Sunday, October 6, 2013

కపిల రాంకుమార్ || వితంతుపూజ -సంప్రదాయం||

కపిల రాంకుమార్ || వితంతుపూజ -సంప్రదాయం||
మొన్నమొన్నటి వరకు ఉత్తరాలు రాసేటప్పుడు పెద్దలను గౌరవసూచకంగా మహారాజశ్రీ,
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన, అని మగవారిని సంబోధించి వ్రాయటం, అదే విధంగా ఒక వేళ
వితంతువులకు రాసేటప్పుడు గంగా భవానీ సమానురలైన అని పేర్కొనటం మనకు
తెలిసినదే. సాధారణంగా వితంతువులను కొంచెంహీన భావంతో చూడటం, చులకన చేయటం,
వారిచే చాకిరీ చేయించటం, కాస్త అంద విహీనంగ కనబడేలా శిరోముండనం చేయించడం,
పూలు, గాజులు, పసుపు, కుంకుమలకు, రంగు చీరలకు దూరంగావుంచడం ప్రాచీన సంప్రదాయం.
కేవలం తెల్ల ముతకచీర కట్టుకుని, కటికనేలమీద శయనించడం, ఎవరికి ఎదురు పడకుండటం లాంటి
ఆంక్షలు మెండుగావుండేవి. వాటిపై వీరేశలింగం వంటి వారు సంస్కరణ ఉద్యమాలు చేసారనేది,
యిప్పుడూ  ఆనిర్బంధాలు, ఆంక్షలు అంతగాలేవని తెలుసు. అటువంటి పూర్వసువాసినులకు

(వితంతవులకు) పూజర్హత కల్పించి, పూజించి, వారిచే దీవెనలు పొంది సంప్రదాయమొకటివుంది.
అదీ దక్షిణాది తమిళ దేశంలో మనకు కనపడుతుంది. వివరాలలోకి వెడితే ఉత్తరాదికి వచ్చిన స్థిరపడిన ఆర్యులు
కొంతకాలానికి వారిలో కొందరు దక్షిణ భారదేశానికి తరలివచ్చారనేందుకు చారిత్రాఢారాలునాయి.
అలా వచ్చిన వారు సుమారు ఎనిమిదివేలమందికిపైగా గుంపుగా తమిళనాడులో స్థిరపడ్డారు. వారిని
' అష్ట్ర సహర జాతీ అని పిలుస్తారని, అస్ట్రవస్త్రం అనే స్థానిక సంప్రదాయబ్రాహ్మణ వంశాలతో కలిసిపోయారని
తెలుస్తున్నది. కోయంబత్తూర్, ఈరోడ్, సత్యమంగళం ప్రాంతాలలో విస్తరించారని రూఢవుతున్నది.
 ' కౌండిన్యస '  గోత్రీకులైన బ్రాహ్మణ వంశాలలో జరిగే ప్రతీ శుభకార్యక్రమనిర్వహణాలకు ముందుగా
విధిగా వారు నిర్వహించే పూజా విధానమే మనం యిపుడు తెలుసుకొనబోతున్నాం. ప్రతీ శుభకార్యానికి
ముందు ముఖ్యంగా వివాహాది కార్యాలలో వితంతు పూజ తప్పనిసరిగా చేసికానిప్రారంభించరు.
కుటుంబ, లోక శాంతి సౌఖ్యాలకు అభివృద్ధికొరకు జరిపే ప్రార్థనలు సైతం వితంతు పూజలతో
ప్రారంబమవటం ఒక ప్రత్యేకత సంతరించుకున్న సంప్రదాయం. (గణపతి పూజ మాదిరి)
ఒక వితంతువు, ఆమెతో పాటు ఐదుగురు ముత్తైదవులు, ఒక బ్రహ్మచారి ( మొత్తం యేడుగురికి)
పూజలు నిర్వహిస్తారు. ఈ వితంతుపూజ తరువాత సుమంగళిపూజ జరుపుతారు. అందరికీ తాంబూలాలు,
ఫలాలు, సమర్పించి, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుతారు. ముఖ్య అతిథి గౌరవం ఆ వితంతువు
పందుతుంది. గౌరవంగా సంభావన, బహుమతి, దక్షిణ యివ్వటం పరిపాటి. అయితే పూజందుకునే
వితంతువు తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్న వారినే యెంపికచేస్తారు.
సాత్వికాహారం తీసుకునేవ్యక్తి, నియబద్ధ జీవితం గడిపేది, పసుపు, కుంకుమ, రవిక లాంటివాటిని
విసర్జించినదైన వితంతువు మాత్రమే పూజార్హురాలు. ఆమెకు తొమ్మిది గజాల చీర ధరింపచేసి
దైవ పీఠంపై కూర్చుండ పెట్టి, ఆ రోజున జరిపే దుర్గా పరమేశ్వరి పూజలో దేవికి ప్రతినిధిగా పరిగణిస్తారు.
పురోహితులు కాని, యింటి పెద్దగాని, (మగ/ఆడ) ఈపూజా విధానాన్ని నిర్వహిస్తారు. తొమ్మిది గజాల
చీర యిచ్చేముందుకూడ పూజ చేస్తారు. ఆ చీరను పూర్తిగా తడిపి, యెండపెట్టి, ఆరిన తరువాత
మడతపెట్టి దేవతముందు పళ్ళెంలోవుంచిం ఆ చీరకు మాలిన్యం అంటకుండా పైన అరటి ఆకు
(దుమ్ము, ధూళి పడకుండ) కప్పి, అరటి ఆకుపైనే పసుపు, కుంకుమ, పూలతో పూజచేస్తారు. ఆ చీరని
ఆ వితంతువు అందిస్తారు. అపుడామె ఆ చీర ధరించి తిరిగి దైవ పీఠంపై కూర్చుంటుంది. ఆ రోజు
తయారు చేసిన పిండివంటలు ఆమెకే మొదట దేవతగా భావించి నైవేద్యం పెడతారు. తరువాత మహిళలందరు
ఆ దేవతతోపాటు కలిసి భోజనం చేస్తారు. భోజనానంతరం మొదట కుటుంబంలోని పురుషులు వచ్చి
ఆమెకు నమకరించి,ఆమె దీవెనలు తీసుకుంటారు. వివిధ బహుమతులు, రొఖ్ఖం, కానుకలు యిస్తారు.
అందరు అశీర్వచనాలు పొందిన తరువాత ఆమె తనకు యిచ్చిన కాఉకలు, దక్షిణ, కొంత భాగాన్ని తిరిగి
ఆ కుటుంబానికి అందిస్తుంది. అది మహా ప్రసాదంగా స్వీకరిస్తారు..
_______________________________________________.
--చాల సంవత్సరాల క్రితం ఒక పత్రికలో '' మోరపాకుల '' పేరుతో వ్యాసం ప్రచురణ జరిగింది. దానని
జీర్ణ దశలో కాస్త సంస్కరించి(కనపడని అక్షరాలను సరిచేసుకొని) అందరికి ఈ విషయం వ్యాప్తిచేయాలని
వితంతువులను గౌరవించడం ఒక సుసంప్రదాయమని తెలపాలని సేకరించాను. 
_________________________________________________
5.10.2013 సాయంత్రం 4.35

No comments: