Wednesday, December 24, 2014

Dr. G V Purnachand, B.A.M.S.,: ప్రయోజనం సాధించిన తిట్టు కవిత్వం :: డా. జి వి పూర్...

Dr. G V Purnachand, B.A.M.S.,: ప్రయోజనం సాధించిన తిట్టు కవిత్వం :: డా. జి వి పూర్...: ప్రయోజనం సాధించిన తిట్టు కవిత్వం డా. జి వి పూర్ణచందు      సీ. అందలంబెక్కుట నవని బ్రశస్తమా , మ్రానెక్కి నిక్కదే మర్కటంబు తొడవుల...

Tuesday, December 23, 2014

Saahitya darshanam | Ramaswamy Blogs

Saahitya darshanam | Ramaswamy Blogs

Tuesday, December 16, 2014

తెలుగు పండిత దర్శిని: తెలుగు కవులు - బోయి భీమన్న

తెలుగు పండిత దర్శిని: తెలుగు కవులు - బోయి భీమన్న: బోయి భీమన్న వికీపీడియా నుండి బోయి భీమన్న బోయి భీమన్న జన్మ నామం బోయి భీమన్న జననం 19 సెప్టెంబరు 1911 మామిడికుదురు, తూర...

Thursday, December 4, 2014

||గద్దర్‌ రాసిన పోరాట పాట ||

కపిల రాంకుమార్ ||ఇప్పుడే చదివిన గేయం||
||గద్దర్‌ రాసిన పోరాట పాట ||

రెక్కబొక్క నొయ్యకుండ
సుక్కచెమట ఒడ్వకుండ
బొర్ర బాగ పెంచావురో దొరోడో!
నీ పెయ్యంత మంత్రిస్తం దొరోడో! || రెక్క||

వడ్డిమీద వడ్డిలాగి
మారెక్కల సొత్తంత
గడ్డముల పేర్చావురో దొరోడో!
నీ నడ్డి విరగదంతంరో దొరోడో  || రెక్క||

కాళ్ళు ఏళ్ళు మొక్కంగ
పెండ్లి మేమి అపిస్తివి
అడ్డికి పావుసేరు
పుస్తె మట్టెలను గొంటివి!
సస్తెమానాయెగాని దొరోడో
నీమస్తి వదలగొడతంరో దొరోడో! || రెక్క||

పోనీ పోనీ అంటే
కానీ కానీ అంటే
మా పానానికి ముప్పయితివి దొరోడో!
నీ పని బడ్తెనె మాకు సుకం దొరోడో! || రెక్క||

స్వాతంత్ర్యం వచ్చిందని
సర్కారు మనదేనని
ఏటేటా నీకేమో
వోట్లేసి పెంస్తిమిరో దొరోడో
నువు ఇంతకింత బలిసినవుర దొరోడో
నీ కాల్గడుపులు మొక్కినోల్లమే - దొరోడో
ఇంక కల్లూ తెరిసి కదిలినాము దొరోడో || రెక్క ||
_________________
(పోరాట పాటలు ) విరసం ప్రచురణ
పేజి 118 -కవిత్వం చైతన్యం -త్రిపురనేని
జూన్‌ 2006
-------------------------
4.12.2014  ఉదయం 10.00

Monday, November 17, 2014

కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 ||


కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 ||
ప్రతీ ఒక్కరు సాహిత్య అధ్యయన కావించనదే కొత్త కొత్త సాహిత్య ఒరవడిని అందిపుచ్చుకోలేరు. నిరంతర అధ్యయనం కవులకు అవసరం అని చెబుతూ సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి రౌతు రవి '' సాహితీ స్రవంతి అధ్యయనవేదిక '' జరిపే మూడవ ఆదివారం సమావేశంలో అన్నారు. కవులే కాదు ప్రతీ విద్యార్థి, యువకుడుచదివితీరవలసిన '' మాలాలా '' పై ప్రజాశక్తి వారు ప్రచురించిన పుస్తకమని అన్నారు. ఆమే ఏ విధంగా అఫ్ఘన్ తాలిబన్ల క్రౌర్యానికి, దాడులకు ఎదురునిలబడి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అనే నినాదమొక్కటే ధ్యేయంగా నిలబడిందో, ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొందో ఆ పుస్తకంలో వివరంగా వున్నాయని, ఆమె పటుదల, నిబద్ధతే '' శాంతి '' పురస్కారానికి మార్గం వేసిందని అన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం గ్రంథాలయంలో ఆదివారం సాయంత్ర సాహితీ స్రవంతి ప్రతినెలా జరిపే మూడవ ఆదివారపు అధ్యయన వేదికలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. '' నవ తెలంగాణా నిర్మాణంలో కవుల పాత్రపై ఉపన్యాసకుడుగా కవితా డిగ్రీకాలేజి ఉప ప్రధానచార్యుడు డా. సి.హెచ్.ఆంజనేయులు ని వేదికపైకి సాహితీ స్రవంతి ఖమ్మం పట్టణ అధ్యక్షుడు సంపటం దుర్గా ప్రసాదరావు అహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు కన్నేగంటి వెంకటయ్య, గ్రంథాలయ నిర్వాహకుడు, అధ్యయనవేదిక ప్రధాన బాధ్యుడు కపిల రాంకుమార్, శ్రీమతి సునంద వేదికపైకి ఆసీనులైనారు. కన్నెగంటి వెంకటయ్య అధ్యక్ష ఉపన్యాసం కావిస్తూ ప్రతి నెల మూడవ ఆదివారం క్రమం తప్పకుండా సాహితీస్రవంతి అధ్యయనవేదిక నిర్వహించబడటంలో గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ కృషి అభినందనీయమని ఇది 14 వ ఆదివారమని గుర్తుచేసుకుంటు సాహిత్య శిల్ప సమీక్షలు, సిద్ధాంత విమర్శలు, పుస్తక అధ్యయనాలు, కవితా పఠనాలు, గేయాలాపనలు ఇన్నాళ్ళుగా కొనసాగిస్తూవున్నమని. ఇది నిరంతరం కొనసాగాలని, ఇంకా సమావేశాలకు సమయాన్ని పాటించాలని, కొత్త వారిని రాబట్టుకోవాలని, శిక్షణాతరగతులకు ప్రణాళిక వేసుకుని మరింత ముందుకు పోతూ తెలంగాణా జిల్లాలలో మనది అదర్శంగా నిలవాలని కోరారు. విశ్రాంత ఇంజనీర్-ఇన్-ఛీఫ్ శ్రీ పి. సాంబశివరావు గారు ఎంతో ఓపికతో తన వార్థక్యాన్నికూడ లెక్కచేయక హాజరు అవటం విశేషం. వారు మాట్లాడుతూ పాత కొత్తల మేలు కలయికగా ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను తడుముతూవూండాలని అంటూ కొన్ని ప్రముఖ ప్రాచీన కవుల పద్యాలను, సంస్కృత శ్లోకాలను, హాస్య శతక పద్యాలను వినిపించి, చివరగా అధునిక రీతిలో '' గడచిన విద్యార్థి జీవితాన్ని నా కొకసారి ఇవ్వు '' అనే గేయాన్ని వినిపించి అందరిని అలరించారు. సాహితీ స్రాంతికి ఆర్థిక వనరులు చేకూరే విధంగా కొన్ని సూచనలు చేసారు. వాటిని పరిగణనలోకి తీసుకును అందుకు కావలసిన ప్రయత్నాలు నలుగురితో చర్చిస్తామని కపిల రాంకుమార్ హామీ యిచ్చారు.'' నవ తెలంగాణా నిర్మాణంలో కవుల పాత్ర '' అనే ఆంశంపై వివరణాత్మక ప్రసంగం చేస్తూ పాల్కురికి సోమనాథుడు, పోతనల సాహిత్యాలలో దేశీయ పలుకుబడులు, తెలుగు నుడికారాలు, మనకు కనబడతాయని, బుర్రకథలు ఒగ్గుకథలు, పల్లెసుద్ధులు లాంటి కళారూపాలు ఆవిర్భవించాయని, పండుగులు, తిరునాళ్ళు, సాంస్కృతిక చైతన్యంద్వారా నిజాము నెదిరించే గేయ సాహిత్యం సుద్దాల హనుమంతు, యాదగిరి లాంటి సంపన్నంచేసారని, నేటికాలాని వస్తే గోరేటి వెంకన్న అశోక్తేజ,అందెశ్రీ, మరెందరో కవులు, కళాకారులు, కన్నభూమి తెలంగాణా. దాశరథి సోదరులు, రావెళ్ళ , కవిరాజమూర్తి, పుల్లాభొట్ల, హీరాలాల్ మోరియా లాంటి ఉద్దండులు ఎంతో ఉత్తేజకరమైన సాహిత్యాన్ని అందించారు. పల్లెల జీవనాన్ని ఆలంబనగా ఎన్నో పోరాట గీతాలు, కవిత్వం, నాటకం, నవల కథానిక ప్రక్రియలు వెలిసాయి. మాభూమి, ముందడుగు వంటి నాటకాలు నాటి తెలంగణ పోరాటానికి వత్తాసు పలికాయని, పడమటి గాలి ధాటికి తట్టుకునే రీతిలో సాహితీ స్రవంతి లంటి పలు సాహితీ సంథలు ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించి కృషిచేస్తున్నాయని, అలాంటి సాహితీ స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తానని అన్నారు. పీడిత తాడిత జనావళికి మేలు జరిగేలా మార్క్సిజమే అధారంగా సాహిత్యం అవిర్భవిస్తేనే నవ తెలంగాణాలో ప్రజా కవిత్వానికి సరియైన స్థానం పొందగలదని, అందుకు నిత్యం సమాజ శ్రేయస్సును ఆలంబనగాచేసుకునే సాహిత్య సృజన చేయాలని కోరారు. తన సాహిత్య అభిలాషకు సుబ్బారావు పాణిగ్రాహి గేయం ప్రేరణ అంటూ వారి గేయం '' ఎన్నాళ్ళీ కాపురాలు '' గుర్తు చేసారు రాంకుమార్ దానిని కన్నెగంటి వెంకటయ్య చక్కగా భావయుక్తంగా ఆలపించి అందరిని ఉత్తేజపరిచారు. సునంద బాలలపై ఒక గేయం చదివి వినిపించారు. శ్రీమతి సునంద వందన సమర్పణ చేసారు...
17.11.2014

Sunday, November 16, 2014

సాహితీ-యానం: చదువులు

సాహితీ-యానం: చదువులు: స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి బొల్లోజు బాబా

Saturday, November 15, 2014

కపిల రాంకుమార్|| వెలుగు ఎపుడు ? ||
చాచా నెహ్రూ పుట్టినరోజంటే
బాలల దినోత్సవమని అందరికీ ఎరుకే!
ఆటలు, పాటలు, గురువుల్లా పాత్ర పోషణలు
బహుమతులు ఉపన్యాసాలు
రోటీన్‌గా రేడియో, దూరదర్శన్‌ అన్ని మీడియాల్లో
పోటాపోటీ వార్తలు
మార్మోగటానికెన్ని పాట్లో!
బడిలోని బాలల భవితకే
బడ్జట్‌లో నిధులు అరకొర కేటాయింపైతే
వీధిబాలల, బాల కార్మికుల గోడు పట్టించుకునేదెవరు!
వేళ్ళమీద లెక్కపెట్టగల స్వచ్చంద సంస్థలు తప్ప!
సర్కారు శాఖలో విద్యా విభాలెన్నెన్నో వున్నా
నిబద్ధత కరువైంది
ప్రతి సంవత్సరం
ఒక కొత్త ఆశ!
కాని నిరాశగానే మిగిలిపోతోంది
శివాలయం సందులో
బచ్చాగాళ్ళు బచ్చాలాడుతోనో
ఆవారా పిల్లలు బారులో తాగేవాళ్ళకి
'' నంజు ముక్కలు '' సరఫరా చేస్తొనో
బలిసిన దొరసాని పిక్కలు పిసుకుతోనో
కామాంధుడైన కామందుగారి చుంబన క్రీడలో
పెదాలు రక్తమోడుతోనో
రైల్వే భోగీల్లో ఓ మూలగా దాక్కుని
భంగు పట్టిస్తూనో
మత్తునిచ్చేది అస్వాదిస్తూ
చొక్కా చిరిగినా, లాగూబొత్తం వూడి పోస్టాఫీసులైనా
కాలం ఆకలిని తింటూంటే,
వీరు దుప్పి భోజనం చేస్తోనో
భావిపౌరులు కాలేని వారికి దిక్కెవరు?
ఎవరి దయా దాక్షిణ్యాలకోసమో ఎదురుచూస్తోనో
అర్థంకాని భేతాళ ప్రశ్నలా
మరల మర్రిచెట్టెక్కిన శవంలా
వేలాడుతూనో వుంటే.....
వెలుగు ఎపుడు ?

14.11.2014 / 15.11.2014
 

Thursday, November 13, 2014

కపిల రాంకుమార్ ||ఆసరా||

కపిల రాంకుమార్ ||ఆసరా||
'' నేనిప్పుడు
ఓ జీవిత భాగస్వామిని
ఆహ్వానించబోతున్నాను
ఈ నెల రెండో ఆదివారం

తప్పకుండా రాగలవ'' న్న
నాన్ననుండి కబురొచ్చినప్పుడు
కొంత ఆశ్చర్యం మరికొంత నమ్మకం
కలిగింది.
**
నాకు బాగా గుర్తు
అమ్మ మరణం!
అన్నయ్యకు 16 నాకు 14 వచ్చిన రోజు!
ఆ రోజే నేను వ్యక్తురాలవ్వటం!
మాయదారి గుండెపోటుతో
అమ్మ కన్నుమూయటం!
ఆ దృశ్యం కళ్ళలో మెదిలినప్పుడల్లా
కన్నీరు మున్నీరవుతుంటాను!
**
షష్ఠి పూర్తికి కొత్త వధువుతో
రెండో పెళ్ళి
ఇన్నాళ్ళు ఒంటరిగా తన భుజాలపై
శ్రమనంతా మోసిన నాన్న
ఆఖరి రోజుల్లో ఆసరా కోసం
తోడుకోరునుంటున్నాడే కాని వేరేకాదని
అర్థమైంది!
**
అన్నయ్య అమెరికాలో స్థిరపడ్డాడు
నాన్న బాగోగులు చూచేవారుండాలి కదా!
నేనేదో చుట్టపు చూపుగా
నాలుగురోజులుండిపోయేదాన్నే
శాశ్వతంగా నాన్నను అంటిపెట్టుకుని వుండలేను కదా!
అందుకే నాన్న నిర్ణయం
సమంజసమనిపించింది
చివరి రోజుల్లో ఆసరా దొరుకుతున్నందుకు
సంతోషమనిపించింది!
అందుకే మనసారా నాన్నను
అభినందిస్తున్నాను.
**
13.11.2014.....2.35 pm

Wednesday, October 29, 2014

కపిల రాంకుమార్|| ప్రకృతి -మనిషి ||

కపిల రాంకుమార్|| ప్రకృతి  -మనిషి ||

పిడక, పుడక ఒకనాటి
వంటింటి ఇంధనాలు
ఆరోగ్యకర వంటకాలు
పిడకల దాలిలో కుండలో కాగిన పాల రుచి
ఆ తోడుపెట్టిన మీగడపెరుగు కల్పిన అన్నం
అందులోకి ఆవకాయబద్ద
నిమ్మపండంత వెన్నముద్ద
ఆహాఁ అది అమృత తుల్యమే కదా!
**
మట్టి గోడలు, అరుగులు 
పేడ అలుకుతో, ముగ్గుల అల్లికలమధ్య
అందమైన కుఢ్యాలను మించేవి కదా!
ఇప్పుడా పేడను అసహ్యయించుకుంటే
గ్రామీణ సంస్కృతిని అవమానపరచినట్టే!
మన మూలాలను సమూలంగా పాతిపెట్టినట్లే!
పశువులకొట్టంలోఊడ్చిన గడ్డి పేడ
ఎరువుల కుప్పై
పేడకళ్ళకు యింత ఊక కలిపి
గోడకు కొట్టిన పిడకై
కన్నెపిల్లల ఆటలలో '' గొబ్బెమ్మ ''
ఒక సాంస్కృతిక చిహ్నం
ఈ ధనుర్మాస ఆరంభం నుండి
మకర రాశిలో సూర్యుని పాదం మోపే భోగివరకు
సాగే సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యమై
భోగి మంటల సెగలో వెలిగే
బాల్యపు ఆనందం మరువలేనిది!
**
కాలం మార్పులతో అదొక ఆదాయ వనరై
గ్రామ పంచాయితీల పేడ వేలంపాటల పాలై
అపురూప వస్తువైంది!
మనదోడ్లో వరకే దాని మీద హక్కు!
బజారున పడితే గుత్తే దారు వశం!
ఒక రకంగా గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది
పరిసరాల శుభ్రత అందులో దాగుంది కూడా!
పెంట వేసి పంట అడుగమన్న పొలానికి
దొడ్లో ఎరువుకుప్ప అధారం కదా!
ఇంధన వనరుల లోటులో కట్టెలు దొరకటం

కనికష్టం అవుతున్నప్పుడు ఆ ఎరువుకుప్పే
గ్యాసునుత్పత్తిచేసే గోబర్ ప్లాంటవుతూనే
మిగిలినది పొలానికి బలాన్నిస్తోంది!
ఆ గోడకేసిన పిడకే వంటకే కాదు
మన అంతిమ సంస్కారానికి ఆధారమై
ఆజ్యమై ఛితాభస్మరూపంలో నీటిలో కలుస్తోంది!
మట్టికి మనిషికి - పేడకి పిడకకి
అవినాభావ సంబంధం!
**
28/10/2014

Sunday, October 19, 2014

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

ఓట్ల వరదలో
అధికార బురదలో చిక్కి
తామరపుష్పసింహాస్నమెక్కి
క్షాళనపేర మూలాలను విస్మరించకు!
ఆడినమాట గట్టుమీదపెట్టి
ఆశలను తుంగలో తొక్కి
కుంటిసాకుల ముట్టిపొగరులొద్దు!
కారుకూతలొద్దు!
అభివృద్ధిచేస్తామని చెప్పి
చేతికి ఎముకలేని చందాన
పరిశ్రమలకు వందల ఎకరాలు
అప్పనంగా దొబ్బపెట్టి,
సాగుచేసుకోటానికి  దున్నేవాడికి
చెలకలివ్వడానికి మీనమేషాలెందుకు
వెర్రిచూపులెందుకు!
నిజం చెప్పలేక తడబాటులెందుకు!
తక్షణ అవసరాలను నిర్లక్ష్యంచేసి
రాష్ట్రం అంధ:కారమౌతున్నా
చీమకుట్టినట్టైనాలేదే?
చీదరించుకుంటావెందుకు
దోమలుకుట్టి విష జ్వరాలకు
గిరి జనాల పానాలు పాడెక్కుతుంటే
సోద్యం చూస్తూ వైద్యం మరిచారేం?
అయినవారికి ఆకుల్లో
కాని వారికి (కాసులు కలిగిన వారికి)
(వెండి)కంచాల్లో 
విందు భోజనాలు వడ్డించే సంస్కృతి నుండి
తేరుకోనంతవరకు
జనసామాన్యపు మెప్పు పొందలేవు సరికదా
చెప్పు దెబ్బలు తినవలసిన అగత్యం పట్టేను సుమా!
నీరులేక జీవాలు బతకొచ్చేమో కాని
పంటచేలు చచ్చిపోతాయన్న
యింగితంలేకపోతే యెలా?
పారుదలకు, ఎత్తిపోతలకు సాధనమైన
విద్యుత్‌ సరఫరా లేక
వొట్టిమాటలై, వల్లకాడులు నింపటానికా?
మంత్రులకు, శాసన సభ్యులకు నజరానాలు కాదు
కడుపు కాలుతున్న  రైతన్నలకు చేయూతనివ్వు!
అల్లకల్లోలం కాకముందే
అలమటించేవారిని ఆదుకోలేకపోతే
బంగారు రాష్ట్రం మాట యేమో కాని
అధికారం శంకరగిరి మాన్యాలు పట్టవచ్చు!
తిట్టానని  కోప్పడటంకాదు - గట్టు దిగి కళ్ళుతెరిచి చూడు!
వాస్తవం ఎంత గబ్బుకొడుతున్నదో చూడు!
తదనంతరం నీ జబ్బునెలా కుదురుస్తుందో తెలుసుకో!
నిటారుగా నిక్కబడి చూడటంకాదు -
కాస్త వంగి వాస్తవంలోకి తొంగిచూడు!
నేలపైన చూపులు సారిస్తేనే
కాస్త సోయ కలుగుతుందేమో!
చల్లారిపోతున్న సంసారాల కమురువాసన
ముక్కుకు సోకుతుందేమో!
అప్పటికైనా నీకు జ్ఞానోదయం కలుగుతుందేమో!
నిజం యెప్పుడూ చేదే మరి
ఆ చేదుతో కాని ఉన్నరోగం పోదని తెలవదా?!
నేలవిడిచి సాము చేయకు బాబూ!
కాస్త గెలిపించినవారినీ పట్టించుకోకపోతే
కాల గర్భంలో కలిసిన రాజకీయ పార్టీల్లా
నీకూ అదే గతి! అదే సారూ అధోగతి!
తస్మాత్‌ జాగ్రత ....రుగ్మతలు తగ్గాలంటే
ఆహారంతో పాటూ వ్యాయామమూ కావాలి!
ప్రజాసేవచేయటానికి మనుగడ ముఖ్యం కదా!
తదుపరి కర్తవ్యం నీదే
దానికి ప్రతి స్పందనే మాది!
18.10.2014



Wednesday, October 8, 2014

బతుకమ్మా ఓ బతుకమ్మా

...బతుకమ్మా ఓ బతుకమ్మా
    నీబతుకు నీవే దిద్దుకోవమ్మా!
    కొమ్మలా పూల రెమ్మలా,
    పూలపండ్ల పొదరిల్లులా
    నీడలా జగతినాదుకునే
    మమతల గోడలా బతుగవ్వు
    బతుకవే, బతికించవే
    చితికిపోయే బుజ్జి
   బతుకమ్మలకమ్మవై!

బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

పుడమి కాలిడిన నాటినుండి
ఎడమ చూపుల బాధనుండి
ఆడపిల్ల వంచు అడ్డగింతల నుండి
పాబందీ సంకెల తొలిగిపోయేదాక
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

మొక్కుబడి ముచ్చట్లు
చెవికుట్టు సంబురాలు
మూడేళ్ళ ముగియ
మొట్టికాయల బతుకున
పరుగుల అడుగుల
కడుగడుగు అడ్డాలు
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

ఆట పాటలలోన అపరాధ వర్తనలు
ఆంక్షల ముళ్ళకంచె దాటి,
అకాంక్షల మల్లెబాట పట్టేలా
పాతకాలపుటలవాట్లు మాని
పోరుబాట నడిచేలా    
బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

చదువు సంధ్యలకు తాళాలు వేసి
ఇంటి పనులంటూ నిలువరించేరు
నలుగురిలో తిరుగరాదంటూ
పదుగురిలో నవ్వరాదంటూ
లంగావోణి తగిలించి
లంకణాలు చేయించి
ఎదుగుదలకు వంకలు పెడుతూ
బంధాల గదిలోన ఒంటరిని చేస్తారు!    
 
// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

మనసులోని మాట పైకి రానీక
కళ్లలో నీళ్ళు కుక్కుకుంటేను
మునుముందు మనుగడ కష్టాలే తల్లి
తెలియకుండానే మనువాడమంటారు
ఆలంచనల స్వేచ్ఛను నిలిపివేస్తారు
బలిపశువును చేసి మారాడనీకుండ
తాళితో ముడిపెట్టి కాళ్ళకు బంధాలు వేస్తారు
నీ ఆశలు నెరవేర మగనికి ఎదిరించa
నీ లోని చైతన్య భావాలు ఎదుగ      
        
// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

సంసార సంద్రాన మునిగి
పిల్లల కోడివై,  నీరసించకుండ
బాగోగులకైన వంతెనవ్వాలంటే
నీదైన గొంతు నినదించవలెనమ్మా
మగువంటే వంటింటి కుందేలు కాదని
తెగువుంటే దేశాన్ని నడిపించు నేతని
తెలిపేటి  రీతిలో అడుగులేయవమ్మ
జూలుదులిపి సమరశీలవతివై        

 // బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

అచ్చోసిన ఆబోతులు
పిచ్చెక్కిన కుక్కలు
ఉచ్ఛనీచాలు మరిచి
కుళ్ళ బొడుస్తాయి
అడ్డుకునే చట్టాలకు
చుట్టల తాకిడికి
మూగవైనావంటే
చట్టాలు నీరుకారు
ఎన్నాళ్ళని బాధపడతావు!

// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                    
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //


వెతలు లేని బతుకు కొరకు
చదువొక్కటే ఆయుధమ్ము
గతులు మార్చగ పోరుబాట
అనుసరించ కర్తవ్యమ్ము
అనునిత్యం జరుగుతున్న
అక్రమాల నెదిరింప
కొంగుముడిలో పిడికెడు ధైర్యం
గుండెనిండ ఆత్మవిశ్వాసం
పొందగాను సమర మార్గం
అనుసరించి, అనుకరించి, కొనసాగవమ్మ

// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

Monday, October 6, 2014

కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||

కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||
1. 
అత్యాశ అధ:పాతాళానికి నెట్టినా
ఆశచావని మూఢులు
జ్యోతిష్యుడేదో ప్రవచించాడని
చొక్కాలు చించుకొని
విగ్రహాల విధ్వంసానికి పాల్పడినపుడు
వజ్రాలు దొరకలేదు సరికదా
కృష్ణజన్మ స్థానం మాత్రం దొరికింది!
చెప్పినవాడు పారిపోయాడు పత్తాలేకుండా!
ఇలాంటి మూఢ విశ్వాసాలను అరికట్టాలి
వారసత్వ సంపద కాపాడుకోవాలి!
**
2.
చట్టాలెన్నివున్నా
నిర్భయంగా
అత్యచారాలు
తామర తంపరలుగా అవతరిస్తూనేవున్నాయి!
అమాయక శీలాలేకాదు ప్రాణాలు అంతరిస్తూనేవున్నాయి!
**
3.
అబ్బో! ఓ నినాదాన్ని ఒకటి
మోసుకొచ్చి వీధులు ఊడ్చటంకాదు
రాజకీయ అవినీతి అతిరథుల వీధులు క్షాళన చెయ్యండి!
ఎన్నుకోబడిన నేతలలోని
నీతిలేని నేర చరితుల్ని ఊడ్చిపారేయండి యిప్పుడైనా!
తిరిగి యే చట్టసభల్లోను అడుగిడకుండా పూడ్చిపెట్టండి!
అప్పుడే '' స్వచ్ఛమేవ జయతి ''
పత్రికల్లో ఫొటోలు కాదు - ప్రతిదినం పాటుపడాలికదా!
**
4.
ప్రత్యేక యింక్రిమెంట్లు, వేతన సవరణలు ఎంత ముఖ్యమో
అవినీతికి దూరంగావుండి ప్రజాసేవ చేయడమే ముఖ్యం కదా!
చేతుల్ని మలినం చేసుకుని
చేతల్ని నాశనం చేసుకుని
మచ్చతెచ్చే పనులెందుకు?
ప్రజల ఉసురు తీయుటెందుకు?
కనీసం యిప్పుడైనా ఆలోచించరా?
కేటాయింపులు చేయగానే సంబరపడక
వాటాలకోసం గడ్డి తినకుంటేమేలు కదా!
ప్రజా ప్రతినిధులెంతమంది వున్నారన్నది కాదు
ప్రజల ప్రతీ నిధిని కాపాడాలికదా!
**
5.
ఆర్భాటాలకు విందు వినోదాలకు దుబారా కంటే
కనీస మనుగడ సాగించలేని
దారిద్ర్య రేఖ క్రింద నలుగుతున్న వారికి
చేయూతనివ్వండి!
వైద్యం కంటే ఆరోగ్యం ముఖ్యం కదా
సర్కారుదా, ప్రైవేటుదా అనికాదు ముఖ్యం!
స్వచ్ఛమైన గాలి, శుభ్రమైన తాగునీరు
పోషకాహారం దొరికేలా చేయండి చాలు!
పాలకులెవరైనా సలాం కొడతా!
నిర్లక్ష్యం చేస్తే ఇలాగే చివాట్లు పెడతా!
**
6.
నచ్చని విగ్రహాలు తొలగించడమంటే
సాంస్కృతిక వారసత్వాన్ని కించపరచటమే
విశ్వవిఖ్యాత సంగీత సాహిత్యకారులు
ఏ జాతివారైనా ఎక్కడివారైనా అభినందనీయులే!
గుర్తించిన మహానుభావులందరి స్మారక విగ్రహాలు నిలపండి
నిగ్రహం కోల్పోయి విగ్రహాలకు గ్రహణం పట్టించకండి!
ఆలయాలెక్కడున్నా దర్శించికుంటూ గౌరవించినట్లు
ముఖేముఖే సరస్వతి అన్నట్లు
ప్రతిభ ఎవరిదైనా అభినందనీయమే
వివిక్షత ఎవరిపైనైనా ఖండనీయమే!
**
అక్టోబర్‌ 2/6.10.2014

Saturday, October 4, 2014

''సాహితీ సౌరభాలతో పులకించిన ఖమ్మం ఖిల్లా '' - రిపోర్ట్‌
'' పలు సంకలనాలతిను '' లోగిలి '' ప్రత్యేక సంచిక ఒక ఆకర్షణగా సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం ఖమ్మం సాహితీ చరిత్రలో ఒక మైలు రాయి '' అని వార్షికోత్సవ సభను ప్రారంభించిన ముఖ్య అతిథి సుధామ అన్నారు. మనిషి సృష్టించుకున్న మా'నవ'సమాజంలో తానే ఒంటరైపోతున్నడని, అంతరాలు తగ్గించే మానవీకరణే కవిత్వ ప్రథాన ధ్యేయమని; కనుమరుగౌతున్న మానవవిలువలను కాపాడే విషయంలో కవులే ప్రధాన భూమిక నిర్వహించాలని ఉద్ఘాటించారు. చట్టాలు, శాసనాలతో అమలుకానివి కూడ కవులు కవులు కళకారులు తలుచుకుంటే సాధ్యమౌతుందని ఆలిండియా రేడియో విశ్రాంత ప్రొగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌, కవి, కాలమిస్ట్‌, సుధామ అన్నారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఖమ్మం లోని రోటరీక్లబ్‌ ఆర్టిఫిషియల్‌ లింబ్‌ సెంటర్‌ ( ఎన్‌.ఎస్‌.టి.రోడ్‌) లో ఉదయం 11.00 గంతలనుండి రాత్రి 9.00 గంటలవరకు విజయవంతంగా సుమారు 350 మంది కవులు, సాహిత్య అభిమానులు, కళాకారుల ఆనందోత్సాహాలతో నిర్వహించబడింది. ప్రముఖ దిన పత్రికలు ప్రశంసల జల్లు కురిపించాయి.మరో అతిథి ప్రముఖ కవయిత్రి షాజహానా మాట్లాడుతూ మనసు పలికే భాష కవిత్వమని, కొబ్బరినీళ్ళలాంటిదని అంటూకవిత్వమెప్పుడు ప్రజల పక్షానే నిలబడుతూ శాశ్వత ప్రతిపక్షంగా నిలుస్తుందన్నారు. కవులు సిద్ధాంత చట్రంలో యిరుక్కుని నలైగిపోతున్నారని, బయటకు వచ్చి నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షాపూరిత దాడుల్ను ఖండిస్తూ వారికి మద్దతుగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని మత మౌఢ్య సంస్థలు సాగిస్తున్న దమనకాండపై 
నిప్పులు చెరిగారు. ఆట్తడుగు వర్గాలకోసం రచనలు చేయటమే కవుల లక్ష్యంగావుండాలని అభిప్రాయపడ్డారు.ఈ సభలో మరో ముఖ్య అతిథి, సాహిత్య విమర్శకుడు, అద్దేపల్లి రామమోహనరావు మాట్లాడుతూ దేశ అస్థిత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపనవుందని, ముఖ్యంగా కవులపైన మరీ ఎక్కువగా వుందని నొక్కిచెప్పారు. పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రజలను ఉద్యమాలవెంపు, పోరాటలవెంపు నడవటానికి సంసిద్ధం చేయవలసిన వారు కవులేనని ఉద్బోదించారు. ఆ శక్తి సాహిత్యానికున్నదని, మన స్వాతంత్ర్యపోరాటంకాని, తెలంగాణా రైతంగ సాయుధపోరాటంకాని అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో 
నిలిచాయని వివరించారు.సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యయనవేదిక నిర్వాహకుడు 
రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో వెలువరించిన ప్రత్యేక సంచిక '' లోగిలి ''ని ఖమ్మం జిల్లా ఫెమా అధ్యక్షుడు, కవి, మువ్వా శ్రీనివాసరావు అవిష్కరించగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు ఆనందాచారి పరిచయంచేసి, సంచికను తయారుచేయటంలో కృషి చేసిన కపిల రాంకుమార్‌ను, వారికి తోడ్పాటు అందించిన హైదరాబాద్ ప్రజాశక్తికి చెందిన అనంతోజు మోహనకృష్ణను అభినందించారు. తదుపరి వురిమళ్ళ సునంద రచించిన వరమళ్ళ వసంతం కవితా సంకలనం అద్దేపల్లి రామ మోహనరావు ఆవిష్కరించగా కన్నెగంటి వెంకటయ్య పుస్తక పరిచయం కావించారు. కవి, గాయకుడు సంపటం దుర్గాప్రసాదరావు సంకలనపరచిన ఖమ్మం జిల్లాకు చెందిన 340 మంది కవుల పరిచయగ్రంథంగా సాహితీమూర్తులనే పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు డా.దిలావర్‌ ఆవిష్కరించగా సాహితీ స్రవంతి తెలంగాణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి పరిచయంచేసారు. మరో కవి, గాయకుడు మేడగాని శేషగిరి రచించి, స్వరపరచిన పాటల ఆడియో డిస్క్‌ ( సి.డి) '' పుడమి రెక్కలు '' ను తెలంగాణా రాష్ట్ర ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి , కవి, కె. దేవేంద్ర ఆవిష్కరించగా, కవి పోతగాని సత్యనారాయణ పరిచయ వాక్యాలు పలికారు. ఖమ్మం జిల్లా సీనియర్‌ అచయిత, కవి అంకిత కేశవులు రచించిన '' మానవతా జిందాబాద్‌ '' కవితల సంపుటాన్ని ముఖ్య అతిథి ప్రముఖ కవి సుధామ ఆవిష్కరించగా బి.వి.కె. రాజకీయ విద్యా విభాగం కన్వీనర్, యువ కవి బండారు రమేష్ పుస్తక పరిచయం చేసారు. సాహితీ స్రవంతి పట్టణ కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్ రచించిన పోలవరంపై గీతాన్ని ఆసు ప్రసాద్‌ ఉర్రూతలూగేలా ఆలపించాడు.వార్షికోత్సవ ప్రారంభ ముగిసిన అనంతరం భోజన విరామం అనంతరం సాహజహానా జనకఅవనం ఆరంభించగా, వీధుల రాంబాబు (భద్రాచలం) కటుకోజ్వల రమేష్‌ (ఇల్లందు) కవిసమ్మేళనం సమన్వయపరిచారు. వివిధ అంశాలపైన కవుల స్పందన అలరించింది. సుమారుగా 56 మంది కవితాగానం చేసారు.అనంతరం ఖమ్మం జిల్ల సాహితీ స్రవంతి నూతన కమిటీ కన్నెగంటీ వెంకటయ్య అధ్యక్షులుగా, రౌతు రవి ప్రధాన కార్యదర్శిగా, సంపటం దుర్గాప్రసాద్‌, పోతగాని సత్యనారాయణ, కటుకోజ్వల రమేష్‌, ఉపాధ్యక్షులుగా, మేడగాని శేషగిరి, శిరంశెట్టి కంతారావు, వీధుల రాంబాబు, సహాయ కార్యదర్శులుగా, వురిమళ్ళ సునంద కోశాధికారిగా ఎన్నికకాగా మాల్యశ్రీ, కపిల రాంకుమార్, మండవ సుబ్బారావు, కావూరి పాపయ్య శాస్త్రి, మువ్వా శ్రీనివాసరావు గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు.
డా.సీతారాం, డా. సి.హెచ్‌.ఆంజనేయులు, డా.దిలావర్‌, మాల్యశ్రీ, మండవ సుబ్బారావు, సందేశాలిచ్చారు. సాగి వెంకన్న, మనోరమ, స్వప్న, ఆసుప్రసాద్‌, కన్నెగంటి వెంకటయ్య, శేషగిరి పలి అభ్య్దయ గీతాలాలపీంచి సభను మరింత రంజింపచేసారు. ముఖ్య అతిథులకు, సీనియర్‌ కవులకు మెమెంటోలు అందించి సత్కరించారు.జిల్లా నలుమూలలనుండి కవులు, గాయకులు పాల్గొన్న సభ మరింత ఉత్సాహాన్నిచ్చింది. సాధనాల, లెనిన్‌ శ్రీనివాస్‌, సబ్బతి సుమిత్రదేవి, యనగందుల దేవయ్య, బండిఉష, సునీత, హడ్డంహరి, తాళ్ళూరి లక్ష్మి, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్‌ తదితర కవులు, కవయిత్రులు పాల్గొన్నారు.ప్రారంభ సభలో రౌతు రవి సాహితీ స్రవంతి 15వ వార్షికోతసవం సంర్భం గత 15 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాల నివేది సభ్యుల కరతాళధనులమధ్య ప్రవేశపెట్టారు. ఈ సభ 
దివంగతులైన కళాదర్శకులు బాపు, ఇతర సాహితీ వేత్తల మరణానికి సంతాపం ప్రకటించి, ఒక నిముషం మౌనం పాటించింది. సాహితి స్రవంతి లాంటి సాహిత్య సంస్థల కార్యక్రమాల నిర్వహణకు ఒక దాశరథి లాంటి పేరుమీద ఒక సమావేశమందిరం ఖమ్మంలో నిర్మించాలని, 
కవుల రచనల ప్రచురణకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని, సాహిత్య సాంస్కృతిక విషయాలపై ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాలని తీర్మానీంచారు. మేడగాని శేషగిరి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసి, ఖమ్మం జిల్లా కవులకు
నూతన ఉత్సాహాన్ని యిచ్చింది.

22.9.2014 /4.10.2013

సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి

కపిల రాంకుమార్|| సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి ||
***
సాహితీ స్రవంతి నగరకమిటీ ఆధ్వర్యంలో 21.9.2014 ఆదివారం బి.వి.కె. గ్రంథాలయంలో
రాబోయే బతుకమ్మ పండుగను ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో జరుగుపోవాలనే తలంపుతో కవితా గోష్టి ఏర్పాటుచేసామని సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కార్యదర్శి రౌతు రవి తమ అధ్యక్ష్యోపన్యాసంలో పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు సంపటం దుర్గా ప్రసాదరావు, సాహితీస్రవంతి అధ్యయన వేదిక నిర్వాహకుడు, బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్, సాహితీ స్రవంతి కోశాధికారి సునంద,ఫెమా అధ్యక్షుడు, కవి మువ్వా శ్రీనివాసరావు, కవి, గాయకుడు మేడగాని శేషగిరి పాల్గొన్న ఈ కవితా గోష్టిలో బతుకమ్మ పండుగ విశిష్టతగురించి సునంద సోదాహరణ్ ప్రసంగంతో ఆరంభం అయింది. మువా శ్రీనివాసరావు సందేశమిస్తూ గురజాడ 152వ జన్మదినం జరుపుకుంటున్న ఈ రోజున కూడ స్త్రీలస్ పట్ల జరుగుతున్న అన్యాయాలగురించి మాట్లాడుకోటం కడుశోచనీయం. బాలికల దీనావస్థ గురించి కలం సంధించిన మొదటి కవి, ఆధునికుడు గురజాడ అని కొనియాడారు. పుత్తడిబొమ్మ పూర్ణమ గేయ కథ ద్వారా వయసుమీరిన వారిన వార్తో బాలికల వివాహంపై తన నిరశన వ్యక్తం చేయటమేకాక, ప్రజలను చైతన్యపరిచేలా నాడే కన్యాశుల్కం నాటకాన్ని రచించి, ప్రదర్శింపచేసిన ప్రగతివాద నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందాడని.సమాజమ్లోని వివిధ వ్యక్తులు మానసిక వికారాలను ప్రస్పుటంగా ఆ నాటకంద్వారా వెలుగులోకి తెచ్చి సమాక హితం కోరిన గురజాడ నేటికీ ఆరాధ్యుడేనన్నారు. ఇవాళా కన్యాశుల్కం రూపం మారినా మరో విధంగా అది లోకంలో విలయతాండవమాడుతూ ఎన్నో సంసారాలలో నిప్పులు పోస్తూ గర్భసోకాలను కలిగిస్తున్నదని. అందుకే మనం అలాంటి మూఢ సంప్రదాయాలమీద, పసలేని దుష్ట సంస్కృతులపైన కవులుగా స్పందిస్తూ ప్రజలను చైతన్యపరచడమే తక్షణకర్తవ్యమని చెప్పారు. ఆసుప్రసాద్‌, శేషగిరి బృందం బతుకమ్మ పాటలను వినిపించారు. కపిల రాంకుమార్ రాసిన గేయాన్ని మేడగాని శేషగిరి ఆలపించారు. తదుపరి బండి ఉష, సునంద, బండారు రమేష్, చాగంటి కృష్ణమూర్తి, ఆదాం (విశ్రాంత జూనియర్‌ కళాశాల ప్రధానాచార్యులు) ,దేవులపల్లి హనుమంతరావు, మాటేటి శ్రీరామారావు, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్, నల్లమోతు శ్రీనివాసరావు, నారాయణ, మొదలగు వారు బతుకమ్మ కవితలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలని నిరసిస్తూ కవితా గానం చేసారు. సదానందం బృందం సునంద రాసిన బతుకమ్మ పాటను పాడి అందరిని అలరించారు. మే్డగాని శేషగిరి వందన సమర్పణ చేస్తూ, బతుకమ్మంపండుగ సాక్షిగా '' ఆడపిల్లని పుట్టనిద్దాం, ఎదుగనిద్దాం, చదవనిద్దాం, ఆత్మ గౌరవంతో బతుకనిద్దాం '' అనే అంశాల ప్రాతిపదికగా ప్రత్యామ్నాయ సంస్కృతినిని ప్రజలలోకి తీసుకువెడదామని, దానికి మరింతగా మనం ప్రోత్సహించవలసివుందని తెలియచేసారు. .
21.9.2014/4-10-2014

Monday, August 25, 2014

శోభనాచల: దేవులపల్లి రామానుజరావు - సజీవ స్వరాలు

శోభనాచల: దేవులపల్లి రామానుజరావు - సజీవ స్వరాలు: ఆకాశవాణి వారి సజీవ స్వరాలు కార్యక్రమంలో ప్రసారమైన శ్రీ దేవులపల్లి రామానుజరావు గారితో ఇంటర్వ్యూ విందాము. వీరు ఎంతోమంది గొప్ప గొప్ప వారిని ...http://sobhanaachala.blogspot.in/2014/07/blog-post_27.html

Sunday, August 24, 2014

కపిలరాంకుమార్ || చక్రభ్రమణం పార్ట్‌ 3 లో 4వ పద్యం ఆంగ్లానుసరణ||

కపిలరాంకుమార్ || చక్రభ్రమణం పార్ట్‌ 3 లో 4వ పద్యం ఆంగ్లానుసరణ||
Upcoming green seedling
duly observing the world
raising a head to dream at dawn
as just born baby half opened eyes
My moving thoughts spread like
star visions along my body
spraying all the greenish spots over body
with adjacent water spills
around the seedling fields
appear like a great poetic View
Represent my predecessor saint
That ever reveals some travelogue
of Train with absorbed wet heart.
______
తెలుగు మూలం (డా. పొత్తూరి వెంకట సుబ్బారావు - ఖమ్మం)
--------
అప్పుడే కన్ను తెరిచిన
పసిపాపలా
నూనూగు పచ్చనారు
మళ్లలో తలెత్తి
లోకాన్ని కంటున్నపుడు
కదిలే నా ఊహలు
తనువు నిండా చుక్కల చూపులను
పొదుముకుంటాయి
వారుమళ్ళ పక్కన ఆనుకున్న
శాద్వలం ఆ నీటితోనే
పచ్చదనాన్ని ఒళ్ళంతా పులుముకున్నట్లు
నా పూర్వ కవి భావసాంద్రత
ఆర్థ్రం చేస్తుంది నా గుండెను
కొన్ని రైలు ప్రయాణాల్లో.
..
23.8.2014 ఉ.11.35

