Wednesday, May 22, 2013

||కొడవళ్ళై కదలాలి||

కపిలరాంకుమార్||కొడవళ్ళై కదలాలి||

ఎంతమంది మొత్తుకొన్నా,
వింతగానే చూస్తున్నారేం? కాక యెవడికీ యెక్కినట్లులేదు !
బాడకావు నాకొడుకులందరు గద్దెనెక్కిచచ్చారు కదా!
గుడ్డినాకొడుకులు , చెవిటి ముందాకొడుకులు!
మన్ను తిన్న పాములా, తన్నులుతిన్నా సిగ్గులేక
చూరు వట్టుకుని వేళ్ళాడే గబ్బిలాలు
ఎడ్డిమొకం సర్కారు ఒక్కెల్లి /
నడ్డి విరిగినా కిమ్మనని జనమొక్కెల్లి
ఛా! యే బతుకులురా మనయి!
తినటానికిగతిలేదు, - మనటానికి గతిలేదు,
నేత గజబబిజైతే - బట్టకటలేము
నేతలు గబ్బునాకొడుకులైతే - బతికి బట్టకట్టలేము !
**
66 యేండ్ల సంది యిదే తంతు
ఐదేళ్ళ పథకాల ఫలితాలు -
బయలుదేరినపుడు నిండు బండి
అడంగుచేరేటప్పటికి -
సడలిపోయి, చిరిగిపోయి, -
చక్రాలూడి, తొట్టికర్రలిరిగి
దేనికి పని కిరాని చందమైందని -
ఉభయపక్షాలు ఒప్పుకుంటూనే
అధికారమున్నప్పుడు - లేనప్పుడు ఒకలాగ -
పట్టించుకోరు -అందుకే వారు అంధులు! బధిరులు!
.ఆడది - ఏడదైనా, ఆడదైనా, ఈడదైనా,
ప్రాంత, భాషా బేధాలు లేని ఆ అకృత్యానికి
ఏడేళ్ళదైనా, ఏదు పదులదైనా, ఆడదైతా చాలులే అనే
సాకుతో కుతి తీర్చుకునే నాయాళ్ళకి ,
బిడ్డ, చెల్లి, తల్లి యాదుండరా?
పశు పక్ష్యాదులకున్న కనీస యింగితం లేని
దేహ జిలగాళ్ళా, మేహగులగాళ్ళా
అర్థంకాని మానసిక శాస్త్ర విశ్లేషణక్కూడ అందని
నీతి తక్కువ పని నిత్య కృత్య అత్యాచారమై,
రావణకాష్ఠాన్ని మించిపోతుంటే చోద్యం చూ డడమేనా?
'A' సర్టిఫికేట్ కంటే సుపీరియర్ సీరియల్ గా
దృశ్యమాద్యమాల చిత్రీకరణ విసుగొస్తూంటే అరికట్టే వారే లేరు!
అదొక ఆనందమా? డార్విన్ విశ్లేషణకు వక్ర భాష్యామా?
అందుకే కామోసు ,
యేతావాతా,
కమ్మదనం తగ్గిపోయి కనుమరుగౌతోంది
కాపుదలకు,
యేపుదలకు,
పాదుపోసేవారులేక
అదును,పదును అందక ,
చదునుకు భూమి దొరకక దిగాలుగా
యెడ్డెమొగాల సర్కారు -
జిడ్డు వదిలించుకోక మరింత పూసుకొని-
బురదలో దొర్లే పందిలా
తోకలు ఆడిస్తూ జనాల ధ్యాసే లేకుండా
ఖజానాలనింపే ఊసే యెప్పుడూ
జనానాల వద్ద తమ పరువు కాపాడుకోవాలికదా!
పరుపుమీద పడుకోవాలి కదా!
లేక పోతే బోజనం బందు ,
ముక్క బందు,పక్క బందు
స్వార్థం మాటున యే ఘాటు నిర్ణయానికైనా సిద్ధం!
రెండునాలుకల ధోరణి కాకపోతే యేమిటీ
జగన్ బయటకొస్తే సాక్ష్యాలు తారుమారవుతాయట
కళంకితులు సచివాలయంలోవుండే మాయమంత్రం చేయలేరా!
వారు లోపలెళ్ళకూడదట! చెవుల్లో పూవులు పెట్టుకున్నామా! మనం?
ఏ నేతతో విందు జాతరలో, యే నేలలో మందు పాతరలో
రోజూ -అయారాం గయారాం నాయకులతో
పునాదులు కదులుతున్నా
మొకరాలు చెదలుపట్టి కూలుతున్నా
శిఖరాన జెండా నిరాఘాటంగా ఎగుర్తోందని
సంబరపడుతున్నా యే భూకంపమో,
కాగిన నివేదికల
తాకిడ్కో ఇంద్ర భవన కూలబోతోందని గ్రహించరా?
అడ్డగోలు అనుమతుల ప్రభావమే వడగాలిలా,
సుడిగాలిలా,
తుఫానులా ,
మరో సునామీ వచ్చి
ఈ బినామీ గాళ్ళ భరతం పట్టేదాకా కళ్ళుతెరవని-చేతకాని,
చేత కానిలేని
చేవలేని సర్కారు
చేతిబలం చూసుకొని మురుస్తోంది
కాని నిద్రబోతున్న జనం
ఆ చేతిమీద తమ చేతితో
ప్రలోభాలకు లొంగక
ఓక్క గుద్దు గుద్దారో
శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే
ఆ ప్రజావెల్లువకోసం
కలాలు, కొత్త గళాలై
బిగించిన కొడవళ్ళై కదలాలి!
________________________________________________
(19.5.2013 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం - సాహితీ స్రవంతి నిర్వహించచిన జనకవనంలో చదివినది.)

No comments: