.9.2013 రాత్రి 8.21 (ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆశంస)

కపిల రాంకుమార్ || నియో మాట్రిమోనియల్ సెర్చ్||

కపిల రాంకుమార్ || నియో మాట్రిమోనియల్ సెర్చ్||
( జస్ట్ ఫర్ ఫన్‌)
ఎవరైనా సరే
కట్నం యివ్వలేని వారు
తీసుకోమనే వారు 
ఉన్న డిగ్రీలు, 
పంచుకున్న ఆస్తులు
అనుభవించిన పస్తులు
ఎత్తు కొలుచుకోటాలు
బరువులు తూగటాలు
మా ప్రమాణాలకు సరితూగాలి
తదుపరి పరిణామాలకు వారే బాధ్యత!
దరఖాస్తు చేసుకోవచ్చు
దానితో పాటు
రక్త పరీక్షతో పాటు,
ఇతరేతర బంధాలు, అనుబంధాలు
స్నేహితుల, శత్రువుల
గురువుల తల్లిదండ్రుల,
తోడబుట్టిన వారి నుండికూడ
ధృవపత్రం జతచేయని వారు
వివాహ పరిచియవేదిక
ప్రవేశానికి అర్హులు కారు!
ఆవేశాలు, కావేశాలు
దరిరానివారు మాత్రమే
బయలుదేరండి!
పడమటి గాలి సోకినవారు
పబ్బులు, క్లబ్బులు
ఏదేని సప్తవ్యసనాలున్న వారు
బయటపడితే నిర్భయ శిక్ష అమలు!
సంబంధం కుదిరితే
మరునిముషంలో-దండ మార్పులు!
రిజిష్ట్రారు కార్యాలయంలో
నమోదు గారంటీ!
సమయం, తేదీ, స్థలం
తరువాత తెలుపబడును!
గమనిక: ఫేస్ బుక్ అసలు ఫొటో లేని వారు
దరఖాస్తు చేయడానికి అర్హులు కారు.
షరా:ఈ ప్రకటన వెలువడిన అరగంటలోగా
దాఖలు చేసుకోవలెను.
సిఫార్సులు, చెల్లవు!
3.9.2013

2, సెప్టెంబర్ 2013, సోమవారం

కపిల రాంకుమార్|| సెప్టెంబర్ 1 ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలో ||

కపిల రాంకుమార్|| సెప్టెంబర్ 1 ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలో ||
'' ఏ దేశ చరిత్ర చూసినా ఏ మున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ‘‘- శ్రీశ్రీ.
1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.తేదీ సెప్టెంబరు 1, 1939 – సెప్టెంబరు 2, 1945
స్థానం:యూరోప్, పసిఫిక్, ఆగ్నేయ ఆసియా, చైనా, మధ్య ప్రాచ్యం, మధ్యధరా ప్రాంతం మరియు ఆఫ్రికా
ఫలితం:మిత్ర రాజ్యాల విజయం. ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం. అ.సం.రా. మరియు సోవియట్ యూనియన్‌లు అగ్ర రాజ్యాలుగా రూపొందాయి. ఐరోపాలో మొదటి ప్రపంచం మరియు రెండవ ప్రపంచం అనే ప్రభావ ప్రాంతాల అవతరణ - దీని నుండి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం. రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్ధిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.
1931 సెప్టెంబరు లో జపాన్ దేశం చైనా అధీనంలోని మంచూరియా ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించుకుంది. రెండేళ్ల తరువాత, 1933లో, జర్మనీ లో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అతివాద నాజీ పార్టీ అధికారంలోకొచ్చింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ శరవేగంగా సైనికంగా బలపడింది. 1938 నాటికి హిట్లర్ జర్మనీని తూర్పు దిశగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
జర్మని మనసు మరింత క్షోభ పడిన అంశాలుగా '' వెర్సైల్స్‌'' ఒప్పందం, నానాజాతి సమితి ఆవిర్భావం, ప్రపంచ మహా ఆర్థిక సంక్షోభం మొదలగునవి పేర్కొన్నపుడు, అవే రెండో ప్రపంచ యుద్ధ సన్నహాకానికి బీజాలు పడివుంటాయని భావించవచ్చును. అసలు అంతకంటే కూడ ఏదో మౌలికమైన కారణం బలీయంగాఉండివచ్చునని తెలుస్తున్నది. బహుశ: పోలెండును నాశనంచేసి, వరుస క్రమంలో సోవియట్ యూనియన్‌ (రష్యా)ని జయించి, తన అధీనంలోకి తెచ్చుకోవాలనే కామన మూలము. గతంలో సోవియట్ యూనియన్‌ తో చేసుకున్న దురాక్రమణ ఒప్పందం యెడల పేరుకుపోయిన విరోధ భావమే అందుకు కారణం. తాను చేసిన పెద్ద పొరపాటుగా నిర్థారణకు రావటం జర్మనీ లో యుద్ధ పిపాసకు హేతువైంది. ఆ పరిస్థితులను పాశ్చాత్య దేశాలు రాజీకుదుర్చు కునేందుకు వీలు లేని స్థితి హిట్లరే తీసుకువచ్చాడనేది నిర్వివాదాంశం. అలా అతను కృతకృత్యుడ య్యాడనే చెప్పక తప్పదు. అతని పాలన మొత్తం యుద్ధ సన్నాహాలు, కుట్రలు, కుతంత్రాలతోనే సాగింది. రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణం కల్పించన వ్యక్తి, దోషి హిట్లరే అని నిర్ద్వంద్వంగా చెప్పక తప్పదు. గమనించాల్సిన విషయం ఒకటుంది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం '' శాశ్వత శాంతి ఒప్పందం '' కుదిరింది. కాని ఆ తర్వాత తలెత్తిన అశాంతుల వల్ల ఆ ఒప్పందపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. పైపెచ్చు త్వర త్వరగా అభివృద్ధిచెందుతున్న శాస్త్ర, సాంకేతిక జ్ఞాన నైపుణ్యం వలన మారణాయుధాలలో అత్యంత ప్రమాదకరమైన '' అణుబాంబు '' తయారీ యుద్ధ వాతావరణం వైపు మొగ్గు చూపేలా చేసింది, దాని ద్వారా అంతా నాశనంచేసి దేశాలను తన అధీనంలోకి తెచ్చుకోవచ్చుననే దురాశ, సామ్రాజ్య వాదానికు మరింత ఊతమిచ్చింది. మారణాయుధాల తయారీ, లేదా సమకూర్చుకోటం రెండవ ప్రపంచ యుద్ధం దారిచూపి, దేశాల మధ్య ఆయుధ పోటీని రెట్టింపు చేసింది. 1939-45 కాలంలొ జరిగిన యుద్ధాలాన్ని యెంతో వినాశాన్ని, విధ్వంసాన్ని సృష్టించాయి. అంతటితో ఆగక ఆసియా, ఆఫ్రికా సుదూర పసిఫిక్ దీవుల్లో భీకర పోరాటాలకు ఆజ్యం పోసాయి. అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి అనివార్యంగా తీసుకెళ్ళాయి. హిట్లర్ తనకు బద్ధ శత్రువైన సొవియట్ యూనియన్‌ తో ''దురాక్రమణ వ్యతిరేక ఒప్పందం '' కుదుర్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేయటం ఒక గొప్ప (దుష్ట) నైపుణ్యం అని తదుపరి గాని అర్థం కానిది. 1939 సెప్టెంబరు ఒకటో తారీఖున పోలెండ్ సరిహద్దుపై తన సేనలను (కావాలనే మారువేషాల్లో - పోలెండు సైనికుల మాదిరి భ్రమ కలిగించి) పోలెండు పంపి తన సేనలపై దాడి జరిగిందని (తను యేర్పాటు చేసుకున్నట్లే) సాకు చూపి, పోలెండ్ ను బిస్కట్ నమిలినట్లు చేయడంలోనే ఆతని దురాక్రమణ చాతుర్యం యెంత కుటిల మైనదో అర్థమౌతుంది. గతంలోనే చేసుకున్న ఒప్పందవలన జర్మనీపై దాడి జరిగితే పోలెండుకు మద్దతు యిస్తామని, బ్రిటన్‌, ఫ్రాన్సు దేశాలు మాట యిచ్చివున్నందున సహకరించాల్సిన తప్పనిసరి పరిస్థితిని కల్పించాడు. అందువలన అవి పోలెండుకు మద్దతుగా జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. అయినా నెలరోజులలో హిట్లరు పోలెండు పై విజయం సాధించాడు. అందుకే ఈ కాలాన్ని (1939-40) యుద్ధ ప్రకటనల కాలంగా చరిత్రలో నిలచిపోయింది. 1939 సెప్టెంబరులో జర్మన్‌ ప్రారంభించిన యుద్ధాన్ని అనవసరయుద్ధంగా అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి లిన్‌స్టన్‌ చర్చిల్ పేర్కొనటం గమనార్హం. యుద్ధాన్ని నివారించకలిగిన అవకాశాలు వచ్చినట్లే వచ్చి జారిపోయి యుద్ధం అనివార్యమైందని గ్రహించవచ్చును. అసలు హిట్లరు నైజం యేమిటో తెలుసుకోగోరు వారు అతని స్వీయచరిత్ర ' మెయిన్‌ క్యాంప్ ' చదివితే బోధపడుతుంది. అతనిలోని క్రూరత్వం, యుద్ధ కాంక్ష, సామ్రాజ్యవాద కామం ఎంత తీక్షణంగా వున్నయో మొత్తం బయంకర విశ్వరూపం మనకు దర్శనమిస్తుంది. అతని ప్రసంగాలలోని తీవ్రత, ఉద్రేకం కమ్యూనిజం నిర్మూలనాధ్యేయం, కార్మిక సంఘాలయెడల విచ్చిన్న ధోరణి, అతనిలొ మెండుగా వున్నయనే భ్రమ కొంత కాలం ఫ్రెంచి, ఇంగ్లండు వారికి ఉండేది. కేవలం వెర్సైల్ ఒప్పందం అల్ల తీవ్రంగా నష్టపోవడం, ఇతర దేశాలకు తాను అపరాధాలు చెల్లించవలసిరావటం. జర్మనీలోని డెమొక్రాటిక్ సోషలిస్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నిరంగాలలో విఫలమవ్వటం తన నాజీయిజానికి నియంతృత్వానికి మార్గం సుగమం చేసాయి. అందుకే 1934 నాటికి హిట్లర్ అధికారం చేపట్టీ పచ్చి నియంతగా, సైనిక బలాన్ని పెంచుకోవటమే కాక తిరుగులేని నాయకుడుగా ఎదిగి, నౌకాదళ అభివృద్ధిపరిచి, సైనికాధికురులందర్ని తన చెప్పుచేతల్లోపెట్టుకుని, పెత్తనం చెలాయించి వారి తోడ్పాటుతోనే జపాన్‌ సామ్రాజ్య విస్తరణ మొదలు పెట్టాడని తెలుస్తున్నది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు జపాను వారు కూడ ఆసియాలో కమ్యూనిజాన్ని పారదోలాలనే కంకణం కట్టుకునివుండట వలన ఆ నినాదంతోనే జపాను 1931 ముందుకురావటం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉద్యమ నడపటంతో పాటు అందులో భాగంగా ఉత్తర మంచూరియాలో ఘర్షణ సాకు చూపెట్టి, చొరబడి అంతర్జాతీయ అభిప్రాయాలేవీ పట్టించుకోకుండా ఒంటెద్దుపోకడతోనే అక్కడ తన అజమాయిషిలో ఒక ''కీలుబొమ్మ'' ప్రభుత్వాన్ని యేర్పాటుచేసింది. 