Thursday, August 21, 2014

కపిల రాంకుమార్||సామ్రాజ్యవాదం||

కపిల రాంకుమార్||సామ్రాజ్యవాదం||
మానవ రక్తపు రుచి మరిగినవాడికి
దేహమైనా, పార్థివదేహమైనా ఒక్కటే
వెచ్చగావుంటే చాలు!
దేశ,కుల,మత,లింగ, వయో తేడాలతో పనిలేదు
రక్త దాహమే తీరనికోరికైన ఒక వ్యసనం, అభ్యాసం!
చమురు దేశాలైనా
చివురు వనాలైనా
పాడిపంటల సుక్షేత్రాలైనా
ఖనిజ స్వర్గాలైనా
ప్రకృతి వనరుల అంబోధులైన ఒకటే లక్ష్యం
చమురు దొరికితే చాలు!
వేదాలు వల్లిస్తూనే
ఉపనిషత్తులు చెబుతునే
ధర్మ సంస్థాపనాయ అనే సాకు ఒక్కటి
మాస్కులా తగిలించుకుని
ఎవరి గుండె గదిలోకైనా వచ్చేస్తాడు!
సుడిగుండాలు సృష్టించడానికి
ఎవరి దేహంలోకైనా
ఏ దేశంలోకైనా
ఇట్టే సునాయాసంగా చొరబడతాడు!
రక్తదాహం తీర్చుకోటానికి!
ఆఖరికి ఖండాంతర ఆంతరంగిక వ్యవహారాల్లోకైనా దూరేస్తాడు!
తన జార తనాన్ని, జాణతనాన్ని
ప్రదర్శించి లోబరచుకుంటాడు!
తాయిలాలు అందించి, మభ్యపెట్టి
మానాలను మట్టుపెడతాడు!
వాడు చేసే యాగానికి, పాడు యాగికి
పిచుక నుండి నెమలి వరకు
పసికందు నుండి ముదుసలి వరకు
రూపసి నుండి కురూపి వరకు
బడి, గుడి, పంట మడి, తేడాలుండవు!
లేడికి లేచిందే వేళలా
కోరిక కలిగితే చాలు
ఎక్కుపెట్టిన విల్లులా
కార్చిచ్చులా అల్లుకుపోతాడు!
విధ్వంసం చేస్తాడు
కళేబరాల శయ్యపై పరుండి
క్రూరంగా సంగమించే మదోన్మాదుడిలా
రక్త స్నానం, పానం, చేస్తుంటాడు!
కాళ్ళకింద మెత్తలా స్తనాలదిండ్లు
మంచంకోళ్ళులా పిక్కటెముకలు
హుక్కా పీల్చేందుకు అమాయకుల పుర్రెలు
వాడి విశ్రాంతి గదిలో అలంకరణలు!
ప్రపంచ దేశాలలో వాడి వాడిగోరు గుచ్చని నేలలేదు
క్యూబా,వెనుజులా లాంటి లాటిన్‌ దేశాలు తప్ప!
చిత్రమైన పచ్చి నెత్తురు పత్తరులలో
దిగంబర సాధువులా అఘోరాలను మించిన
క్షుద్రపూజారిలా నరమేథం చేస్తున్నాడు
వాడికి చమురు కావాలి!
అందుకు ఎవరిదైనా ఉసురు తీయాలి!
తనకెవరూ ఎదురులేరని, రారని
ఒకే ఒక్క కండకావరం వాడ్ని నడిపిస్తున్నది!
చిన్నదేశాల ధిక్కార స్వరం వాడి చెవులకు సోకవు
కంటిలో నలుసుగా మాత్రం మిగిలిపోతాయి!
పక్కలో బల్లెంలా కలవరపెడుతుంటాయి!
వాడికి లెక్కలేదు
మెజారిటి ప్రపంచం వాడి మోకాలికి మోకరిల్లుతున్నా
మైనారిటీ ప్రజ కునారిల్లుతున్న సజీవ చిత్రం
కలచివేస్తున్న కలాలు కదలనివ్వని కర్కశత్వం వాడిది
కళలను సైతం అణగ తొక్కే నియంతృత్వం వాడిది!
ఇప్పుడిప్పుడే
అక్కడక్కడా అంకురించే ఏ చిన్న తిరుగుబాటు కణమైనా
విశ్వరూపం దాల్చి
వాడి ఆయువుపట్టుపై సంధించే సమయంకోసం
ప్రజా తంత్ర శక్తులు అప్రమత్తమవుతున్నారు!
బిందువునుండి సింధువుగా మారి బందూకులవ్వటానికి
వాడి రక్త దాహానికి అడ్డుకట్టావేయాలంటే
వాడి గొంతులో పచ్చి వెలక్కాయ వేయడమే1
అందుకు సిద్ధమవుదాం రండి
విందు పేరుతో రప్పించి
కందిగింజ పరిణామమైతేనేం
గొంతుకడ్డం తగిలేలా
గోతులోకి దిగేద్దాం! పదండి!

21-8-2014...మ. 12.30

Friday, August 8, 2014

|| కపిల రాంకుమార్ || ఏది ఆదర్శమేది ఆచరణీయం?||

|| కపిల రాంకుమార్ || ఏది ఆదర్శమేది ఆచరణీయం?||

ఆదర్శాలు ఊరిస్తుంటాయి
ఆచరణలు జారిపోతుంటాయి!
మాట యివ్వటం తేలికే కాని
నిలబెట్టుకోటమే కష్టం!

పాలుతాగే పసివాడికి,
మీసాలొచ్చే కుర్రాడికి
బ్రహ్మచారికి కోరికలు
భౌతిక సహజ వాస్తవాలు!

అది ప్రేమ, కామము మధ్య,
కోరికా ఆకర్షణల మధ్య
బాధ్యతా, నిర్వహణల మధ్య
అర్థవంత అవగాహనలే ముఖ్యం!

'' వంశము నిల్పనే కదా వివాహం!''
ఒకానొక నియమబద్ధ బంధం
విశృంఖల కోరికలకు ఆనకట్ట!
దాంపత్య వ్యవసాయ చెలియలికట్ట!

గుంపు సంస్కృతినుండి
కుటుంబ సంస్కృతికి
పరివర్తన చెందిన తరుణంలో
నియమాల కట్టుబాట్ల పందిరి!

అటు యిటు తరాల అంతరాల
సంప్రదాయ సంస్కృతుల
సమ్మేళన సమతుల్యతల
అనుసంధాన విధానమే పెండ్లి!

కాలం మారలేదు
కొలమానాలే మారాయి!
ఋతువులు మారలేదు
క్రతువులే మారాయి!

నక్షత్ర రాశి గ్రహాల పేర
పెద్దలు కుదిర్చిన
కులాలవారి లగ్నాల్లో తేడాలు
అటు యిటుగా సూత్రాలన్నీ ఒకటే!

ముహూర్తానికే పెద్ద పీట
జీలకర్ర బెల్లం నెత్తిమీద పట్టు
తాళితో సహా మిగతావి
కాడితో సూత్రం వివాహ తంతే!

పొలాలవద్దో బిలాల వద్దో
పనిపాటల చదువుతోటల వద్దో
కనుల మెరుపుల సిగ్గుల మధ్య
నిరీక్షణా మాధ్యమొక సంకేతమే!

రాయబారాలుగా, ఉత్తరాలలో
సాంకేతిక పనిముట్ల హంసలా
మేఘ సందేశపు దూతలా
రుక్మిణి పంపిన అగ్నిద్యోతుడిలా
నిర్జన ప్రదేశాలు, సంకేత స్థలాలు
చాటుమాటు సందు సరసాలు
కబుర్ల గుబుర్లై, ముందుచూపుంటే
పెద్దలముందు, లేకుంటే రహస్య పెళ్ళి!

మనసు, మనువు ప్రధాన పాత్రలై
అర్థం, భావం, కార్యం కృషి
తరాజులలో తేడాలేకుంటేనే
ఉయ్యాలలూగేను సంసారం!

పందిట్లో జరిగినదైనా,
వేదికల దండలమార్పైనా
సహజీవనమైనా,
అనురాగాల ముడి
బంధాలకు ఒక దడి,
చట్ట బద్ధమైన హక్కులు
కలిగివుంటేనే సార్థకం!
లేదా నిరర్థకమే!

వంశవృద్ధి మొదలయ్యో,
వృద్ధులపై గౌరవం తగ్గో
ఆర్థిక ఒడుదుడుకుల పోట్లో,
అభిప్రాయాల చిటపటలో
చిరాకు కలిగించవచ్చు -
పరాకు తెప్పించవచ్చు
ఒకరొకరిపై నమ్మకం తగ్గొచ్చు -
కొత్త రుచులబారి పడొచ్చు
చెత్త దారులు వెతకొచ్చు -
వాదాలసెగ రగలొచ్చు
నిబ్బరంగా నిదానంగా
చేతనాస్పృహలో సమసేలాచేయాలి!

కోపతాపాలను స్వయం నియంత్రించుకోవాలి
విచ్ఛిన్నాలను నివారించుకోవాలి
పొరపాట్లు పునరవృతం కానీయకుండా
పునరనుసంధానం పొందాలి!
కాని పక్షం అంటూ వుండదు
చిత్తశుద్ధి, నిబద్ధతవుంటే!
కాదూ కూడదని పట్టుదలకు పోతే
చక్రాలు తొలగిన బండౌతుంది!

పూల పానుపులు, వెండి కంచాలకంటే
కటిక నేల పడక , మట్టిమూకుడు బువ్వలో
తృప్తిని, సౌఖ్యాన్ని పొందకలిగిననాడే
మూడుపూవులు ఆరుకాయలు!

ఆర్భాటాలకు అర్రులు చాచొద్దు
పొరుగువారితో పోల్చుకుని
చేతులు, జేబులు కాల్చుకోవద్దు
తదుపరి నలుగురిలో చులకన కావద్దు!

పెంపకాలలో, పంపకాలలో
అంపకాలలో కొంపలమీదకు
తంపుల తుంపర్లు పడనీకు
అతి చేసి, మనేది పడొద్దు!

విచక్షణ మరువకు -
వివక్షత చూపకు
విశ్లేషణ వీడకు -
వైరుధ్యం రానీకు!
గదిలోనైనా, విధిలోనైనా -
మనసు పెట్టి మసలు!
మదిలోనైనా, చేతల్లోనైనా -
కల్మషాలు దరి రానీకు!

వయసులో కలివిడిగా వున్నట్లే
సదా ముదిమిలోను
తోడు వీడక నీడలా వుంటేనే
పరిపూర్ణం, లేదా బతుకు ఉభయ భ్రష్టత్వం!

**
ముక్తాయింపు:
ఏ ఆదర్శం వల్లె వేస్తారో తెలీదు కాని
పామరుడి మాటపై చూలాలుని శీల పరీక్ష నెరపినవాడా?
ఆలుబిడ్డల తాకట్టుపెట్టిన మహారాజా?
వాస్తవం దాచి అమ్మమాటతో ఐదుగురు పతులైన వారా?
వళ్ళంతా కళ్ళతో కాముకుడైన వాడా?
తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడేనా ప్రశ్నకు జవాబీయలేని వాడా?
మునివాటికలో చేపట్టిన దానిని మరచిపోయే మహారాజా?
ఉద్యమాలకు అడ్డని నిస్సంతుగా పేరొందిన ప్రజానేతా!
మనకెవరు ఆదర్శం!!

Antharlochana: నేలకొండపల్లి బౌద్ధ స్తూపం మరికొన్ని విశేషాలు

Antharlochana: నేలకొండపల్లి బౌద్ధ స్తూపం మరికొన్ని విశేషాలు: నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వివరాలతో ఏర్పాటు చేసిన బోర్డు ఖమ్మం జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో నేలకొండపల్లివుంది. ఖ...

Thursday, August 7, 2014

కపిల రాంకుమార్ -|| దీవెనలు ||

కపిల రాంకుమార్ -|| దీవెనలు ||

మనసు తలుపు తెరుచుకున్న మంగళ హేల
వలపు తలపు చివురించిన పరిణయ వేళ ...ఈ పరిణయ వేళ ||మనసు||

మదిగదిలో ఆనందం పరిమళించగా
సొగసు కనులు ఒద్దికగా ఒక్కటికాగా
అరమరికలు చొరబడని జీవనయానంలో
ఒకరికొకరి కలివిడిగా ముందుకు పయనించే ||మనసు||

సంతులకు సక్కనైన సుద్దులు నేర్పిస్తూ
చింతలవంతలకు వెరవకుండ జీవిస్తూ
పగలుసెగలవగలులేని దంపతులై
సంతసాలసిరులతరులు యేపుగపెంచే ||మనసు||

మరులు విరులు దొర్లుతున్న జోరులో
విరులతావి కలవరపడిపోకుండా
కలనైనా తప్పులను దరిచేరనీయక
నలుగురి మెప్పును పొందగ ఎదగాలి! ||మనసు||

31.7.2014( Written) 07-08-2014 (posted)

