Saturday, May 3, 2014

కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||


కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||
**
కంచు మోగునట్లు కనకంబు మోగదని
వేమన మాట అక్షరాలా నిజమని తెలుస్తుంది
న.మో. రాజకీయ రంకెలు ఆలకిస్తే.
దేశానికే కళంకమంటించిన హత్యాకాండలో
తడిసిన చేతులు రుద్రాక్షలతో
జతగటితే పవిత్రమైనట్టు
కాల్పనిక ఉదాహరణలే అభివృద్ధంటూ
ఎన్నికల ప్రచారాలపై ఊరేగుతున్నారు.
తిరుగులేని నాయకుడైనట్టు
స్వార్థపరుల అండతో
అస్తిత్వాన్ని కాపాడుకోగలమనుకోవడం,
వీరోక్తుల గాలి భజనలో పరవశించి పోవడం
అంతా ప్రహసన ప్రాయం.
పర్యటనా ప్రసంగాలలో
ఊకదంపుడుపన్యాసాలలో,
ఇదే వైరుధ్యం ప్రత్యక్షమవుతుంది.
రాష్ట్ర విభజన తమ వల్లనేనని చెప్పుకునే
ఈయన '' తల్లిని చంపి బిడ్డను బతికించాల '' ని
మాటలు చెప్పడం ఎవరిని నమ్మించడానికి?
మతాల మంటలు పెట్టడంలో ఆరితేరిన నేత
పదేపదే విభజన రాజకీయాలు తగవని
చేసే హితబోధ పుర్రెలతో భగవన్నామస్మరణ
చేసే కుహనా సాధువులా బహిరంగ రంగ ప్రదర్శన
చేస్తూ '' కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిన చందమే ( చంద్రమే) '' కాదా?
**
అధికారం కోసం తహతహలాడుతూ
కాంగ్రెస్‌పై విమర్శించటం అర్థమైనదే కాని
ఆ సాకుతో మతతత్వాన్ని
బాబు నెత్తినెత్తుకోవడం ఎలా సమంజసం?
తెలుగువారి ఆత్మగౌరవం సంగతి
అటుంచి దేశం ఆత్మగౌరవానికే
ఇది తప్పనిసరిగా భంగకరం.
తనను విస్మరించినా పట్టుకు వేళ్లాడే దుస్థితి
అవకాశవాదమే కాదు
తప్పిదపు స్వయం కృతాపరాధం కూడ
ప్రభంజనం ఇక్కడ ఎంత ప్రహసన ప్రాయంగా
ముగిసేదీ త్వరలోనే విదితమవుతుంది.
**
25.4.2014 **/ 3.5.2014 ( ఒకానొక విశ్లేషణకు స్పందన)

No comments: