Thursday, February 28, 2013

||వెయ్ దరువెయ్ ||

కపిల రాంకుమార్ ||వెయ్ దరువెయ్ ||

ధనాధన చప్పుడుతో
దండోరా యెయరన్నా
ఓ నా కొమరన్నా
వంత పాడు గేడి ఈరన్నా!

గుండెలోన బండరాళ్ళు - దొరలించె భూసాములకు
రాతి గుండె లదరగా దండోర వెయరన్నా!

మెలితిప్పే మీసాకు కాలమిఖ్మ చెల్లదని
తప్పుడు నాయాళకు తిప్పలింక తప్పవని
యెర్రి జనం గొర్రె జనం తలవుఫి వస్తరనే
బొర్రపెంచు ఆసాముల బుర్రలలదిరిపోయేలా

ధనాధన చప్పుడుతో! దండోరా యెయరన్నా

కులం లేదు భూమికి మతంలేదు గాలికి
పేరు లేదు నీటికి, ఊరులేదు అగ్గికి
పుట్టినోడు గిట్టు వరకు యెన్ని మెట్లు యెక్కినా
సమవాదం అందించే వల్లకాడు పిలుపేనని!

ఓ నా కొమరన్నా! వంత పాడు గేడి ఈరన్నా!

ఆసాముల మోసాలు యిక మీదa కుదరవని
అచ్చరాల బాట పుచ్చయెన్నెలిచ్చిందని
వెలుగులోన కలివిడిగా తిరుగుబాట పట్టేరని
బక్కవాడు యికమీదట ఒక్క తాటి నడిచేరని
దప్పుమోత అదరగొట్టు! మదపు వత్తు వదల్గొట్టు!

ధనాధన చప్పుడుతో దండోరా యెయరన్నా!

....** (యెంతో ఆశ...నెరవేరేదెపుడో!)

28.2.2013.......ఉదయం 5.00

Wednesday, February 27, 2013

|కవి/కవిత్వము : సూక్తులు, హితోక్తులు ||

కపిల రాంకుమార్ ||కవి/కవిత్వము : సూక్తులు, హితోక్తులు ||

1. కవి శ్రమను కవి మాత్రమే చక్కగా తెలుసుకొగలడు ---- నలచంపువు

2. ఓ బ్రహ్మ దేవా! రసికతలేని వా్ఖ్ఖలి కవిత్వం వినిపించే దుస్థితిని మా నుదిటిపై రాయకు! రాయకు! ...........ఆపస్తంభ గృహ్య సూత్రాలు

3.పాండిత్యమున్న కవులే నిజ్మైన కవులు, తక్కిన వారు ఒట్టి కవులు - .........మహాభారతం

4. కవిత్వపు అసలు గుణం నూతన కల్పన, ఆ కల్పన అనూహ్య ఫలితాన్నిస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది, ఆనందాన్నిస్తుంది. -------శామ్యూల్ జాంసన్.

5. సన్నిహితంగా ఉన్న కవి యెంతటి గొప్పవాడైనా అతడిప లోకం ఆదరణ చూపదు .........కావ్య మీమాంస

6.కవి ఓ కోకిల, చీకటిలో పాడుతూ తియ్యని శబ్దాలతో మానవునికి మానసిక ఉల్లాసం కలిగిస్తాడు .........పి.బి.షెల్లీ

7. ప్రేమలో మునిగిన వాడే కవి ....... ప్లేటో

8. ప్రసిద్ధుడైన తాత్వికుడు కానివాడు ఇంతవరకు యెవ్వరూ గొప్ప కవి కాలేదు....... కాలెరిడ్జ్ .

9. దుర్నీతి చివరిగా అంటుకునేది కవికి మాత్రమే ------- ఇటాలియను సామెత

10. పరిణితి చెందిన కవి - అనుకరిస్తాడు. పరిణతి చెందని కవి - చౌర్యంచేస్తాడు. ............టి.ఎస్.ఇలియట్

27-02-2013 ఉ.11.02..>>>>>...మిగతావి రేపు. <<<<<

Tuesday, February 26, 2013

|| మినీలు -2 ||

కపిల రాంకుమార్ || మినీలు -2 ||

పౌరుషం అనేది
రక్తంలోనే వుంటుంది కాని
పప్పుభోజనం గాడనో, ఉప్పు కారం తినడనో
అనుకుంటే యెలా?
హింసను ప్రేరేపిస్తే
రుధిరయాగమౌతుంది
మా రాతలు సంస్కరణలై
మమతల పూదోటౌటలౌతాయ్!

**

మీసాలకి రంగేస్తే మాత్రం
వంటికి లేని హుందా వస్తుందా?
మీ '' సాలు '' వారసత్వమే కదా
అది మోసాలు చేయకుంటుందా!
తాడిని తన్నేవాడుంటే
వాని తలదన్నే వాడుంతాడని
తెలిసి మసలండి !
లేదా మా క్రోధాగ్నిలో మాడి మసవుతారు!
మమ్మల్ని ఉసికొల్పకండి!
ఉశిళ్ళై మాడి చస్తారు.!
నీ చేతిలో నిప్పు
కొంపలు తగలెట్టడానికే కాదు
కుంభం మెక్కడానికీ ఉపయోగమే
పిచ్చోడి చేతిలోని రాయిలా
అది నిన్నే తన్ని తగలేస్తుంది !
నిప్పుతో తల గోక్కుంటే
యెప్పటికైనా అదేనీ
చివరి స్నేహితురాలు!

**

తిరగబడటానికి దమ్ములేక కాదురా
హింస మా మార్గం కాదు కనుక!
అలా అని చేత ' కాని '' లేనివాళ్ళమైనా
'' చేతకాని వాళ్ళం '' కాదు!
చావుని నవ్వుతూ కూడ
కౌగలించుకోగలవాళ్ళం!
నీలా పారిపోయేవాళం కాదురా!
మా మంచితనాన్ని
అలసత్వం అనుకుంటే పొరపడ్డట్టే!
సామ దాన బేధ దండోపాయాలు
మాకు తెలుసు!
ఊరికే పేట్రేగకు - మరీ పేట్రేగితే
ఆవగింజంత పేడు కూడ నీ పుర్రెలో మిగలదు!
మా ధాటికి - ఖబడ్దార్ !
____________
26.2.2013 సా.4.00

Sunday, February 24, 2013

|| భావ మంజరి|| ***

కపిల రాంకమమార్|| భావ మంజరి|| ***

వీణ తీగలు తాకగా - వాణి పలుకును తీయగా
బాణి కూర్చిన పాట -నా రాణి పాడును హాయిగా!

ఇందులోచన బేలవై - కుందుచుంటివి యేలకో
మందహాసిని జేయగా -ముద్దులిడుదును తీయగా!

చాల కాలము వేచినా యేల రావది యేలకో
కాలమన్నది యాగునే జాలి జూపపగ రాగదే!

మంజుభాషిణ్ రాగదే సంజ వేళ యెడందలో
మంజుమాన్విత రాగ -సౌ మంజరీ మధుపమ్ముతో!

మల్లెపూల సుdధమున్ అల్లి తెమ్మర తోడుగా
జల్లినావ సఖీ యెదన్ -మెల్లగా నను జేరగన్.!

ప్రేమతో నిను జేర నా -భామ నీ హృదయమ్ములో
ప్రేమగా నివసింతునో -లేమ నన్ను తరింపవే!్

రాగ జీవన యాత్రలో - భోగ జీవిత భాగమున్
వేగ బొందగ రాగదే నా దరిన్ చెలీ శీఘ్రమున్!

వచ్చినావ సఖీ ప్రియా, తెచ్చితే యనురాగమున్,
మెచ్చి యిచ్చిన రాగమే పుచ్చుకొందు మనోజ్ఞతన్.

పాలుకారెడు బుగ్గతో క్రాలుగంటి సఖీ
కాలయాపనమేలకో పాలుపంచుకొనంగరా!

ఏరి కోరితి నిన్ను నా -తారవీవు సఖీ ప్రియా
దారగా నినుజేయు నీ- తారి నీ సఖుడే సుమీ!

నీవు నా ప్రియురాలవే - భావి జీవిత నావ - పో
బోవుచున్నది దూర తీ రావలోకన చేయగా!

చాటులేకను రమ్ము-యే లోటు చేయక జూచెదన్!
మాటదప్పననివాడ - మో మాట్మేల - సరస్వతీ!

సాహితీ మధురామృతిన్, స్వాహ జేయగ వచ్చితిన్!
ఊహకందని భావమున్- ఓహటిల్ల వచింపగాన్!

తామమాంగిని జూడ నా-లో మదీయ మనోజ్ఞతా
రామమందు సుసాహితీ -ధూమ రేఖలు పొంగెనో!

పూవులోని మరందమున్- ద్రావి తుమ్మెద జుమ్మనెన్!
నావికా విభువోలే యీ - త్రోవజూపె కవీతకున్!

24.2.2013 ఉ. 5.21
(వాస్తవ రచన కాలం 1968 ఉగాది)***

Saturday, February 23, 2013

|| వీల్ చైర్ టు - గోని సంచి ||

కపిల రాంకుమార్ || వీల్ చైర్ టు - గోని సంచి ||

ఇప్పుడే అందిన వార్త
మొబైల్ లో
మా ఫ్రెండ్ బాంబు దాడికి
ఆపరేషను జరిగి గురై వీల్ చైర్లో
అర్జంటు కబురొస్తే
పోస్ట్ మార్టం గదికి,
చని చూస్తే
గోనిసంచిలో తన సగ భాగం
గుర్తు పట్టలేని మాంసం ముద్ద
ముద్దుగా అరగంట క్రితం
కొన్న గోల్డ్ వాచీ
గుర్తు పట్టీందట నేనూ ఆంటూ!

23.2.2013 సా 4.30

Friday, February 22, 2013

|| కలానికే రక్తపు పోటు||

కపిల రాంకుమార్ || కలానికే రక్తపు పోటు||

దారుణ మారణ కాండ
భాగ్యనగర నడిబొడ్డున
విధ్వంసం
అందరూ ఖండించే వాళ్ళే
ఇంకొక పక్క
ఓకరి మీద ఓకరు
దుమ్మెత్తిపోసే వాళ్ళే
దొంగలే .. దొంగాదొంగా అన్నచందాలు!
ప్రపంచ పకృతిలో మార్పులు సైతం
కనిపేట్టి హెచ్చరికలు చేసే
డేగ కళ్ళకు
దుర్మార్గుల అంతరంగాల
కుతంత్రాల పసిగట్టే
రోజెపుడో! నేర్పెపుడో!

కళింగ యుద్ధ భీభత్సానికి
అశోకునికి వైరాగ్యమొచ్చి
భౌద్ధం స్వీకరించాడు అది అతని
సంస్కారం!

ఉగ్ర వాదులకు మాత్రం పరివర్తన
రాదు...రాదు.

నిఘాలోపం స్పష్టంగా కనబడుతోంది
మృతుల,క్షత గాత్రుల లెక్కింపులో్
పత్రికకు పత్రికకూ
మీడియ మీడియాకు
పొసగని గణాంకాలు
సర్కారు గణితాలు మరొకతీరు

పుకార్లకి సికారు చేసే అలవాటెక్కువ
ప్రజలు జాగ్రత వహించపోతే
సంయమనం పాటించకపోతే
పునరావృత మయ్యే ప్రమాదాలు లేక పోలేదు

సమయానికి రాని రక్షక భటులు
అత్యవసర వైద్య సేవల నిర్లక్ష్యాలు
శవాలనమ్ముకునే వారికి
సవాలు చేసే వారెవరూ లేక
పెచ్చుమీరుతున్న స్వార్థ పరత్వం

రాజకీయ పబ్బం గడుపునే
ఆరంగేట్రం మరో యెత్తుగడలకు
సన్నద్ధం కాకముందే
మరెంత మనసులుం మానవత్వం
మసి కానుందో...భూతద్దాలతో వెతుకుదాం
దొరికితే ఉతికి ఆరేద్దాం!

మానవత్వం తో రక్త దానం చేసే వారు
అనాథలైన పిల్లలను ఆదుకునేవారు
పోషించే దిక్కు కోల్పోయినావరికి చేయూతనిచ్చేవారు
చెదిరిన మదిని ఒదార్చేవారు
తమ పరిథిలో ఆపన్న హస్తాలివ్వటమే!
.....
యేదో ఇంకా రాయాలనివున్నా
అక్షరాలు విలపిస్తుంటె
పదాలు ముందుకు కదలలేనంటుంటే
ఈ నాలుగు మాటలు రాయటానికి
కూడ మొరాయిస్తున్న చేతి వేళ్ళను
సముదాయించలేని
నిస్సహాయతతో.........నా కలానికి రక్తపు పోటొచ్చింది!
కాస్త మౌనం మనసుకు స్వాంతనం కావాలి

22.2.2013 ఉ. 5.45

Thursday, February 21, 2013

|| జ్ఞాపకాల యాది -5||

కపిల రాంకుమార్ || జ్ఞాపకాల యాది -5||
యెవరునమ్మినా, నమ్మక పోయినా
గత స్మృతుల యవనికలో దాగున్న
చిన్న రహస్యం, నా అక్షరాల
దూకుడుకు నేపథ్యం
యెన్నో మలుపులు తిరిగింది!
పదో తరగతి అర్థంతరంగా మానేసి
ప్రైవేటు చదువుల ప్రస్థానం
మెట్రిక్ నుండి స్నాతకోత్తర విద్య వరకు
కాలేజి తెలియదు, రాగింగ్ తెలియదు,
మార్క్స్ ని చదవాల్సి రావడం వల్ల
ప్రైవేటుగా వెలగపెడ్తున్న
ఎం.ఏ (తెలుగు) చదువు
కుంటుపడింది
ప్రీవియస్ సీరియస్ గా చదవలేదు
మార్కులు తక్కువే వచ్చాయి!
చందోవ్యాకరణాలు సందు
యివ్వని కారణంగా వెనకబడినా
ఫైనల్ పరీక్ష నా వెనుక బడింది
చాల యిష్టంగా నాటకాలాడటం చేతనో,
చిన్నప్పుడు తాతయ్యగారి వద్ద
తెల్గు శతక పద్యాలు వల్లెవేయటం వల్లనో,
పల్లెటుర్లో రాత్రుళ్ళు
మాయింటివద్ద
గ్రామీణులు చిరుతల రామాయణం
ఆడటంవల్లనో,
ఐచ్చిక ఆంశాలైన
నాటకాలు, శతకాలు, జానపదగేయాల
పత్రాలలో తొంభై సగటు మార్కులు వచ్చీ
ప్రీవియస్ కు తోడు యివ్వక పోగా
తదుపరి కొనసాగింపు కై యేమాత్రం
నన్ను ఆదుకోలేకపోయాయి!
అనే కోపం యిప్పటికీ తగ్గలేదు!
ఐనా తెలుగులో పట్టు నాకు వుంది అని
అనుకుంటే కేవలం చిన్నప్పటి
తాతగారి ఉద్బోధలే కారణం పునాది!
చందస్సు వంటపట్టకపోయినా
ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠపు సహచరుల్లో
కొంపెల్ల రామకృష్ణ వాడే
మాత్రా చందస్సు ఆకర్షించింది!
రేగడిమిల్లి సత్యమూర్తి వచ కవిత్వ ధోరణి
మరో ప్రేరణనిచ్చింది!
వచనంలోనూ మాత్రల పోకడలు
అందుకే కనబడతాయి
కేవలం సరదాగా చదివిన
చాత్ర స్నాతక విద్య
కూడ దూరవిద్యే అయింది,
అందుకు మాత్రం కాంటాక్ట్ క్లాసులు విజయవాడలొ
సెవెంత్ ఎడ్వెంచర్ స్కూల్ వేదికయ్యింది!
85 శాతం యువకుల మధ్య ఆ 15 శాతం పెద్దవాళ్ళ లో నేను.
***
ఇంతకీ యీ సోదెందుకంటే
గత నెలలో (జనవరి31 న)
నా చిన్నప్పటి అక్షరాభ్యాసపు చాయాచిత్రం
(నలుపు-తెలుపు) కంటపడింది,
కాని శిధిలావస్థలో యెవరెవరున్నరో గుర్త్రుపట్టలేనంతగా!
అది మదరాసులో 1957 లో తీసినది,
నాకు తెలిసిన వారి చిరునామా
అందిపుచ్చుకుని ఫోనుచేసి
మరీ వివరం రాబట్టాను
చిక్కుముడి వీడింది
ఇద్దరు ఉద్దండులు నా చేత పలకను
అక్షీకరింపచేస్సారట!
ఒకరు రెండు శ్రీల కళ్ళజోడు *
మరొకరు ఇది మల్లెలవేళయని ముందే కూసిన కోయిల **
పట్టరాని ఆనందం
లోకం బాధ
తన బాధ చేసుకొన్న దొకరు
తన బాధను
లోకానికే బాధను చేసిన మరియొకరు!
అందుకే నవ్య నవనీత సమానమైన
పదాల కూర్పుతో పాటు
దారుణాఖండల శస్త్రతుల్యమైన
తీక్షణ విప్లవ భావాలు
సమాంతర కవిత్వాని ప్రేరణై
నన్నిలా నిలబెట్టాయి
తలచుకుంటేనే చెప్పలేని
అనుభూతి నా కంట చెమ్మగా
....కేవలమిప్పుడు ఒక
జ్ఞాపకాల యాదిగా మిగిలింది!

21.2.2013 రాత్రి 7.40
________________
* శ్రీశ్రీ
** దేవులపల్లి
( మా నాన్నగారికి గరికిపాటి రాజారావు, గూడవల్లి రామబ్రహ్మం స్నేహితులు
పుట్టిల్లు సినిమా తీసేటప్పుడు వారితో పనిచే్సారు. మద్రాసులో వుండగా మా యింటికి వింజమూరి లక్ష్మి, సీత, దేవులపల్లి వారితో వస్తూండే వారు. మా మేనత్త సుభద్ర బర్త గారైన వేమరాజు భానుమూర్తి ( అప్పట్లో ఆంధ్ర ప్రభలో చేస్తూవుండేవారు....మామయ్య తరువాత ఢిల్లీ సమాచార పౌర సంబాధాల శాఖ్కు వెళ్ళారు ,పంజాబి బాషనుంది తెలుగు అనువాదాలు చే్సారు.కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద రచనలకు బహుమతి పొందిన వారిలో ఒకరు) పక్కపక్కనే వూండేవారం కాబట్టి వస్తూవూండే వారు. అదీ ఫ్లాష్ బాక్ )

| ఎల్లోరా కవిత: చెమట బిందువు ||**


కపిల రాంకుమార్ || ఎల్లోరా కవిత: చెమట బిందువు ||**
కవితా మంజీర ధ్వని తరంగాల మీద
పయననిస్తా రేపటి ఉదయార్క్
ప్రభాసదస్సుకు!
కవిగా వినిపిస్తా వెన్నెల తామ్రపత్ర
శాసనాన్ని ప్రతి హృదయానికీ
అమృత భావనా ప్రబోధాన్ని!
చీకటి దెయ్యాలకు
రాజకీయ కయ్యాలకు
మరణ శాసనం విరచిస్తా!
వెలుగురథం మీద
తెలుగు జాతిని
యెక్కించుకుని ప్రగతి ప్రస్థానం సాగిస్తా!
విశ్వ మానవ సహృద్య సంకేతంగా
చెమట బిందువులలోంచి ఆత్మ శక్తిని రగిలించి
రక్తపు చుక్కలలోంచి
సమతా గీతం వినిపిస్తా!
21.2.2013 ఉ. 4.54
_________________________________________

Wednesday, February 20, 2013

| ఉగ్రవాద ఫలితాలింతేనా?

కపిల రాంకుమార్ || ఉగ్రవాద ఫలితాలింతేనా? ||

సర్వ జనుల సుఖముకోరి - వేదం ఘోషించినా
హాలికుల స్వేదంతో - నేల పునీతమైనా
సైనికుల రుధిరంతో - సరిహద్దులు సరిద్దినా

నిర్మాణం కుంటుపడె
నిర్వాకం తగులబడె
నిర్యాణం వెంట తరుమ
నిష్క్రమించు తీరమై
ప్రజాస్వామ్య వృక్షానికి
చీడపురుగు మాదిరిగ
పెద్దలను హతమార్చె
పిదప బుద్ధి హెచ్చినది!

హింసవీడి దారి మార్చి
నేటికైన కళ్ళుతెరచి
జనజీవన మార్గానికి
మనిషిలాగ మారండి!

ఎందుకంటె........

ఎదలు కరిగి గిరులు కూలె
మతులు చెదరి మందగించె !
అవీదన ఆక్రందన
యెల్లెడల వ్యాపించె !
సర్వజనుల మనసు నలిగి
దీనంగా విలపించె !

రక్తంతో స్నానమాడు - ఉగ్రవాద రాచక్రీడ
కత్తులతో రాజ్యమేల యింత కన్న దారిలేదా?
ఈ మాదిరి హత్యలతో యేలాభం పొందుతారు?
దొంగచాటు దెబ్బలతో పొందలేరు అధికారం!

పావురాల నట్యాలను ఈర్ష్యతోన త్రుంచుటేల?
పావులుగా మారిపోయి విధ్వంసం చేయనేల?
నేల విడిచి సాములా నేతల తల తెంచనేల?
తలపులు మార్చకుండ తలుపులు మూయుటేల!

నలుగురిలో కలువలేక - నలుగురిని కలుపలేక
పిరికితనపు చేష్టలతో - హతమార్చె రాచక్రీడ
గెలువబోదు యేనాడు - కలకాలం మనబోదు!

అందుకే......

స్వేచ్చగాను పావురాలు గగనంలో విహరింప
స్వచ్చమైన ప్రకృతికి నాందిపలుక కదలండి!
ఈ కత్తులు వదలండి - తుత్తునియలు కాకుండ
ఆ కక్షలు మానండి - శాంతి బాట నడవండి!

20.2.2013 మధ్యాహ్నం: 12.26

Tuesday, February 19, 2013

గజల్ స్థితిగతులపై కొత్త చూపు

గజల్ స్థితిగతులపై కొత్త చూపు
ఆయా పరిస్థితులూ, బతుకు తీరులో పాటించే విలువలలో అమరిపోయిన ఏ సంప్రదాయమైనా, కళా విషయమయినా రూపు మాసిపోవడం సాధ్యం కాని పని. ఇతరేతర శక్తుల దాడికి గురైనా పరిస్థితుల ప్రాబల్యానికి అణగారిపోయినా వెనుక తట్టు పడిపోవచ్చు. సరైనా స్థితిగతులు రాజుకుంటే తిరిగి మొగ్గ తొడగడం ఖాయం. కళారూపమేదయినా భౌతిక పరిస్థితులలో తగిన ప్రతిపాదిక, జీవితానికి సం బంధం ఉంటే దాని మునుగడ ఎల్లవేళలా ఉంటుంది. కాకపోతే రూపం మారవచ్చు. పోవడిలో మార్పులు చేర్పులు కొనసాగవచ్చు. ఇటీవల హైదరాబాదు నగరంలో పుంజుకున్న ఉర్దూ నాటకం, ముషయిరా, హిందుస్తానీ సంగీత కచేరీలు ఈ పరిణామ క్రమాన్నే సూచిస్తున్నవి. మొగలాయిల పాలనలో ఎన్ని అవాంఛనీయ పోకడలయినా పుట్టవచ్చు. ఆ రాజవంశం పాలన ఫలితం వల్లే భారతదేశానికి గాలీబు వంటి కవితో పాటు ఉర్దూ భాష, తాజ్ మహల్ సంక్రమించాయన్నది ఒక విశ్లేషణ. హైదరాబాదుకు చెందిన నిజాములైనా, ఢిల్లీ రాజులైనా మొగల్ రాజవంశానికి చెందినవాళ్లే. కనుక అది వాస్తవం కావచ్చు. ఉర్దూ సాహిత్యం గజల్ ప్రక్రియ, ముషయిరా సంప్రదాయాల పుట్టుక, వికాసం హైదరాబాదు కేంద్రంగా జరిగింది. ఢిల్లీ చేరుకుని దశదిశలా వ్యాప్తి చెందింది. ఈ వాస్తవాన్ని ఉత్తరాది ఉర్దూ సాహిత్యకారులు దాటవేస్తుంటారు. ఉంటే ప్రస్తావన మాత్రంగా ఉంటుంది. లక్నో సాహిత్య సంస్కక్షుతులపై ప్రామాణిక గ్రంథాన్ని వెలువరించిన ఉర్దూ చరివూతకారుడు శరార్ నుంచి అకాడమీ ప్రచురణ వరకు ఇదే తంతు. ఈ పుస్తకం ఆ లెక్కలోకి చేరదు. చివరి మొగలాయి ప్రభువు బహుదుర్ షా జఫర్ కాలం నాటి ముషయిరా సంప్రదాయం గురించి దాని లోతుపాతులు, నియమావళి గురించిన రచన ఇది. ఉత్తరాది వారి చరిత్ర రచనా పద్దతులను అధిగమించిన ఆ రచయిత పేరు మిర్జా ఫర్హాతుల్లా బేగ్. ఉర్దూ భాష వికాసంలో హైదరాబాదు పాత్రను పట్టిచ్చుకున్న పుస్తకమిది. ‘పేరు ది లాస్ట్ ముషయిరా ఆఫ్ ఢిల్లీ’.

మొగలాయిల పాలన ఫలితంగా ఉర్దూ భారతదేశానికి సంక్రమించిందన్నది తెలిసిందే. అటువంటి కళాత్మక భాష అయిన ఉర్దూకు, గజల్ ప్ర క్రియ, ముషయిరాల మధ్య గల అంతర్గత, అంతరంగ సంబంధాన్ని అంతే కళాత్మకంగా విశదం చేసే గ్రంథరాజమిది. ఆంగ్లంలో సైతం సొంతరచన వలె కనిపించే ఈ పుస్తకం ఉర్దూ ప్రపంచంలో ప్రామాణిక రచనగా ఉన్నత స్థానం పొందిందని అనువాదకి ఆఖ్తర్ ఖంబర్ అంటారు. రచయిత ఉర్దూ వచన శైలి తనను ఆకట్టుకోవడం వల్లె తాను తర్జుమా కు ఉపక్షికమించినట్టు ఆమె చెబుతారు. ఈ రచన చేయడంలో ప్రేరణ మౌల్వీ కరీం ఉద్దీన్, ఆయన రచన తబ్‌ఖత్- ఉల్- షోరాబు- హింద్ అనే గ్రంథం. 1845 లో ఢిల్లీ దర్బారులో జరిగిన ముషయిరా విశేషాలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. అది చదివిన బేగ్ సాబ్‌కు గజల్, ముషయిరా సంప్రదాయాలను రచన రూపేణా పదిలం చేయాలన్న ఆలోచన తట్టింది. ఇందుకు ‘ఆత్మకత’ రీతిలో రచన చేస్తూ ఉర్దూ భాషావికాసం, గజల్ పుట్టుక, మొగల్ దర్బారు గురించి పరిచయం చేశారు. ఈ క్రమంలో హైదరాబాదు పాత్ర గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో పాత్రదారి రచయిత కాదు. తాను ఎవరి నుంచయితే ప్రేరణ పొందారో ఆ రచయితే పాత్రదారి. అతని పేరు కరీముద్దీన్. కథనమంతా స్వగతం వలె ఉండడంతో ఈ పుస్తకం చదివిన పాఠకులకు తాము ముషయిరాలో పాల్గొన్న అనుభూతి కలుగుతుంది. ఉర్దూ రాకపోయినా గజల్‌ను అర్థం చేసుకోగల్గిన ఆంగ్ల పాఠకులకు ఈ పుస్తకం సరికొత్త సాహితీ కళా ప్రపంచాన్ని పరిచయం కావడం ఖాయం. ఢిల్లీ పతనాన్ని ముషయిరా ముగింపును షమ్మా (దీపపు చెమ్మ) ఆరిపోవడంతో రచయిత సూచిస్తారు. ఇట్లా చెప్పడంలో రాజరికపు, దర్బారు సంప్రదాయాలకు కాలం చెల్లిందని రచయిత భావమని అనువాదకి అంటారు. నిజానికి గజల్ గానంతో వెలిగిన షమ్మా 1857లోనే కాదు, ఆతర్వాత వెలుగుతూ ఆరిపోతూనే ఉంది. ఈ పుస్తకానికి ప్రేరణ అయిన భూమిక 1845, 1848 (పోలీసు యాక్షన్),1979, 2010 వంటి సాంవత్సరిక సందర్బాలు కూడా గజల్, ముషయిరా వంటి కళా ప్రక్రియల ఉత్తాన, పతనాలను సూచిస్తాయి.

1979 నే తీసుకుందాం. దేశ విదేశాలలో ప్రసిద్ధి గాంచిన హైదరాబాదు ముషయిరా ఈ కాలంలోనే ఆగి పోయింది. స్థాపకుడు శంకర్‌జీ. ఆయనే నుమాయిష్ (ఎగ్జిబిషన్ సొసైటీ) స్థాపకుడు కూడ. నిజాం కాలంలోనే ప్రారంభించారు. ఆయన పేరుతో కూడ ఈ కవితా జాతర పేరు గాంచింది. మొత్తం భారత ఉపఖండంలో అంటే ‘పార్టీషన్’ కు ముందు అటు తర్వాత ఉర్దూ భాషా ప్రియులు ఎంతగానో మక్కువ చూపే కవుల కలయిక ఇది. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నుంచి పేరెల్లిన ప్రగతిశీల కవి ఫైజ్ వరకు, సరోజినీ నాయుడు నుంచి కాళోజి, దాశరథి, దేవులపల్లి రామానుజరావు, దాశరథి రంగాచార్య వరకు, సి. నారాయణడ్డి, సామల సదాశివ వంటి ఈనాటి ప్రముఖులు ఆ సభపై ఆసీనులై, కవితాగానం చేసినవాళ్లో, ప్రేక్షకులుగా పాల్గొన్న వాళ్లో అయి ఉంటారు. ఈ ముషయిరాలో అత్యంత ఆకర్షణ శక్తి గల వ్యక్తి షాయర్-ఏ - ఇంక్విలాబ్ మఖ్దూం సాబ్. అటువంటి మానవీయ కళాసంవూపదాయం 1978లో మతం పేర జరిగిన మారణహోమానికి అణగారిపోయింది. పెద్దలు దేవులపల్లి రామానుజరావు, దాశరథి వంటి వారు ఈ ముషయిరా గురించి రాసి ఉన్నారు. సరిగా అదే ఏడు ‘దిల్లీకా ఆఖరి షమా’పేరుతో ఉర్దూ సాహిత్య ప్రపంచంలో పేరు గాంచిన ఈ గ్రంథం ఆంగ్ల తర్జుమా వచ్చింది. అదే హైదరాబాదు నుంచి వెలువడడం మరో వైచిత్రి. రచయిత కూడా ఇక్కడి నివాసే. 1978 వరకు నిర్విరామంగా కొన్ని దశాబ్దాలుగా నడిచిన ఈ ముషయిరా గురించి ఈయాళ్ల కూడా చెప్పుకునే వాళ్లు అనేకం ఉన్నారు. సరిగా మూడు దశకాల కిందట అచ్చయిన ఈ పుస్తకం ఎన్నెన్ని ప్రభావాలు నెరిపిందో తెలియదు. ఎటువంటి ఆలోచనలకు పాదులు వేసిందో అందాజలేదు. కానైతే 2010లో వెలువడినప్పటికీ హైదరాబాదులో స్థితిగతులు మారిపోయాయి. 1979లో ఆరిపోయిన ముషయిరా సంప్రదాయం తిరిగి గత రెండు మూడేళ్ల నుంచి ఊపిరి పోసుకుంది.

గత ఏడాది ఒక వెయ్యి మంది సమక్షంలో అదే నుమాయిష్ హాలులో జరిగింది. మొత్తానికి 1979 నుంచి 2010 వరకు స్థానికంగా ఈ పట్టణపు జన జీవితంలో ఉర్దూ సాహితీ లోకంలో అనేక విపరీతాలు వచ్చిపడ్డాయి. స్వతంత్ర భారతావనిలో 1978 రాజకీయంగా కీలకమయినదే. ఇది చాలా మంది మేధావులు గుర్తించిన అంశమే. మతం, ప్రాంతం, కులం వంటి సామాజికాంశాలు రంగు మారి రంగం మీదికి వచ్చిన గడియ కూడ అదే. అవే అనేక రూపాల వైరుధ్యాలుగా మామూలు జనం జిందగీలోకి చొరబడ్డ కాలం కూడ అదే. మామూలు రీతి, రివాజులను అతలాకుతలం చేసిన గడియ అది. మతం పేరుతో బీజేపీ, భాష పేరుతో టీడీపీ రాజకీయ రంగపు అధికార పీటం పైకి వచ్చిన పూర్వరంగం కూడా అదే. ఇక అప్పటి నుంచి నాలుగైదు ఏళ్ల మునుపు వరకు హైదరాబాదు స్థానిక సంప్రదాయాలు, విలువలన్నీ తీవ్రమయిన నిర్లక్ష్యానికి, ఉపేక్షకు గురై కోస్తా పాలక వర్గాల ఆధిపత్యపు విధానాలకు అణగారిపోయాయి. ప్రభుత్వమే రహస్య ఎజెండాతో పనిచేస్తూ.. హైదరాబాదుతో సహా తెలంగాణ భాషా సంస్కక్షుతులను మట్టుపెట్టడానికి పూనుకుంది. వాటికి కొనసాగింపే ‘హైదరాబాద్ నగరం మాదే అన్న’ వాదన. తెలంగాణ సాహితీ సమరం ముందుకు తెచ్చిన అనేక చర్చల నేపథ్యంలో ఈ పుస్తకం ‘ది లాస్ట్ ముషయిరా’ వెలువడడం ఒక మ లుపు గానే చెప్పవచ్చు. ఈ ప్రచురణల కాలంలోనే తెలంగాణ లో మరో విపరీతం జరిగింది. శతాబ్దాలుగా ఉర్దూ భాషను తమదిగా చేసుకుని ప్రేమించిన స్థానికులు మరో చాపల్యానికి గురయ్యారు. దానిని పరాయిదిగా భావించి ముస్లింలకు, వారి మతానికి చెందినదిగా భావించడం మొదలు పెట్టారు. అదేరకంగా వారు కూడ ఆ భాష తమదేనన్న దురాలోచనలోకి పడిపోయారు. ఈ తరహా పోకడల వల్ల పెద్దలు, కాళోజి, సదాశివ వంటి వారు ఎంతగానో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే బేగ్‌సాబ్ రచనలో చానా ప్రజాస్వామిక వైఖరి కనబరిచారు. ఉర్దూ రచనా సంప్రదాయాలు, కళారీతుల వికాసానికి దక్కన్‌లో జరిగిన వృద్ధిని బాగా చెప్పుకొచ్చారు. ఇందుకు బేగ్‌సాబ్ ఢిల్లీలో పుట్టి హైదరాబాదులో ఉండవల్సిరావడం కావచ్చు. ఉర్దూ, గజల్, హిందూస్తానీ సంగీతం వికాసంలో హైదరాబాదు పాత్ర గురించి వారికి తెలిసింది కొంతే. ఉత్తరాది వారికి తెలిసిందల్లా తొలి దివాస్ (సంకలనం)ను ముద్రించిన కులీకుతుబ్‌షా మొదటి వచన గ్రంథాన్ని ప్రచురించిన వలీ దక్కనీ, ప్రగతిశీల కవి మఖ్దూం మాత్రమే. మొత్తం ఉప ఖండంలో ప్రసిద్ధి గాంచిన రెండు ఆంగ,్ల ఉర్దూ సాహిత్య చరివూతలలో ఒకటి హైదరాబాదు నుంచి వెలువడిన విషయం వారు తాపీగా విస్మరిస్తుంటారు. కానీ ఈ రచయిత ఆ తీరుకు తావు లేకుండా చేశారు.

ముఖ్యంగా హైదరాబాదు, ఢిల్లీ వంటి రాచనగరాలలో గజల్, ముషయిరా,మర్సియా లాంటి ప్రక్రియలు, వాటిని పెంచి పోషించిన దర్బారు, రీతి రివాజుల గురించి చెప్పే గ్రంథమే కావచ్చు. సాంతం చారివూతక చూపు ప్రతిఫలించిన రచన ఇది. అయితే విధించుకున్న పరిమితి 1857 వరకే కావడం వల్ల అప్పటి లోకపు స్థితిగతులకే ఇందులో పెద్దపీట దొరికింది. హైదరాబాదు, ఢిల్లీ అటు తరువాత రాంపూర్, అవద్ సంస్థానాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రచన ఇది. అనాటి ప్రతిఫలనాల సారాంశాన్ని పట్టుకోవడంలో రచయిత విజయం సాధించారు. అట్ట చివర చెప్పినట్టు ఉర్దూ భాషా, సాహిత్య పరిణామాలను సముచితరీతిలో విశ్లేషించారు. మొత్తంగా చూస్తే ఈ గ్రంథం ఉర్దూ భాష, గజల్, ముషయిరాల చరిత్ర కూడ. విస్తక్షుతమైన చదువరి కావడం వల్ల రచకుడు తనదైన స్వతంత్ర వైఖరి తీసుకోవడం వల్ల రచన సాంతం ఉర్దూ గుబాళింపులను ప్రతిఫలించింది. ఒక కవితా ప్రక్రియగా గజల్ క్రమ వికాసాలకు భూమికయిన మూడు రీతులను ప్రతిపాదించారు. ఒకటి దక్కన్, రెండవది ఢిల్లీ, మూడవది లక్నో. గజల్ ప్రక్రియ వికాసంలో దక్కన్ తండ్లాటకు ఆయన ప్రథమ స్థానం ఇచ్చారు. పైగా దాని స్వభావాన్ని నిర్ధారించి ఢిల్లీ, లక్నో రీతులకంటే ఎంతటి విశిష్టమయిందో తేల్చి చెప్పారు. దక్కన్ అంటే ప్రధానంగా హైదరాబాదు నగరంలో పుట్టిన గజల్ ఉర్దూ కవివూబహ్మా వలీదక్కనీ వల్ల ఢిల్లీకి చేరుకుని ఏ రకంగా బలోపేతమయిందో ఈ రచయిత విశదీకరించారు. సాధారణంగా ఉర్దూ సాహితీ ప్రక్రియలే కాదు మొగలాయిల పేరుతో,దక్కన్ పేరుతో చెలామణిలో ఉన్న ఏ ప్రక్రియ అయి నా పశ్చిమాసియాలో అరబీ, పార్శీ సంపర్కంతో పుట్టిందనీ ఉత్తరాది చరివూతకారులు రాయడం పరిపాటి. బేగ్ సాబ్ ఈ వైఖరిని కాదన కున్నా స్థానికతకు సరైన తావే ఇచ్చారు. నిజానికి భారతీయ వలస చరివూతలో దక్కన్‌ను, ఆదివాసీలను విస్మరించడం మామూలే. ఈ రచయిత అందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. కొంత ప్రజాస్వామిక వైఖరి కనబరుస్తారు. పరస్పరం పర్షియన్, అరబీ వంటి భాషా రీతుల ప్రమేయంతో గజల్ ఏమేరకు పుష్టిని పొందిందో చెబుతారు. గజల్ రచనకు అద్యు డుగా అమీర్ ఖుస్రూను చెప్పడం కూడ ఉంది. పార్శీ, ఉర్దూ, తెలుగు భాషలలో ప్రగాఢమైన పట్టుగల డా.సామల సదాశివ వంటి సాహితీవేత్తలు, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ఔత్సాహిక గజల్ ప్రి యులు ఈ వాదనను అంగీకరించరు. ‘గజల్ మినార్లు గోల్కొం డలో లేచాయి’అని అంటారు శేషేంద్ర శర్మ. అందులో కొంత వాస్త వం కూడా ఉంది. కులీకుతుబ్ షా ఉర్దూ దివాస్ ప్రచురించే వరకు గజల్ అనే మాట ప్రచారంలో లేదు. పశ్చిమాసియాలో అరబీ, పార్శీ భాషా సాహిత్యాల ప్రభావంతో పుట్టింది రుబాయత్ అని అమీర్ ఖుస్రూ రాసింది దోహాలనీ, దక్కన్ స్థానిక కవితా, సంగీత, సంప్రదాయాల ప్రభావంతో కులీ రచన వల్ల గజల్ రూపుదిద్దుకుందనీ వాదన ఉంది.

ఈ వాదనల జోలికి పోకుండా హిందూస్తాన్ కళా సంప్రదాయాల ప్రభావం అరబీ, పర్షియన్ భాషా సాహిత్యాలపై ఉందని అదేవిధంగా వాటి ప్రభావం ఉర్దూ భాషా సాహిత్యాలపై పడిందనీ రచయిత చెబుతారు. ఈ తరహా ఆలోచనతో ఎవరైనా అంగీకరిస్తారు. ఇదొక ప్రజాస్వామిక అవగాహన. ఇప్పటికీ గజల్ దక్కన్‌లో పుట్టిన కవితా విశేషమన్న అంశాన్ని ఉత్తరాది ఉర్దూ రచయితలు ససేమిరా ఒప్పుకోరు.దక్కన్, ఉత్తరాది ఉర్దూ సాహిత్య కవితా సంప్రదాయాలపై గాఢ పరిచయమున్న బేగ్‌సాబ్ తటస్థమయిన, ప్రజాస్వామికమైన వైఖరి తీసుకోవడం విశేషం. దక్కన్‌లో ముస్లిం రాజవంశాల ప్ర భావాన్ని పరిగణలోకి తీసుకుంటే ఉర్దూ సాహిత్య చరివూతకారుల ఢిల్లీ కేంద్రిత వైఖరి కొంతైనా తగ్గి ఉండేది. బేగ్‌సాబ్ ఢిల్లీ లో జరిగిన ఒక ముషయిరా ఆధారంగా ఈ రచన చేసినప్పటికీ చరిత్రకు సంబంధించినంత వరకు వాస్తవికమయిన వైఖరి తీసుకున్నారు. ఢిల్లీ పెత్తనాన్ని పక్కన పెట్టేశారు. ముషయిరా అనేది ఉర్దూ కవితా సంప్రదాయాలకు, సంబంధించినంత వరకు కవి సమ్మేళనమో, కవి సభోకాదు. అదొక కళావిన్యాసం. ఇది కేవలం ఉర్దూ బాషా సాహిత్యాలకే పరిమితం. దీనినొక విశేషంగా కూడ భావించక్కరలేదు. ప్రతి రచనా సంప్రదాయంలో ఈ తరహా అనేక సంప్రదాయాలు కనిపిస్తాయి. ముషయిరా నిర్వహణకు సంబంధించిన నియమాలు, సంప్రదాయాలపై ఈ పుస్తకంలో వివరమయిన చర్చ ఉంది. ఉర్దూ చదవరాని పాఠకులకు ‘ద ముషయిరా’ పేరుతో ఉన్న భాగం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సారాంశంలో ఒక కళా విశేషంపై చర్చ అన్నమాట. ఒక కళ నిర్వహణా తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చిత్రించడం ఈ రచనా విశేషం. ఈ పుస్తకం మొత్తంలో ప్రధానమయిన భాగమిదే. గజల్‌కు ముషయిరా శరీరం వంటిది. ఈ రెండింటిలో దేన్నించి దేనిని విడదీసినా మొత్తం ప్రక్రియ నిర్జీవమే. అయితే రచయిత వీటికి ఆత్మవంటిదయిన హిందూస్తానీ సంగీతాన్ని విస్మరించారు. గజల్, ముషయిరా, గాత్ర, వాయిద్య సంగీతం కలయిక వల్లే ప్రక్రియ మొత్తంగా అర్థవంతమౌతుంది. ఒకప్పుడు 1960 వరకు హైదరాబాదు నగరంలో గజల్ గానా బజనాలో రాత్రిళ్లు రాజుకునేవని స్థానిక పెద్దలు చెబుతారు.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడి హైదరాబాదు నగరం సీమాంధ్ర క్యాస్టిస్టు, ప్యూడలిస్టు పోలీసు అధికారుల చేతులలోకి వెళ్లడంతో వారి దాష్టికాల వల్ల ఆ సంప్రదాయం సైతం అడుగంటి పోయింది. స్థానిక జీవన రీతిపై ఏమాత్రం ఖాతరు లేకపోవడంతో జరిగిన విపరీతం ఇది. గత నాలుగైదేళ్లుగా పరిస్థితి మారింది. ఇంతేకాదు హైదరాబాదు నగరంలో కులీకుతుబ్‌షా కాలం నాటి సంప్రదాయాలతో ముషయిరాను పునర్జీవింప చేసే ప్రయత్నమూ కొనసాగుతున్నది.1956 వరకు ఎంతో జనాదరణ పొందిన ఘరేలు, మెహిఫిల్, (ఇంటింట గజల్ సంగీత కచేరీ) భూపాళం (తెలుగు, ఉర్దూ, హిందీ గీతాలాపన, భజనావళి) సంప్రదాయం అటు తరువాత కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా పెరిగిన సాంకేతికత వల్ల, పెరిగిన సంగీత సోయి వల్ల తిరిగి మొగ్గ తొడిగింది. వారాంతాన, నెలకోసారి పాతబస్తీ ఇండ్లల్లో ఈ కచేరీలు కొనసాగుతున్నట్లు తెలిసింది.ఆంగ్లంలోనయినా ఒక కొత్త కళా సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేసే ఈ పుస్తకం ఇందుకు మరింత దోహదం చేస్తుందనీ కచ్ఛితంగా చెప్పవచ్చు. పుస్తకం ఆఖరిలో రచయిత పొందుపరిచిన బిబ్లియోక్షిగఫి, నోట్సు రచయిత పడ్డ కష్టాన్ని, చిత్తశుద్ధిని, భాషా సాహిత్యాల పట్ల ప్రగాఢ అభినివేశాన్ని అందుకు తగ్గ గౌరవాన్ని తెలియచేసేవి. ఆఖరికి కొసమెరుపు ఏమిటంటే నిజాం మునిమనుమడు రెడ్ హిల్స్‌లో ఉంటారు.ఆయన ఇంట్లో ఇప్పటికీ మొగల్,ఆసఫ్ జాహీల కాలం నాటి సంప్రదాయంలోనే ముషయిరా జరుగుతుందట. అందులో మీర్ మహబూబ్ అలీఖాన్ తన దర్బారులో ముషయిరా సందర్భంగా ఉపయోగించిన షమ్మానే ఉపయోగిస్తారట!
-ఎస్. జగన్‌డ్డి

|| ముద్రాపకుని అంతరాత్మ||**

కపిల రాంకుమార్|| ముద్రాపకుని అంతరాత్మ||**

వ్యాస భారతానికి
వ్రాయసకారుడైన గణపతిలా
బాసుల అధికారపుటాజ్ఞలను,
అనునయాలను,
నయనాల చివరనుండి జాలువారే
సైగ విన్యాసాలను,
ముద్రారాక్షసం కాకుండ,
పత్ర వ్యవహారశైలిని,
కార్యాలయ ప్రాతినిథ్యం వుట్టిపడేలా,
మీటలు నొక్కి,
వేళ్ళనరాల సత్తువకొద్ది వేగాన్ని జోడించి,
జవాబుల్లో నిర్థిష్టత,
చూపులకు స్పష్టత అందించే నువ్వు,
అయ్యగారు పిలిచినప్పుడల్లా ఓ చిరునవ్వు రువ్వు!
అయ్యగారి ఆగమనానికి ముందే వచ్చి,
నిష్క్రమణ తరువాతే నీకు ఆటవిడుపు!
కండొకచో ఆదివారము లేదు!
బ్రతుకులో ఆది తాళమూలేదు!
నీ బాధలు నీవి -నీలోనే వుండనీయ్!
వాటిని కదిలించకు!
టైపు మీటలు తప్ప!
అర్హతానర్హతల్ను పక్కన పెట్టి
అధికారులనుండి అనధికారులవర్కు
తెగరాసే అక్షర స్ఖాలిత్యాలను
ముత్యాలా పొదిగి, లలితంగా, సున్నితంగా,
కాగితపు కేన్వాసుపై
అక్షర భావ చిత్రాలను అందించే నీకు
పాతికేళ్ళ పైబడిన సర్వీసుందా?
కాని నీకంటే నీ కంటి ముందున్న యీ '' టైపు రైటరు ''
యే సర్వీసుకు నోచుకోక దిఘాలుగావుంది గమనించావా?
దీనిపైఅ పనిచేసిన యెంతమంది
రాజులు, మహరాజులు, చక్రవరులయ్యారో తెలియది కాని
ఇది మాత్రం పురానా హవేలీలా,
చాదర్ ఘాట్ బ్రిడ్జీలా మైలురాయిలా మిగిలివుంది!
తన వయస్సును కూడ లెక్కచేయకుండానే, పనిచేస్తూ
అప్పుడప్పూడు మొరాయిస్తూనే
నీ చేతి స్పర్శతో అచ్చక్షరాల విన్యాసం చేస్తూ
ముక్కుపై జారిన కళ్ళజోడునూ
ముగ్గుబుట్టైన నీ బట్టతలనూ
యెప్పటికీ రాని ప్రమోషను ద్రాక్షను వెక్కిరిస్తూ
అసహనం కంపించకుండానే,
ప్రహసనం నడిపిస్తూ
ఎన్.జి.వో గానే బతుకీడుస్తూ,
ఎన్ని జీ.వోలు వచ్చినా
నిర్జీవంగా (దాదాపు) యిప్పుడూ, యెప్పుడూ
సమాంతర గమన శ్రామికుడవై
(Horizontal Mobility of Labour)
అర్థశాస్త్రంలో నిర్వచింపబడ్డావు!
ఆఫీసుకు ముఖ్యమైన మరమనిషివి
పులిహోరలో కరివేపాకయినావు!
సాధించుకున్న రాయితీలు కుదించే రీతిలో
ప్రబుత్వం తీసేస్తున్నా,
కరిగిపోయే సత్తువని పూడ్చే విత్తంలేదు!
సంసారపు బడ్జెట్టుకు ఓవర్ డ్రాఫ్టూ లేదు!
పనిముట్టు పాతబడితే
నాగేటి కోండ్ర సైతం వంకరపోతుంది!
అక్షరాలు తారుమారైతే అర్థమే మారిపోతుంది
అర్థమూ క్షీణిస్తుంది (ఇంక్రిమెంట్ కట్ రూపంలో)
అందుకే యేలినవారికి విన్నపాలు చేసుకో
జారిపోయిన ముత్యాలు యేరుకో!
వాడిన వదనంపై దరహాసం నింపుకో!
భవితపై నమ్మకంతో వర్తమానాన్నివీడకు!
భూతకాలపు తీపి చేదు అనుభవాలు మరువకు!

19.2.2013 ఉదయం 5.23
*****************************
( నా ఉద్యోగ పప్రస్థానంలో దాదాపు 28 యేండ్లు టైపిస్ట్ గా పనిచేసి
చివరి రోజుల్లో సూపెరింటెండెంటు కేదరులీ పద్వీ విరమణ చేసాను. ఇది
మా టపిస్ట్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషను రాట్ష్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా
యెన్నికైన సందర్భంగా సభలో చదివినది ( 1998 మే 10 )

Monday, February 18, 2013

కపిల రాంకుమార్|| జానపద గీతం||
|| కట్టాలనెదిరించి సక్కంగ వుందాము ||

ఆమె: సింత సెట్టెక్కేవు - సిగురాకు కోసేవు
సెప్పకుండ నీవు తిరునాలకెల్లేవు
అచ్చట తీర్సంగ ముచ్చట సెప్పంగ
యేడసూసినాకాని కానరాకున్నవు!
యిట్ట చేస్తివంటె రెంకో రెంకా
వల్లనూ నేనింక యెంకరోరెంక!

అతడు: అప్పుడంటావు -యిప్పుడంటావు
సప్పుడు లేకుంట తప్పుకుంటావు
అక్కోరి పిల్లా - అల్లరీ సేమాకు
అక్కున నీ వల్లో వాలి పోతాను!

ఆమె: మాయమ్మ తమ్ముడాని మనసిచ్చి నేనుంటి
అక్క బిడ్డానని అలుసేలయ్య!
తిక్కరేగిందంటె మాడుసెక్కపెట్టి
పచ్చడి మెతుకుల బొచ్చె బోర్లిస్త!

అతడు: పప్పులోకి సిగురు కమ్మగుంటాదమి
నాజూకు సేతుల గాజులూ నింప
సంతాకు నేబోతే పంతాలు నీకేల
నారాజు కామాకు నీ రాజు నే కాన!

ఆమె: ఉడికించ నిన్ను అట్లంటికాని
నినుయీడి నేనెటుల వుండేదిరెంక!
నీకాల ములుదిగిన నా కాలు నొవ్వేను
నాకాన కూడ - నా మగడవీవె!

అతడు: నీ తాన యెల్లపుడు నా పానముంటాది
యేకోన వున్నా మరువనంటాది!
తడవ తడవకు మరి గొడవల్లు సేమాకు
యెన్నెలా రాత్రుల్లు మంటలూ కానీకు!

ఇద్దరు: ఒకరు నొకరింక - యిడస కుండాను
యెవ్వరేమన్న దడసకుండాను!
సెట్టుకూ తీగల్లె పెనవేసుకుందాము
కట్టాలనెదిరించి సక్కంగనుందాము!

****
18.2.2013 సా. 3.41
(అముద్రిత ' జనపద్యం ' కావ్యం నుండి)

|ఎర్రపిడికిలి|| కె.వి.రమణారెడ్డి||| పుస్తకపరిచయం||


కపిల రాంకుమార్|| పుస్తకపరిచయం||
||ఎర్రపిడికిలి|| కె.వి.రమణారెడ్డి||
________________________________
విరసం – ప్రచురణ సెప్టెంబర్ 1972 వెల రు.3/=
బాలాజీ పబ్లిషర్స్ – బజారు వీధి – తిరుపతి
_______________________________ ముందుమాట త్రిపురనేని మధుసూదనరావు ” ఎప్పూదూ, ఇప్పుడులోనే”
1.కొంత మంది కవులు కలం పట్టుకున్న రోజునే ముసలాళ్ళు. సావిత్రో, ఊర్వశో, రాముడో అవేశించి (ఆవహించి ) పాత కాలాన్ని నెమరేస్తూ భూతకాలపు కవిత్వాన్ని రాస్తారు. శవ వాహకులుగా మిగుల్తారు. నిన్నటి గురించి రాయగలరు కాని నిన్నలా జీవించి రాయటం సాధ్యంకాని పని.”
2.ఇంకో రకం ఆధునికత పేరుకోసం ఒక రోజున ఆ రోజు గురించే కవిత రాస్తారు. జీవిత కాలలెండరులో ఆరోజు తొలిగిపోయినా అందులోనే కూరుకుపోతారు. వెనక్కి పరిగెత్తటంలో వీళ్ళు భూతకవులు (పై వారితో) పందాలు కాస్తారు, వేస్తారు–అవకాశవాద కవులౌతారు.”
3. నిజమైన కవులు ఎప్పుడు, ఇప్పుడులోనే జీవిస్తారు. పాతబడిన ఆయుధాలను విసిరి కొత్త కొత్త గతుల్ని, కత్తుల్ని వెతుక్కుంటారు. గమ్యం చేరేదాకా, శిఖరాన్ని అధిరోహించేదాకా ముందుకే నడుస్తారు.
కటకటాలు కరకరమంటున్నా,తుపాకులు మ్రోగుతున్నా..ముందుకే..పరుగెత్తే వాడే ప్రజాకవి..రమణారెడ్డి యీ కోవకు చెందిన ప్రజాకవి. ప్రజా వుద్య్మాల్ను అనుసరిస్తూ, ప్రజాస్వామ్య వలలు పన్ని మభ్యపెట్టె పార్లమెంటరీ విధానాన్ని
యెదురొడ్డి, బలికాకుండ, నిజమైన ప్రజా వైఖరిని సమర్థిస్తూ సందేశిస్తూ,అక్షర శక్తి సమర్పించాడు.రెండు దశాబ్దాల నుండి నవ కవే, యువకవే (1972 నాటి వ్యాఖ్యలో) అడవి, భువనఘోష, అంగారవల్లి రాసి..యిపుడు ‘ ఎర్ర పిడికిలి ‘ బిగించాడు……
రమణారెడ్డి కవి కాడనే అర్భకులున్నారు (నిరాకరించే అర్చకులూ వున్నారు) వాళ్ళ ప్రమాణాలకు సరితూగే కవికాకపోవటమే గొప్ప విషయం. ” నీ శత్రువు అభినందిస్తున్నాడంటే నీలో నిస్సందేహంగా లోపం వున్నట్లే ” అయితే సాను భూతి పరులు కూడ ఆ మాట అంటే అది వారి తప్పు కాదు. ఆదిలో రేమణరెడ్డి కవిత్వంలో శిల్ప వ్యామోహం, భాషా భేషజం మెండు, పండితులని మెప్పించాలనే పరోక్ష కాంక్ష వున్నందున, అభ్యుదయ కవిత్వ పాఠకులకు కొంత దూరమయ్యాడు. దాన్ని అధిగమించే రీతిలో సంస్కరించుకున్నాడు కాబట్టే ‘ ఎర్రపిడికిలి ” యెత్తాడు, ప్రజా హృదయాలమీద ముద్ర వేసే స్థాయిలో>>>>>
కత్తుల చక్రం – తిప్పుతూ ‘ అయ్యా! కవి వర్యా/ కొయ్య లాగుంటే మొయ్య బరువయ్యా!/కత్తిలాగుంటేనే ఘనమయ్యా! ” 9/1972
స్వాహాతంత్రం – మంత్రం జపిస్తూ (1) ఎట్లాగైతే వచ్చింది/బేరమాడితే అచ్చింది / ఎవరు తెస్తేనే వచ్చింద్/అట్లా యిస్తే వచ్చింది/ యెప్పుడైఅతేనేం వచ్చింది – చచ్చి చేదుగా వచ్చిందీయెవ్విధమైతేం వచ్చింది – విప్లవాన్ని చంపి తాను వచ్చింది ”
2) ” ద్వీపాంతర వాసాల ముగింపుపై/ ఉరి చెర శిక్షల కెల్లా తుడుపై/ విప్లవకారుల గోరీ రాయై/ పితూరిదారుల శవాల గోయ్యై, రక్తం పంటల నింపిన గాదై/ ధూర్తుడెక్కి కూర్చున్న గాడిదై/ పెత్తందారుల ఉంపుడుగత్తై/ హంగు చేసుకుని వచ్చింది ” 8/72
….
” ఎర్రపిడికిలి ” లో
కలలు కంటు కవిత రాస్తూ
కలను మెలుకువతో పెనవేస్తూ!
అడవి పిట్టలు బదులు చెబుతూ
పాడుతూ పోరాడుతుంటివిగా!
పళ్లలోపల దొండపండూ – పూవుల్లో మందారపువ్వూ
పేరు నీది తలచుకొంటె – గుర్తువస్తై ఎర్రయెర్రంగా!
….
ఒంటి నిండా యెర్ర్ జెండా
ఉదయసంధ్యే కప్పివేస్తే!
గాయమే కనిపించకుండా
అడవికొమ్మలు రెమ్మలిచ్చిందా!
ఒత్తుకున్నం కంటిలో తడి – ఎత్తుకున్నాం ఎర్రపిడికిలి!
సత్యమెన్నడు చావదంటున్నాం – నీకీర్తి మూర్తే తరగదంటున్నాం ” 21.5.72
________________________________________________
ముక్తాయింపు నాది.
యిలా ఎన్నో యెన్నెన్నో………చదవాలని కోరుకుంటాను.
18.2.2013 ఉ. 1016

Sunday, February 17, 2013

( జానపద గీతం ) ప్రేమతోటె బంధనాలు||

కపిల రాంకుమార్ ||( జానపద గీతం ) ప్రేమతోటె బంధనాలు||

అతడు: విందులొన తందనాలు - సందులోన పందిరేసి
అందమైన సిన్నదన - గంతులేయ వచ్చినావ!
గుండెలదరగొట్టమాకు - అండనీకు కడకంట
ఉండనీకి గడుసోణ్ణి - కండబలమున్నోణ్ణి!

ఆమె: పందెమేసి నెగ్గవోయి - సంకురాత్తిరి సంబరాలు
అందమైన జాతరలో పేమతోటి బందనాలు!
లగ్గమేల దాటకుండ ఒగ్గుకత సెప్పుకుంట
సిగ్గులన్ని మూటకట్టి బగ్గిలోన పెట్టినాను!

అతడు: రేతిరేల యెన్నల్లో రాజనాల పంటసేలో
కావిలేల నక్కకూసే కడుపులోన దిగులాయె!
యేరువాక నాటికల్ల వూరు దాటిపోకుంట
కారుమబ్బు చెర్వుమీన జోరువాన కురిసాది!

ఆమె: అలుగుపడ్డ సెర్వులోన బురదమట్టలేరుతుంటె
యెండ్రకాయ కరిసాది కలుగులోకి దూరాది!
కాలునొవ్వినాదని గట్టుమీన కూకుంటె
పూలు కుక్కు నెపమెట్టి జడకుచ్చు లాగమాకు!

అతడు: కొత్త యింత కాలువెట్టు అత్తమామ మెచ్చుకోను
సత్త చూపు కాపురాన విత్తగాను పదును చేయి!

ఆమె: రోజులేమొ లెక్కపెట్ట ఓపలేని పానమాయె
రాజుకున్న దిగులంత పారదోల వేగిరార!

ఇద్దరు: సల్లగాను సక్కగాను కంటిపాప మాదిరోలె
మింట సూరెసందురోలె జంట బిడ్డ మనకి సాలు!

17-2-2013 ఉదయం 5.30
(అముద్రిత జనపద్యం కావ్యం నుండి)

Saturday, February 16, 2013

తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు



తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు
సంవత్సరం           పుస్తకం                                సాహితీ విభాగం                   రచయిత
2007                  శతపత్రం                                ఆత్మకథ                    గడియారం రామకృష్ణ శర్మ
2006                  అస్థిత్వ నదం ఆవలి తీరాన          చిన్న కథ                   మునిపల్లె రాజు
2005                  తనమార్గం                        కథా సంకలనం                   అబ్బూరి ఛాయాదేవి
2004                 కాలరేఖలు                       నవల                 అంపశయ్య నవీన్
2003                  శ్రీ కృష్ణ చంద్రోదయము          పద్యరచన            ఉత్పల సత్యనారాయణాచార్య
2002                  స్మృతి కిణాంకం                  వ్యాసాలు             చేకూరి రామారావు
2001                  హంపి నుంచి హరప్పా దాకా   ఆత్మకథ             తిరుమల రామచంద్ర
2000                 కాలాన్ని నిద్ర పోనివ్వను       పద్యరచన            ఆచార్య ఎన్.గోపి
1999                   కథాశిల్పం                        వ్యాసాలు             వల్లంపాటి వెంకటసుబ్బయ్య
1998                   బలివాడ కాంతారావు కథలు   కథలు                 బలివాడ కాంతారావు
1997                   స్వప్నలిపి                        కవిత                  అజంతా (పి. వి. శాస్త్రి)
1996                   కేతు విశ్వనాథ రెడ్డి కథలు     కథలు                 కేతు విశ్వనాథరెడ్డి
1995                   యజ్ఞంతో తొమ్మిది             కథలు                 కాళీపట్నం రామారావు
1994                   కాలరేఖ                           విమర్శ               గుంటూరు శేషేంద్రశర్మ
1993                   మధురాంతకం రాజారాం కథలు            కథలు                 మధురాంతకం రాజారాం
1992                   హృదయ నేత్రి                    నవల                 మాలతీ చందూర్
1991                    ఇట్లు మీ విధేయుడు            కథలు                 భమిడిపాటి రామగోపాలం
1990                   మోహనా ఓ మోహనా          కవిత                  కె.శివారెడ్డి
1989                   మణిప్రవాళము                  వ్యాసాలు             ఎస్.వి.జోగారావు
1988                   అనువాద సమస్యలు           విమర్శ               రాచమల్లు రామచంద్రారెడ్డి
1987                   గురజాడ గురుపీఠం             వ్యాసాలు             ఆరుద్ర
1986                   ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం   సాహితీ విమర్శ      ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
1985                   గాలివాన                         కథలు                 పాలగుమ్మి పద్మరాజు
1984                   ఆగమ గీతి                       కవిత                  ఆలూరి బైరాగి
1983                   జీవనసమరం                    వ్యాసాలు             రావూరి భరద్వాజ
1982                   స్వర్ణ కమలాలు                  కథలు                 ఇల్లిందల సరస్వతీదేవి
1981                    సీతజోస్యం                        నాటకం               నార్ల వెంకటేశ్వరరావు
1979                   జనప్రియ రామాయణం         కవిత్వం               పుట్టపర్తి నారాయణాచార్యులు
1978                   కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు)         కవిత్వం, నాటకాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి
1977                   కుందుర్తి కృతులు                కవిత్వం              కుందుర్తి ఆంజనేయులు
1975                   గుడిసెలు కూలిపోతున్నాయి   కవిత్వం               బోయి భీమన్న
1974                   తిమిరంతో సమరం             కవిత్వం               దాశరథి
1973                   మంటలు మానవుడు           కవిత్వం               సి.నారాయణరెడ్డి
1972                   శ్రీశ్రీ సాహిత్యము                 కవిత్వం               శ్రీశ్రీ
1971                    విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య            వ్యాఖ్యానం            తాపీ ధర్మారావు
1970                   అమృతం కురిసిన రాత్రి         కవిత్వం               దేవరకొండ బాలగంగాధర తిలక్‌
1969                   మహాత్మకథ                      కవిత్వం               తుమ్మల సీతారామమూర్తి
1965                   మిశ్రమంజరి                      కవిత్వం               రాయప్రోలు సుబ్బారావు
1964                   క్రీస్తుచరిత్ర                         కవిత్వం               గుర్రం జాషువా
1963       పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా      నవల                 త్రిపురనేని గోపీచంద్
1962       విశ్వనాథ మధ్యాక్కరలు                    కవిత్వం               విశ్వనాథ సత్యనారాయణ
1961        ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము               జీవిత చరిత్ర          బాలాంత్రపు రజనీకాంతరావు
1960       నాట్యశాస్త్రము                                చరిత్ర                  పోనంగి శ్రీరామ అప్పారావు
1957       శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర                జీవిత చరిత్ర          చిరంతానందస్వామి
1956       భారతీయ తత్వశాస్త్రము                    పరిశోధన             బులుసు వెంకటేశ్వర్లు
1955       ఆంధ్రుల సాంఘిక చరిత్రము               చరిత్ర                  సురవరం ప్రతాపరెడ్డి

1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.
తెలుగు భాషకు చెందిన అనువాదాల పురస్కార గ్రహీతలు
సంవత్సరం           అనువాద పుస్తకం పేరు         అనువాద రచయిత             మూలం పేరు (భాష, సాహితీ విభాగం)                మూల రచయిత
2005      మాస్తి చిన్నకథలు               జి.ఎస్.మోహన్       సన్న కథెగళు సం. 12-13 (కన్నడ, చిన్న కథలు)     మాస్తి వెంకటేశ అయ్యంగార్
2004     పర్వ                   గంగిశెట్టి లక్ష్మీనారాయణ        పర్వ (కన్నడ, నవల)                        ఎస్.ఎల్.బైరప్ప
2003      శ్రీ దేవీభాగవతము   బేతవోలు రామబ్రహ్మం          దేవీభాగవతం (సంస్కృతం, పురాణం)      వేదవ్యాసుడు
2002      మాటన్నది జ్యోతిర్లింగం         డి.వి.సుబ్బారావు    కన్నడ 'వచనాల' సంపుటి (కన్నడ, పద్యాలు)        వివిధ రచయితలు
2001      ఆత్మ సాక్షాత్కారము           పింగళి సూర్య సుందరం         సెల్ఫ్ రియలైజేషన్ (ఇంగ్లీషు, జీవిత చరిత్ర)           బి.వి.నరసింహస్వామి
2000     ఛాయారేఖలు        ఆర్.ఎ.పద్మనాభరావు           షాడో లైన్స్ (ఇంగ్లీషు, నవల)   అమితావ్ ఘోష్
1999       సగం వెన్నెల రాత్రి   వేమరాజు భానుమూర్తి          ఆధ్ చనాణీ రాత్ (పంజాబీ, నవల)         గుర్దయాళ్ సింగ్
1998       మెట్టుకు పైమెట్టు    ఇలపావులూరి పాండురంగారావు          ఎనిప్పాదికళ్ (మలయాళం, నవల)        తక్కాళి శివశంకర పిళ్ళై
1997       గడచిన కాలం        బి.కె.ఈశ్వర్           కజింజ కాలం(మలయాళం, నవల)         కె.పి.కేశవ మీనన్
1996       కావ్య ప్రకాశము      పి.శ్రీరామచంద్రుడు   కావ్య ప్రకాశం (సంస్కృతం, వ్యాఖ్యానం)    మమ్మట
1995       తలదండం            భార్గవి పి. రావు      తలెదండ (కన్నడ, నాటకం)     గిరీష్ కర్నాడ్
1994       అమృతం విషం       పి.ఆదేశ్వరరావు     అమృత్ ఔర్ విష్ (హిందీ, నవల)           అమృత్లాల్ నాగర్
1993       సమయం కాని సమయం      మద్దిపట్ల సూరి       అసమయ (బెంగాలీ, నవల)     బిమల్ కార్
1992       తమస్    యార్లగడ్డ లక్ష్మీప్రసాద్          తమస్ (హిందీ, నవల)          భీషమ్ సాహనీ
1991        తిరుక్కురళ్           సి.ఆర్.శర్మ            తిరుక్కురళ్ (తమిళం, వ్యాఖ్యానం          తిరువళ్ళువార్
1990       గణపతి రామాయణ సుధ      చర్ల గణపతిశాస్త్రి      శ్రీమద్రామాయణం(సంస్కృతం, పురాణం) వాల్మీకి
1989       రవీంద్రుని నాటికలు             బెజవాడ గోపాలరెడ్డి             బిదాయెర్ అభిశాప్, చిత్రాంగద, మొ.. (బెంగాలీ, నాటికలు)       రవీంద్రనాథ టాగోర్
బయటి లింకులు