Tuesday, February 10, 2015

కపిల రాంకుమార్‌ || ఢిల్లీ ఓటరు ||

కపిల రాంకుమార్‌ || ఢిల్లీ ఓటరు ||
కమలాలు ఎన్ని మల్లగుల్లాలు పడి
పేలాలు వేగించినా,
ఎన్ని మాయలు, మంత్రాలు
చేసి ప్రజాస్వామ్యాన్ని
ఈడ్చిపారేస్తామన్నా ,
తెలుసుకున్నారు జనం!
**
ఏ సర్కారైతేనేం
అన్నింటిదీ ఒకే వర్గ స్వభావం కదా!
అనుకున్నారు స్థిరంగా!
మెజారిటీని చూసుకుని
అహంకారంతో పేట్రేగితే
పాలనలో చేతగాని అరకొర వైకుంఠాలు చూపితే
సహిస్తారా!
**
పూడ్చిపెడతాం అని విర్రవీగి,
రోజుకో తీరుగా
విధానాలు మార్చుకుపోతే
సన్నిధానం మొత్తం పునాదులతో
సహా ఊడ్చి పారేసారు  కదా  మార్చురీకి!
**
జనాల్ని గందరగోళపరిచి
తదుపరి నాలిక కరుచుకునేం లాభం!
**
అన్ని అవరోధాలను గమనించారు  కాబట్టే
ఆవిరైపోతున్న ఆశల్లో చిగుళ్ళు పల్లవించడానికి
జనఘోష వినిపించడానికి
గాలికి ఎగిరిన పేలపిండి ప్రభావాన్ని
ఊడ్చి ఆరేసి ఇలా కూడా ప్రజాస్వామ్యాన్ని
గెలిపించవచ్చుననే ఢిల్లీ ఓటర్లు
దేశంలోని గల్లీ గల్లీకి తెలిసేలే
ఒక ముద్ర వేసి పాతాళానికి
పూడ్చి పెట్టారు!
జయహో సామాన్య ఓటర్లకు!
జయహో!
10.06.2015

No comments: