వార్త/ వ్యాఖ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వార్త/ వ్యాఖ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జూన్ 2016, సోమవారం

'' కవిత్వంలో కొత్త అంశంపై మూడో స్వరం ఆహ్వానించతగినదే ''


'' కవిత్వంలో కొత్త అంశంపై మూడో స్వరం ఆహ్వానించతగినదే ''

థర్డ్‌జెండర్‌ పై తెలుగు సాహిత్యంలో కవితా సంకలన రూపంలో ఇంతవరకు ఎవరూ ప్రాచుర్యం చేయలేదు. బహుశ: రచించివుండరేమో కూడ .అటువంటిది ఖమ్మానికి చెందిన   కంచర్ల శ్రీనివాస్‌, సుభాషిణి తోట సంయుక్తంగా ఒక సంకలనం '' థర్డ్‌ వాయిస్‌ '' పేర వెలువరించడం, అహ్వానించతగ్గది. ఆ సంకలనం నేను పరిచయం చేయటం ఒక కవిత్వంలో  కొత్త  ఒరవడికి పెద్ద పీఠం వేసినట్లే నని ప్రముఖ కవి, సాహితి
విమర్శకుడు డా. సీతారాం పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా తెలంగాణ సాహితి నెలనెలా నవకవనం ప్రథమ సమావేశం స్థానిక మంచికంటి భవన్‌లో అధ్యయన వేదిక నిర్వాహకుడు కపిల రాంకుమార్ అధ్యక్షతన జరిగింది. మువ్వా శ్రీనివాసరావు , డా. సీతారాం, కె. ఆనందాచారి,కెన్నెగంటి వెంకటయ్య, పాల్గొన్న సమావేశ ప్రారంభంలో ఇటీవలే మే 24 న మరణించిన ప్రముఖ అభ్యుదయ వాది, అనువాదకుడు నీరుకొండ హనుమంతరావు మృతికి సంతాపం ప్రకటించారు. కిషన్‌ చందర్‌ నవలను తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన గొప్ప కవిగా వారిసేవలను స్మరిస్తూ వక్త్రలు మాట్లాడారు.

ఈ సాహితీ సమావేశంలో కంచర్ల శ్రీనివాస్‌, సుభాషిణితో సంయుక్తంగా వెలువరించిన ''థర్డ్‌ వాయిస్‌ '' కవితల సంకలనాన్ని  మువ్వా శ్రీనివాసరావు ఆవిష్కరించగా, డా. సీతారాం పరిచయం చేస్తూ '' ఎన్నో రకాలుగా భిన్నమైన కవితలు క్లుప్తంగా, ఆప్తంగా, ఆర్దంగా ఆలోచింపచేసేవిగా వున్నాయన్నారు. ఇలాంటి కవిత్వాన్ని కాని, ఇలాంటి వ్యక్తుల గురించిగాని తలచేవారు చాల తక్కువ.  సమాజంలో పాతుకుపోయిన వివిక్ష వలన  ఈసడింపబడే  వారి జీవన విధానం, బాధలు, గాథలు, ఆర్తిని చిన్న చిన్న కవితలుగా మలచి రెండు పార్శ్వాలుగా ఇద్దరు కవులు మనముందుంచడానికి సఫలమయినట్టే. అందరూ చదవండి వారిగురించి తెలుసుకోండి. ఆరికి సమాజంలో ఒక గౌరవ స్థానం వుందని గుర్తించండని అంటూ
రచయితలు ఇంకా కొద్ది శ్రద్ధ తీసుకుంటే ఇదిగొప్ప కావ్యమనడానికి సందేహంలేదని అన్నారు. అసలు ఈ ప్రయత్నమే అభినందనీయమని అన్నారు. కవితలలో ఒక ధర్మాగ్రహం వుంది. అది పలు ప్రాంతాలలోకి విస్తరించాలి. అన్నారు. మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకరి కవిత్వం స్త్రీ సమస్యలపైన, ఒకరి కవిత్వం అణిచివేతకు గురై ఆ మగవారి సమస్యలపైన, కవనం పంచుకుని రాసినట్లు అనిపించింది అన్నారు. సానుభూతికి,సహానుభూతికి ఒక స్పష్టమైన రేఖ ఈ కవిత్వంలో కనిపిస్తుందని అంటూ  కంచెర్ల శ్రీనివాస్‌ కవిత్వంలో కవితాగ్రహావేశం కొట్టొచ్చినట్టు కనబ్డుతోందని, సుభాషిణి కవిత్వం కూడా ఆ స్థాయికి ఎదగాటానికి చేసిన ప్రయత్నం హర్షించతగినదేనని, మరింత కృషి చేయగలరనే నమ్మకంతో మనస్పూర్తిగా అబినందనలు తెలిపారు. ముందుమాటలో ప్రస్థాఇంచినట్లుగానే ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, బహుళ ప్రచారం అందిస్తామని, హైదరా్బాద్‌లో కూడ ఈ పుస్తక ఆవిష్కరణ పరిచయ సభ నిర్వహిస్తామని, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి కవులిద్దరిని అభినందించారు.   తదుపరి ఇల్లందుకు చెందిన  బైరి ఇందిర రాసిన తెలంగాణా గజల్‌ కావ్యం కన్నెగంటి వెంకటయ్య పరిచయం చేసారు. తెలంగాణ చరిత్ర నేపథ్యంగా కవిత్వంలో యిమడ్చటం కష్టమీన ప్రక్రియ అని, అందునా గజల్‌ రూపంలో తేవడం మరింత క్లిష్తమైనదని, అలాంటి ప్రక్రియను ఆసాంతం విజయవంతమయేలా   మహిళా గజల్‌ రచయిత్రిగా ఒక చరిత్రను గ్రంథస్థం చేసిన ఘనత తెలుగు రాష్ట్రాలలో ఇందిరకే ఆ స్థానం దక్కుతుందని అన్నారు. తెలంగాణ సాహితి ప్రతినెల నెల నెలా నవకవనం పేర నిర్వహించే కార్యక్రమంలో కవితా పఠనం, విశ్లేషణ, కొత్త పుస్తకం పరిచయం, విశ్లేషణ,   సాహిత్య ప్రసంగాలు క్రమం తప్పకుండా ప్రతి నెల మూడవ ఆదివారం జరుగుతాయని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని కె.ఆనందాచారి అన్నారు. చివరిగా సుభాషిణితోట, ఇందిర, కంచర్ల శ్రీనివాస్‌లు రచయతలుగా ప్రతిస్పందించారు. ఈ కార్యక్రమంలో
కటుకోజ్వల రమేష్‌,ఇబ్రహీం నిర్గుణ్‌, తాళ్ళూరి రాథ, సంపటం దుర్గా ప్రసాదరావు, రాచమళ్ళ ఉపేందర్‌. ఎం. సుబ్బారావు, జిగీష, తదితర సాహితీ అభిమానులు,పాల్గొన్నారు.  కంచర్ల శ్రీనివాస్‌ వందన సమర్పణ చేసారు.

 

18, మార్చి 2016, శుక్రవారం

మిన్నేటి పొంగులు || (కవితపై శ్రీ వాచవి ముందుమాట)

Photo: కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం  1961 లో ప్రచురించింది.  దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు. 

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ  కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి,  చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల  కవిత్వమనండి,  దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని  లాక్షణికులు చెప్పారు.  '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్  మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత  ''' మిన్నేటి పొంగులు "  వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు.  అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే ' 
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో  ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని  భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని, 
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత. 
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం  మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది.  '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు  '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ 
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే  ''  మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు  సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961 


హీరాలాల్ మోరుయా - దాశరథి కల ఫొటొ హీరాలాల్ మోరియా - దాశరథి కల ఫొటొ 

కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం 1961 లో ప్రచురించింది. దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు.

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి, చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల కవిత్వమనండి, దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని లాక్షణికులు చెప్పారు. '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్ మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత ''' మిన్నేటి పొంగులు " వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు. అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే '
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని,
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత.
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది. '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే '' మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961  


3, డిసెంబర్ 2015, గురువారం

|| యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||

|యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||'శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు - పరిశీలన వ్యాసం నుండి||
***రచయితలలో అగ్రాసనం కవిది. ఇటీవల వాడుకలోకి వచ్చిన మాట రచయిత, పూర్వం కవిగానే సర్వత్ర వ్యవహారితం. సాహిత్య ప్రక్రియలలోకవిత ఆద్యం, సర్వ సాహిత్యాలలో తొలిపూత కవితే అని చరిత్ర తెలుపుతోంది. కావ్యాస్వాదన పాఠకుని సహృదయతను మెరుగుపెట్టి, నాగరికుణ్ణి చేస్తుంది. మనసుపైన సత్కవిత వేసే ముద్ర ఎన్నటికి చెరగనిది. దాని తావి తరుగులేనిది.2015 మే 6 నాటికి దిగంబర కవిత్వోద్యమం యాభై వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అంటే దిగంబరకవుల మొదటి సంపుటి 1965 మే 6న తెలుగు సాహిత్య రంగంలో ప్రవేశించింది ఈ సందర్భంగా ప్రపంచ సాహిత్య రంగంలో కూడ యిలాంటి ధోరణులు, లేదా తీక్షణమైన కవితాసృజన జరిగిందేమోనని గమనిస్తే ఈ క్రింది విషయాలు దృష్టికి వచ్చాయి. మన దిగంబరకవిత్వానికి దాదాపుసమకాలీన సాహిత్యం సృజన చేసిన వారిలో 1. సాన్ఫ్రాంసిస్కోలో ని బిట్నిక్కులు, 2. బ్రిటన్కు చెందిన యాంగ్రీ యంగ్మన్ 3. హంగేరికి చెందిన - గాయపడిన యువకులు 4. రష్యాకు చెందిన ఎతుషెంకో అనూనాయులు 5. హాలెండ్లోని - ప్రోవో ఉద్యమం, ఇక మన దేశంలోనే '' కలకత్తా లో ఆకలితరం కవులు '' ఉత్తర ప్రదేశ్లో అనామ కవిత్వోద్యమకారులు, మహారాష్టలోని ఆఫ్వర్గం వారి సాహిత్య ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిగంబర కవులపై ఉండివుండవచ్చునని ఆచార్య కాకర్ల వెంకట్రామ నరసింహ్వం గారు తమ ''ఆధునికాంధ్ర కవితా సమీక్ష'' లో పేర్కొన్నారు. ఈ ఆరుగురిలో చెరబండరాజు, జ్వాలాముఖి దివగంతులుకాగా, కొన్ని కారణాంతరాల వలన 1971 తరువాత సాహిత్య ప్రపంచాన్నుంచి తప్పుకుని మహాస్వప్న నెల్లూరు జిల్లా లింగ సముద్రంలోనూ, భైరవయ్య విజయనగరంలోను స్థిరపడ్డారు. నిఖిలేశ్వర్, నగ్నముని హైదరబాదులో వుంటూ సాహిత్య లోకంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.. మిగతా కవులకు భిన్నంగా వారి పేరుమీద వారాలని: స్నేహ వారం, విశృంఖల వారం, క్రాంతివారం, సృజన వారం వికాసవారం, అనంత వారంగా పేర్కొన్నారు. ఋతువులను ఆశఋతువు, తపన ఋతువు, అశ్రుఋతువు మదిర ఋతువు, విరహ ఋతువు, విషాద ఋతువులుగాను, సంవత్సరాలను నగ్న నామ సంవత్సరం నిఖిలేశ్వరనామ సంవత్సరం, జ్వాలాముఖినామ సంవత్సరం, చెరబండనామ సంవత్సరం, భైరవ నామ సంవత్సరం మహాస్వప్న నామ సంవత్సరాలుగా ప్రకటించడంద్వారా సాహిత్యంలో ఒక నూతన ఒరవడిగా మొదలైనట్లు భావించవచ్చు. వాటి క్రమంలో 6 సంపుటాలుగా వెలువరించాలని వారు మొదట భావించినా మూడు సంపుటాలను మాత్రమే పరిచయంచేసి అర్థంతరంగా అనివార్య కారణాల వల్ల ఆపివేయటం కొంత నిరాశ కలిగించినదని చెప్పవచ్చు.
** మొదటి సంపుటం ''ఇతి శాసనం'' లో దిగంబరశకం, నగ్ననామ సంవత్సరం ఆశఋఉతువు (సరిగ్గా క్రీ.శ.1965 మే)న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్న ప్రప్రధమంగా తాము దిగంబర కవిలమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేయడానికొస్తున్న నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భైరవయ్య, చెరబండరాజు, మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని పేజీల్లో పట్టుకోవడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ అంటూ వాళ్ళ ఆగమనాన్ని తెలియచేసారు.
రెండవ సంపుటం '' దిక్లు-30'' దిగంబరశకం, నిఖిలేశ్వరనామ సంవత్సరం, మదిర ఋతువు (సరిగ్గా క్రీ.శ.1966 డిసెంబర్) లో ఇంకా భయంభయంగా బానిసత్వంగా దుర్భరంగా, హేయంగా, ఛండాలంగావున్న ఆంఢ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితాప్రచురణ సమర్పిస్తున్నది అని దిగంబరశకాన్ని తెలియచేసారు.
మూడవసంపుటం: ప్రజల అవిద్యని, అజ్ఞానాన్ని, అశక్తతని, ఆసరాగా తీసుకుని దేశాన్ని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాలవాళ్ళు నేడు ప్రజలపై రుద్దుతున్న '' కుష్టు వ్యవస్థ''ని ఎదుర్కొంటూ దిగంబరకవులు పలికిన జ్వాలానామ సంవత్సరం, విషాద ఋతువు (సరిగ్గా క్రీ.శ. 1968 జూన్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్న్నది అని తెలియచేసారు. ఈ దేశంలో ఈ ఇరవైయేళ్ళ స్వాతంత్ర్యంలో భయంకరంగా, విజృంభించిన కులమత దురహంకారానికి, ధనమదంతో యధేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న గుండాయిజానికి సినిమా రొంపిలో ఈదులాడుతున్న యువతరం బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న మేథావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి ఈ కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల కోటేశు స్మృతికి ఈ మూడో సంపుటం అంకితం చేసారు. ( ఇది హర్షించదగ్గది) దిగంబరకవులు తమ మొదటి సంపుటిలో ఒక విషయాన్ని స్పష్టం చేసారు. తమ కవితా ప్రక్రియని వచన కవిత్వం అనమని, అననివ్వమని అన్నారు. ఇకనుండి దిగంబరకవులు తమ కవితా ఖండికను 'దిక్' అనే ఖండికలను దిక్కులనీ వ్యవహరిస్తారు. జబ్బుపొరల్ని చీల్చి కాస్మిక్ మార్గాన్ని నిర్దేశించేవి దిక్‌లు . మానవత్వపు విలువలే వీటిహద్దులని చాటారు…
**…
( ఇంకా వుంది - స్థలాభావం చేత సంక్షిప్త సమాచారం తీసుకున్నాను)
6-5.2015/3.12.2015

24, నవంబర్ 2015, మంగళవారం

డా. వై.ఆర్.కె.సాహితీ పురస్కారాలు - దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

కపిల రాంకుమార్‌ ||నివేదిక ||దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

డా. వై.ఆర్.కె. సాహితీపురస్కారాలందుకుంటున్న ఈ సభ ఒక ప్రత్యేకత సంతరించుకున్నదని, దేశమంతటా కవులు సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి యిచ్చివేస్తున్న సందర్భంలో, ఒక సాహిత్య అభిమాని, ప్రజావైద్యుడు కీ.శే. డా. వై.ఆర్.కె. గారి పేర అవార్డులు ఖమ్మం జిల్లాకు చెందిన వారు అందుకోవటమంటే, ఇవి  ప్రజా అవార్డులని తెలంగాణా సాహితి రాష్ట్ర కన్వీనర్ కె. ఆనందాచారి అన్నారు.

తెలంగాణ సాహితీ ఖమ్మ జిల్లా ఆధ్వర్యంలో 10.11.2015న దీపావళి కవి సమ్మేళనం మరియు సాహితీ పురస్కారాల సభకు తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు  కన్నెగంటి వెంకటయ్య అధ్యక్షతన స్థానిక బోడేపూడి  విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పలువురు వక్తలు మాట్లాడారు. డా. రాధాకృష్ణమూర్తి వ్యక్తిత్వం, ప్రజాసేవా, అధ్యయన శీలత, సాహితి అవగాహన పలు అంశాలను ప్రముఖులు తమ జ్ఞాపకాలను  గుర్తు చేసుకున్నారు. అత్యంత ఉత్సాహ వాతావరణంలో నిర్వహించబడింది.  ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు, విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు, విశ్రాంత ఆచార్యుడు డా. పి.వి.సుబ్బారావు,
జన విజ్ఞావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్ర రావు, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి వేదికపైఆశీనులయ్యారు.

తన అధ్యక్షోపాన్యాసంలో కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ ఒక ప్రత్యేక సందర్భంలో జరుపుకుంటున్న  సభ, ఒక తాత్త్విక కవితా విశ్లేషణను కలిగించి,వక్తగా, ప్రజా వైధ్యుడుగా, నడయాడే గ్రంథాలయంగా, ప్రజల మనిషిగా, పరిణితి చెందిన రాకజీయ వేత్తగా, అంతకంటే సామాజికవేత్తగా గొప్ప మానవహక్కుల పోరాట నేతగా, సామాజిక దార్శినికునిగా పేరొందిన మహా మనిషి కీ.శే.డా. వై.రాధాకృష్ణమూర్తిని స్మరించుకుంటూ ప్రథమ వర్థంతిజరిగిన సందర్భంలో పురస్కారాలు అందుకోవటం, మిగతా ప్రభుత్వ పురస్కారాలకు  భిన్నమైనదని చెప్పవచ్చునన్నారు.తెలంగాణసాహితి రాష్ట్ర కన్వీనరు కె.ఆనందాచారి మాట్లాదుతూ పురస్కారాలు అందుకుంటున్న కవులకు మొదటగా అభినందనలు తెలిపారు.గతంలో ఖమ్మం సాహితీ గుమ్మంలో సాహితీ సేద్య చేసిన మహామహులతో మహా కవి శ్రీశ్రీ స్మారక సభను నిర్వహించిన తీరు అద్వితీయమైనదని,దాని నిర్వహణలో అంతా తానై డా. వై.ఆర్.కె. ప్రత్యేక సంచికలో ఒక వ్యాసం  రాస్తూ '' చంద్రునికో నూలుపోగు '' శీర్షికలో  శ్రీశ్రీ బహుముఖ కోణాల్లో వర్ణించిన వారి వ్యాస శైలి వారి మేథోపాఠవానికి తార్కాణమని, ఎందరినో ఆలోచింపచేసిన వ్యాసమని కొనియాడారు.ప్రస్థుత సమాజంలో సర్కారు వైఖరిపై నిరసనగా కవి ద్రష్ట కాబట్టి 100 మంది కవులు తమ అవార్డులు వాపసి యిచ్చేయడంలో '' కవులంటే ఏమనుకుంటున్నారు - కవులకు వేయి కళ్ళుంటాయి '' అనే కవితను చదివి రసజ్ఞులను ఉర్రూతలూగించారు.

డా.పొత్తూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తనకు డాక్టరుగారికివున్న అత్యంత సాన్నిహిత్యంగురించి ఎన్నో విషయాలుతెలియచేసారు.క్రిటిక్ డాక్టర్ వై.ఆర్.కె ను ప్రస్థుతిస్తూ ఎల్లపుడూ, కవి ధర్మాగ్రహాన్ని ప్రదర్శించకలగాలని ఉద్బోధించారు. 1645 లో జాన్మిల్టన్ రాసిన పుస్తకం పత్రికా స్వేచ్ఛకు ఒక బైబిల్ లాంటిదని. కవికి వశ్యవాక్కుంటుంది. కేవలం కవులు, కళాకారులు మాత్రమే ప్రతీపశక్తులను
ఎదుర్కొంటారనేది అక్షర సత్యమని తెలిపారు.

జనవిజ్ఞానవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రరావు ప్రజాసైన్స్ ఉద్యమంతో డాక్టరుగారికున్న నిబద్ధత, నిజాయితీని గుర్తుచేసారు.సమాజం ఎల్లపుడు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పథంవైపే చూస్తూవుంటూందని, దాని నుండే ప్రజాహితం ఆశిస్తుందని. తిరుగులేని విజ్ఞానమే ప్రగతికి సోపానమని డాక్టరుగారు నొక్కి చెప్పేవారని తెలిపారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మతోన్మాదుల ఆగడాలు,
దుశ్చర్యలు ఎక్కువైనాయని, కాని ప్రజలే చరిత్ర నిర్మాతలనేదిచరిత్ర చెప్పే వాస్తవమని, యదార్థమని ఉటంకించారు.

ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు మాట్లాడుతూ తన పుస్తకావిష్కరణ సభే డాక్టరుగారితో అఖరిదవటం కొంచెం బాధకలిగించినా, వారిచ్చిన ప్రోత్సాహం నేనెన్నటికి మరువజాలనని, వారి సూచనలతోనే నా కథలను ఎక్కువగా క్షేత్రపరిశీలన పిదపే ఆరంభిస్తుంటానని. ఈ మధ్యనే 
హంపీ వెళ్ళటం తటస్థించిందని, ఆ నేపథ్యంలో త్వరలో ఓ కథకు రూపకల్పన చేస్తున్నానని, పరిసరాల అవగాహన కవులకు అవసరమని తెలిపారు.

ప్రముఖ విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ 1989 నుండి 2000 వరకు వై.ఆర్.కె.తోనున్న అవ్యాజానుబంధాన్ని నెమరు వేసారు. ఎన్నో రాత్రుళ్ళు ఇద్దరం సుదీర్ఘ సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలపై గంటలతరబడి చర్చించుకునేవారమని తెలిపారు. నేను  రాసిన ' సమాంతర
ఛాయలు ' వై.ఆర్.కె. గారి చివరి రోజుల్లో అందించాను. వారిసాహచర్యంలోనే నాకీ హృదయస్పందన అలవదిందని అన్నారు. వస్తువుని నిజ దర్శనం చేయకలిగినవాడు మంచి కవి అవితాడం, ప్రతిపక్షం లేకపోయినా, కవులుంటే చాలని అంటూ, '' నాకు నమ్మకమివ్వండి '' అనే ఆలూరి బైరాగి
కవితను ఉటంకించారు.
డా. పిల్లలమర్రి సుబ్బారావు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురియయ్యారు. కొడుకులా ఆదరించి, వైద్యవిధానంలో మెళుకువలు నేర్పి, ఒక వైద్యుడిగా ఇలా నిలబెట్టిన మహానుభావుని సాహచర్యం జన్మ జన్మలకు మరువలేనిదని గద్గద స్వరంతోతన బాధను అందరితో పంచుకున్నారు.  30 సంవత్సరాలు పైగా వారితో నడిచాను కాబట్టే, వారన్నట్టు  నేను కింద పడినా జెండాను కిందపడనివ్వనని, పైకేవుంచుతానని వారికి మాటిచ్చాను. అది నిలబెట్టుకుంటానని, వారి పేర సాహితి వార్డులు వారి పరోక్షంలో నేను అందించే కార్యక్రమాన్ని తలెత్తుకున్నందుకు కొంత మనశ్శాంతిగావుందని తెలిపారు. కవులకు అభినందనలు తెలిపి ముగించారు. 

కథా రచయిత శిరంసెట్టి కాంతారావు,  కథా రచయిత రాచమళ్ళ ఉపేందర్, సంపటం దుర్గా ప్రసాదరావు, గద్దపాటి శ్రీనివాసారావు, కవయిత్రులు  శ్రీమతి సునంద, సుభాషిణి తోట, నవతెలంగాణా ఖమ్మ జిల్లా అక్షరం సారథి, పాత్రికేయ కవి నామాపురుషోత్తం, కటికోఝ్వల రమేష్, కపిల రాంకుమార్లకు అమరజీవి డా. వై.ఆర్.కె. సాహితీ పురస్కారాలు అందచేసారు.
మేడగాని శేషగిరి, సంపటం దుర్గా ప్రసాదరావుల సమన్వయంలో దీపావళి కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా, దీపావళి టపాసుల్లా, ఆటంబాంబుల్లా, మార్మ్రోగి రసజ్ఞులైన శ్రోతలను అలరించింది. కవిసమ్మేళనం సినారె గజల్ తో శేషగిరి ఆరంబించి తన గాత్ర మాధుర్యంతో అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసారు. దీపావళికీ కవుత్వం రాయొచ్చు అనే కవితలో గద్దపాటి శ్రీనివాసరావు '' పెరిగిపోతున్న పాపాలమీద,సంఘాలమీద, సంఘ్పరివార్లమీద, రాని పరిహారాలమీద,రాజకీయ పరిహాసాలమీద '' కవిత్వం రాయొచ్చంటారు. చిరునామా ఎక్కడ అనే కవితలో తాళ్ళూరిరాధ - మానవత్వాన్ని ప్రతిబింబించే స్త్రీమూర్తి వర్ణన చేసారు.  జనం అనే కవితలో పొత్తూరి సీతారామారావు అమృత హృదయాల్లో
నేడలజడులు రేగుతున్నాయని మదనపడ్డారు. తిరగబడ్డ అక్షరం అనే కవితలో సుభాషిణీ తోట  గంగాయమునలంత పవిత్రం మన సాహిత్యమన్నారు. ఆటవికయుగపుటంచులనే కైతను ఆరంభించిన జీవన్ కూరుకుపోతున్న సంక్షుభిత సందర్భాన్ని ఆవిష్కరించారు. డా. వై.ఆర్.కె.తో అనుబంధాన్ని
శ్రోతలకు పంచారు. ఏ సభలోనైనా మాట్లాదవల్సివస్తే అంశాలన్నీ గుదిగుచ్చుకుని, ప్రసంగం పక్కదారి పట్టకూండా చెప్పవలసింది అందరికి స్పష్టంగా చేరేలా తయారయివచ్చే పద్ధతి అందరూ  అలవర్చుకుంటే మంచిదన్నారు.  దీపావళి పర్వదినమనే కవితను జయప్రద '' మన మధ్య నరకాసురులెందరో ఇంకా మిగిలేవున్నారని ఆవేదనవ్యక్తం చేసారు. హేతువాద ఉద్యమనాయకుడు క్రాంతికార్  తన కవితలో మతోన్మాదాన్ని నిరశిస్తూ చెణుకులు విసిరారు.అక్షరం అనే గేయంలో రౌతురవి '' రంగు పూస్తే అక్షరకిరణం మసగబారిపోదురా'' శ్రావ్యంగా వినిపించి శ్రోతలను ఉత్తేజితులను చేసారు. బ్రతుకు వెలుగుల బాట అనే కవితలో కె. రమేష్  బతుకులను దోపిడి చీకటి గుహల్లోకి నెట్టేసే విధానాన్ని
తన ముద్రతో ఆకట్టుకున్నారు. సత్యభామ అనే కవితలో నందిగామ నిర్మలాకుమారి పౌరాణిక అంశానికి సామాజిక స్పృహ కలిగించే కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ యిప్పుడు సత్యభామల అవసరం యెంతైనా వుందనేలా చదివి వినిపించారు. ఖమ్మం జిల్లా ఆధునిక కవిత్వంపై పరిశోధన చేస్తున్న తెలుగు జూనియర్ లెక్చరర్ నిజామాబాద్, పరిశోధనకు సంబంధించి తన అనుభవాలను కొన్నింటిని  శ్రోతలతో పంచుకున్నారు. అమ్మా నీకోఉత్తరం అంటూ దేవయ్య తన కవితలో భ్రూణ హత్యలను గర్హిస్తూ ఆర్ద్రత కలిగించారు. అవసరం అనివార్యమై అనే కవితలో వురిమళ్ళ సునంద  కోట్లాది ప్రశ్నలకు కొడవళ్ళే సమాధానాలి మొలవాలన్నారు. సరికొత్త దీపావళి అనే కవితలో రాచమళ్ళ ఉపేందర్ '' నేడు నరకాసురనికి నకలుగా మనిషి తయారవుతున్నాడని నేటి మనిషిపై చురకత్తులాంటి పదాలు విసిరారు.  కలం గొప్పదనమనే గీతాన్ని ఆవుల వీరభద్రం ఆలపిస్తూ '' పెన్నుమీద మన్ను పొయ్యద్దురా - అది గన్నై మొలుస్తుందిరా '' అంటూ అందరిని ఉత్తేజపరిచారు. భూప్రకంనల్లో అనే కవిత ఆలపిస్తూ ముచ్చర్ల ఇబ్రహీం '' పాటై పోటెత్తుతున్నాయి - భూ కంపనలన్నారు '' ఛాందసం సింహాసనమెక్కితే అనే శీర్షికతో  బండారు రమేష్  '' బుద్ధి జీవాలను శుద్ధి చేయడం కుదరదని, మట్టి పెళ్ళలా సంకెళ్ళను తెంచుకుంటాయని '' ఆక్రోశించారు. హెచ్చరిక అనే కవితతో జయరాజ్ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపించారు '' వాడిపొట్ట అబద్ధాల పుట్ట '' ఏలికలని పీలికలను చేయాలన్నారు. మధ్యలో విజయ కళాశాల ప్రధానాచార్యుడు జంపాల మధుసూదనరావు మాట్లాడుతూ '' ఆవేశం లేకపోతే కవిత్వం రాదని, కవులు ఇతరులతో అనుభవాలను పంచుకోవాలని, ఆవేశంతో పాటూ ఆలోచన ఎంతో అవసరం అని వక్కాణించారు.   దివ్వెలు అనే కవితలో కపిల రాంకుమార్ ''రాయిని పగలకొట్టవు/ ఒక్క రాజుని మార్చలేవు/వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని/చూస్తూ చూస్తూ పదిరూపాయల
నోటును కాల్చమనుండ్రి చూదాం!/గద్దెనెక్కిన నాయాళ్ళ  దిమ్మ తిరిగేలా భూచక్రాలు తిప్పి,ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను, /కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను కుళ్ళపొడవాలనివుంది!'' వర్తమానసమాజాన్ని తన సహజమైన స్వరంతో  దీపావళితో అనుసంధానంచేస్తూ బాణసంచాలంటి పదాలతో పోల్చటం వాటిని కాల్చినంత ఆనందం కలిగింది.
 శ్రోతలకు. శ్రీమతి ఉరిమళ్ళ సునంద వందన సమర్పణ కావించారు.
- 24-11-2015



3, ఏప్రిల్ 2015, శుక్రవారం

మనం మనో మధనం చేయాలి '' -మన్మథనామ ఉగాదినాడు కవి సమ్మేళనంలో కవుల అభిప్రాయం!


'' మనం మనో మధనం చేయాలి '' -మన్మథనామ ఉగాదినాడు కవి సమ్మేళనంలో  కవుల అభిప్రాయం!

               గత పదిహేను సంవత్సరాలుగా ఖమ్మంలో సాహితీ స్రవంతి యికనుండి తెలంగాణసాహితిగా యథవిధిగా సాహితీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుందని, అనన్య సామాన్యమైన సేవలనెలా చేసిందో అదే విధంగా మరిన్ని విస్తృత కార్యక్రమాలు, సెమినార్లు, గోష్టులు, శిక్షణా తరగతులు నిర్వహించాలని తెలంగణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి, ఖమ్మం బి.వి.కె. గ్రంథాలయంలో మన్మథ నామ ఉగాది కవి సమ్మేళనంలో సందేశమిచ్చారు. తెలంగాణ సాహితి  జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో, కార్యదర్శి రౌతురవి,ఖమ్మం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సంపటం దుర్గా ప్రసాద్‌, కంచెర్ల శ్రీనివాస్‌, డా. పి.సుబ్బా రావు,డా.పాపయ్యశాస్త్రి, బాణాల కృష్ణమాచారి, వేదికపై ఆశీనులుకాగా పట్టణంలోని కవులు, కళాకారులు సుమారు 36 మంది ఈకార్యక్రమంలొ పాల్గొన్నారు అధ్యక్షుడు  కన్నెగంటి  మాట్లాడుతూ మన్మథనామ ఉగాదిని ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యం అంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగ విదివడి, ఈ తెలంగాణా రాష్ట్రంలో మొదటి సాహితీ సమవేశంగా కవి సమ్మేళనం  నిర్వహించు కుంటు, కొన్ని ప్రత్యేకమైన, రాష్ట్ర సమస్యలను, జాతీయ అంతర్జాతీయ సమస్యలను అవగాహనతొ పాటు అనుసంధానం చేసుకుంటూ సాహితీ కృషి జరుపుకొవలసిన అవసరంవుందని అన్నారు. ఆగడాలు, అత్యచారాలు, మోసాలు, ద్వేషాలు, ఘోరాలు, నేరాలు పెచ్చరిల్లుతున్న తరుణాలు కొనసాగుతూవున్న కాలంలో వాటిని ధీటుగా విశ్లేషించి నివారించే ప్రాతిపదికలుగా కవిత్వం వుండాలని అన్నారు. ప్రజా జీవితంతో ముడిపడిన అంశాలే మన కవితాంశాలు కావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు ఆనందాచారిని వేదికపైకి అహ్వానించారు. సన్నగిల్లి పోవటమే కాదు, మృగ్యమయ్యే స్థితికి  చేరుకుంటున్న సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటూనే మూఢ నమ్మకాలకు, గ్లొబలీకరణకు, ప్రపంచీకరణకు, మతోన్మాద ఉగ్రవాదాలని నిలువరించే దిశ, దశ నిర్దేశించేలాకవిత్వం రాయాలని. విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, అందరికి శుభాకంక్షలు తెలుపుతూ తన కవితతో కవి సమ్మేళనం ప్రారంభంచేసారు.  '' అరల్లో నిద్రించే వాటిని బయల్పరచాలి / కలాలకు కొత్త బలాను అందించాలి – అంటూ తెరపై రంగులు దుమ్ములేపుతాయి - కాలానికి సంబంధించిం స్పృహ వుండాలి - మన ఆలోచన ఆక్రమణకు గురౌతున్నది, పెట్టుబడి సామాజిక బీభత్సం చేసి మానవతా హృదయాలను కూలుస్తున్నది....కవీ! నువ్వైనా అప్రమత్తుడవై చూడాలి '' అని కొత్త ఆశంస వెలిబుచ్చారు తన కైతలో. కన్నెగంటివెంకటయ్య నవ్వులకు సంబంధించి వ్యంగ్య గేయాన్ని పాడి వినిపించారు. సవ్వులలోని రకాలు, నవ్వు వెనకాల వున్న మానవ నైజాలు ఉర్రూతలూగే కంఠస్వరాన్నందించి ముగ్ధుల్ని చేసారు. ప్రముఖ కవి, విమర్శకుడు జీవన్‌ సందేశం యిస్తూనే తన కవిత  ''యథాతధం ''లో - '' నల్లధనం మూలాలను,స్వరూపాలను వివరించారు. పసలేని నాటకానికి మోత ఎక్కువ, నాందీ వాక్యంలోనే భరత వాక్యం పలికింది '' ఈ వ్యవస్థపై తనదైన చురకలు వేసి అలరించారు. కటుకోజ్వల రమేష్‌  ఉగాది ఆశాగీతం అనే కవితలో '' భరోసాలేని భవితను ఎలా పంచమంటావ్‌?''  అంటూనే  '' కాలం చిలకొయ్యకు మాత్రం మమ్ములను తగిలించాఇ వెళ్ళావని '' చురకలు వేశారు.తాళ్ళూరి రాధ '' నిజం '' అనే కవితలో '' మానవీయ సంబంధాలు, ఆర్థిక బంధాలయినాయ్‌,'' అంటూ - మనిషి ' మనీ 'కొరకు చేస్తున్న సంకుచిత ధోరణులను యెత్తిచూపారు. డా.పొత్తూరి సుబ్బారావు : ఉగాది సందేశమిచ్చి, ఖమ్మం జిల్లా ప్రాశస్త్యాన్ని '' సితార '' నగారాలుగా ఆవిష్కరించి, మన తెలంగాణా ఔన్నత్యాన్ని, అలనాటి బౌద్ధమత విరాజిల్లడాన్ని తన కవితలో శ్లాఘించారు. నాగిరికతా సంస్కృతులకు ఖమ్మం జిల్లా ఉదాహరణ అంటూ జిల్లా గొప్పదనాన్ని ఆసాంతం ఆకట్టుకునేలా వినిపించారు. కవిత్వాన్ని ఓ ధృక్కోణంలో చూడటంకాదు తెలంగాణా అస్థిత్వాన్ని చక్కని చమత్కృతులతో వ్యక్తీ కరించారు.  బండి ఉష: ఉషోదయం అనే కవితలో మట్టికాళ్ళ మనిషి మౌనంగా మట్టిలోనే పొలి అవుతున్నాడు. అరిషడ్వర్గాల నుండి జయించే కొత్త ఉషోదయం రావాలని అకాంక్షించారు. ప్రేమ శరాలను విసరాలి అంటూ ముగించారు. అడవికట్ల ఆదామ్‌:  పద్య కవితలను ఆరు వినిపించారు. షడ్రుచులివేనన్నట్లుగా అవి అందరిని అలరించారు. చక్కటి శ్రావ్యమైన  స్వరంతో రాగయుక్తంగా వీనులవిందు చేసారు. షేక్‌ జాకీర్‌ : మరణించిన సమాజాన్ని మేల్కొనేవాడే కవి అంటు కవిత వినిపించారు.

