Tuesday, January 28, 2014

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||
'' మెజారిటీ మతానికి చెందిన మత తత్వాన్ని, జాతీయవాదంగా భావించే ప్రమాదం నిరంతరం పొంచి
వుంటుంది ''  - నెహ్రూ - 1961 జనవరి 5న చెప్పిన మాటలు.

'' ఒకేసారి కేంద్రంలో అధికారాన్ని రుచి చూసిన హిందూత్వ శక్తులు యిప్పుడు మరోసారి ఎలాగైనా,
అవసమైతే మోడీ వాచాలతను ఉపయోగించుకునైనా, లేక గుజరాత్ అల్లర్లలో అతని పాత్రను చూపించైనా
లేక ఆర్.ఎస్.ఎస్. హిందూత్వకు ఆయన తిరుగులేని మద్దతును చూపించైనా అధికారంలోకి
రావటానికి ప్రయత్నిసుతున్నారు. వారి ఈ స్కీములో వల్లబ్‌భాయ్‌పటేల్ వ్యక్తిత్వం వారికి సరిగ సరిపోతుంది.''

'' హిందూ జాతీయవాదిగా పేరుపొందిన పటేల్‌కు  అర్.ఎస్.ఎస్. తో రహస్య, వ్యక్తిగత సంబంధాలూ.
ఏర్పాట్లు వుండేవి. భారత్‌, బ్రిటిష్‌ వ్యాపాద ప్రపంచంతో మంచి సంబంధాలుండేవి. ఆయనకు విజ్ఞాపనలు
చేసుకుంటుండేవారు.  సనాతన హిందువుగా ఆయన తన మత తత్వ సానుభూతులను కప్పిపుచ్చుకునేవారు దాదు ''

'' కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించే ' పాన్‌సుఖ్‌లాల్‌ మఫత్‌లాల్‌ ' ఈతకొలను ముంబాయిలోని
మెరేన్‌డ్రైవ్ వద్ద ఇప్పటికీవుంది. దానిని సర్దార్‌ పటేల్‌ ప్రారంభించారు. ''

'' మహాత్మా గాంధీ హత్యకు జరిగిన కుట్రపై '' విచారణ కమిటీ నివేదిక '' సమర్పించిన జస్టిస్‌ జె.ఎల్‌.కపూర్ ..
మహాత్ముని ప్రాణం తీసిన ఈ హత్యపై విచారణ జరగాల్సిన రీతిలో జరుగలేదనీ, అడుగడుగున అధికారుల
నిర్లక్ష్యం కనిపించిందని చెబుతూ '' విచారణకు ఇంచార్జి మంత్రిగావున్న హోమ్‌ మంత్రి వల్లభ్‌భాయ్‌ పటేళ్
కూడ దీనిపై ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు '' అని చెప్పారు కపూర్.

'' భారత తొలి గవర్నర్  జనరల్ రాజాజీ లౌకిక వాది కనుక అతనిని రాష్ట్రపతి కాకుండ పటేల్ అడ్డుపడ్డాడని తెలుస్తుంది.''

'' 1848 జనవరి 6న పటేల్‌ ఒకవైపు అబ్దుల్ కలామ్‌ అజాద్‌  దేశభక్తిని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్.
వాళ్ళను కాంగ్రెస్‌లో చేరాలని అహ్వానించారు. పచ్చి మతతత్వ వాదులు మాత్రమే ఆ పనిచేయగలరు

'' నేను భారతీయ ముస్లిమ్‌లను  ఒకేఒక ప్రశ్న వేస్తున్నాను. ఇటీవల జారిగిన అఖిల భారత ముస్లిమ్‌ కాంఫెరెన్స్ లో
మీరు కాశ్మీరుపై ఎందుకు నోరు మెదపలేదు? పాకిస్థాన్‌ చర్యలను ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ ప్రజలమనసులో
సందేహాలు లేవనెత్తుతున్నాయి. దేశభక్తిలేనివారు పాకిస్థాన్‌ వెళ్ళిపోవచ్చు '' - పటేల్

'' పటేల్‌ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరులైన  రఫి అహ్మద్‌ కిద్వాయ్ వంటివారిపైనా, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీమీద
గూఢచారి శాఖ యిచిన ' రహస్య నివేదికకాపీ 'ని 1948 ఫిబ్రవరి 6న నెహ్రూకు పటేల్‌ పంపారు. తనను మంత్రి
వర్గం నుండి తొలగించడానికి కాంగ్రెస్‌ సోషలిస్ట్ పార్టీ కుట్ర పన్నినట్లు సృష్టించిన నివేదిక అది ''

' ఉప ప్రధాన మంత్రిగా, హోమ్‌ మంత్రిగా పటేల్ కాశ్మీర్ మహారాజును సమర్థించేవారు. మహారాజుకు వ్యతిరేకంగా
పోరాడే ప్రజానాయకుడైన షేక్ అబ్దుల్లాను, ప్రజా ట్రిబ్యునళ్ళను పటేల్ వ్యతిరేకించేవారు. భారత్ యూనియన్‌లో
కలసిపోడానికి కాశ్మీర్ మహారాజును ఒప్పించేందుకు ప్రయత్నించే వారు. చివరికి 1948 జనవరి 31 న
కాశ్మీర్ రాజు తాను స్వతంత్ర దేశంగా విడిపోతానని బెదిరించినప్పటికీ, ఆయనపట్ల సానుకూలంగానే వ్యవహరించాడు. ''
__________________________________________
22.1.2014 సాయంత్రం 4.10
__________________________________________
పేజి 9 నుండి 15 జనవరి నెల 2014 మార్క్సిస్టు పత్రికలో ఎ.జి.సూరానీ వ్యాసంలో ముఖ్య అంశాలు.


No comments: