Tuesday, January 28, 2014

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||
'' మెజారిటీ మతానికి చెందిన మత తత్వాన్ని, జాతీయవాదంగా భావించే ప్రమాదం నిరంతరం పొంచి
వుంటుంది ''  - నెహ్రూ - 1961 జనవరి 5న చెప్పిన మాటలు.

'' ఒకేసారి కేంద్రంలో అధికారాన్ని రుచి చూసిన హిందూత్వ శక్తులు యిప్పుడు మరోసారి ఎలాగైనా,
అవసమైతే మోడీ వాచాలతను ఉపయోగించుకునైనా, లేక గుజరాత్ అల్లర్లలో అతని పాత్రను చూపించైనా
లేక ఆర్.ఎస్.ఎస్. హిందూత్వకు ఆయన తిరుగులేని మద్దతును చూపించైనా అధికారంలోకి
రావటానికి ప్రయత్నిసుతున్నారు. వారి ఈ స్కీములో వల్లబ్‌భాయ్‌పటేల్ వ్యక్తిత్వం వారికి సరిగ సరిపోతుంది.''

'' హిందూ జాతీయవాదిగా పేరుపొందిన పటేల్‌కు  అర్.ఎస్.ఎస్. తో రహస్య, వ్యక్తిగత సంబంధాలూ.
ఏర్పాట్లు వుండేవి. భారత్‌, బ్రిటిష్‌ వ్యాపాద ప్రపంచంతో మంచి సంబంధాలుండేవి. ఆయనకు విజ్ఞాపనలు
చేసుకుంటుండేవారు.  సనాతన హిందువుగా ఆయన తన మత తత్వ సానుభూతులను కప్పిపుచ్చుకునేవారు దాదు ''

'' కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించే ' పాన్‌సుఖ్‌లాల్‌ మఫత్‌లాల్‌ ' ఈతకొలను ముంబాయిలోని
మెరేన్‌డ్రైవ్ వద్ద ఇప్పటికీవుంది. దానిని సర్దార్‌ పటేల్‌ ప్రారంభించారు. ''

'' మహాత్మా గాంధీ హత్యకు జరిగిన కుట్రపై '' విచారణ కమిటీ నివేదిక '' సమర్పించిన జస్టిస్‌ జె.ఎల్‌.కపూర్ ..
మహాత్ముని ప్రాణం తీసిన ఈ హత్యపై విచారణ జరగాల్సిన రీతిలో జరుగలేదనీ, అడుగడుగున అధికారుల
నిర్లక్ష్యం కనిపించిందని చెబుతూ '' విచారణకు ఇంచార్జి మంత్రిగావున్న హోమ్‌ మంత్రి వల్లభ్‌భాయ్‌ పటేళ్
కూడ దీనిపై ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు '' అని చెప్పారు కపూర్.

'' భారత తొలి గవర్నర్  జనరల్ రాజాజీ లౌకిక వాది కనుక అతనిని రాష్ట్రపతి కాకుండ పటేల్ అడ్డుపడ్డాడని తెలుస్తుంది.''

'' 1848 జనవరి 6న పటేల్‌ ఒకవైపు అబ్దుల్ కలామ్‌ అజాద్‌  దేశభక్తిని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్.
వాళ్ళను కాంగ్రెస్‌లో చేరాలని అహ్వానించారు. పచ్చి మతతత్వ వాదులు మాత్రమే ఆ పనిచేయగలరు

'' నేను భారతీయ ముస్లిమ్‌లను  ఒకేఒక ప్రశ్న వేస్తున్నాను. ఇటీవల జారిగిన అఖిల భారత ముస్లిమ్‌ కాంఫెరెన్స్ లో
మీరు కాశ్మీరుపై ఎందుకు నోరు మెదపలేదు? పాకిస్థాన్‌ చర్యలను ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ ప్రజలమనసులో
సందేహాలు లేవనెత్తుతున్నాయి. దేశభక్తిలేనివారు పాకిస్థాన్‌ వెళ్ళిపోవచ్చు '' - పటేల్