1933 లో చైనాలో జహోల్ ను, 1935 లో చహార్ ను ఆక్రమించింది. 1936 నాటికి చైనా ఈశాన్య చైనాలో తిష్టవేసింది. అదే సంవత్సరం జపాన్‌, జర్మనీ కలసి కొమిన్‌టర్న్‌ ఒప్పందం, ఏడాది తర్వాత వారితో ఇటలీ చేరడం, చైనా పై దురాక్రమణ కావించి, షాంగై, నాన్‌కింగ్ లను ఆక్రమణ చేసి, 1939 లో దక్షిణ చైనా కోస్తాతీరంలో ఎక్కువభాగం తన అధీనంలోకి తెచ్చుకుంది. యూరప్ లో యుద్ధ ప్రజ్వలనే జపాన్‌ పథకాలకు అనువైన నేపథ్యం అయింది. జపాన్‌ను ఆదర్శంగా తీసుకున్న ' ముసోలిన్‌ ' ఇఠోపియాపై దాడిచేయాలనుకుంటే దానికి బ్రిటన్‌ అడ్డు చెప్పటం హిట్లరు తో చర్చించి ఫ్రెంచ్ని ఒత్తిడి చేయబోతే, అందుకు ఫ్రెంచ్ వారు అనుమతిని ఉపసంహరించుకున్నారు. **
చిట్ట చివరగా 1945 మే నెల 5వ తేదీన జర్మనీ తన ఓటమిని అంగీకరించింది. దర్మిలా జర్మనీని మట్టి కరిపించిన మిత్ర కూటమి ( బ్రిటన6, అమెరికా, ఫ్రెంచ్) జపాన్‌ పై దృష్టి సారించి 1945 ఆగష్టులో హిరోషిమా నాగసాకి లపై అణుబాంబులవర్షం కురిపించి విధ్వంసం చేయటం మనమెరిగినదే. ఆ దెబ్బతో జపాను కూడ ఓటమినంగీకరించడం ప్రపంచ చరిత్ర్తలో చిరస్థాయిగా నిలచిన దారుణ మారణ యుద్ధకాండకు నిదర్శనాలే కాదు. ఆ యుద్ధం తాలూకు శకలాలు, నష్టాలు, బాధలు, మరువలేనివి. సామ్రాజ్య వాద దేశాల దాహం యెలాంటి ఘోరాలు చేస్తుందో తెలుసుకునేందుకు చరిత్రలో నిలిచిపోయాయి. ఆర్థిక సంక్షోభాలను సాకుగా తీసుకునో, లోబరుచుకునో, పెత్తనం చలాయించాలనే బుద్ధి వాటికి ఇప్పటిలో పోదు. అంత కఠోర సామ్రాజ్య కండూతి కలిగిన అమెరికాను, దాని పొరుగు దేశమైన కెనడాను వదిలి, యింకా స్పష్టంగా చెప్పాలంటే వెలివేసి 33 దేశాలు ఒక కూటమిగా '' సలాక్ '' పేరుతో ఒక కోలుకోలేని '' ఝలక్ '' యిచ్చాయి. వాటిలాగ, మిగతా దేశాలు కూడ సామ్రాజ్యవాదా్నికి వ్యతిరేకంగా ఓ బలమైన కూటమి యేర్పడితేగాని సరళీకరణ, ప్రపంచీకరణ, గ్లోబలీకరణ (ఎల్.పి.జి.)లకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటోతేదీన ప్రతిన పూనాలని కోరుకుంటూ.........(వ్యాసం విస్తృతి కాకుండ కొన్ని విషయాలను కుదించడం జరిగింది) ** (ముక్తాయింపు: 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కటొక్కటే జపాన్ నుండి అమెరికన్ సేనల అధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయాసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమికొట్టాయి. అప్పటికీ జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియెట్ యూనియన్ జపాన్ తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ అధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకీ లపై అణుబాంబులను ప్రయోగించటంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది.)
__________________________________________
** ఆధునిక ప్రపంచ చరిత్ర, రెండవ ప్రపంచ యుద్ధం - వాటి పర్యవసానాలు, సీక్రెట్స్ ఆఫ్ సెకండ్ వర్ల్ద్ వార్ లాంటి పుస్తకాల సహాయంతో మరియు వికిపీడియా నుండి సేకరించి ఇది తయారు చేయబడింది) **రచయిత: కపిల రాంకుమార్, గ్రంథాలయ నిర్వాహకుడు, బోడేపూడి విజ్ఞానకేంద్రం, సుందరయ్యనగర్ ఎన్‌.ఎస్.పి.కాలనీ, ఖమ్మం 507 002 మొబైల్ నెం. 9849535033