Saturday, July 26, 2014

కపిల రాంకుమార్ || చెరిగిపోని ' చేరా' తలెన్నో ||

కపిల రాంకుమార్ || చెరిగిపోని ' చేరా' తలెన్నో ||
ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేరాగా పిలువబడే డాక్టర్ చేకూరి రామారావు గురువారం హృద్రోగంతో మృతి చెందారు. ఆయన వయసు 80 ఏళ్లు. 1934 అక్టోబర్ 1న ఖమ్మంలోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ(తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభద్రులయ్యారు. తెలుగు వాక్యం-పదవర్ణ సహితం అంటూ తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధనఅనతి కాలంలో అందరి మన్ననలు పొంది వివిధ విశ్వ విద్యాలయాల పాఠ్యాంశంగా, ఇతర పోటీ పరీక్షలు, ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా నిలిచింది. ఆ పుస్తకాన్ని ఆచార్య జెరల్డ్ బి.కెలీ (1928-1987)నిరంతర స్మృతికి అంకితమివ్వడం ఒక విశేషం. ఆయన తెలుగు భాషకు, వ్యాకరణానికి, సామాజిక భాషాపరిశోధనకు చేసిన సేవకు కృతజ్ఞతగా సముచిత గౌరవాన్ని ఈ విధంగా చేకూరి రామారావు గారు కలుగజేసారు. తెలుగు లో వెలుగులు చాల లోతైన పరిశీలానావ్యాసాల సంకలనం రచించి ఆచార్య నాయని కృష్ణకుమారికి అంకితమిచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్ 1982 లో దానిని ముద్రించింది. సంప్రదాయ వ్యాకరణ విద్యకు, ఆధునిక భాషా శాస్త్రానికి మధ్య సహేతుకంగా హేతుబద్ధ సేతువును నిర్మంచడంలో చే.రా. మాష్టారు సఫలంచెందారు. సాహిత్య విమర్శ - పరామర్శ పేరిట వివిధ కవుల, ప్రక్రియల, వాదాల, విధానాల, కవిత్వ ఉద్యమాలపై '' చేరాతలు ''గా మనకు అందించి ఎంతో మేలుచేసారు. ఆయా కవుల కవితాతత్వం అరటిపండు వలచినట్లు చేసారు. ఈ పుస్తకాన్ని చేరా అభినందన సభ పేర జరిగిన సందర్భంగా సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కమిటీ మార్చి 2003 లో వెలుగులోకి తెచ్చింది. మొదటి ప్రచురణ 1991 లో జరిగినా రెండవ ముద్రణ భాగ్యం ఖమ్మానికి దక్కింది. ఆర్టిస్టు మోహన్ మాటల్లో '' నెమలీకలు రెండూ, సీతాకోక చిలకరెక్కలు పదకొండూ,బంతిపూలరేకులు పన్నెండూ, చిటికెడు వెన్నెలా, స్పూను విషాదశ్త్రు తుషారాలు తుంపి, ఈ సిబ్బెలో వేసి, రెండు కిలో రాళ్ళు ఆ సిబ్బెలో వేసి మూడుముప్పావలా అని తేల్చే ఈ తూనికలూ, కొలతల మంత్రి ఎవడండీ బాబూ అనుకున్నాం. అనుకున్నట్లే కవుల కంప్లైంట్ బాక్స్లొచ్చాయి. కమాన్ బైటికిరా చూసుకుందాం అనే గొడవలయ్యాయి. వాద వివాదలన్నిటినీ సాహితీప్రపంచం సరదాగా చూసింది. సీరియస్గా ఫాలో అయింది. ఏళ్ళు గడచినా చేరాతలపై మోజు తగ్గలేదు. ఆసాక్తి సన్నగిల్లలేదు. అన్ని వివాదాలను తట్టుకుని నిలబడ్డారు చేరా, కాలర్ పట్టి, గుండీని వూడదీసిన యాంగ్రీ యంగ్మన్ని కూడా నవ్వుతూ పలకరించి, సుతారంగా జవాబిచ్చారు. అందులో రీజన్ కనిపించింది. ఉద్రేకం నిల్. పక్షపాతం బొత్తిగాలేదు. కవి, మహిళ,దళిత, లెఫ్ట్ అండ్ రైట్తో పనిలేదు. కేవలం కవిత్వంతోనే పని. లోపలి పేజీల్లోకి వెళ్ళండి. చేరా కనబడతారు చెరగని చిరునవ్వుతో.'' చేరా గారి కవిత్వానుభవం సంకలనం చదివిన మన మోహన్ మాస్టార్కి మార్కులేదాం అంటూ కితాబివ్వటం గమనించతగినది. 2001 లో ప్రచురించబడిన సంకలనం కవిత్వంపై చేరాతలలో ఎంపిక చేసిన వ్యాసాలు యిందులో చోటుచేసుకున్నాయి. ఇక '' స్మృతికిణాంకం ''అనేది సాహిత్యాన్ని నెమరు వేసుకోటంలోనూ, సాహితీమూర్తులను తలచుకోటంలోనూ ప్రాధాన్యత కలిగిన స్మరణ వ్యాసాల సంపుటం 200 లో వెలుగులోకి వచ్చింది దీనిని హేతువాద మిత్రులు, సాహితీ ప్రియులైన కోటపాటీ మురహరిరావు,నర్రాకోటయ్యలకు సంస్మరిస్తూ చేరా తన బాల్యాన్ని, అక్కడి నుండి సాగిన తన సాహితీ ప్రయాణంలో ఎన్ని మలుపులూ, కుదుపులూ, సాహితీ వ్యాసంగం పూసగుచినట్లు తన అనుభవాలను ఒకచోట చేర్చారు చేరా మాష్టారు. ' సాహిత్య మహిళావరణం ' పేర కేవలం మహిళా కవులు, రచయితలను వారు తెలుగు సాహిత్యానికి సంబంధించే వారు నెరపిన ఉత్తేజకరమైన సృజన అన్ని పార్శ్వాలనుండి తడిమి వారి గొంతుకలో పలుకుతున్న స్వర తీవ్రతను బేరీజు వేయటంలో, సమతుల్యతను, నిర్మొహమాటాన్ని ప్రదర్శించి వారి వెన్నుతట్టి, ప్రోత్సహించి, మార్గాలు చూపి, కొన్ని ముఖ్య ఘట్టాల్ను పదిలపరిచిన సంకలనం ఓల్గా లాంటివారు స్వీకరించిన విశ్లేషణ వ్యాస సంపుటం 2001 లో స్వేచ్చ ప్రచురణల ద్వారా పాఠకలోకాని అందింది. తదుపరి మనకు కనిపించేది సాహిత్య వ్యాస ' రింఛోళి ' (సమూహము,గుంపు అనే అర్థం)2001 లోనే వచ్చిన మరొక సాహిత్య, సాహిత్య విమర్శనాల వ్యాస సంకలనం బేతవోలు రామ బ్రహ్మంగారికి అంకితమిచ్చిన రింఛోళి పలువురి ప్రశంసలను అందుకుంది. ప్రాచీన కావ్యాల పరిచయాలనుండి, ఆధునిక కావ్యాల పలుకరింపులదాకా కోవేల సంపత్కుమారాచార్య ' చేరానుశీలనం ' తో మొదలుగాబడి, పురాణ, ప్రబంధ, చంపూ, ముత్యాలసరాలు, శ్రీశ్రీ, ఆరుద్రల వరకు, సాహిత్య విమర్శనాపద్ధతులు,మార్క్సిస్టు విమర్శనాపద్ధతులు, ప్రజల భాషావికాసంతో సాహిత్యం, గ్రాంథిక, వ్య్వహారా భాషాశైలులు ఎన్నో ఇక్కడ తడమి మనకు అధ్యనం నిమిత్తం చేరా గారందించారు. 2002 లో వెలువడిన సాహిత్య ' కిర్మీరం' (రంగుల కలయికలా, కాంతిచ్ఛటలు) చేరా గారు ద్రష్ట, కవిస్రష్ట, విమర్శకుడు మూడూ అంశాల కలసిన వారి వ్యాస సంకలనం ఓ రంగుల సాహితీ తివాసీలాంటిది. ఈ సంకలనంపై కంఘంపాటి సుశీల గారు ముందుమాటలో ' చేరాతలన్నీ వేటికవి విడివిడిగా చదువుకుని ఆనందించవచ్చు (అది మీ యిష్టం) అనుస్యూనత లేకుండా వుండటంలో-మళ్ళీ పోలిక పెడుతున్నాను! '' smorgasbord '' లా వుంటుంది ( అన్ని రుచులు విడివిడి items తొ కూడిన scandinavian buffet) మరొక పుస్తకం ''భాషానువర్తనం'' 2000లో చేరా పబ్లికేషన్ పేర ముద్రించబడింది. వాడుక భాషా, భాషా శాస్త్రాల సమతుల్యత, తేదాలు, సందర్భాలు, ఉచితానుచితాలు, వాదం, వివాదం,అనువాదం, అనే శీర్షికలతో డా. సీతారాం ముందుమాటతో యెన్నో అంశాలు మనకు బోధకమవుతాయి. '' భాషా శాస్త్రం - భాషలోని లోపాలు తెలియచేయటం, వ్యాస88రచన నేర్పగల ఉపాధ్యాయూడుగా, పరభాషా బోధకత, సాహితీ కళాభినివేశం, మనస్తత్వ శాస్త్రజ్ఞత, నృసాస్త్ర వేత్తగా, అవసరం మేరకు మతబోధకుడుగా, చరిత్ర రచయితగా తత్త్వవేత్తగా, భాషా ప్రసార సంబంధ యింజనీరుగాను నిర్వర్తించడం పాఠ్య ప్రణాళిక అని చార్లెస్ ఎఫ్. హాకిట్ రాసిన ''A course in modern linguistic(1958) '' పరిచయ అధ్యాయంలో '' అనేకమంది భాష గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవలసిన వృత్తిపరమైన అవసరం వున్నది ' అని పై ఉదాహరణలు ఉటంకించాడు. అవిగాక మరెన్నో వున్నాయనికూడ తెలుస్తున్నది ''. అందుకే ఒకరు ' నీకు వాడుక భాష గురించి ఏమీ తెలియదు ' అని అంటే '' పోవోయ్ నీకు అసలు భాషా శాస్త్రం అంటేనే ఏమీ తెలియదు ' అని వాదులాడుకునే రోజుల్లో యిలాంటి వ్యాస సంకలనాలు మనకు అందించారు చేరా మాష్టారు. 2003 లో చేరా అభినందన కమిటీ, ఖమ్మం వారు ' భాషాపరివేషం ' - బాషానుభవ వ్యాసాలు అనే గ్రంథం వెలువరించారు. ఇందులో ఆధునిక ప్రమాణ భాషా స్వరూపం రచనకు కొన్ని సూచనలు, వ్యాకరణ శ్లేష, - సందేహాలకు సమాధానాలు, భాషా శైలి-రచనా భేదాలు, రెండు విమర్శలు - ఒక సమాధానం, యిలా పలు భాషాపరమైన, రచనాశైలికి సంబంధించి అమూల్యమైన వ్యాసాలు అందిన 'చేరా' మన మధ్య లేకపోయినా వారి మార్గదర్శకత్వం భావి కవులకు, రచయితలకు ఎంతో ఉపయోగం. వాటిని పాటించి, తమ రచనలను మెరుగుదిద్దుకోవటమే మనమిచ్చే నివాళి.
**
వ్యాస కూర్పు: కపిల రాంకుమార్, 25.7.2014
బోడేపూడి విజ్ఞానకేంద్రం గ్రంఠాలయ నిర్వాహకుడు,
సుందరయ్య భవనం, ఖమ్మం 507 002 9849535033

kapila Ramkumar || poetry to be sharpen ||



kapila Ramkumar || poetry to be sharpen ||
A cute six blossom baby
A lovable elegant Lady
whether beautiful
or charmless foul
It is sufficient
if it is a Feminine!
*
Cruel thoughts
willful acts
blast in the mind
T destroy the flower
brutally or voilently
That masculine gender
ever blowing greedy tender!
persist every where!
**
Incidents are not accidental
pee-planned worst libidos
Creating New Headlines
deponents to suffer a lot
with disturbed lives!
***
For such in humanity
No bar of age
a boy to youngster or Adult swinger
or even an Old bitch
stood for such land mark
with wild crazy Animal
Mere lust to torture the Feminine!
Stalls the Society
attracts pure illicit act
Forgetting all ethics
make the co-human to bend its head
I doubt them as headless Creature
making such vulgar feature!
**
So called sophisticated legislation
remains neither amended nor rectify itself
repeating dramas continue for ever
giving susceptibility of
escaping from sole responsibilities!
**
Marital relation is purely said
to be private secret or privacy nature
But ca not be explored in public as
shameful performances occur here and there
One have to conclude there is a loss of
belief wiping the difference between lust and genocide
throwing the moral values to submerge
the Ancient saint Vatsayana to commit suicide
if he alive today at this juncture!
Or the Fate writer has change his quantum
of his own on forehead giving resignation!
The Universal Destroyer if exist has open
his third eye like AK 47 gun!
**
This a wild play
as an agreed contract
as an animal hunt
atrocities of sex on a sector
defamation is a sign of
declining of moral value
Smashing cultural heritage and Civilisation
earthing deep and deep
Why this has to be tolerated farther?
Why the voice of literature should not be aware?
Rise the guns targeted at this
to stop such unwarranted blasts!
**
A free transcription to me Telugu poem Kattulu padunekkaali
26.7.2014
(Original Telugu poem)
కపిల రాంకుమార్‌ || కవిత్వం పదునెక్కాలి||
ముద్దొచ్చే పాపైనా
ముద్దరాలైనా
అపరంజి బొమ్మైనా
అవకరాల రెమ్మైనా
స్త్రీలింగమైతే చాలు!
పుంలింగాలకి పుడతాయి
వికృత బుద్ధులు
నెరపుతాయి క్రూర చేష్టలు!
మానసిక దౌర్బల్యానికి
వయసు నిమిత్తమాత్రం!
బాలుడైనా, కౌమారుడైనా
యౌవనుడైనా, వృద్ధుడైనా
కోర్కెలు కఠినంగా
కార్యరూపం దాలుస్తాయి!
నిత్యకృత్యనగ్న సత్యమై
వార్తల్లో పతాక శీర్షికలౌతాయ్‌
బోలెడు వెతలతో జీవితాలు
తాలు ధాన్యాలౌతాయ్‌
వృత్తిగౌరవాలు మంటపెట్టి
దౌష్ట్యపు ప్రవృత్తికి సిద్ధమౌతున్నారంటే
సభ్య సమాజం తల దించుకోవాలి
(తల పెట్టడం లేదనిపిస్తోంది కొండకచో)
చట్టాలు తమని తాము సంస్కరించుకోవాలి!
సర్కారుకూ స్థిర చిత్తం శుద్ధంవుండాలి!
పవిత్ర అనబడే '' సృష్ఠి కార్యం '' బహిరంగ
అశ్లీల నృత్యమైతే
అంశాలవారి ఆనందానికే రతి సౌఖ్యంగా మారితే
కామానికి కోరికకు
హద్దులు చెరిగిపోయి
ఉన్మాదం అవహించితే
వాత్స్యాయనుడు ఆత్మహత్య చేసుకోవాలి!
బ్రహ్మ తన తల రాతను
తనేతిరగరాసుకోవాలి!
లయకారుడు మూడోకన్ను తెరవాలి!
ఆటలాగ
వేటలాగా
మృగయవినోదం జరిపినట్టు
ధృవపత్రంపై ఆమోదముద్రలా
దారుణాలు జ్రుగుతుంటే
ఎర్రటోపి, నల్లకోటూ, తెల్లకోటూ
విధులు విస్మరిస్తుంటే
తరతరాల సంప్రదాయపుటానవాళ్ళు
మట్టిలో కలుస్తుంటే
ఈ దారుణాలనాపే సుదర్శనచక్రమై
ఇక కవిత్వం పదునెక్కాలి
తన పంజా విసరాలి!
**
26.7.2014

Tuesday, July 22, 2014

Antharlochana: ఖమ్మంజిల్లా : ముదిగొండ చాళుక్యులు కొన్ని వివరాలు -...

Antharlochana: ఖమ్మంజిల్లా : ముదిగొండ చాళుక్యులు కొన్ని వివరాలు -...: ముదిగొండ చాళుక్యులు బాదామీ చాళుక్వవంశం వాడైన రెండవ సత్యాశ్రయ పులకేసి వల్లభుడు క్రీస్తుశకం 624లో పూర్వ దిగ్విజయ యాత్రకు బయలుదేరి వేంగీక...

Saturday, July 19, 2014

Grassroots Cinema with tribal children in different tribal languages: Changemaker Sandeep Viswanath – Maharashtra

Grassroots Cinema with tribal children in different tribal languages: Changemaker Sandeep Viswanath – Maharashtra

Dr. G V Purnachand, B.A.M.S.,: రెండర్ధాల కవిత్వం :: డా. జి వి పూర్ణచందు

Dr. G V Purnachand, B.A.M.S.,: రెండర్ధాల కవిత్వం :: డా. జి వి పూర్ణచందు: రెండర్ధాల కవిత్వం డా. జి వి పూర్ణచందు “సుబలతనయ గుణమహిమన్ ప్రబలి తనకు దార ధర్మపాలనలీలన్ సొబగొంది వన్నెదేగా విబుధస్తుతు ( డన్విభ...

కపిల రాంకుమార్ || తెలుగు కవితకు ఆంగ్లానుసరణ ||


కపిల రాంకుమార్ || తెలుగు కవితకు ఆంగ్లానుసరణ ||
'' The Train shelter of thousand orphan too ''
Unless a voice is raised
Heartful speech remain un-delivered,
Unless a soul demands
Hunger could remain for ever,
It is an abstract scene of general live!

Hear the music flows nearby you
though rythem less,
gives good pleasure,
like a miserable clouds spread
seems falling like rain drops into mind's cave,
sorrowful spring slanting through eyes!
Hear the liveless sonnet
filled with experienced life span
in the mouth of flute musical rings
see who is carrying such homless
in the crunches of poverty, except
trains moves everyday all the track!
Longstanding preespitation of difficulties
filled acros the life are clyster clear tears
in eyelids chain or half hoisted unfelt eyes
tired horribly like skeltons morn ever
fully disguised mark boils for ever!
Evenly it is none other than a small compartment
of the train gives a secret shelter moves up and down
where more than over thousand orphans exists!
Without a day light or a dark night sunset or sun dawn!
(Free transliration by Kapila Ramkumar) 19.7.2014
------------------------------------------------
( చక్రభ్రమణం - 1 ఖండికలోని 6 పద్యం - మూలం డా.పొత్తూరి వెంకట సుబ్బారావు విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు ఖమ్మం. కవి, విమర్శకుడు.)
**
కొన్ని బ్రతుకులంతే
పెదవి విప్పితేగాని
గుండె పలుకదు
గుండె పలికితేగాని
జానెడు పొట్ట నిండదు!
అదుగో సంగీతం!
అప స్వరాల్లోనూ అనంత శ్రావ్యత
పరచుకున్న జాలి మబ్బు
ఎద లోయలో నినుకై
రాలినట్లు
మనసులోని
బాధాతప్త సింధువు
కనుల్లో అశ్రు బిందువై
బంధువై జారినట్లు!
అతని పిల్లనిగ్రోవిలో
బ్రతుకంతా కరిగి
ఊదిన విషాదపు జీర!
దారిద్ర్యం
వేయిపడగలతో
కాటేసిన
వ్యధాభరిత
అన్నార్తుల జీవితాలను
ఎవరు మోస్తున్నారు
ఈ రైలుగాక!
గుండెల్లో చిరకాలం
గూడుకట్టుకున్న
దు:ఖాన్ని
అశ్రు బిందుమాలికలుగా
అనువదించి
మసిబారిన కళ్ళలోంచి
తొంగిచూస్తాయి!
ఏ అగాధ విషాద గాధలో
అలసిపోయిన అస్థిపంజరాలు
ఒక వేయి
అనథాశ్రమాల
ఆదరాన్ని
ఒక చిన్న రైలు పెట్టె
అందిస్తుంది వారికి
**

Wednesday, July 16, 2014

కపిల రాంకుమార్‌|| సాహిత్యవ్యాసం - కొ.కు. ||

కపిల రాంకుమార్‌|| సాహిత్యవ్యాసం - కొ.కు. ||

''.....  కళా ప్రమాణాలతో పోట్లాడం రెండు కారణాలవల్ల
జరుగుతుంది. ఒకటి కావ్య వస్తువు రుచించటం, రచనా విధానం మీద
విరుచుకు పడట! రెండు గుడ్డిగా కొన్ని కళా ప్రమాణాలు మనసులోపెట్టుకుని
వాటితొ తప్ప ఏ కావ్యాన్ని చూడలేకపోవటం/చదవలేకపోవటం! ఈ రెండు
అభ్యుదయ వాదులు నిరసించతగినవే ''.....

'' ఆధునిక సజీవ సాహిత్యం రచించదలుచుకున్నవాళ్ళు వర్తమాన సాహిత్యంలో
సజీవమైన ధోరణి యేదో, ఏ ధోరణులను ముందుకు తీసుకుపోవాలో స్పష్టంగా
తెలుసుకోవాలి. అందుకుగాను  జీవితం గురించి, జీవనం గురించి, సమగ్రమైన
అవగాహన యేర్పరుచుకోవాలి.  నిత్యం కనిపించే అసంఖ్యాకమైన సంఘర్షణల్లో
ముఖ్యమైన వైరుధ్యాలను గమనించాలి. ధనవంతుడు పన్ను ఎగ్గొట్టచూడటం,
పేదలు తమ ఆలు బిడ్డల పోషించడానికి పడే బాధలు - ఆ రెంటి మధ్య కుర్ర
కారు అపరిమిత యౌవన చేష్టలు, జీవితంలో అశాంతి, అలజడి ప్రబలినకొద్దీ
పెరిగే వైషమ్యాలు బేరీజు వేయాలి.(పాలక వర్గాల దమనకాండ, వర్గ ప్రయోజనాలు,
శ్రామిక వర్గ స్పృహ, అంతే కాదు కుల,మత, ఆర్థిక, వ్యవసాయ,
సంక్షోభాలు ..ఉటంకింపు నాది ) సమాజ జీవన పురోగమన, తిరోగమనాల మధ్య  ఊగిసలాడే
సంస్కృతీ సంప్రదాయాలు వగైరానన్నిటినీ అధ్యయనం చేయాలి. ఒక అస్పష్టత
యేర్పడి, యికముందు జీవించటం దుర్లభం అని, తమ వల్ల కాదు అని/సాధ్యం
కాదు అని అనుకొన్నప్పుడు ప్రజలు విప్లవోన్ముఖులౌతారనేది స్పష్టం ''

'' ఈ నాటి మధ్య తరగతి జీవితం వ్యంగ్య సాహిత్యానికి గొప్ప ముడి సరుకు అనడంలో
అందులో కపట అభ్యుదయ వాదులున్నారు. పాము పడగ నీడ బట్టకప్పుగాళ్ళున్నారు.
వొట్టిగొడ్డు అరుపుల వాళ్ళున్నారు. కీర్తి కండూతిగాళ్ళున్నారు. ఆచరణలో తోక పీకుడు
గాళ్ళున్నారు. (అవార్డులు, బహుమతులు, పదవులు, ఆశించిన వాళ్ళు, సాహిత్యాన్ని
తాకట్టుపెట్టినవాళ్ళు, రాజకీయ వ్యభిచారానికి ప్రలొభపడినవాళ్ళు, ..ఉటంకింపు నాది)
ఎందరో వున్నారు.  వీళ్ళందరిని బట్టబయలుచేయటం అవసరం కదా. ఆభ్యుదయోద్యమం
తెల్లని వన్ని పాలని నమ్మి నడుచుకున్నది. అదే దాని అథోగతికి మార్గమేసింది ''

'' కొందరి అభ్యుదయ రచనలకు, రచయితలకు తేడా చూడటంలేదు. మహాప్రస్థానం
నాటికి ''శ్రీశ్రీ'' మార్క్సిస్టు కాడు. ఆనాడు తాని అభ్యుదయ రచయితననీ చెప్పుకోలేదు.
అభ్యుదయ రచయితలలో మార్క్సిస్టులమని చెప్పుకోని వారు కూడా జీవితాన్ని సరిగా
అవగాహనచేసుకున్నమేర అభ్యుదయరచనలు చేయవచ్చు. అటువంటివారు అభ్యుదయ
రచన అనిపించుకోలేని దానిని రాయవచ్చు. అభ్యుదయ రచయత తప్ప మిగతావారు
అభ్యుదయ రచన చేయలేరని, అభ్యుదయసాహిత్య సృష్టి వారిగుత్తాధికారమని ఎవరూ
ఏనాడూ అనలేదు. అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో ప్రవేశించిన వాడు కనీసం
అభ్యుదయ వ్యతిరేక రచనలు చెయ్యకుండా ఉండేందుకే '' మార్క్సిజం '' తెలుసుకుని
ఉండాలనేది మాత్రం అక్షర సత్యం! అందులో అక్షేపించడానికేమున్నదో నాకు అర్థం కాలేదు ''

'' శ్రీశ్రీ'' రాసినా ''కొ.కు.'' రాసినా అవి  మార్క్సిస్టు అవగాహనతో కూడుకున్న
రచనలే కనుక అందరికీ నచ్చాయి, కనుకనే ఇతర భాషల్లోకీ తర్జుమా అయినవి. ఒక వేళ
సరదాకి రాసివుంటే ఏనాడో అవి గాలికి కొట్టుకుపోయేవి. మేలైన రచనలు చేసినవారిలో
అభ్యుదయరచయితలున్నారు, ఆ సంఘంలో సభ్యులైనా, కాకపోయినా వారు అభ్యుదయ
రచనలు చేసారు. వారికి మార్క్సిజం తెలిసివుండవచ్చు, తెలియకపోవచ్చు. కాని
వారి రచనలలో అనివార్యంగా వస్తు, భావ రీత్యా ' మార్క్సిజం ' తొంగి చూచింది.
కాబట్టి ' కమ్యూనిస్టు ' కాని వాడు కూడ అభ్యుదయ రచనచేయవచ్చు. చాల మందికి
ఈ అభిప్రాయంతో పేచీలేదు.(ముందే చెప్పుకున్నట్టు మహా ప్రస్థానం రచనాకాలం
నాటికి శ్రీశ్రీ కమ్యూనిజం కాని, మార్క్సిజం కాని తెలియదు.) ''
 
(సృజన ప్రచురణలు) 15.7.2014



Monday, July 7, 2014

కపిల రాంకుమార్‌ || సమాధానమేది ? ||

కపిల రాంకుమార్‌ || సమాధానమేది ? ||
నోరున్న వాడి రాజ్యంలో
మూగ జీవులకు దిక్కులేకుండా పోయింది!
మన సంపద కొల్లగొట్టి
మన రాష్ట్రం దాటిపోతున్నా
మన వాటాకై ఎన్నడూ
నోరుమెదపక చోద్యం చూస్తున్న
సర్కారు మూర్ఖత్వానికి
పరాకాష్టగా ఇక్కడ రావణకాష్టం రగులుతున్నది
భద్రత కరువై
కాలంచెల్లిన గొట్టాలు పగిలి
చుక్కపొడిచే సమయానికే
చిరు వాయువు రవ్వలుగా మారి
పట్టపగలు సైతం పొగలు రేపి
సెగలపాలై నిప్పుకణికలుగా
మడి మసిబారిన కంకాళాల్లో
జనాలు, వనాలు, వనజీవాలు, పశు పక్ష్యాదులు
గుర్తుపట్టలేని ఆధునిక శవ వాటికగా మారినా,
క్షతగాత్రాల దీన గాత్రం వినపడదా?
మసిబొగ్గైన కమురువాసన దిబ్బడేసిన సర్కారు
నాశికలకు సోకదా?
కోనసీమ కాటిసీమైనా
కన్నపేగులు చెదిరి
కళ్లముందు కుప్పలైనా
ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలా మారిన
దారుణ దృశ్యాలకు చలించని
అధికార యంత్రాంగాన్ని
ఎన్ని శాపనార్థాలు పెట్టినా
ఒక్క ఓదార్పు మలయ మారుతం వీచకపోగా
నిట్టూర్పుల తూర్పుదిక్కు
దిక్కులేనిదానిలా మిగలాలా?
జన కారుణ్యం మంటకలిసింది సరే మరి
జీవ కారుణ్యం యేమైనట్టో తెలియని తనంలో
నిర్లక్ష్యానికి బలైన అమాయక పశుపక్ష్యాదుల దీనవస్థకు
బాధ్యులు ఎవరని మూగగా ప్రశ్నిస్తూంటే
సమాధానమేది?

రిలయంస్‌ అంబానీల మోచేతి నీళ్ళు తాగుతూ
అంబారిపై ఊరేగించే
ప్రభుత్వ సంస్థల ఊడిగానికి
సర్వం ఊడ్చిపెట్టుకుపోయిన కొబ్బరివనఘోష,
వలస వచ్చిన విదేశీపక్షుల విషాద గాథ,
విచ్ఛిన్నమైన జనజీవన హాహాకారం
బధిర పాలకులకు కనువిప్పు కలిగేదెన్నడు?
తరతరాలుగా ఎదురుగాలుల్లా వీచే నిరసనల విప్లవం
ఒకనాడైన జయకేతనమెగరాలని
కలం గళం విప్పి నినదిస్తున్నది!
**
6.7.2014

Saturday, July 5, 2014

నా అంగ్ల కవితకు నా స్వేచ్ఛానుసరణ

Kapila Ramkumar|| Balance of enjoyment ||
some memories make me pleasure
some memories recall with pressure
Good and bad incidents
reveal the past came across !
Some probably remain unaltered
Some Trouble me when gathered
Anyhow leave all the ఫorgotten
keep the other Sweet for further !
If picture in a complete shape
feel the whole an enjoy
If disappear do not try to recollect
throw it in a hole of envoy
So as to keep life better for ever
It's better to leave the bitter as scrap !
3.6.2014 / 5..2014

________________________
నా అంగ్ల కవితకు నా స్వేచ్ఛానుసరణ
కపిల రాంకుమార్ || సంతోష విషాదాల సమతుల్యత ||
కొన్ని స్మృతులు
మనోయవనికపై
అందంగా ఆనందంగా తారాడుతుంటయ్‌
మరికొన్ని గాఢ గతాలు
సునామీలుగా బాధిస్తుంటాయ్‌
కాలగమనంలో
పాతుకున్న గుర్తులేవైనా
అవి మంచో, చెడో
గడచినం జరిగిపోయిన సంఘటనలు
**
కొన్ని ఏ మార్పులు లేకుండా శాశ్వతమైతే
కొన్ని నొప్పించే రీతిలో సంచలనమౌతాయ్‌
ఏమైనా తీపిగుర్తులు పదిలంగా దాచెయ్‌
మరుగునపడ్డవాటి అనవాళ్ళు చెరిపేయ్‌!
చిత్రం స్పష్టంగా కనిపిస్తేనే నయనాందకరమే
గజిబిజి బొమ్మలా కదలాడితే నిరాకరణమే
మధురమైన వాటిన అట్టిపెట్టుకో పున:పున: ఆనందించడానికి
ఇతరలన్ని పాత సామాన్లుగా వదిలించేసుకో శాశ్వతంగా!
(30.6.2014)/5-7-2014
_________________________________
చిన్న ప్రయత్నం చేసాను... సలహాలు కోరుతున్నాను.

Saturday, June 28, 2014

కపిల రాంకుమార్ ||రండి-పదండి||

కపిల రాంకుమార్ ||రండి-పదండి||

బొక్కసాలు నిండి
పొర్లిపోయేలా
వీధులు, వాడలు
వాసనొచ్చేలా
మానవత్వం
మంటకలిసేలా
మృగ సంచారాలకి
పచ్చ జెండా ఎత్తిన వేలంపాటల్లో
తలపండినవారే కాదు
నవ యువకులు పోటీ పడి
మద్యవిక్రయాన్ని
అందిపుచ్చుకోవాలని
ఆబగా అంగలార్చుకుంటున్నారు
యెలాగైనా దక్కించుకుని
ఆదాయపు ఆలంబన చేసుకుంటున్నారు
బడుగులను మెట్లగాచేసుకుని
అంతస్ఠులందుకోనున్నారు!
**
మరో ప్రక్క
ముంపు మండలాలు మాత్రం
గ్రామ సభల స్థాయిలోనే
మద్యం వద్దని తీర్మానిస్తున్నారు.
జనాలని మత్తులో వుంచి
ఖజానా నింపుకోటమే
తమ జనానాలకు పసందు భోజ్నాలు
ఓటేసిన జనాలకు ఓటి బతుకులు
మద్యం మహమ్మారిని తరిమేదెలా అని
మరో దూబకుంట ఉద్యమానికి
కొంగులు నడుము చుట్టుకోచూస్తున్నారు!
**
తాగ నీరు లేదు కాని
తాగ బీరు పోస్తామన్నట్టుంది
సర్కారుల తీరు!
**
మెతుకులకు సైతం అల్లాడే
కరువు వాత పడాల్సిందే
జనం రోదన చెవిటివాని శంఖనాదం కాకూడదని
గురితప్పని గిరిజన శరమవ్వాలని
అక్షరాల కత్తులు
నూరుతున్నాను.
సుక్షేత్రంలో పోరాట
విత్తులు నాటుతున్నాను.
సేద్యం చేద్దాం రండి
చేవ చూపుదాం పదండి.
***
28.06.2014

Wednesday, June 18, 2014

సాహిత్య ప్రయోజనం || కీ.శే.డా||కె.హరీష్ (సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు)||

సామాజిక ఉత్పత్తిలో ఓకరినొకరు ఎరుకపరచుకోటానికి వాడేది భాష, మాట, పాటా  మానవశ్రమ నుండి సమిష్టి తత్వం నుండి పుట్టాయనేది నిర్వివాదాంశం. సామాజికపరిణామ క్రమంలో ఉత్పత్తి రూపాలూ, విధానాలు మారాయి. శ్రమ విభజన వర్గవిభజనగా మారింది. అది క్రమేణా సమిష్టీ తత్వం నుండి వ్యక్తి తత్వమయింది/ వ్యక్తులకు సొంత ఆస్తితోపాటు కవిత్వం కొద్దిమంది కవుల, ఛందస్సు గొలుసుల్లో చిక్కువడింది. క్రమేణా కవిత్వం ఆధిపత్య వర్గాల ఆనందం కోసం, ప్రజల్ని అంధవి శ్వాసాల్లో ముంచటం కోసం ఉపయోగపడింది. కవిత్వానికి, కళలకూ కూడ వర్గ
స్వభావం వుంటుంది. అవి కూడ అంతస్థులూ, అంతరాలు, కులాలు పాటిస్తాయి. భాషయొక్క ఉపరితలమే ' కవిత్వం  వర్గాధిపత్యాలతో పాటు కవితారూపాలలో కూడ మార్పు వచ్చాయి. మారుతున్న ఈ కళారుపాన్నే మనం పద్యం అన్నాం. గేయం అన్నాం. వచన కవిత అన్నాం. అభ్యుదయ సమాజానికి రూపాలను సమాంతరంగా కళలు, వాటి రుపాలు ( కాంటెంట్లు) మారుతూనే వుంటాయి. కళా రుఫాలు సామాజిక వృక్షంపై విరబూసి వికసించే పూలు. ఈ గుర్తింపు కలిగిన తరువాత కొన్నీ కళలు ప్రజల పక్షాన నిలబడతాయి. కొన్ని పాలకవర్గాలను అంటకాగి
వాటి కొమ్ము కాస్తుంటాయి. ఈ చారిత్రక నేపథ్యం సాహితీ ప్రియులందరికి తెలుసు. కళకైనా, సాహిత్యానికైనా, మమతం సమత, శాంతి మానవాభ్యున్నతిని మించిన మరొక లక్ష్యం మరొకటి వుండదు, వుండకూడదు. అలాంటి ఉత్తమ సాహిత్యాన్ని, కళా సంస్కృతిని విస్తరింపచేయటమే సాహిత్యకారుల ముఖ్య లక్ష్యం, కర్తవ్యం. '' ప్రజల నుంచి ప్రజల కొరకు '' అనేది ఇక మన నినాదం, విధానం కావాలి. ఈనాడు మనం ఒకానొక సంక్లిష్టమైన  
మలుపులోవున్నాం. సాహిత్యాన్ని, మీడియాను, మోసపూరితం చేస్తున్న వ్యాపారపు విలువలు ఒకవపు, సామ్రాజ్యవాదుల ఆర్థిక సాంస్కృతిక దాడులు మరొక్ వైపు, మత ఛాందస ఆదిమ యుగాల దాడి మరొక వైపు నిత్యం మనం ఎదుర్కోటున్నాం. ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదం ముప్పేట దాడులు చేస్తూనే వున్నాయి. ఈ దాడినుంచి మనలను మనం మన సంస్కృతిని, సాహిత్యాన్ని మనమే కాపాడుకోవలసిన ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ విషయాన్ని మానవాభ్యుదయాన్ని కోరే సాజితీ ప్రియులు గుర్తించాలని మరీమరీ కోరుతున్నాను.
ఆ విలువలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ఆగత్యాన్ని గుర్తుచేస్తూ సెలవు తీసుకుంటాను.

( సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభలో 2001 నాటి గౌరవాధ్యక్షులు డా||కె. హరీష్‌ గారి ప్రసంగం నుండి
కొంత భాగం.....వారి స్వంత నోట్‌ పేడ్ నుండి )
___________
17/6/2014....

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

కపిల రాంకుమార్|\ సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

విప్లవాన్ని కవిత్వీకరించిన వాడు, కవిత్వాన్ని విప్లవీకరించనవాడు శ్రీశ్రీ అని నేటి యువకవులకు స్పూర్తిదాయకమైన ఆందించాడని, సముద్రమంత ముద్ర వేసిన కవి శ్రీశ్రీ అని, చరిత్రకు అర్థాన్ని '' ఏ దేశ చరిత్ర చూసిన యేమున్నది గర్వ కారణం ' అనే గేయం ద్వారా ఋజువు చేసాడు. చరిత్రకు నిజమైన అర్థాన్ని తన కవిత్వంలో తెలిపిన మార్గదర్శి. అని కొనియాడారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి. రౌతు రవి అధ్యక్షతన సాహితీ స్రవంతి ఆధయనవేదిక సమావేశం జూన్‌ నెల మూడవ ఆదివారం ప్రత్యేకంగా శ్రీశ్రీ వర్థంతి సమావేశంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు ఉదయం 10గంటలకు ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పట్టణంలోని కవులు మొవ్వా శ్రీనివాసరావు, సంపటందుర్గా ప్రసాదరావు, కపిల రాంకుమార్, రౌతు రవి, కె. ఆనందాచారి, ప్రముఖ విద్యా సంస్థల అధిపతులు రమణారావు, వీరారెడ్డి, రాఘవరావు, ప్రముఖ వైద్యుడు డా. భారవి, ఇతర సాహితీ అభిమానులు, పాల్గొన్నారు. సాయంత్రం బోడేపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయన వేదికలో భాగంగా సామావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశ్రీ గేయాలను ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సంపటందుర్గా ప్రసాదరావు ఆలపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి సంకలనంలోని కవితలు సునంద, శైలజ, . సునంద, శైలజ, టి.లక్ష్మి, జయప్రద మున్నగువారు చదివారు. శ్రీశ్రీపై నాగభైరవకోటేశ్వరావు రాసిన గేయాన్ని కపిల రాంకుమార్ చదివారుశ్రీశ్రీ సాహిత్య ప్రక్రియల అన్నింటిలోను ఆల్‌రౌండర్‌ అంటూ విమర్శ, అనువాదం, కవిత్వ, చందోరచన, వ్యాసాలు, కథలు, నాటికలు, అంతేకా విదేశీ భాషాలలో పట్టు, శాసనమండలి సభ్యుడిగా తన పాత్రను నిర్వహించాడని అన్నారు. కె.ఎల్‌.యూనివర్సిటి అనువాద విభాగంకు చెందిన మోహనాచార్యులు మాట్లాడుతు నేటి పాఠశాలల మరియు కళాశాల విద్యార్థులకు శ్రీశ్రీ కవిత్వాన్ని పరిచయం చేయవలసివుందని తెలిపారు. నేటి సాంకేతిక విజ్ఞాన సంపాదన మాటున సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం లోపించిందని, దానిని అధిగమించేలా ఎంతో కృషిచేయాలిసివుందని అన్నారు. డా. పి. సుబ్బారావు గారు మాట్లాడుతూ కవిత్వాన్ని విశ్వజనీనం చేయటంలో అతని కృషి అనితర సాధ్యం, దానిని ఎవరూ అధిగమించలేదు. విశ్వనాధను గౌరవించినట్లే, గురజాడను, తిక్కనను, వేమనూ గౌరవించాడు. పద్య చందస్సు, మాత్రాచందస్సు, గేయం, వచన కవిత,అంతే కాక కవిత్వంలో విభిన్న ధోరణులను సృజించినవాడు. అధివాస్తవికత, సర్రలియజం, లాంటి ప్రక్రియలు, లిమరిక్కులు, ప్రాసక్రీడలు ఇలా చెప్పుకుంటేపోతే సమయం చాలదు. మహా ప్రస్థానం ఒక భగవద్గీతలా కొత్తగా కవిత్వం రాసేవారు చదవాల్సివుందని నొక్కివక్కాణించారు. డా.||కవితాంజనేయులు శ్రీశ్రీ కవితలలోని కొన్ని సోదాహరణగా వివరించారు. ఎం.శేషగిరి '' ఏ దేశ చరిత్ర చూసినా ''గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేసారు.

17.6.2014

Saturday, June 14, 2014

కపిల రాంకుమార్ || చమక్‌||

కపిల రాంకుమార్ || చమక్‌||

గరుకు కాగితం
చిట్లిన పాళీ
చిద్రమైన బతుకు!

14.6.2014 ఉదయం 5.51

Monday, June 9, 2014

కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ |

కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ ||
While wandering in terrace
A wonder ring on trees
made me surprise along with sunshine
Bird flow over head
stone fall on my shoulder
wounded me with shock
appeared an angel from heaven
recognised her to be my old friend
bend downwith love
__________________________________
**1604-1780 మధ్య ఓ కవి రాసిన పోయెం కు
నా స్వేచ్చానుసరణ కవి పేరు మరిచిపోయాను.
___________________________________
ఒక శుభోదయాన
అంతస్తులో సంచారం చేస్తూంటే,
చెట్లపై ఒక అద్భుతం వలయం
మెరుపులా కనపడింది సూర్యరశ్మి పాటు
ఆశ్చర్యచకితుడయ్యాను
నా తలపై ఓ పక్షి ఎగిరినట్లైంది
ఇంతలో నా భుజం మీద
రాతిముక్క బలంగా తాకినట్టుంది
దిగ్భ్రాంతి తో నేను గాయపడ్డాను
తేరుకుని చూస్తే
స్వర్గం నుండి దిగివస్తున్న
ఒక దేవదూత కనిపించింది
ఆమె నా పాత స్నేహితురాలై ఉందని గుర్తించా!
నా తనువు ఒంగిపోయిది ప్రేమతో!
________________________
9 జూన్‌ 2014

Thursday, June 5, 2014

కపిల రాంకుమార్ || జై తెలంగాణ సిరుల గిరుల కోన ||

కపిల రాంకుమార్ || జై తెలంగాణ సిరుల గిరుల కోన ||

జై తెలంగాణ - సిరుల గిరులకోన - జై తెలంగాణ - నదుల నిధులసీమ
వడివడిగా ఎదగాలి కలలన్ని నెరవేర - సకల జనులు మెచ్చేలా మా తెలంగాణ !

గలగల మంజీర పెన్‌గంగ ప్రాణహిత- ఇంద్రావతినాట్యాన జూరాల తుంగభద్ర
కిన్నెరసాని హొయలై ఉరకెత్తే గోదారై, - పాలేరుతొ మున్నేరుగా కృష్ణవేణి పరవళ్ళై !

శాతవాహన కాకతీయ బహమనీ కుతుబ్‌షాహీ - రాజ్యమేలిన నేలరా! వీరులకు పుట్టిల్లురా!
కవులకు కాణాచిరా నా తెలంగాణ - జానపద కళల నెలవురా నా తెలంగాణ

నల్లమల గిరుల లోయల సహజీవనాలు - పాపికొండల రమణీయ దృశ్యాలు
నల్లపసిడికి సింగరేణి నేల కొలువు - శైవ, వైష్ణవ బౌద్ధ జైనాల ఆనవాలురా!

చారిత్రిక సురవరం - సదాశివ సంగీతం - అచ్చ తెలుగు పాలకురికి సోముడు
హలం పట్టిన భాగవతకవి పోతన - పల్లెపదాల హనుమంతు సుద్దులు


ఆడుబిడ్డల బతుకమ్మలాటతో - బంజారడప్పుల రంగేళి హోలిరా
ఆదివాసీకూనలలరారు తల్లిరా - రేలపాటలతొ పులకించు నేలరా

ఏ యోధుని కదిపినా చాలు - బందగీ ఐలమ్మ త్యాగాల కతలు
నైజాము నెదిరించి సాగినా సమరం - ఒగ్గుకథలాగ కదలాడు కనువిందు

కాలాలు గడిచినా మారని బతుకుల - నీటి మూటల గత నేత చేతలు
అరువదేండ్ల పట్టుదల సాక్షిగా - రాష్ట్రమై తెలంగాణ అవతరించెరా!

నీటమునిగే ఆటపాటల నేల - సంకటాల బారిపడకుండ
గిరిపుత్రుల సంప్రదాయ గురుతులు - పదిలింగా నిలిచేలా

పథకాల మార్పుతో పరిసరాలు పరిమళించ - కాకుల తరిమి గద్దల మేపే లోక కంటక పద్ధతులాపి
పోలవరం పేర జనపదం నీటిపాలు కాకుండ - అనవతరం పచ్చదనపు పంట సిరులవాన కురిసేలా

గతకాలపు నష్టాలను దోషపు చట్టాలను - సవరించుకు ముందుకు సాగేందుకు
ఆశలు, తీరేలా విరామమెరుగక - అనునిత్యం పోరాడుట తెలంగాణ ఆన!

అమరుల త్యాగాలు మనమున నిడుకొని - బడుగుల బతుకువీణ కొత్తరాగాలెత్త
చేయి చేయి కలిపి చేవతనమూచూపి - నిర్మించుకుందాము మనదైన తెలంగాణ!

01.06.2014/5.6.2014

Saturday, May 31, 2014

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||
**
అందం ఆస్వాదించు కాని
ఆబగా దోచుకోవాలనుకోకు!
నోటిని దురుసుగా వాడకు!
అదుపు తప్పి కలాన్ని వదలకు!
చేతితో కరవాలమైనా, కార్యస్పూర్తిగానైనా
చక్రం తిప్పటంలో అశ్రద్ధ వద్దు!
మగతనముందని విర్రవీగకు!
దేనినైనా ఉపయోగించే ముందు
అలోచనాల మథనం జరగాలి!
**
నిప్పుల వానలో తడవకుండా
తప్పించుకోగల మాద్రికుమారుడవైనా కావాలి!
రుధిర సంద్రపు ఔపోసన పట్టగల శక్తికి
అగస్త్యముని శిష్యరికమైనా వుండాలి!
జ్వాలాముఖ ప్రవేశం చేయడానికి
జలధరుని సౌదామినీ దుప్పటి వుండాలి!
అత్యాచారాల అభినివేశ నిపుణతలో
చుట్టాలకు, చట్టాలకు చిక్కని చక్కని
పథక రచయితవ్వకలగాలి
లేశమైనా అనావాళ్ళ జాగిలాలకి
చిక్కకుండా పూడ్చగల తవ్వుకోల
కలిగుండాలి !
**
పాలకుల పాలకడలి
పాపాల నివారిణి కాకూడదు
చాటుమాటు వ్యవహారాలు
చక్కబెట్టే వేశ్యాగృహంలో
అధికారపు మబ్బులచాటున
ఘీంకారాలన్నివేళల సాగవు!
**
చుండూరు నేరగాడు
నిర్దోషిగా బయటపడినా
జాతీయ రహదారిమాత్రం
ప్రమాదంపేర మరణశిక్ష
పొందలేదా? కాకతాళీయమైనా
కాకి మాత్రం పిండాలనే కోరుతుంది కదా!
**
31.05.2014

Friday, May 9, 2014

కపిల రాంకుమార్ || వేసవితో వాదం!||

కపిల రాంకుమార్ || వేసవితో వాదం!||

వేసవితో వాదం
అందరి తరఫున వకాల్త పుచ్చుకున్న
నేలతల్లికి వందనం!
'' ఎంత తీక్షణుడవైతే
క్షణం కూడ వ్యవధివ్వకుండా
నాలోని జలరాశిని ఆసాంతం ఆపోసనపట్టి
నీవొక్కడివే లాగేసుకుంటే యెలా?
జీవరాశుల దప్పిక రోదన చూడవయ్యా
సప్తారథగమనానంద పురుషుడా! ''
దాడికి లేదా వాదానికి దిగింది ధరిత్రి!

'' తాపానికి తాళలేక,
నా వేడికి నేనే చావలేక
దాహంతో ఆస్వాదించినా,
నా పిడికెడు పొట్టలో ఆ కడివెడు పట్టవుగా
వల్లూ చల్లబరచుకుని మిగిలినది
జలధరుడితో పంపుతాలే పో
ఈ లోగా యేం కొంపలు మునగవు! ''
అంటూ పొగరుగా వడగాలి జవాబు!

'' జనాలకు గొతెండుతోంటే ఎకసెక్కంగా వుందా
బాబ్బాబు పార్వతి చాలు గంగను విడువమనగానే
కరుణించిన శివుడే నయం!
నువ్వు మరీ పడమటి దేశపు గాలిసోకినవాడివికదా!
మరీ మండిస్తున్నావు! నిద్రించేది సహ్యాద్రిలోనే కదా!
గ్లొబరీకరణతో కిరణాలు ప్రపంచీకరించబడ్డయిగా!
ముసలీ ముతక, లేలేత మొగ్గలనీ పాడెక్కిస్తున్నావు ''
ధరిత్రీ ధర్నా మొదలెట్టింది!
**
దాని ప్రభావం -
మారుతం షికారు ప్రారంభమైంది కామోసు
ఆకాశంలో నల్లటి మబ్బు దబదబా గుండెలు బాదుకుంటోంది
ఎవరో చేసిన హడవుడికి నాకేమీ తెలియదన్నటు
బిక్కమొగమేసి, చెల్లాచెదరై
దారి తప్పి జారిపడితున్నాయి సన్నగా చినుకులు!
తలలూపుతూ తరువులూ కిలకిలనవ్వుతూ,
నేలంతా పులకింత మట్టివాసన నలుదిశలా
జీవరాశి కేరింత!
పోరాటం అనివార్యం ఎప్పుడైనా ఎక్కడైనా!
**
8.5.2014

Saturday, May 3, 2014

కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||


కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||
**
కంచు మోగునట్లు కనకంబు మోగదని
వేమన మాట అక్షరాలా నిజమని తెలుస్తుంది
న.మో. రాజకీయ రంకెలు ఆలకిస్తే.
దేశానికే కళంకమంటించిన హత్యాకాండలో
తడిసిన చేతులు రుద్రాక్షలతో
జతగటితే పవిత్రమైనట్టు
కాల్పనిక ఉదాహరణలే అభివృద్ధంటూ
ఎన్నికల ప్రచారాలపై ఊరేగుతున్నారు.
తిరుగులేని నాయకుడైనట్టు
స్వార్థపరుల అండతో
అస్తిత్వాన్ని కాపాడుకోగలమనుకోవడం,
వీరోక్తుల గాలి భజనలో పరవశించి పోవడం
అంతా ప్రహసన ప్రాయం.
పర్యటనా ప్రసంగాలలో
ఊకదంపుడుపన్యాసాలలో,
ఇదే వైరుధ్యం ప్రత్యక్షమవుతుంది.
రాష్ట్ర విభజన తమ వల్లనేనని చెప్పుకునే
ఈయన '' తల్లిని చంపి బిడ్డను బతికించాల '' ని
మాటలు చెప్పడం ఎవరిని నమ్మించడానికి?
మతాల మంటలు పెట్టడంలో ఆరితేరిన నేత
పదేపదే విభజన రాజకీయాలు తగవని
చేసే హితబోధ పుర్రెలతో భగవన్నామస్మరణ
చేసే కుహనా సాధువులా బహిరంగ రంగ ప్రదర్శన
చేస్తూ '' కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిన చందమే ( చంద్రమే) '' కాదా?
**
అధికారం కోసం తహతహలాడుతూ
కాంగ్రెస్‌పై విమర్శించటం అర్థమైనదే కాని
ఆ సాకుతో మతతత్వాన్ని
బాబు నెత్తినెత్తుకోవడం ఎలా సమంజసం?
తెలుగువారి ఆత్మగౌరవం సంగతి
అటుంచి దేశం ఆత్మగౌరవానికే
ఇది తప్పనిసరిగా భంగకరం.
తనను విస్మరించినా పట్టుకు వేళ్లాడే దుస్థితి
అవకాశవాదమే కాదు
తప్పిదపు స్వయం కృతాపరాధం కూడ
ప్రభంజనం ఇక్కడ ఎంత ప్రహసన ప్రాయంగా
ముగిసేదీ త్వరలోనే విదితమవుతుంది.
**
25.4.2014 **/ 3.5.2014 ( ఒకానొక విశ్లేషణకు స్పందన)

Wednesday, April 23, 2014

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? |

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? ||
ఊళ్ళో పెళ్ళైతే
కుక్కలకు హడవుడని
ఎందుకన్నారో కాని
కాట్లాడుకుంటున్నప్పుడు
కుప్పతొట్టి రణరంగమైంది
అయినా అది
నాకు ఆశ్చర్యమనిపించలేదు!
పక్కనేవున్న సర్కారీ హాస్టలు పోరగాళ్ళు
ఫంక్షన్‌హాలు గేటువద్ద
పడిగాపులు కాస్తూ బతిమాలుకుంటుంటే
వాచ్‌మన్‌ పొండిరా పొండని అరుస్తుంటే
ముక్కున వేలుపడింది!
సర్కారు వాళ్ళ కడుపులను
అర్థాకలి గురిచేసి
మిగిలిన దానిని అర్థంగా మార్చి
బొక్కసానికి బొక్కపెట్టి
తమ బొక్కసం నింపుకుంటున్నపుడు
ఆశ్చర్యమేసింది!
అందుకేనేమో
ఆ పోరళ్ళప్పుడప్పుడు
బడికెళ్ళే దారిలో వంకర చూపులతో
ఇండ్ల దొడ్లో కొబ్బరికాయలకో
జామకాయలకో గోడలు దూకి
రాళ్ళు రువ్వుతుంటే గమనించాను
కొండకచో గద్దించే వాడిని!
పల్లెటూళ్ళో అమ్మ అయ్య
వీరి బాగుకోసం తాపత్రయంతో
హాస్టల్‌కు తోలితే
అజమాయిషీ లేని వీళ్ళు
యిలా అర్థాకలితోనో
బాల్య చాపల్యంతోనో
పొరుగువాడి వస్తువులపై
కన్నేస్తున్నారంటే.... ఏమటర్థం?
సంక్షేమం ఇలా
సంక్షోభాల్ని
సంక్లిష్టతలని
పురుడుపోసుకుంటుంటే
సమాధానం ఎక్కడ దొరుకుతుంది!
రేపు బాల నేరస్తులగానో,
కరుడుగట్టిన నేరగాళ్ళైతే
సమాధానం ఏది?
23.04.2014

Sunday, April 20, 2014

వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం|

కపిల రాంకుమార్|| వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం||

ఆమని '' ఉగాది కవితా సంపుటాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పిదప సంపాదకత్వం వహించిన బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ మాట్లాడారు. . జయనామ వత్సరానికి స్వాగతం పలుకుతూ '' మన తెలుగువారికి ప్రధానమైన సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా కుటుంబ యావత్తు ఆనందంగా కోటి ఆశలతో, కొత్తపథకాల రూపకల్పనతో కొంగ్రొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలతో జరుపుకునే పర్వదినం ' ఉగాది ' కి విశిష్ట స్థానం వుంది అని '' తదనంతరం, కపిల రాంకుమార్ తన సంపాదకీయాన్ని కొనసాగిస్తూ '' మన భాషా సంస్కృతులు, మానవ సంబంధాలు ప్రస్తుతం పడమటిగాలి వడదెబ్బ కు సోలిపోకుండా, ప్రపంచం మొత్తం ఆవహించిన మత ఛాందస వాదానికి, ఉగ్రవాదానికి,ప్రపంచీకరణ ముసుగులో ముంచుకొస్తున్న గ్లోబలీకరణకి తట్టుకుని నిలబడాలనే తలంపుతోనే భావ సారూప్యం కల కవులు, కళాకారులు 1999 జనవరి 26 తేదీన ఖమ్మం పట్టణంలో సాహితీ స్రవంతిని ఒక వేదికగా ఏర్పాటుచేసుకుని గత 15 సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకుంటూ,కేవలం ఖమ్మంలో ఆవిర్భవించి నా, రాష్ట్ర షాయి సంస్థగా ఏర్పడటానికి, అంతేకాక, దాని ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం అనే సాహిత్య మాస పత్రికగా జనాదరణ పొందటానికి కొద్దో గొప్పో ఖమ్మం పాత్ర గణనీయమైనదేనని చెప్పుకునేందుకు నయంగానే గర్వపడుతున్నామని, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహిస్తూనే ఒక గుర్తింపు పొందామని, దానిని నిలబెట్టుకోవాలని, అందుకు నిబద్ధత, నిమగ్నత కలిగిన సాహితీ కార్యకర్తల కృషి అవసరం ఎంతైనావుందని, కొత్త వారిని ప్రోత్సహించటం. మెలుకువలు నేర్పటం సదస్సులు, శిక్షణాతరగతులు నిర్వహించటంలాంటి కార్యక్రమాలు చేస్తూనేవున్నామని,. ఇంకా మరిన్ని అలాంటివి కొనసాగించాలనే కృత నిశ్చయంతో వున్నామని, అందులో భాగంగానే గత సంవత్సరం జూలై నెల నుండి మూడవ ఆదివారంలో ప్రతి నెల సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తూ, దాదాపు 20 నుండి 35 మంది దాక హాజరవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక, కవిత్వ పఠనం, చర్చ, సాహిత్య ప్రసంగములు నిర్వహిస్తున్నామని, ఇది ఒక అపూర్వ ప్రయోగంగానూ, ఉపయుక్తంగానూ, వుందని తెలిపారు.ఈ సంవత్సరం సాహితీ స్రవంతి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సాహితీ సంచిక ప్రత్యేకంగా తేవాలని అనుకుంటున్నామన్నారు . ఆప్రయత్నంలో భాగంగానే ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలను మీ ముందుంచుతున్నానని, సలహాలు, సూచనలు కోరారు. ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయని, వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో యేమాత్రం సాఫల్యం చెందామో కాని, ఒక చిన్న సంతృప్తి మాత్రం కలుగుతోంది. ఆదరించి, అహ్వానించిన వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుముందు కూడ ఇలానే ఇదే స్ఫూర్తితో తోడ్పడాలని వేడుకుంటూ, పేరుకే సంకలనకర్తనే కాని యిది అందరి సమిష్టి కృషి అనిమాత్రం చెప్పక తప్పదు. మరొక్కమారు అందరికి నూతన సంవత్సర అభినందనలు తెలియచేసారు.ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించగా, సాహితీ స్రవంతి జిల్లాకార్యదర్శి రౌతు రవి, అతిథులను వేదికపకి అహ్వానించి తన నివేదిక సమర్పించచారు
ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. బాణాల కృష్ణమాచారి, కోటీ శశిశ్రీ, కపిల రాంకుమార్, వురిమళ్ళ సునంద, టి.ఎల్. లక్ష్మీనరసయ్య, డా. పొత్తూరి సుబ్బారావు, డా.కావూరి పాపయ్య శాస్త్రి, డా.కవితాంజనేయులు, మొదలగు వారు సన్మానంపొందిన వారిలోవున్నారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరో పదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిపల్ చైర్ పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు నాయకులు ఎర్రా శ్రీకాంత్, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్, బి.వి.కె. డిప్యూటి జనరల్ మేనేజర్ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు.

పండుగ బలహీనతని రాజకీయ నాయకులు ఎలా అవకాశంగా తీసుకుని సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో, ఆశపడి, బోర్లపడిం సామాన్యుని వేదన తన కవితలో రాంకుమార్, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఒట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా, కాలాన్ని నిర్వ్చిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిసిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ, ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, '' జయాలనిచ్చే ఉషోదయానికై '' అంటూ గేయ రూపంలో ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుమంకున్న ఉగాదే అంటూ చతుర్తలు కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్, కోకొఇల స్వరాలకు బదులు కాకుర స్వరాలు.. పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం కవితతో బూడిద అరుణ గౌడ్, షడ్రుచులతో కృష్ణవేణి, కొత్త ఆశలతో సీతారామారావు, పాడవే కోయిలా గొంతెత్తి యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా.పొత్త్రి సుబ్బారావు, డా. పాపయ్య శాస్త్రి, తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు, పండుగ హడావుడి - హాస్య రూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా - ఎన్నీకలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదిన్నం పేరుతో నైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు. ఇచేఏ పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు , మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహార వచ్చిన వారందరికి పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం.శేషగిరి , కన్నెగంటి వెంకటయ్య, మరియు కళానిలయం బృందం వారు తమ గీతాలాతో అలరించారు.
**
--కపిల రాంకుమార్ 9849535033 (4.4.2014/19-4-2014)

సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క|


కపిల రాంకుమార్ || సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క||

అనునిత్యం పోరుబాట వెన్నుదట్టు అమ్మమాట
ఆశయాల పెనుకోట త్యాగధనుల పూదోట
ఎరుపంటే వెలుగె ఎరుపంటే జయమే
ఎరుపంటే పతాకం విజయానికి సంకేతం

సుందరయ్య ఆచరించి బంధుత్వం కలిపాడు -
కూలిరైతు సంఘాలకు ఒక మార్గం నెరిపాడు

బెదిరే జింకలను కుమిలే జనాలను -
ఆపదల ఆగడాల తట్టుకోను బలమిచ్చి
ప్రశ్నించే తత్వాన్ని కొనసాగే ధైర్యాన్ని -
చీకటిని పారదోలే ఎర్రజెండా మనకిచ్చి

అరకపట్టి చెమెటోద్చే పనివాడిదే పొలమంటూ -
చాకిరిలి సరిపోయే రూకలు పొందాలంటూ
ఆరుగాలపు కష్టాన్నీ బుర్ర మీసం దోచుకునే -
పాతకాల దొరతనం కలకాలం సాగదని

అతివలు అనాథలు బడుగులు బలహీనులు -
హక్కులకై ఉద్యమించ ఎలుగెతే గళమిచ్చి!
కదం కలిపి నడిచేలా ముందువరుస తానుండి -
లాఠీలకు తూటాలకు వెరవులేక ఎదురొడ్డగ

జనం తెరువు కొరకు బతుకు వెలుగు కొరకు -
పొద్దు పొడిచిన సూరీడై ఆదరించు చెలికాడై
సుత్తికొడవలి చుక్కరా దారిచూపు వేగు చుక్కరా! -
వేలు పట్టి నడిపించే కన్నతల్లి చేయిరా!

కపిల రాంకుమార్ - 20.4.2014

Friday, April 11, 2014

ఓటుబద్ధ హెచ్చరిక

కపిల రాంకుమార్|\ ఓటుబద్ధ హెచ్చరిక ||

పార్టీ మారిన నేతకెన్ని కష్టాలో
దుమ్మెత్తిపోసేటప్పుడు జాగ్రతలెన్నో
తీసుకోక పాత పాటే పాడితే
ఓట్లు రాలకపోగా తాటతీసి తన్ని తగలేయగలరు
యింటికి పంపుతారు జనాలు
మారేటప్పుడు వళ్ళు దగ్గరపెట్టకున్నా
ఇప్పుడుమాత్రం జర భద్రం!
సీటు గెలవాలంటే!
**
గుర్తు తప్పు చెప్పినా
అధినాయకుడి పేరు మర్చిపోయినా
ప్రస్తుతాన్ని స్తుతించిక పోయినా
ఏ యెండకా గొడుగు పట్టకున్నా
సమావేశాల్లో, ప్రెస్ మీట్లో నోరు పారేసుకున్నా
జోరువాన పడ్డట్టు
చెప్పులు పడొచ్చు
కుర్చీలు మీద పడొచ్చు
అలో లక్ష్మణా అని
తప్పించుకోలేక
యే సోదరి కోక కట్టుకోక తప్పదు!
ఆకట్టుకోక తప్పదు!
**
ఇన్నాళ్ళు నమ్మిన జనాన్ని
మోసగించడానికి
సిగ్గు తీసి ఇంట్లోపెట్టి
మనస్సాక్షిని హత్యచేసిన రక్తపు చేతితో
రెండు వేళ్ళూపుతూండాలి
అవలక్షణాలన్నీ వంటబట్టకున్నా
మనుగడకే తిప్పలొస్తాయి
మళ్ళీ కొత్త గెంతు వేయాలి !
**
తెలివైన కుందేలు ముతరాసోని వలలో పడ్డట్టు
మతతత్వమంటూ రంకెలేసి
మఠాధిపతుల ఒళ్ళో వాలాలి కదా
కాలు విరగ్గొడతానన్నవాడివి
వాని కాళ్ళకాడికే చేరాలికదా
యేమొ
జనం తెలివితో
ఓటిది కాని ఓటుతో
బలంగా ఓ పోటు పొడిస్తే
కాటుకు తట్టుకోలేకపోతే
గోచి సర్దుకుని గోడ దూకటానికి సిద్ధపడాలి కదా!
**
దాదాపు పార్టీలన్ని
బారులు తెరిచి బార్లా తెరిచి
అహ్వానిస్తాయని యెల్లపుడు కలగనకు!
ఒక్కొక చోట గడీలమించిన
అడ్డుగోడలు లోపలిలి రానీవు
అప్పుడు నీగతి అధోగతి
పేడకళ్ళు, చీపురు దెబ్బలు
తప్పించుకోకలగాలి
మద్దతిచ్చే పర్టీలు
ముద్దకుడుములు పెడతాయనుకోకు
బూడిదలో పన్నిన కుక్క వైరాగ్యంలా
పాతవి గుర్తుకొస్తే
మడత పేచీలు పెట్టి
నీ బతుకు సంకరం చేసి
శంకరగిరిమాన్యాలు పట్టిస్తాయి!
**
పదవే పరమావధికాదు
ప్రజలకొరకు పనిచేయ
నియమబద్ధ, నిబద్ధత కలిగి
నాయకత్వం వహిస్తే చాలు
గౌరవాలు పొందటానికి
అంతే కాని వంకలేనమ్మ డొంకట్టుకు
యేడ్చినట్లు కబుర్లు చెప్పకు!
అజెండాలకు నీళ్ళొదిలి
జెండాలట్టుకు తిరుగకు!
ఇది ఓటుబద్ధ హెచ్చరిక!
**
11.4.2014 సాయంత్రం 5.55