'' పటేల్‌ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరులైన  రఫి అహ్మద్‌ కిద్వాయ్ వంటివారిపైనా, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీమీద
గూఢచారి శాఖ యిచిన ' రహస్య నివేదికకాపీ 'ని 1948 ఫిబ్రవరి 6న నెహ్రూకు పటేల్‌ పంపారు. తనను మంత్రి
వర్గం నుండి తొలగించడానికి కాంగ్రెస్‌ సోషలిస్ట్ పార్టీ కుట్ర పన్నినట్లు సృష్టించిన నివేదిక అది ''

' ఉప ప్రధాన మంత్రిగా, హోమ్‌ మంత్రిగా పటేల్ కాశ్మీర్ మహారాజును సమర్థించేవారు. మహారాజుకు వ్యతిరేకంగా
పోరాడే ప్రజానాయకుడైన షేక్ అబ్దుల్లాను, ప్రజా ట్రిబ్యునళ్ళను పటేల్ వ్యతిరేకించేవారు. భారత్ యూనియన్‌లో
కలసిపోడానికి కాశ్మీర్ మహారాజును ఒప్పించేందుకు ప్రయత్నించే వారు. చివరికి 1948 జనవరి 31 న
కాశ్మీర్ రాజు తాను స్వతంత్ర దేశంగా విడిపోతానని బెదిరించినప్పటికీ, ఆయనపట్ల సానుకూలంగానే వ్యవహరించాడు. ''
__________________________________________
22.1.2014 సాయంత్రం 4.10
__________________________________________
పేజి 9 నుండి 15 జనవరి నెల 2014 మార్క్సిస్టు పత్రికలో ఎ.జి.సూరానీ వ్యాసంలో ముఖ్య అంశాలు.


కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

దండలో దారంగా ఉండి, నేర్పరితనం కలిగివుండటమే శిల్ఫం అని కన్నేగంటీ వెంకటయ్య సాహితీ స్రవంతి 6వ అధ్యయనవేదిక ప్రతీనెల మూడవఅదివారంలో భాగంగా ది.19.1.2014 సమావేశానికి తన అధ్యక్షోపన్యాసంలో అన్నారు. తొలుత ఇటీవల మరణించిన  ప్రముఖ కళాకారులు, చలన చిత్ర  ప్రముఖలకు సంతాప తెలుపుతూ ఒక నిముషం మౌనం పాటించారు. బి.వి.కె. విద్యార్థి ఆసు ప్రసాద్ గీతాలాపనతో కార్యక్రమం ఆరంభమయింది. ముఖ్యాంశం  '' కవిత్వం - శిల్పం '' - వాస్తవంగా ఆనందాచారి ప్రసంగించవలసివుంది. కారణాంతరాలవల్ల వారు హాజరు్కాలేకపోయారు. అదే అంశంపై డా.పి. సుబ్బారావు గారిని ప్రసంగించవలసినదిగా కన్నెగంటి వెంకటయ్య కోరారు. మరొక కవి జీవన్‌, కపిల రాంకుమార్ గార్లను కూడ  దానిపై మాట్లాడవలసినదిగా వేదికపైకి పిలిచారు. శిల్పంపై పట్టు సాధించిన వారు అద్భుత కవితా సృష్టికర్తలుగా పేర్కొంబడతారని, ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసములు ఎంతో సహకరిస్తాయని వివరించారు.డా.పి. సుబ్బారావు గారు మాట్లాడుతు కవిత్వ భాష ఒక ప్రత్యేక భాష అని, మన 20 శతాబ్ద కవులు అభిభాషించారని తెలిపారు. కవిత్వం శిల్పం పరస్పరాధారితాలని, పద్యం రాసేటప్పుడు కవి తన భాషనుంచి పక్కకు తొలుగుతాడని, దానికొక ప్రత్యేక శైలిలో నేర్పుగా సృజనచేస్తాడని అన్నారు. ,వ్యాకరణం మొదట సంస్కృతలో మొదట వ్రాయబడి, తదనంతరం తెలుగులోకి వచ్చింది. నన్నయ వ్యాకరణం అందుకుదాహరణ.  బాల వ్యాకరణం
ప్రౌఢ వ్యాకరణం, అప్పకవీయం, ఇలా పరిణామ క్రమం.  కాకువు - నిత్య జీవితంలో ఉపయోగించే భాషలోవాడబడేదని అన్నారు. ధని, రసం ప్రధానంగా కవిత్వం సాగాలని దానికి తోడుగా అలంకారాలు సొగసునిస్తాయని చెబుతూ ధ్వని ప్రధానంగా 1. డినొటేషన్‌ 2. కనొటేషన్‌ 3. సజెషన్‌ లపై అధారపదివుంటుందనిదీనికి అదనంగా ఉక్తి వైచిత్యం , సర్వకాలీనత (విశ్వజనీనత)....ఇప్పటికి చెప్పకోతగిన మంచి ఉదాహరణ యెండ్లూరి సుధాకర్  కొత్త గబ్బిలం .  ఛందస్సు -అంటే  (అంద చందాలకు దగ్గర సంబంధం) అందం అని అర్థం. సమాజం లేక పోతే (ప్రపంచం) కవిత్వం లేదు. ఒక్క అడుగు ముందుకు వేయించేదే కవిత్వం. లోక పరిశీలన లేక కవిత్వం మనజాలదు. కవితలో ఓక మెరుపు, ఒక ఉరుము, ఒక స్వాంతనం, ఒక వేదన, అలోచన మిళితమైవుండాలి. - '' బాలపు బస్తాలను మోస్తున్న ఆ స్త్రీలు - గ్లోబును  ఎత్తుకున్న  అట్లాసు '' అని సుధాకర్ అన్నారు తన కొత్త గబ్బిలంలో సందర్భానికి తగ్గ పద ప్రయోగం, చేసి శ్రోతను/ పఠితను ఆకట్టుకునేదే శిల్పం అది నింపునున్నదే కవిత్వం.ఓ తిక్కన, ఓ వేమన ఓ గురజాడ అంటే నాకిష్టం ఆధునిక కవిత్రయం అని శ్రీశ్రీ అన్నారని చెపారు. కవిత్వం ఒక ఆల్కెమీ అంటాడు ' తిలక్ ' నిజమే కదా! ..ఫిలాసఫీ ఆఫ్ కాంపొజిషన్‌ అనే గ్రంథం తప్పక చదవండి అని సలహా యిచ్చారు. భాస, పదజాలం, ఊహ కలిగివుండాలి.  పప్రబంధ, ఆశు, బంధ, చాటు కవిత్వాలు కవిత్వంలో వచ్చిన పరిణమాలనే తెలుసుకోండి. కావ్య పఠన పునాది కావాలి. అదే అధ్యయనం,అభ్యసనం, సృజనం గా మార్పుచెందాలి.  పురాణ, ఇతిహాస, చారిత్రిక, సాంఘిక, పద్య, వచన కవిత్వం పరిచయం చేసుకుంటేనే కొత్త పోకడలు కవిత్వంలో చూపించగలం. కొన్ని సోదాహరణలుగా పద్యాలు, కవితలు చదివివినిపించారు. సమావేశానికి హాజరయిన వారి కోరికపై ఇదే అంశం వచ్చే మూడవ ఆదివారం కొనసగించాలని తీర్మానించారు.
మరొక ప్రముఖ కవి జీవన్‌ దీర్ఘ ఉపన్యాసం జోలికి వెళ్ళక కొన్ని కవితలను ఉదహరిస్తూ ఆయా కవుల కవిత్వ శిల్ప చాతుర్యాన్నివివరించారు. తెలంగాణా రైతంగ సాయుధపోరాట కాలంలో ఎంతో అభ్యుదయ సాహిత్యం వచ్చింది కుందుర్తి ' తెలంగణా 'సోమసుందర్ ' వజ్రాయుధం ' ఆరుద్ర  ' త్వమేవహం' గంగినేని ఎర్రజెండాలు, అవేకాక వాటినేపథ్యంలో నవలా సాహిత్యంకూడ వచ్చింది. దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి లాటి వారు ప్రసిద్ధులు.వాటిలో కవిత్వం, శిల్పం, శబ్దం, ధ్వని, రసం,చక్కగా అలరించాయి.  దర్మిలా నేటి  తెలంగాణ ఉద్యమకాలంలో కూడ చక్కటి కవిత్వం ప్రపంచంలో ఎప్పుడూ రానంతవిరివిగానూ వచ్చింది. కవిత్వం ఒక హృదయంనుండు మరొక హృదయంలోకి ప్రవేశిస్తేనే - అది కవిత్వమై తీరుతుంది అని చలం అంటూండేవారని చెప్పారు అంటూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్ది కవితలు, విశ్లేషణలు క్లుప్తంగా తనప్రసంగాన్ని ముగించారు జీవన్‌.
గ్రంథాలయ నిర్వాహకుడు, కవి కపిల రాంకుమార్ మాట్లాడుతూ కాలాన్ని హరించ కుండా, కొన్ని ముఖ్యమైన అధ్యయన చేయవలసిన పుస్తకాలుగా  హరగోపాల్ -''రూపం సారం '',  కె.కె.రంగనాథాచార్యులు ''సాహిత్యంలో విభిన్న ధోరణలు ''  సాహిత్య  శిల్ప సమీక్ష లాంటివి బాగా ఉపయోగపడతాయన్నారు. శ్రీశ్రీ కవితలను ఉదహరించినంతగా విమర్శకులు ఉదహరించే కవి అలిశెట్టి ప్రభాకర్, తెలంగాణకు చెందినవాడవటం గర్వించతగిన విషయమని తెలిపారు.హాజరైన కవులలో సునంద, శైలజ, బండారు రమేష్, షేక్ బషీర్ కవితలు చదివారు. రౌతురవి వందన సమర్పణ చేస్తూ మరల ఫిబ్రవరి నెల మూడవ ఆదివారం తిరిగి ఇదే అంశం కొనసాగుతుందని తెలిపారు..


24.1.2014 సాయంత్రం  2.50

Sunday, January 26, 2014

|| బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

కపిల రాంకుమార్ || బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

ఒకప్పటి మా ఫ్రెండ్ 
పాపం! వాడు పిచ్చి వాడో
మద బిచ్చగాడో తెలీదు 
అచ్చం చూడ్డానికలావుంటాడు...
కాని బాగా చదువుకున్నవాడు
విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు కూడానట!
అదేమి పొయేకాలమో
పెడధోరణో....లేక
పెర్వర్టెడ్ ఇంటిల్‌జెన్‌సీయేమో  తెలియదు కాని
రాతలనీండా రోతలే
నోటితో ఉచ్చరించే మాటలన్నీ విషయించాలనే కూతలే
మత్తులోవుంటాడో? మదంతో వుంటాడో?
బోధపడడు.....వేషం ఆచార్య దేవునిది కదా!
ఏమీ అనలేము, ఏమీ అనకుండాను వుండలేము!
ప్రేలాపనలు చూస్తుంటే
ఒక సారి ఫ్రాయిడ్ సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి!
ఒక సారి మరీ పైత్యం తలకెక్కి
కైపులో వుంటాడో
పక్కవాడికి కైపెక్కిస్తాడో కాని
ఒకపట్టానా అర్థం కాడు!
స్నేహితుడ్ని రెచ్చకొడతాడో, హేళన పట్టిస్తాడో
అంతరంగం పరీక్షించాలనుకుంటాదో కాని
'' మా శ్రీమతి అందంగా వుంటుంది!
అంత అందంగాను వంట చేస్తుంది!
మరి మై డియర్ గే నీకేమైనా కోరిక పుడుతోందా
ఓపిక చేస్తావా, నా బదులు షేర్ చేసుకో చూద్దాం! ''
అనే తలతిక్క మాటలకి
స్నేహితుడనేవాడు....నిజంగా స్నేహితుడైతే
స్నేహాన్ని వదులుకుంటాడు కాని
స్నేహితుని పైత్యపు కోరికకు ఊఁ కొట్టడు!
మీరేమంటారు?
26.1.2014 ..... 7.35 pm
_______________________________________
అలాంటివాడొకడు నాకు తారస పడితె లాగి చెంపమీదొకటిచ్చి, వాని భార్యతో చెప్పితే
ఆమె చాల బాధపడి....తన వెర్రి వేషాలు స్నేహితులమధ్యకు తెచ్చాడూ అంటూ
కలత చెంది, గత అనుభవాలను జత చేసి ....న్యాయస్థానం ద్వారా వానినుండి విడాకులు
తీసుకొని సజావుగా తన బతుకు గడుపుతోంది.
___________________________________

Friday, January 17, 2014

jignasa: MY OWN WAY

jignasa: MY OWN WAY: J.   HANUMANTHA   RAO 9848208007 Jaihindjamalapuri@gmail.com www.suryajamalapuri.blogspot.com Qual...