కపిల రాంకుమార్|| సబాల్ట్రన్‌ ఆర్తి, ఆక్రోషం '' అజా '' || సుంకిరెడ్డి నారాయణరెడ్డి|

కపిల రాంకుమార్|| సబాల్ట్రన్‌ ఆర్తి, ఆక్రోషం '' అజా '' || సుంకిరెడ్డి నారాయణరెడ్డి||

జాతి అణచివేతను ప్రశ్నిస్తున్న సంకలనం '' అజా'' -

అజా అనేది ఆర్తికాదు, పిలుపు కాదు, ధ్వంస రచనలో నిట్ట నిలువునా మునుగుతున్న
ఒక ఆక్రందన,ఒక అర్తనాదం, నిస్సహాయ ఆక్రోషం, గాయం నుంచి కారే కన్నీళ్ళు
గాయం నుంచి కారే కవిత్వం. ప్రేయసి చేసిన గాయంలోంచి, విధి చేసిన గాయం లోంచి ఒంటరి
ముస్లిం బాధే కవిత్వమై ప్రవహించినట్లు, మెజారిటి మతం చేసిన గాయం నుంచి, అమెరికా చేసిన గాయం నుంచి ముస్లిం ఒంటరితనమే విశాలంగా పరుచుకున్న కవిత్వం
ఇక్బాల్ : నాకేం కవిత్వ మొస్తది అంటూనే
'' నా తోటలో పూలే లేవు
నన్ను పువ్వడిగితే ఎట్లా తెచ్చేది.'' కవిత్వం రాదంటూనే కవిత్వంలో మాట్లాడాడు.
ఇదీ సైగల్ గొంతులోని మెలాంకలీ అంటే.
సోవియట్ రష్యా వున్నపుడు ప్రపంచం బొమ్మ, బొరుసు వున్న నాణెం, బొమ్మ పోయింది.
బొమ్మ వుండొద్దు. బొమ్మ వుంటే దానికి చీమూ నెత్తురు వుంటాయి. అది ప్రశ్నిస్తుంది
ప్రపంచంలో కమ్యూనిజం ఓడిన తరవాత మరో బొమ్మ ఇస్లాం మిగిలే వుంది.
అదీ పోవాలి. ఇప్పుడు ఇస్లాం ప్రాణమున్న వైధ్యమున్న బొమ్మ. మొమ్మలుండొద్దు,
బొరులొక్కటే వుండాలి. అది ప్రపంచమైనా, భారత్ అయినా! అందరూ నిద్ర పోవాలి.
డాలర్ రెక్కల కింద. కాషాయం కరవాలాల కింద. ' అజా' లుండొద్దు. అరఫత్ లుండొద్దు
**
' దేశాలు స్వతంత్ర్యాన్ని కోరుతున్నాయి
జాతులు విమ్నుక్తి కోరుతున్నాయి.'
ఏమైంది? ఇన్ని దశాబ్దాల తర్వాత? ఒక జాతి అణిచివేతను ప్రశ్నించిన ప్రపంచ కవుల
సంకలనం ఇంకా రాలేదు, కాని అదే ప్రశ్నతో అచ్చిన ఆంధ్ర దేశ ముస్లిం కవుల సంక
లనమిది. స్కైబాబ, అన్వర్ ల ముందుమాటలు ఈ సంకలనాన్ని తెరిచే ''సెషామ్‌ '':
''నీకు బురఖా అంటే తల్లో, చెల్లో, భార్యో, బంధువో
కాని కాషాయానికి బురఖా అంటే తురకదే!
...
అరే సాయిబూ!
పిల్లల్ని పుట్టిచ్చుడే కాదు
అప్పుడప్పుడు పిల్లల్ని కాపాడుకుందాం '' ...అన్వర్
నీళ్ళు నమలకూండా సూతిగా, స్పష్టంగా మొదలవుతుందీ సంకలనం.
' నబూత్ ' అనే కవితలో
ఇక్కడే
నా ఘర్ ఒకటివుండాలి
కిలకిలా నవ్వుతూ స్వాగతం పలికే
' దెహ్ లీజ్ ' ఒకటి వుందాలి!
ఇక్కడే ఎక్కడో తప్పిపోయిన
నా ' తకదీర్ ' కోసం వెతుక్కుంటున్నాను
' తన్‌హాయి' ని తలకు చుట్టుకొని.......' అంటూ సాగుతుంది.
గుజరాత్ ఘటనపై స్కైబాబ :''కుడికన్ను చూస్తుండగానే
ఎడమకన్ను పెరికివేత
భార్యల కను రెప్పలమీదే
భర్తల దహనం!
భర్తల పిచ్చి చూపులముందే
బరిసెలు దిగబడిన యోనుల రక్తం ''

ఇషాఖ్ మహమ్మద్ : ''అక్కడ మతోన్మాదం

రక్తపు హోళీ ఆడుతోంది
అది రక్తం కాదు
రంగు నీళ్ళని బుకాయిస్తోంది ''

గౌస్ మొహియుద్దీన్‌: ''ఆ చమేలీ నవ్వు
చమన్‌ లో పూసినందుకే
రెమ్మారెమ్మా విరచబడింది ''

జమీలా నిషాత్ : ' ఆ ఇళ్ళ బూడిద
మమ్మల్ని పిలుస్తోంది
విరిగిన తలుపులు
చప్పుడు చేస్తున్నాయి ''
మహమూద్ : '' తప్పిపోయిన బంతిలా
తన బాల్యాన్ని వెతుక్కుండున్నాడు
తల్లీతండ్రినీ వెతుక్కుంటున్నాడు
రెగిపడిన మాంసం ముద్దలతో
పోల్చుకుంటున్నాడు.''
యాకూబ్ : ' నేనేం చేసాను
నా శరీరంలో కోర్కెల్ని తీర్చే
ఒక మర్మాంగం కూడా ఉందని తెలియనిదాన్ని ''
షాజహానా: '' ఆకాశాన్ని చీరి
చందమాను లాగిపారేస్తే
చీకటి అమవాస్య
ఆ తల్లి కడుపులోంచి మాట్లాడుతున్నాను ''
.....కవుల పేర్లు తీసేసి చదివితే ఇది ఒక దీర్ఘ కవిత్గా కనిపిస్తుంది కదూ.
అవును అంద్రిలోనూ బీభత్సం, ఒకే రకంగా రక్తాన్ని మరిగిస్తున్నప్పుడు
అందర్లోంచి వెలువడిన ఒకే కావ్యమిది. ..
ఈ సమీక్షలో మొదట్లో కోట్ చేసినట్లు దేనీ అస్థిత్వం దానిదే, దేని గౌరవం,

దేని స్థానం దాని కివాల్సిందే. అలా కాకపోతే అది, వైవిధ్యంలేని, అంద విహీనమైన
శిలా సదృశమైన దేశమౌతుంది. ప్రపంచమౌతుంది.
అంత వికారమైన దేశమెందుకు? ప్రపంచమెందుకు??
_________________________________
పేజి 187-189 . ముల్కి - ముస్లిం సాహిత్య సంకలనం (వ్యాసాలు, రిపోర్ట్లు, కవితలు, సమీక్షలు )సంపాదకులు : స్కైబాబ, వేముల ఎల్లయ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ జూలై 2005 వెల రు.65/- మా బి.వి.కె. గ్రంథాలయంలో ఈ పుస్తకమున్నది.
__________________________________
2.9.2013 9.51 am.

31, ఆగస్టు 2013, శనివారం

కపిల రాంకుమార్ || చిలీ మరో సెప్టెంబర్ 11 ||పుస్తకపరిచయం||

కపిల రాంకుమార్ || చిలీ మరో సెప్టెంబర్ 11 ||పుస్తకపరిచయం||
1. ''ఒక మనిషి చిత్ర పటం'' - పాబ్లో నెరుడా - గేయం

స్వీయ అభద్రతా భావంతో
హత్యాకాండకి తెగబ్డి
చనిపోయినవారి రక్తంతో
పంకిలమైన ఆ చేతులని
విచారించవలసినదే
అమరులు ఈ భూమిలో నుండి
విషాదపు విత్తనాలవలె మొలకెత్తుతున్నావు
ఎందుకంటే మున్నెన్నడూ
ఇలాంటి కాలాన్ని కూడా ఉఓహించలేదు
బోనులో చిక్కిన ఎలుక మాదిరి
భయంతో ఇంతలేసి పెద్దవైన కళ్ళతో 'నిక్సన్‌'
తుపాకితో కాల్చేసిన జండాలు
పునరుద్ధానం అవడాన్ను చూస్తున్నాడు!
అతని అహంకారాన్ని క్యూబా తరిమికొట్టింది
ఇప్పుడీ సంధ్యా సమయం అస్తమించాక
ఆ కరకు కోరల పశువు కొరుకుడుపడని
' చిలీ' ని నమిలెయ్యాలని చూస్తుంది!
బహుశా అతగాడికి తెలిసివుండకపోవచ్చు
అంతగా పేరు ప్రఖ్యాతులులేని ఈ చీలీ దేశ ప్రజలు
అతనికి గౌరవంగా ఒక గుణపాఠం నేర్పించనున్నారు!
**
2. ప్రతి కార్మికుడు, ప్రతి రైతు చేతుల్లో తుపాకి ఉండివుంటే
ఫాసిస్టు తిరుగుబాటుకి ఆస్కారమే ఉండేది కాదు '' - ఫైడల్ కాస్ట్రో
**
3. '' విప్లవ క్రమాన్నీ నిక్కచ్చిగా, గౌరవప్రదంగా నిలబెట్టేదానికి
పరిరక్షించేదానికి మీరు కట్టుబడివుండండి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా
సిద్ధపడితే - మీరు అందుకు సమర్థులని కూడా తెలిసిందే -
మీతోపాటు ఆ పోరాటంలో చీలీ దేశ ప్రజానీకాన్నీ భాగంచేసే
వీలుంటుంది. ఇవాళవున్న పరిస్థితుల్లో మీ మాతృదేశం ముందున్న
చారిత్రక విభాతసంధ్యలో - మీ ధైర్యసాహసాలు స్థిరమైన, దృఢమైన
మీ వీరోచిత నాయకత్వం ఎంతైనా అవసరం. మీ ఈ క్యూబా స్నేహితులు
మీకు ఎలాంటి సాయం అందించగలరో కార్లోన్‌, మాన్యుయల్ మీకు
స్వయంగా తెలియజేస్తారు. మా ప్రజల అచంచల విశ్వాసాన్ని అపారమైన
ప్రేమని పునరుద్ఘాటిస్తూ ...మీ సహచరుడు - ఫైడల్ కాస్ట్రో...జూలై 29 1973
ఒక లేఖలో మద్దతు.
**
సెప్టెంబరు 11 అనగానే మనకు అమెరికాపై దాడి జరిగిన 2001
సెప్టెంబరు 11 గుర్తుకొస్తుంది. కాని అదే రోజు 1973 లో చీలీలో
జరిగిన ఘోర ఉదంతం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సాల్వెడార్
అలేండీ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని అమెరికా ప్రోద్బలంతో
పినోచెట్ కూల ద్రోసి సైనిక నియంతృత్వాఅన్ని నెలకొల్పాడు. దేశాన్ని
రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. సాల్వెడార్ అలెండీ, పాబ్లో నెరూడాలతో
పాతు ఈ ఘోరకలికి ప్రత్యక్ష సాక్షులైనవారు రాసిన వ్యాసాలు, గేయాలు
ప్రసంగాల సంకలనమే ఈ '' చిలీ మరోసెప్టెంబరు 11 '' హవానాలో జరిగిన
సంఘీభావ సభలో ఫైడల్ కాస్ట్రో, అలెండీ త్యాగాన్ని, ధీరత్వాన్ని
శ్లాఘిస్తూ ఎంతో ఉత్తేజకర ప్రసంగం చేశారు. ఇందులో ఏరియల్
డార్ఫ్మన్‌, సాల్వెడార్ అలెండీ, పాబ్లో నెరుడా, జోన్‌ జారా, ఫైడల్ కాస్ట్రో,
బియాట్రిస్‌ అలెండీ, జోన్‌ జారా, విక్టర్ జారా, మురీల్ రూక్యేసర్, డెవిడ్రే,
మెటిల్డా నెరుడా, ఎ. ఎప్పర్ సెల్లె లాంటి ప్రముఖుల వ్యాసాలు, గేయాలు,
వున్నాయి. దీనిని కె. సత్యరంజన్‌ అనువదించారు. ప్రజాశక్తి ప్రచురణ
ప్రథమ ముద్రణ మే.2005 వెల. 30/-
_______________________________________
28.8.2013 మ2.15