              తదుపరి సాహితీ స్రవంతి 15 సంవత్సరాల ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి అవిస్కరించి, ఆ సందర్భంగా సందేశమిస్తూ బహుకొద్ది మందితో పదిహేనేళ్ళ క్రితం యేర్పడిన సాహితీస్రవంతి అచిరకాలంలో శాఖోపశాఖలుగా విస్తరించడం, తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఒక బలమైన సాహితీ సంస్థగాను, ఒక సాహిత్య మాసపత్రిక ప్రస్థానం ఆవిర్భావానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగాను తాను తోడ్పడినందుకు ఆనందంగావుందని అన్నారు. యిప్పుడు కొత్త రాష్ట్రంలో తెలంగాణా భాషను, సంస్కృతులను మరింత పరిపుష్టం చేయడానికి మరింత కృషిలో భాగంగా తన నాటక రచనా వ్యాసంగాన్ని తెలంగాణా బాషలోనే సృజన చేస్తానని, యిన్నాళ్ళకు ఆ కల సాకార మవ్వబోతోందని సంతోషం వెలిబుచ్చారు.డా. ఆంజనేయులు : మనవూరి చెరువు - గుర్తుకు తెచ్చారు. చిన్నతనంలోని చిలిపి పనులు, చెరువు ఉపయోగం, బహుముఖాలుగా చెరువుకు ఊరికి వున్న బంధం చాకటి తెలంగాణా పలుకుబడులు పండేలా మంచి కైత వినిపించారు. అందరిని అలరించారు.తాళ్ళూరి లక్ష్మి:  తన కవితలో  నైతికంగా దిగజారిన మన సమాజాన్ని మనం జల్లెడ పట్టి, వ్యక్తి వర్తమానంలోబాటచూపించాలంటూ ఆకాంక్షిస్తూ ముందు ముందు నీళ్ళ టాంకులకోసం యుద్ధ టాంకులవసర్మేమో అని వ్యంగ్యంగా నీటి అవసరాన్ని తెలిపారు.గరికిపాటి మణీందర్‌:  '' ఏడిపించకండి దొర - బతికుండగానే చావు బాజా మోగించకండి '' అంటూ నేటి ఆసరాఅ పథకాలలో జరుగుతున్న అవకతవకలు ఎత్తిచూపించారు. ఫించను రాక టెన్‌షన్‌కు గురువుతున్న అనాన్ని పట్టించుకోమని కోరారు తన కవిత '' శిశిర గీతం ' లో. పొత్తూరి సీతారామారావు : హాస్య వ్యంగ్యోక్తులమిశ్రమైన సంభాషణల్తో ఆద్యంతం రక్తికట్టించేలా తన అవితను వినిపించారు.దేవయ్య : తొలి ఉషస్సు అనే కవిత, గొవిందు :
ఓ ఆత్మీయ అతిథి అనే కవిత, వినిపించగా డా.కావూరి పాపయ్య శాస్త్రి '' కోకిల ''పేర పద్యాలను వినిపించి అందులో జాతీయాలు, తెలుగు పలుకుబడులు, నుడికారాలు పొందుపరవటమే కాక చక్కటి వివరణలు తెలియచేసారు. కంచెర్ల శ్రీనివాస్‌ '' కోయిలమ్మ కూస్తోందిరా ' అనే కవితలో '' బడుగు భారత జనుల ఉషస్సులకు, ఆటంకాలు లేని ఇజాలు''  కావాలన్నారు.  కపిలరాంకుమార్‌ : పెపంచానికి కాస్త బుద్ది సెప్పండి అనే కవితలో ' కోయిల గొంతు మూగబోయింది, ' అంటూ కాకులు, కోకిలల మధ్య సారుప్యత లేకపోవడాన్ని చిత్రికపట్టారు. మన మనస్సులను మథనం చేసుకూంటూ, మేథో మథనం చేసికోవాలి అంటూ మనుషులు మృగాలవటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కారు( వయసు) తేడాలేని బతుకులకు చితికిపోవడాలకు స్వస్తి పలకాలంటూ ఆశాభావం వ్యక్తీకరించారు. పోతగాని సత్యనారాయణ '' కొన్ని యుగాలు తేల్చని సగాలు '' అనే కవితలో అకృత్యాలు, అధికారాలు కవలలు, అసమానతలు హద్దులు దాటాయంటూ ఆక్రోసించారు.ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు లభించినపుడే, విశ్వంలో సగమై జయకేతనమెగురుతందని ముక్తాయింపునిచ్చారు. ఉరిమళ్ళ సునంద: అంతా కొత్త యాదే అంటూ యుగాదిని, ఉగాదిగా తలవాలంటే '' అస్థిత్వానికి తండ్లాడుతున్నాను, మట్టి పరిమళాలు పరివ్యాప్తం కావాలందుకే. అవనిపై జరుగుతున్న  విశృంఖలత్వాన్ని అక్షరీకరించారు. సంపటం దుర్గా ప్రసాదరావు తనదైన రీతిలో చిక్కని, చక్కని చిన్న కవిత చదివి అందర్ని అలరించారు. నారాయణ '' అది ఏరే - ఇది ఏరే '' అనేకవితను ఆలపించారు. కన్నెగంటి వెంకటయ్య  ' వైఫల్యాల గజనీ యాత్రలో నేనొక విశ్వాసంలేన్ని అశ్వాన్ని కాలేను, కాలం బడిలో పాఠాలు నేర్చుకునే బడిపిల్లమౌదాం అంటు నవగీతాంజలి పాఠం అవుదాం అని తన కవితలో ఆశించారు. ఈ సందర్భంగా  మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందుగానే కూసిన కోయిలలాగ ఖమ్మం సాహితీ స్రవంతి తెలంగాణా సాహితీగా మారిన మొదటి కార్యక్రమంలొ గత15 సంత్సరాలుగా సాహితీకార్యక్రమాలలో బాధ్యతలు స్వీకరించినవారు, వివిధ సందర్భాలలలో వెన్నుదన్నుగా నిలచి సలహలు, ఉపన్యాసాలు అందించిన సీనియర్‌ కవులు, విమర్శకులను సన్మానించు కోవటం ఒక కొత్త ఒరవడికి సంప్రదాయానికి తెలంగాణా సాహితి ఖమ్మం జిల్లా కమిటి తెరతీసింది: ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యంలో అందెవేసిన చేయి, డా. పొత్తూరి వెంకట సుబ్బారావు గారిని, కవి, విమర్శకుడు డా.కావూరి పాపయ్య శాస్త్రి గారిని, నటుడు ప్రయోక్త, దర్శకుడు, తెలంగాణా పడికట్టుపై పట్టున్న రచయిత, బానాలకృష్ణమాచారి గారిని, మరొ తెలంగాణా పలుకుబడిని పెట్టుబడిగా కలిగిన కవి, కథా రచయిత, జీవన్‌ గారిని, కవి, రచయిత, నటుడు, దర్శకు, బోడేపూడి విజ్ఞాకేంద్రం నిర్వాహకుడు, సాహితీ స్రవంతికి తొలినాళ్ళలో ఐదు సంవత్సరాలు అధ్యక్షస్థానాం నిర్వహించి, తదుపరిసాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తున్న కపిల రాంకుమార్‌కు సన్మానం జరగటం. ఒక చారిత్రిక నిదర్శనంగా ఈ తొలి సాహిత్య కార్యక్రమం నిలుస్తుంది . రౌతు రవి కవులందరికి నమస్కారం అంటూ వందన సమర్పణ చేసారు.

 



photo.php 13.jpg

సాహితీ స్రవంతి 15 సంవత్సరాల ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి

17, నవంబర్ 2014, సోమవారం

కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 ||


కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 ||
ప్రతీ ఒక్కరు సాహిత్య అధ్యయన కావించనదే కొత్త కొత్త సాహిత్య ఒరవడిని అందిపుచ్చుకోలేరు. నిరంతర అధ్యయనం కవులకు అవసరం అని చెబుతూ సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి రౌతు రవి '' సాహితీ స్రవంతి అధ్యయనవేదిక '' జరిపే మూడవ ఆదివారం సమావేశంలో అన్నారు. కవులే కాదు ప్రతీ విద్యార్థి, యువకుడుచదివితీరవలసిన '' మాలాలా '' పై ప్రజాశక్తి వారు ప్రచురించిన పుస్తకమని అన్నారు. ఆమే ఏ విధంగా అఫ్ఘన్ తాలిబన్ల క్రౌర్యానికి, దాడులకు ఎదురునిలబడి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అనే నినాదమొక్కటే ధ్యేయంగా నిలబడిందో, ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొందో ఆ పుస్తకంలో వివరంగా వున్నాయని, ఆమె పటుదల, నిబద్ధతే '' శాంతి '' పురస్కారానికి మార్గం వేసిందని అన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం గ్రంథాలయంలో ఆదివారం సాయంత్ర సాహితీ స్రవంతి ప్రతినెలా జరిపే మూడవ ఆదివారపు అధ్యయన వేదికలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. '' నవ తెలంగాణా నిర్మాణంలో కవుల పాత్రపై ఉపన్యాసకుడుగా కవితా డిగ్రీకాలేజి ఉప ప్రధానచార్యుడు డా. సి.హెచ్.ఆంజనేయులు ని వేదికపైకి సాహితీ స్రవంతి ఖమ్మం పట్టణ అధ్యక్షుడు సంపటం దుర్గా ప్రసాదరావు అహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు కన్నేగంటి వెంకటయ్య, గ్రంథాలయ నిర్వాహకుడు, అధ్యయనవేదిక ప్రధాన బాధ్యుడు కపిల రాంకుమార్, శ్రీమతి సునంద వేదికపైకి ఆసీనులైనారు. కన్నెగంటి వెంకటయ్య అధ్యక్ష ఉపన్యాసం కావిస్తూ ప్రతి నెల మూడవ ఆదివారం క్రమం తప్పకుండా సాహితీస్రవంతి అధ్యయనవేదిక నిర్వహించబడటంలో గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ కృషి అభినందనీయమని ఇది 14 వ ఆదివారమని గుర్తుచేసుకుంటు సాహిత్య శిల్ప సమీక్షలు, సిద్ధాంత విమర్శలు, పుస్తక అధ్యయనాలు, కవితా పఠనాలు, గేయాలాపనలు ఇన్నాళ్ళుగా కొనసాగిస్తూవున్నమని. ఇది నిరంతరం కొనసాగాలని, ఇంకా సమావేశాలకు సమయాన్ని పాటించాలని, కొత్త వారిని రాబట్టుకోవాలని, శిక్షణాతరగతులకు ప్రణాళిక వేసుకుని మరింత ముందుకు పోతూ తెలంగాణా జిల్లాలలో మనది అదర్శంగా నిలవాలని కోరారు. విశ్రాంత ఇంజనీర్-ఇన్-ఛీఫ్ శ్రీ పి. సాంబశివరావు గారు ఎంతో ఓపికతో తన వార్థక్యాన్నికూడ లెక్కచేయక హాజరు అవటం విశేషం. వారు మాట్లాడుతూ పాత కొత్తల మేలు కలయికగా ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను తడుముతూవూండాలని అంటూ కొన్ని ప్రముఖ ప్రాచీన కవుల పద్యాలను, సంస్కృత శ్లోకాలను, హాస్య శతక పద్యాలను వినిపించి, చివరగా అధునిక రీతిలో '' గడచిన విద్యార్థి జీవితాన్ని నా కొకసారి ఇవ్వు '' అనే గేయాన్ని వినిపించి అందరిని అలరించారు. సాహితీ స్రాంతికి ఆర్థిక వనరులు చేకూరే విధంగా కొన్ని సూచనలు చేసారు. వాటిని పరిగణనలోకి తీసుకును అందుకు కావలసిన ప్రయత్నాలు నలుగురితో చర్చిస్తామని కపిల రాంకుమార్ హామీ యిచ్చారు.'' నవ తెలంగాణా నిర్మాణంలో కవుల పాత్ర '' అనే ఆంశంపై వివరణాత్మక ప్రసంగం చేస్తూ పాల్కురికి సోమనాథుడు, పోతనల సాహిత్యాలలో దేశీయ పలుకుబడులు, తెలుగు నుడికారాలు, మనకు కనబడతాయని, బుర్రకథలు ఒగ్గుకథలు, పల్లెసుద్ధులు లాంటి కళారూపాలు ఆవిర్భవించాయని, పండుగులు, తిరునాళ్ళు, సాంస్కృతిక చైతన్యంద్వారా నిజాము నెదిరించే గేయ సాహిత్యం సుద్దాల హనుమంతు, యాదగిరి లాంటి సంపన్నంచేసారని, నేటికాలాని వస్తే గోరేటి వెంకన్న అశోక్తేజ,అందెశ్రీ, మరెందరో కవులు, కళాకారులు, కన్నభూమి తెలంగాణా. దాశరథి సోదరులు, రావెళ్ళ , కవిరాజమూర్తి, పుల్లాభొట్ల, హీరాలాల్ మోరియా లాంటి ఉద్దండులు ఎంతో ఉత్తేజకరమైన సాహిత్యాన్ని అందించారు. పల్లెల జీవనాన్ని ఆలంబనగా ఎన్నో పోరాట గీతాలు, కవిత్వం, నాటకం, నవల కథానిక ప్రక్రియలు వెలిసాయి. మాభూమి, ముందడుగు వంటి నాటకాలు నాటి తెలంగణ పోరాటానికి వత్తాసు పలికాయని, పడమటి గాలి ధాటికి తట్టుకునే రీతిలో సాహితీ స్రవంతి లంటి పలు సాహితీ సంథలు ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించి కృషిచేస్తున్నాయని, అలాంటి సాహితీ స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తానని అన్నారు. పీడిత తాడిత జనావళికి మేలు జరిగేలా మార్క్సిజమే అధారంగా సాహిత్యం అవిర్భవిస్తేనే నవ తెలంగాణాలో ప్రజా కవిత్వానికి సరియైన స్థానం పొందగలదని, అందుకు నిత్యం సమాజ శ్రేయస్సును ఆలంబనగాచేసుకునే సాహిత్య సృజన చేయాలని కోరారు. తన సాహిత్య అభిలాషకు సుబ్బారావు పాణిగ్రాహి గేయం ప్రేరణ అంటూ వారి గేయం '' ఎన్నాళ్ళీ కాపురాలు '' గుర్తు చేసారు రాంకుమార్ దానిని కన్నెగంటి వెంకటయ్య చక్కగా భావయుక్తంగా ఆలపించి అందరిని ఉత్తేజపరిచారు. సునంద బాలలపై ఒక గేయం చదివి వినిపించారు. శ్రీమతి సునంద వందన సమర్పణ చేసారు...
17.11.2014

4, అక్టోబర్ 2014, శనివారం

''సాహితీ సౌరభాలతో పులకించిన ఖమ్మం ఖిల్లా '' - రిపోర్ట్‌
'' పలు సంకలనాలతిను '' లోగిలి '' ప్రత్యేక సంచిక ఒక ఆకర్షణగా సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం ఖమ్మం సాహితీ చరిత్రలో ఒక మైలు రాయి '' అని వార్షికోత్సవ సభను ప్రారంభించిన ముఖ్య అతిథి సుధామ అన్నారు. మనిషి సృష్టించుకున్న మా'నవ'సమాజంలో తానే ఒంటరైపోతున్నడని, అంతరాలు తగ్గించే మానవీకరణే కవిత్వ ప్రథాన ధ్యేయమని; కనుమరుగౌతున్న మానవవిలువలను కాపాడే విషయంలో కవులే ప్రధాన భూమిక నిర్వహించాలని ఉద్ఘాటించారు. చట్టాలు, శాసనాలతో అమలుకానివి కూడ కవులు కవులు కళకారులు తలుచుకుంటే సాధ్యమౌతుందని ఆలిండియా రేడియో విశ్రాంత ప్రొగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌, కవి, కాలమిస్ట్‌, సుధామ అన్నారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఖమ్మం లోని రోటరీక్లబ్‌ ఆర్టిఫిషియల్‌ లింబ్‌ సెంటర్‌ ( ఎన్‌.ఎస్‌.టి.రోడ్‌) లో ఉదయం 11.00 గంతలనుండి రాత్రి 9.00 గంటలవరకు విజయవంతంగా సుమారు 350 మంది కవులు, సాహిత్య అభిమానులు, కళాకారుల ఆనందోత్సాహాలతో నిర్వహించబడింది. ప్రముఖ దిన పత్రికలు ప్రశంసల జల్లు కురిపించాయి.మరో అతిథి ప్రముఖ కవయిత్రి షాజహానా మాట్లాడుతూ మనసు పలికే భాష కవిత్వమని, కొబ్బరినీళ్ళలాంటిదని అంటూకవిత్వమెప్పుడు ప్రజల పక్షానే నిలబడుతూ శాశ్వత ప్రతిపక్షంగా నిలుస్తుందన్నారు. కవులు సిద్ధాంత చట్రంలో యిరుక్కుని నలైగిపోతున్నారని, బయటకు వచ్చి నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షాపూరిత దాడుల్ను ఖండిస్తూ వారికి మద్దతుగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని మత మౌఢ్య సంస్థలు సాగిస్తున్న దమనకాండపై 
నిప్పులు చెరిగారు. ఆట్తడుగు వర్గాలకోసం రచనలు చేయటమే కవుల లక్ష్యంగావుండాలని అభిప్రాయపడ్డారు.ఈ సభలో మరో ముఖ్య అతిథి, సాహిత్య విమర్శకుడు, అద్దేపల్లి రామమోహనరావు మాట్లాడుతూ దేశ అస్థిత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపనవుందని, ముఖ్యంగా కవులపైన మరీ ఎక్కువగా వుందని నొక్కిచెప్పారు. పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రజలను ఉద్యమాలవెంపు, పోరాటలవెంపు నడవటానికి సంసిద్ధం చేయవలసిన వారు కవులేనని ఉద్బోదించారు. ఆ శక్తి సాహిత్యానికున్నదని, మన స్వాతంత్ర్యపోరాటంకాని, తెలంగాణా రైతంగ సాయుధపోరాటంకాని అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో 
నిలిచాయని వివరించారు.సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యయనవేదిక నిర్వాహకుడు 
రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో వెలువరించిన ప్రత్యేక సంచిక '' లోగిలి ''ని ఖమ్మం జిల్లా ఫెమా అధ్యక్షుడు, కవి, మువ్వా శ్రీనివాసరావు అవిష్కరించగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు ఆనందాచారి పరిచయంచేసి, సంచికను తయారుచేయటంలో కృషి చేసిన కపిల రాంకుమార్‌ను, వారికి తోడ్పాటు అందించిన హైదరాబాద్ ప్రజాశక్తికి చెందిన అనంతోజు మోహనకృష్ణను అభినందించారు. తదుపరి వురిమళ్ళ సునంద రచించిన వరమళ్ళ వసంతం కవితా సంకలనం అద్దేపల్లి రామ మోహనరావు ఆవిష్కరించగా కన్నెగంటి వెంకటయ్య పుస్తక పరిచయం కావించారు. కవి, గాయకుడు సంపటం దుర్గాప్రసాదరావు సంకలనపరచిన ఖమ్మం జిల్లాకు చెందిన 340 మంది కవుల పరిచయగ్రంథంగా సాహితీమూర్తులనే పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు డా.దిలావర్‌ ఆవిష్కరించగా సాహితీ స్రవంతి తెలంగాణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి పరిచయంచేసారు. మరో కవి, గాయకుడు మేడగాని శేషగిరి రచించి, స్వరపరచిన పాటల ఆడియో డిస్క్‌ ( సి.డి) '' పుడమి రెక్కలు '' ను తెలంగాణా రాష్ట్ర ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి , కవి, కె. దేవేంద్ర ఆవిష్కరించగా, కవి పోతగాని సత్యనారాయణ పరిచయ వాక్యాలు పలికారు. ఖమ్మం జిల్లా సీనియర్‌ అచయిత, కవి అంకిత కేశవులు రచించిన '' మానవతా జిందాబాద్‌ '' కవితల సంపుటాన్ని ముఖ్య అతిథి ప్రముఖ కవి సుధామ ఆవిష్కరించగా బి.వి.కె. రాజకీయ విద్యా విభాగం కన్వీనర్, యువ కవి బండారు రమేష్ పుస్తక పరిచయం చేసారు. సాహితీ స్రవంతి పట్టణ కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్ రచించిన పోలవరంపై గీతాన్ని ఆసు ప్రసాద్‌ ఉర్రూతలూగేలా ఆలపించాడు.వార్షికోత్సవ ప్రారంభ ముగిసిన అనంతరం భోజన విరామం అనంతరం సాహజహానా జనకఅవనం ఆరంభించగా, వీధుల రాంబాబు (భద్రాచలం) కటుకోజ్వల రమేష్‌ (ఇల్లందు) కవిసమ్మేళనం సమన్వయపరిచారు. వివిధ అంశాలపైన కవుల స్పందన అలరించింది. సుమారుగా 56 మంది కవితాగానం చేసారు.అనంతరం ఖమ్మం జిల్ల సాహితీ స్రవంతి నూతన కమిటీ కన్నెగంటీ వెంకటయ్య అధ్యక్షులుగా, రౌతు రవి ప్రధాన కార్యదర్శిగా, సంపటం దుర్గాప్రసాద్‌, పోతగాని సత్యనారాయణ, కటుకోజ్వల రమేష్‌, ఉపాధ్యక్షులుగా, మేడగాని శేషగిరి, శిరంశెట్టి కంతారావు, వీధుల రాంబాబు, సహాయ కార్యదర్శులుగా, వురిమళ్ళ సునంద కోశాధికారిగా ఎన్నికకాగా మాల్యశ్రీ, కపిల రాంకుమార్, మండవ సుబ్బారావు, కావూరి పాపయ్య శాస్త్రి, మువ్వా శ్రీనివాసరావు గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు.
డా.సీతారాం, డా. సి.హెచ్‌.ఆంజనేయులు, డా.దిలావర్‌, మాల్యశ్రీ, మండవ సుబ్బారావు, సందేశాలిచ్చారు. సాగి వెంకన్న, మనోరమ, స్వప్న, ఆసుప్రసాద్‌, కన్నెగంటి వెంకటయ్య, శేషగిరి పలి అభ్య్దయ గీతాలాలపీంచి సభను మరింత రంజింపచేసారు. ముఖ్య అతిథులకు, సీనియర్‌ కవులకు మెమెంటోలు అందించి సత్కరించారు.జిల్లా నలుమూలలనుండి కవులు, గాయకులు పాల్గొన్న సభ మరింత ఉత్సాహాన్నిచ్చింది. సాధనాల, లెనిన్‌ శ్రీనివాస్‌, సబ్బతి సుమిత్రదేవి, యనగందుల దేవయ్య, బండిఉష, సునీత, హడ్డంహరి, తాళ్ళూరి లక్ష్మి, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్‌ తదితర కవులు, కవయిత్రులు పాల్గొన్నారు.ప్రారంభ సభలో రౌతు రవి సాహితీ స్రవంతి 15వ వార్షికోతసవం సంర్భం గత 15 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాల నివేది సభ్యుల కరతాళధనులమధ్య ప్రవేశపెట్టారు. ఈ సభ 
దివంగతులైన కళాదర్శకులు బాపు, ఇతర సాహితీ వేత్తల మరణానికి సంతాపం ప్రకటించి, ఒక నిముషం మౌనం పాటించింది. సాహితి స్రవంతి లాంటి సాహిత్య సంస్థల కార్యక్రమాల నిర్వహణకు ఒక దాశరథి లాంటి పేరుమీద ఒక సమావేశమందిరం ఖమ్మంలో నిర్మించాలని, 
కవుల రచనల ప్రచురణకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని, సాహిత్య సాంస్కృతిక విషయాలపై ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాలని తీర్మానీంచారు. మేడగాని శేషగిరి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసి, ఖమ్మం జిల్లా కవులకు
నూతన ఉత్సాహాన్ని యిచ్చింది.

22.9.2014 /4.10.2013

సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి

కపిల రాంకుమార్|| సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి ||
***
సాహితీ స్రవంతి నగరకమిటీ ఆధ్వర్యంలో 21.9.2014 ఆదివారం బి.వి.కె. గ్రంథాలయంలో
రాబోయే బతుకమ్మ పండుగను ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో జరుగుపోవాలనే తలంపుతో కవితా గోష్టి ఏర్పాటుచేసామని సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కార్యదర్శి రౌతు రవి తమ అధ్యక్ష్యోపన్యాసంలో పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు సంపటం దుర్గా ప్రసాదరావు, సాహితీస్రవంతి అధ్యయన వేదిక నిర్వాహకుడు, బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్, సాహితీ స్రవంతి కోశాధికారి సునంద,ఫెమా అధ్యక్షుడు, కవి మువ్వా శ్రీనివాసరావు, కవి, గాయకుడు మేడగాని శేషగిరి పాల్గొన్న ఈ కవితా గోష్టిలో బతుకమ్మ పండుగ విశిష్టతగురించి సునంద సోదాహరణ్ ప్రసంగంతో ఆరంభం అయింది. మువా శ్రీనివాసరావు సందేశమిస్తూ గురజాడ 152వ జన్మదినం జరుపుకుంటున్న ఈ రోజున కూడ స్త్రీలస్ పట్ల జరుగుతున్న అన్యాయాలగురించి మాట్లాడుకోటం కడుశోచనీయం. బాలికల దీనావస్థ గురించి కలం సంధించిన మొదటి కవి, ఆధునికుడు గురజాడ అని కొనియాడారు. పుత్తడిబొమ్మ పూర్ణమ గేయ కథ ద్వారా వయసుమీరిన వారిన వార్తో బాలికల వివాహంపై తన నిరశన వ్యక్తం చేయటమేకాక, ప్రజలను చైతన్యపరిచేలా నాడే కన్యాశుల్కం నాటకాన్ని రచించి, ప్రదర్శింపచేసిన ప్రగతివాద నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందాడని.సమాజమ్లోని వివిధ వ్యక్తులు మానసిక వికారాలను ప్రస్పుటంగా ఆ నాటకంద్వారా వెలుగులోకి తెచ్చి సమాక హితం కోరిన గురజాడ నేటికీ ఆరాధ్యుడేనన్నారు. ఇవాళా కన్యాశుల్కం రూపం మారినా మరో విధంగా అది లోకంలో విలయతాండవమాడుతూ ఎన్నో సంసారాలలో నిప్పులు పోస్తూ గర్భసోకాలను కలిగిస్తున్నదని. అందుకే మనం అలాంటి మూఢ సంప్రదాయాలమీద, పసలేని దుష్ట సంస్కృతులపైన కవులుగా స్పందిస్తూ ప్రజలను చైతన్యపరచడమే తక్షణకర్తవ్యమని చెప్పారు. ఆసుప్రసాద్‌, శేషగిరి బృందం బతుకమ్మ పాటలను వినిపించారు. కపిల రాంకుమార్ రాసిన గేయాన్ని మేడగాని శేషగిరి ఆలపించారు. తదుపరి బండి ఉష, సునంద, బండారు రమేష్, చాగంటి కృష్ణమూర్తి, ఆదాం (విశ్రాంత జూనియర్‌ కళాశాల ప్రధానాచార్యులు) ,దేవులపల్లి హనుమంతరావు, మాటేటి శ్రీరామారావు, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్, నల్లమోతు శ్రీనివాసరావు, నారాయణ, మొదలగు వారు బతుకమ్మ కవితలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలని నిరసిస్తూ కవితా గానం చేసారు. సదానందం బృందం సునంద రాసిన బతుకమ్మ పాటను పాడి అందరిని అలరించారు. మే్డగాని శేషగిరి వందన సమర్పణ చేస్తూ, బతుకమ్మంపండుగ సాక్షిగా '' ఆడపిల్లని పుట్టనిద్దాం, ఎదుగనిద్దాం, చదవనిద్దాం, ఆత్మ గౌరవంతో బతుకనిద్దాం '' అనే అంశాల ప్రాతిపదికగా ప్రత్యామ్నాయ సంస్కృతినిని ప్రజలలోకి తీసుకువెడదామని, దానికి మరింతగా మనం ప్రోత్సహించవలసివుందని తెలియచేసారు. .
21.9.2014/4-10-2014

8, ఆగస్టు 2014, శుక్రవారం

Antharlochana: నేలకొండపల్లి బౌద్ధ స్తూపం మరికొన్ని విశేషాలు

Antharlochana: నేలకొండపల్లి బౌద్ధ స్తూపం మరికొన్ని విశేషాలు: నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వివరాలతో ఏర్పాటు చేసిన బోర్డు ఖమ్మం జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో నేలకొండపల్లివుంది. ఖ...

26, జులై 2014, శనివారం

కపిల రాంకుమార్ || చెరిగిపోని ' చేరా' తలెన్నో ||

కపిల రాంకుమార్ || చెరిగిపోని ' చేరా' తలెన్నో ||
ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేరాగా పిలువబడే డాక్టర్ చేకూరి రామారావు గురువారం హృద్రోగంతో మృతి చెందారు. ఆయన వయసు 80 ఏళ్లు. 1934 అక్టోబర్ 1న ఖమ్మంలోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ(తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభద్రులయ్యారు. తెలుగు వాక్యం-పదవర్ణ సహితం అంటూ తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధనఅనతి కాలంలో అందరి మన్ననలు పొంది వివిధ విశ్వ విద్యాలయాల పాఠ్యాంశంగా, ఇతర పోటీ పరీక్షలు, ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా నిలిచింది. ఆ పుస్తకాన్ని ఆచార్య జెరల్డ్ బి.కెలీ (1928-1987)నిరంతర స్మృతికి అంకితమివ్వడం ఒక విశేషం. ఆయన తెలుగు భాషకు, వ్యాకరణానికి, సామాజిక భాషాపరిశోధనకు చేసిన సేవకు కృతజ్ఞతగా సముచిత గౌరవాన్ని ఈ విధంగా చేకూరి రామారావు గారు కలుగజేసారు. తెలుగు లో వెలుగులు చాల లోతైన పరిశీలానావ్యాసాల సంకలనం రచించి ఆచార్య నాయని కృష్ణకుమారికి అంకితమిచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్ 1982 లో దానిని ముద్రించింది. సంప్రదాయ వ్యాకరణ విద్యకు, ఆధునిక భాషా శాస్త్రానికి మధ్య సహేతుకంగా హేతుబద్ధ సేతువును నిర్మంచడంలో చే.రా. మాష్టారు సఫలంచెందారు. సాహిత్య విమర్శ - పరామర్శ పేరిట వివిధ కవుల, ప్రక్రియల, వాదాల, విధానాల, కవిత్వ ఉద్యమాలపై '' చేరాతలు ''గా మనకు అందించి ఎంతో మేలుచేసారు. ఆయా కవుల కవితాతత్వం అరటిపండు వలచినట్లు చేసారు. ఈ పుస్తకాన్ని చేరా అభినందన సభ పేర జరిగిన సందర్భంగా సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కమిటీ మార్చి 2003 లో వెలుగులోకి తెచ్చింది. మొదటి ప్రచురణ 1991 లో జరిగినా రెండవ ముద్రణ భాగ్యం ఖమ్మానికి దక్కింది. ఆర్టిస్టు మోహన్ మాటల్లో '' నెమలీకలు రెండూ, సీతాకోక చిలకరెక్కలు పదకొండూ,బంతిపూలరేకులు పన్నెండూ, చిటికెడు వెన్నెలా, స్పూను విషాదశ్త్రు తుషారాలు తుంపి, ఈ సిబ్బెలో వేసి, రెండు కిలో రాళ్ళు ఆ సిబ్బెలో వేసి మూడుముప్పావలా అని తేల్చే ఈ తూనికలూ, కొలతల మంత్రి ఎవడండీ బాబూ అనుకున్నాం. అనుకున్నట్లే కవుల కంప్లైంట్ బాక్స్లొచ్చాయి. కమాన్ బైటికిరా చూసుకుందాం అనే గొడవలయ్యాయి. వాద వివాదలన్నిటినీ సాహితీప్రపంచం సరదాగా చూసింది. సీరియస్గా ఫాలో అయింది. ఏళ్ళు గడచినా చేరాతలపై మోజు తగ్గలేదు. ఆసాక్తి సన్నగిల్లలేదు. అన్ని వివాదాలను తట్టుకుని నిలబడ్డారు చేరా, కాలర్ పట్టి, గుండీని వూడదీసిన యాంగ్రీ యంగ్మన్ని కూడా నవ్వుతూ పలకరించి, సుతారంగా జవాబిచ్చారు. అందులో రీజన్ కనిపించింది. ఉద్రేకం నిల్. పక్షపాతం బొత్తిగాలేదు. కవి, మహిళ,దళిత, లెఫ్ట్ అండ్ రైట్తో పనిలేదు. కేవలం కవిత్వంతోనే పని. లోపలి పేజీల్లోకి వెళ్ళండి. చేరా కనబడతారు చెరగని చిరునవ్వుతో.'' చేరా గారి కవిత్వానుభవం సంకలనం చదివిన మన మోహన్ మాస్టార్కి మార్కులేదాం అంటూ కితాబివ్వటం గమనించతగినది. 2001 లో ప్రచురించబడిన సంకలనం కవిత్వంపై చేరాతలలో ఎంపిక చేసిన వ్యాసాలు యిందులో చోటుచేసుకున్నాయి. ఇక '' స్మృతికిణాంకం ''అనేది సాహిత్యాన్ని నెమరు వేసుకోటంలోనూ, సాహితీమూర్తులను తలచుకోటంలోనూ ప్రాధాన్యత కలిగిన స్మరణ వ్యాసాల సంపుటం 200 లో వెలుగులోకి వచ్చింది దీనిని హేతువాద మిత్రులు, సాహితీ ప్రియులైన కోటపాటీ మురహరిరావు,నర్రాకోటయ్యలకు సంస్మరిస్తూ చేరా తన బాల్యాన్ని, అక్కడి నుండి సాగిన తన సాహితీ ప్రయాణంలో ఎన్ని మలుపులూ, కుదుపులూ, సాహితీ వ్యాసంగం పూసగుచినట్లు తన అనుభవాలను ఒకచోట చేర్చారు చేరా మాష్టారు. ' సాహిత్య మహిళావరణం ' పేర కేవలం మహిళా కవులు, రచయితలను వారు తెలుగు సాహిత్యానికి సంబంధించే వారు నెరపిన ఉత్తేజకరమైన సృజన అన్ని పార్శ్వాలనుండి తడిమి వారి గొంతుకలో పలుకుతున్న స్వర తీవ్రతను బేరీజు వేయటంలో, సమతుల్యతను, నిర్మొహమాటాన్ని ప్రదర్శించి వారి వెన్నుతట్టి, ప్రోత్సహించి, మార్గాలు చూపి, కొన్ని ముఖ్య ఘట్టాల్ను పదిలపరిచిన సంకలనం ఓల్గా లాంటివారు స్వీకరించిన విశ్లేషణ వ్యాస సంపుటం 2001 లో స్వేచ్చ ప్రచురణల ద్వారా పాఠకలోకాని అందింది. తదుపరి మనకు కనిపించేది సాహిత్య వ్యాస ' రింఛోళి ' (సమూహము,గుంపు అనే అర్థం)2001 లోనే వచ్చిన మరొక సాహిత్య, సాహిత్య విమర్శనాల వ్యాస సంకలనం బేతవోలు రామ బ్రహ్మంగారికి అంకితమిచ్చిన రింఛోళి పలువురి ప్రశంసలను అందుకుంది. ప్రాచీన కావ్యాల పరిచయాలనుండి, ఆధునిక కావ్యాల పలుకరింపులదాకా కోవేల సంపత్కుమారాచార్య ' చేరానుశీలనం ' తో మొదలుగాబడి, పురాణ, ప్రబంధ, చంపూ, ముత్యాలసరాలు, శ్రీశ్రీ, ఆరుద్రల వరకు, సాహిత్య విమర్శనాపద్ధతులు,మార్క్సిస్టు విమర్శనాపద్ధతులు, ప్రజల భాషావికాసంతో సాహిత్యం, గ్రాంథిక, వ్య్వహారా భాషాశైలులు ఎన్నో ఇక్కడ తడమి మనకు అధ్యనం నిమిత్తం చేరా గారందించారు. 2002 లో వెలువడిన సాహిత్య ' కిర్మీరం' (రంగుల కలయికలా, కాంతిచ్ఛటలు) చేరా గారు ద్రష్ట, కవిస్రష్ట, విమర్శకుడు మూడూ అంశాల కలసిన వారి వ్యాస సంకలనం ఓ రంగుల సాహితీ తివాసీలాంటిది. ఈ సంకలనంపై కంఘంపాటి సుశీల గారు ముందుమాటలో ' చేరాతలన్నీ వేటికవి విడివిడిగా చదువుకుని ఆనందించవచ్చు (అది మీ యిష్టం) అనుస్యూనత లేకుండా వుండటంలో-మళ్ళీ పోలిక పెడుతున్నాను! '' smorgasbord '' లా వుంటుంది ( అన్ని రుచులు విడివిడి items తొ కూడిన scandinavian buffet) మరొక పుస్తకం ''భాషానువర్తనం'' 2000లో చేరా పబ్లికేషన్ పేర ముద్రించబడింది. వాడుక భాషా, భాషా శాస్త్రాల సమతుల్యత, తేదాలు, సందర్భాలు, ఉచితానుచితాలు, వాదం, వివాదం,అనువాదం, అనే శీర్షికలతో డా. సీతారాం ముందుమాటతో యెన్నో అంశాలు మనకు బోధకమవుతాయి. '' భాషా శాస్త్రం - భాషలోని లోపాలు తెలియచేయటం, వ్యాస88రచన నేర్పగల ఉపాధ్యాయూడుగా, పరభాషా బోధకత, సాహితీ కళాభినివేశం, మనస్తత్వ శాస్త్రజ్ఞత, నృసాస్త్ర వేత్తగా, అవసరం మేరకు మతబోధకుడుగా, చరిత్ర రచయితగా తత్త్వవేత్తగా, భాషా ప్రసార సంబంధ యింజనీరుగాను నిర్వర్తించడం పాఠ్య ప్రణాళిక అని చార్లెస్ ఎఫ్. హాకిట్ రాసిన ''A course in modern linguistic(1958) '' పరిచయ అధ్యాయంలో '' అనేకమంది భాష గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవలసిన వృత్తిపరమైన అవసరం వున్నది ' అని పై ఉదాహరణలు ఉటంకించాడు. అవిగాక మరెన్నో వున్నాయనికూడ తెలుస్తున్నది ''. అందుకే ఒకరు ' నీకు వాడుక భాష గురించి ఏమీ తెలియదు ' అని అంటే '' పోవోయ్ నీకు అసలు భాషా శాస్త్రం అంటేనే ఏమీ తెలియదు ' అని వాదులాడుకునే రోజుల్లో యిలాంటి వ్యాస సంకలనాలు మనకు అందించారు చేరా మాష్టారు. 2003 లో చేరా అభినందన కమిటీ, ఖమ్మం వారు ' భాషాపరివేషం ' - బాషానుభవ వ్యాసాలు అనే గ్రంథం వెలువరించారు. ఇందులో ఆధునిక ప్రమాణ భాషా స్వరూపం రచనకు కొన్ని సూచనలు, వ్యాకరణ శ్లేష, - సందేహాలకు సమాధానాలు, భాషా శైలి-రచనా భేదాలు, రెండు విమర్శలు - ఒక సమాధానం, యిలా పలు భాషాపరమైన, రచనాశైలికి సంబంధించి అమూల్యమైన వ్యాసాలు అందిన 'చేరా' మన మధ్య లేకపోయినా వారి మార్గదర్శకత్వం భావి కవులకు, రచయితలకు ఎంతో ఉపయోగం. వాటిని పాటించి, తమ రచనలను మెరుగుదిద్దుకోవటమే మనమిచ్చే నివాళి.
**
వ్యాస కూర్పు: కపిల రాంకుమార్, 25.7.2014
బోడేపూడి విజ్ఞానకేంద్రం గ్రంఠాలయ నిర్వాహకుడు,
సుందరయ్య భవనం, ఖమ్మం 507 002 9849535033

22, జులై 2014, మంగళవారం

Antharlochana: ఖమ్మంజిల్లా : ముదిగొండ చాళుక్యులు కొన్ని వివరాలు -...

Antharlochana: ఖమ్మంజిల్లా : ముదిగొండ చాళుక్యులు కొన్ని వివరాలు -...: ముదిగొండ చాళుక్యులు బాదామీ చాళుక్వవంశం వాడైన రెండవ సత్యాశ్రయ పులకేసి వల్లభుడు క్రీస్తుశకం 624లో పూర్వ దిగ్విజయ యాత్రకు బయలుదేరి వేంగీక...

19, జులై 2014, శనివారం

Grassroots Cinema with tribal children in different tribal languages: Changemaker Sandeep Viswanath – Maharashtra

Grassroots Cinema with tribal children in different tribal languages: Changemaker Sandeep Viswanath – Maharashtra

Dr. G V Purnachand, B.A.M.S.,: రెండర్ధాల కవిత్వం :: డా. జి వి పూర్ణచందు

Dr. G V Purnachand, B.A.M.S.,: రెండర్ధాల కవిత్వం :: డా. జి వి పూర్ణచందు: రెండర్ధాల కవిత్వం డా. జి వి పూర్ణచందు “సుబలతనయ గుణమహిమన్ ప్రబలి తనకు దార ధర్మపాలనలీలన్ సొబగొంది వన్నెదేగా విబుధస్తుతు ( డన్విభ...

16, జులై 2014, బుధవారం

కపిల రాంకుమార్‌|| సాహిత్యవ్యాసం - కొ.కు. ||

కపిల రాంకుమార్‌|| సాహిత్యవ్యాసం - కొ.కు. ||

''.....  కళా ప్రమాణాలతో పోట్లాడం రెండు కారణాలవల్ల
జరుగుతుంది. ఒకటి కావ్య వస్తువు రుచించటం, రచనా విధానం మీద
విరుచుకు పడట! రెండు గుడ్డిగా కొన్ని కళా ప్రమాణాలు మనసులోపెట్టుకుని
వాటితొ తప్ప ఏ కావ్యాన్ని చూడలేకపోవటం/చదవలేకపోవటం! ఈ రెండు
అభ్యుదయ వాదులు నిరసించతగినవే ''.....

'' ఆధునిక సజీవ సాహిత్యం రచించదలుచుకున్నవాళ్ళు వర్తమాన సాహిత్యంలో
సజీవమైన ధోరణి యేదో, ఏ ధోరణులను ముందుకు తీసుకుపోవాలో స్పష్టంగా
తెలుసుకోవాలి. అందుకుగాను  జీవితం గురించి, జీవనం గురించి, సమగ్రమైన
అవగాహన యేర్పరుచుకోవాలి.  నిత్యం కనిపించే అసంఖ్యాకమైన సంఘర్షణల్లో
ముఖ్యమైన వైరుధ్యాలను గమనించాలి. ధనవంతుడు పన్ను ఎగ్గొట్టచూడటం,
పేదలు తమ ఆలు బిడ్డల పోషించడానికి పడే బాధలు - ఆ రెంటి మధ్య కుర్ర
కారు అపరిమిత యౌవన చేష్టలు, జీవితంలో అశాంతి, అలజడి ప్రబలినకొద్దీ
పెరిగే వైషమ్యాలు బేరీజు వేయాలి.(పాలక వర్గాల దమనకాండ, వర్గ ప్రయోజనాలు,
శ్రామిక వర్గ స్పృహ, అంతే కాదు కుల,మత, ఆర్థిక, వ్యవసాయ,
సంక్షోభాలు ..ఉటంకింపు నాది ) సమాజ జీవన పురోగమన, తిరోగమనాల మధ్య  ఊగిసలాడే
సంస్కృతీ సంప్రదాయాలు వగైరానన్నిటినీ అధ్యయనం చేయాలి. ఒక అస్పష్టత
యేర్పడి, యికముందు జీవించటం దుర్లభం అని, తమ వల్ల కాదు అని/సాధ్యం
కాదు అని అనుకొన్నప్పుడు ప్రజలు విప్లవోన్ముఖులౌతారనేది స్పష్టం ''

'' ఈ నాటి మధ్య తరగతి జీవితం వ్యంగ్య సాహిత్యానికి గొప్ప ముడి సరుకు అనడంలో
అందులో కపట అభ్యుదయ వాదులున్నారు. పాము పడగ నీడ బట్టకప్పుగాళ్ళున్నారు.
వొట్టిగొడ్డు అరుపుల వాళ్ళున్నారు. కీర్తి కండూతిగాళ్ళున్నారు. ఆచరణలో తోక పీకుడు
గాళ్ళున్నారు. (అవార్డులు, బహుమతులు, పదవులు, ఆశించిన వాళ్ళు, సాహిత్యాన్ని
తాకట్టుపెట్టినవాళ్ళు, రాజకీయ వ్యభిచారానికి ప్రలొభపడినవాళ్ళు, ..ఉటంకింపు నాది)
ఎందరో వున్నారు.  వీళ్ళందరిని బట్టబయలుచేయటం అవసరం కదా. ఆభ్యుదయోద్యమం
తెల్లని వన్ని పాలని నమ్మి నడుచుకున్నది. అదే దాని అథోగతికి మార్గమేసింది ''

'' కొందరి అభ్యుదయ రచనలకు, రచయితలకు తేడా చూడటంలేదు. మహాప్రస్థానం
నాటికి ''శ్రీశ్రీ'' మార్క్సిస్టు కాడు. ఆనాడు తాని అభ్యుదయ రచయితననీ చెప్పుకోలేదు.
అభ్యుదయ రచయితలలో మార్క్సిస్టులమని చెప్పుకోని వారు కూడా జీవితాన్ని సరిగా
అవగాహనచేసుకున్నమేర అభ్యుదయరచనలు చేయవచ్చు. అటువంటివారు అభ్యుదయ
రచన అనిపించుకోలేని దానిని రాయవచ్చు. అభ్యుదయ రచయత తప్ప మిగతావారు
అభ్యుదయ రచన చేయలేరని, అభ్యుదయసాహిత్య సృష్టి వారిగుత్తాధికారమని ఎవరూ
ఏనాడూ అనలేదు. అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో ప్రవేశించిన వాడు కనీసం
అభ్యుదయ వ్యతిరేక రచనలు చెయ్యకుండా ఉండేందుకే '' మార్క్సిజం '' తెలుసుకుని
ఉండాలనేది మాత్రం అక్షర సత్యం! అందులో అక్షేపించడానికేమున్నదో నాకు అర్థం కాలేదు ''

'' శ్రీశ్రీ'' రాసినా ''కొ.కు.'' రాసినా అవి  మార్క్సిస్టు అవగాహనతో కూడుకున్న
రచనలే కనుక అందరికీ నచ్చాయి, కనుకనే ఇతర భాషల్లోకీ తర్జుమా అయినవి. ఒక వేళ
సరదాకి రాసివుంటే ఏనాడో అవి గాలికి కొట్టుకుపోయేవి. మేలైన రచనలు చేసినవారిలో
అభ్యుదయరచయితలున్నారు, ఆ సంఘంలో సభ్యులైనా, కాకపోయినా వారు అభ్యుదయ
రచనలు చేసారు. వారికి మార్క్సిజం తెలిసివుండవచ్చు, తెలియకపోవచ్చు. కాని
వారి రచనలలో అనివార్యంగా వస్తు, భావ రీత్యా ' మార్క్సిజం ' తొంగి చూచింది.
కాబట్టి ' కమ్యూనిస్టు ' కాని వాడు కూడ అభ్యుదయ రచనచేయవచ్చు. చాల మందికి
ఈ అభిప్రాయంతో పేచీలేదు.(ముందే చెప్పుకున్నట్టు మహా ప్రస్థానం రచనాకాలం
నాటికి శ్రీశ్రీ కమ్యూనిజం కాని, మార్క్సిజం కాని తెలియదు.) ''
 
(సృజన ప్రచురణలు) 15.7.2014



18, జూన్ 2014, బుధవారం

సాహిత్య ప్రయోజనం || కీ.శే.డా||కె.హరీష్ (సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు)||

సామాజిక ఉత్పత్తిలో ఓకరినొకరు ఎరుకపరచుకోటానికి వాడేది భాష, మాట, పాటా  మానవశ్రమ నుండి సమిష్టి తత్వం నుండి పుట్టాయనేది నిర్వివాదాంశం. సామాజికపరిణామ క్రమంలో ఉత్పత్తి రూపాలూ, విధానాలు మారాయి. శ్రమ విభజన వర్గవిభజనగా మారింది. అది క్రమేణా సమిష్టీ తత్వం నుండి వ్యక్తి తత్వమయింది/ వ్యక్తులకు సొంత ఆస్తితోపాటు కవిత్వం కొద్దిమంది కవుల, ఛందస్సు గొలుసుల్లో చిక్కువడింది. క్రమేణా కవిత్వం ఆధిపత్య వర్గాల ఆనందం కోసం, ప్రజల్ని అంధవి శ్వాసాల్లో ముంచటం కోసం ఉపయోగపడింది. కవిత్వానికి, కళలకూ కూడ వర్గ
స్వభావం వుంటుంది. అవి కూడ అంతస్థులూ, అంతరాలు, కులాలు పాటిస్తాయి. భాషయొక్క ఉపరితలమే ' కవిత్వం  వర్గాధిపత్యాలతో పాటు కవితారూపాలలో కూడ మార్పు వచ్చాయి. మారుతున్న ఈ కళారుపాన్నే మనం పద్యం అన్నాం. గేయం అన్నాం. వచన కవిత అన్నాం. అభ్యుదయ సమాజానికి రూపాలను సమాంతరంగా కళలు, వాటి రుపాలు ( కాంటెంట్లు) మారుతూనే వుంటాయి. కళా రుఫాలు సామాజిక వృక్షంపై విరబూసి వికసించే పూలు. ఈ గుర్తింపు కలిగిన తరువాత కొన్నీ కళలు ప్రజల పక్షాన నిలబడతాయి. కొన్ని పాలకవర్గాలను అంటకాగి
వాటి కొమ్ము కాస్తుంటాయి. ఈ చారిత్రక నేపథ్యం సాహితీ ప్రియులందరికి తెలుసు. కళకైనా, సాహిత్యానికైనా, మమతం సమత, శాంతి మానవాభ్యున్నతిని మించిన మరొక లక్ష్యం మరొకటి వుండదు, వుండకూడదు. అలాంటి ఉత్తమ సాహిత్యాన్ని, కళా సంస్కృతిని విస్తరింపచేయటమే సాహిత్యకారుల ముఖ్య లక్ష్యం, కర్తవ్యం. '' ప్రజల నుంచి ప్రజల కొరకు '' అనేది ఇక మన నినాదం, విధానం కావాలి. ఈనాడు మనం ఒకానొక సంక్లిష్టమైన  
మలుపులోవున్నాం. సాహిత్యాన్ని, మీడియాను, మోసపూరితం చేస్తున్న వ్యాపారపు విలువలు ఒకవపు, సామ్రాజ్యవాదుల ఆర్థిక సాంస్కృతిక దాడులు మరొక్ వైపు, మత ఛాందస ఆదిమ యుగాల దాడి మరొక వైపు నిత్యం మనం ఎదుర్కోటున్నాం. ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదం ముప్పేట దాడులు చేస్తూనే వున్నాయి. ఈ దాడినుంచి మనలను మనం మన సంస్కృతిని, సాహిత్యాన్ని మనమే కాపాడుకోవలసిన ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ విషయాన్ని మానవాభ్యుదయాన్ని కోరే సాజితీ ప్రియులు గుర్తించాలని మరీమరీ కోరుతున్నాను.
ఆ విలువలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ఆగత్యాన్ని గుర్తుచేస్తూ సెలవు తీసుకుంటాను.

( సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభలో 2001 నాటి గౌరవాధ్యక్షులు డా||కె. హరీష్‌ గారి ప్రసంగం నుండి
కొంత భాగం.....వారి స్వంత నోట్‌ పేడ్ నుండి )
___________
17/6/2014....

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

కపిల రాంకుమార్|\ సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

విప్లవాన్ని కవిత్వీకరించిన వాడు, కవిత్వాన్ని విప్లవీకరించనవాడు శ్రీశ్రీ అని నేటి యువకవులకు స్పూర్తిదాయకమైన ఆందించాడని, సముద్రమంత ముద్ర వేసిన కవి శ్రీశ్రీ అని, చరిత్రకు అర్థాన్ని '' ఏ దేశ చరిత్ర చూసిన యేమున్నది గర్వ కారణం ' అనే గేయం ద్వారా ఋజువు చేసాడు. చరిత్రకు నిజమైన అర్థాన్ని తన కవిత్వంలో తెలిపిన మార్గదర్శి. అని కొనియాడారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి. రౌతు రవి అధ్యక్షతన సాహితీ స్రవంతి ఆధయనవేదిక సమావేశం జూన్‌ నెల మూడవ ఆదివారం ప్రత్యేకంగా శ్రీశ్రీ వర్థంతి సమావేశంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు ఉదయం 10గంటలకు ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పట్టణంలోని కవులు మొవ్వా శ్రీనివాసరావు, సంపటందుర్గా ప్రసాదరావు, కపిల రాంకుమార్, రౌతు రవి, కె. ఆనందాచారి, ప్రముఖ విద్యా సంస్థల అధిపతులు రమణారావు, వీరారెడ్డి, రాఘవరావు, ప్రముఖ వైద్యుడు డా. భారవి, ఇతర సాహితీ అభిమానులు, పాల్గొన్నారు. సాయంత్రం బోడేపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయన వేదికలో భాగంగా సామావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశ్రీ గేయాలను ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సంపటందుర్గా ప్రసాదరావు ఆలపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి సంకలనంలోని కవితలు సునంద, శైలజ, . సునంద, శైలజ, టి.లక్ష్మి, జయప్రద మున్నగువారు చదివారు. శ్రీశ్రీపై నాగభైరవకోటేశ్వరావు రాసిన గేయాన్ని కపిల రాంకుమార్ చదివారుశ్రీశ్రీ సాహిత్య ప్రక్రియల అన్నింటిలోను ఆల్‌రౌండర్‌ అంటూ విమర్శ, అనువాదం, కవిత్వ, చందోరచన, వ్యాసాలు, కథలు, నాటికలు, అంతేకా విదేశీ భాషాలలో పట్టు, శాసనమండలి సభ్యుడిగా తన పాత్రను నిర్వహించాడని అన్నారు. కె.ఎల్‌.యూనివర్సిటి అనువాద విభాగంకు చెందిన మోహనాచార్యులు మాట్లాడుతు నేటి పాఠశాలల మరియు కళాశాల విద్యార్థులకు శ్రీశ్రీ కవిత్వాన్ని పరిచయం చేయవలసివుందని తెలిపారు. నేటి సాంకేతిక విజ్ఞాన సంపాదన మాటున సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం లోపించిందని, దానిని అధిగమించేలా ఎంతో కృషిచేయాలిసివుందని అన్నారు. డా. పి. సుబ్బారావు గారు మాట్లాడుతూ కవిత్వాన్ని విశ్వజనీనం చేయటంలో అతని కృషి అనితర సాధ్యం, దానిని ఎవరూ అధిగమించలేదు. విశ్వనాధను గౌరవించినట్లే, గురజాడను, తిక్కనను, వేమనూ గౌరవించాడు. పద్య చందస్సు, మాత్రాచందస్సు, గేయం, వచన కవిత,అంతే కాక కవిత్వంలో విభిన్న ధోరణులను సృజించినవాడు. అధివాస్తవికత, సర్రలియజం, లాంటి ప్రక్రియలు, లిమరిక్కులు, ప్రాసక్రీడలు ఇలా చెప్పుకుంటేపోతే సమయం చాలదు. మహా ప్రస్థానం ఒక భగవద్గీతలా కొత్తగా కవిత్వం రాసేవారు చదవాల్సివుందని నొక్కివక్కాణించారు. డా.||కవితాంజనేయులు శ్రీశ్రీ కవితలలోని కొన్ని సోదాహరణగా వివరించారు. ఎం.శేషగిరి '' ఏ దేశ చరిత్ర చూసినా ''గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేసారు.

17.6.2014

20, ఏప్రిల్ 2014, ఆదివారం

వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం|

కపిల రాంకుమార్|| వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం||

ఆమని '' ఉగాది కవితా సంపుటాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పిదప సంపాదకత్వం వహించిన బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ మాట్లాడారు. . జయనామ వత్సరానికి స్వాగతం పలుకుతూ '' మన తెలుగువారికి ప్రధానమైన సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా కుటుంబ యావత్తు ఆనందంగా కోటి ఆశలతో, కొత్తపథకాల రూపకల్పనతో కొంగ్రొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలతో జరుపుకునే పర్వదినం ' ఉగాది ' కి విశిష్ట స్థానం వుంది అని '' తదనంతరం, కపిల రాంకుమార్ తన సంపాదకీయాన్ని కొనసాగిస్తూ '' మన భాషా సంస్కృతులు, మానవ సంబంధాలు ప్రస్తుతం పడమటిగాలి వడదెబ్బ కు సోలిపోకుండా, ప్రపంచం మొత్తం ఆవహించిన మత ఛాందస వాదానికి, ఉగ్రవాదానికి,ప్రపంచీకరణ ముసుగులో ముంచుకొస్తున్న గ్లోబలీకరణకి తట్టుకుని నిలబడాలనే తలంపుతోనే భావ సారూప్యం కల కవులు, కళాకారులు 1999 జనవరి 26 తేదీన ఖమ్మం పట్టణంలో సాహితీ స్రవంతిని ఒక వేదికగా ఏర్పాటుచేసుకుని గత 15 సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకుంటూ,కేవలం ఖమ్మంలో ఆవిర్భవించి నా, రాష్ట్ర షాయి సంస్థగా ఏర్పడటానికి, అంతేకాక, దాని ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం అనే సాహిత్య మాస పత్రికగా జనాదరణ పొందటానికి కొద్దో గొప్పో ఖమ్మం పాత్ర గణనీయమైనదేనని చెప్పుకునేందుకు నయంగానే గర్వపడుతున్నామని, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహిస్తూనే ఒక గుర్తింపు పొందామని, దానిని నిలబెట్టుకోవాలని, అందుకు నిబద్ధత, నిమగ్నత కలిగిన సాహితీ కార్యకర్తల కృషి అవసరం ఎంతైనావుందని, కొత్త వారిని ప్రోత్సహించటం. మెలుకువలు నేర్పటం సదస్సులు, శిక్షణాతరగతులు నిర్వహించటంలాంటి కార్యక్రమాలు చేస్తూనేవున్నామని,. ఇంకా మరిన్ని అలాంటివి కొనసాగించాలనే కృత నిశ్చయంతో వున్నామని, అందులో భాగంగానే గత సంవత్సరం జూలై నెల నుండి మూడవ ఆదివారంలో ప్రతి నెల సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తూ, దాదాపు 20 నుండి 35 మంది దాక హాజరవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక, కవిత్వ పఠనం, చర్చ, సాహిత్య ప్రసంగములు నిర్వహిస్తున్నామని, ఇది ఒక అపూర్వ ప్రయోగంగానూ, ఉపయుక్తంగానూ, వుందని తెలిపారు.ఈ సంవత్సరం సాహితీ స్రవంతి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సాహితీ సంచిక ప్రత్యేకంగా తేవాలని అనుకుంటున్నామన్నారు . ఆప్రయత్నంలో భాగంగానే ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలను మీ ముందుంచుతున్నానని, సలహాలు, సూచనలు కోరారు. ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయని, వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో యేమాత్రం సాఫల్యం చెందామో కాని, ఒక చిన్న సంతృప్తి మాత్రం కలుగుతోంది. ఆదరించి, అహ్వానించిన వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుముందు కూడ ఇలానే ఇదే స్ఫూర్తితో తోడ్పడాలని వేడుకుంటూ, పేరుకే సంకలనకర్తనే కాని యిది అందరి సమిష్టి కృషి అనిమాత్రం చెప్పక తప్పదు. మరొక్కమారు అందరికి నూతన సంవత్సర అభినందనలు తెలియచేసారు.ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించగా, సాహితీ స్రవంతి జిల్లాకార్యదర్శి రౌతు రవి, అతిథులను వేదికపకి అహ్వానించి తన నివేదిక సమర్పించచారు
ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. బాణాల కృష్ణమాచారి, కోటీ శశిశ్రీ, కపిల రాంకుమార్, వురిమళ్ళ సునంద, టి.ఎల్. లక్ష్మీనరసయ్య, డా. పొత్తూరి సుబ్బారావు, డా.కావూరి పాపయ్య శాస్త్రి, డా.కవితాంజనేయులు, మొదలగు వారు సన్మానంపొందిన వారిలోవున్నారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరో పదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిపల్ చైర్ పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు నాయకులు ఎర్రా శ్రీకాంత్, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్, బి.వి.కె. డిప్యూటి జనరల్ మేనేజర్ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు.

పండుగ బలహీనతని రాజకీయ నాయకులు ఎలా అవకాశంగా తీసుకుని సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో, ఆశపడి, బోర్లపడిం సామాన్యుని వేదన తన కవితలో రాంకుమార్, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఒట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా, కాలాన్ని నిర్వ్చిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిసిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ, ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, '' జయాలనిచ్చే ఉషోదయానికై '' అంటూ గేయ రూపంలో ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుమంకున్న ఉగాదే అంటూ చతుర్తలు కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్, కోకొఇల స్వరాలకు బదులు కాకుర స్వరాలు.. పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం కవితతో బూడిద అరుణ గౌడ్, షడ్రుచులతో కృష్ణవేణి, కొత్త ఆశలతో సీతారామారావు, పాడవే కోయిలా గొంతెత్తి యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా.పొత్త్రి సుబ్బారావు, డా. పాపయ్య శాస్త్రి, తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు, పండుగ హడావుడి - హాస్య రూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా - ఎన్నీకలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదిన్నం పేరుతో నైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు. ఇచేఏ పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు , మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహార వచ్చిన వారందరికి పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం.శేషగిరి , కన్నెగంటి వెంకటయ్య, మరియు కళానిలయం బృందం వారు తమ గీతాలాతో అలరించారు.
**
--కపిల రాంకుమార్ 9849535033 (4.4.2014/19-4-2014)