Saturday, October 4, 2014

సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి

కపిల రాంకుమార్|| సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి ||
***
సాహితీ స్రవంతి నగరకమిటీ ఆధ్వర్యంలో 21.9.2014 ఆదివారం బి.వి.కె. గ్రంథాలయంలో
రాబోయే బతుకమ్మ పండుగను ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో జరుగుపోవాలనే తలంపుతో కవితా గోష్టి ఏర్పాటుచేసామని సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కార్యదర్శి రౌతు రవి తమ అధ్యక్ష్యోపన్యాసంలో పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు సంపటం దుర్గా ప్రసాదరావు, సాహితీస్రవంతి అధ్యయన వేదిక నిర్వాహకుడు, బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్, సాహితీ స్రవంతి కోశాధికారి సునంద,ఫెమా అధ్యక్షుడు, కవి మువ్వా శ్రీనివాసరావు, కవి, గాయకుడు మేడగాని శేషగిరి పాల్గొన్న ఈ కవితా గోష్టిలో బతుకమ్మ పండుగ విశిష్టతగురించి సునంద సోదాహరణ్ ప్రసంగంతో ఆరంభం అయింది. మువా శ్రీనివాసరావు సందేశమిస్తూ గురజాడ 152వ జన్మదినం జరుపుకుంటున్న ఈ రోజున కూడ స్త్రీలస్ పట్ల జరుగుతున్న అన్యాయాలగురించి మాట్లాడుకోటం కడుశోచనీయం. బాలికల దీనావస్థ గురించి కలం సంధించిన మొదటి కవి, ఆధునికుడు గురజాడ అని కొనియాడారు. పుత్తడిబొమ్మ పూర్ణమ గేయ కథ ద్వారా వయసుమీరిన వారిన వార్తో బాలికల వివాహంపై తన నిరశన వ్యక్తం చేయటమేకాక, ప్రజలను చైతన్యపరిచేలా నాడే కన్యాశుల్కం నాటకాన్ని రచించి, ప్రదర్శింపచేసిన ప్రగతివాద నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందాడని.సమాజమ్లోని వివిధ వ్యక్తులు మానసిక వికారాలను ప్రస్పుటంగా ఆ నాటకంద్వారా వెలుగులోకి తెచ్చి సమాక హితం కోరిన గురజాడ నేటికీ ఆరాధ్యుడేనన్నారు. ఇవాళా కన్యాశుల్కం రూపం మారినా మరో విధంగా అది లోకంలో విలయతాండవమాడుతూ ఎన్నో సంసారాలలో నిప్పులు పోస్తూ గర్భసోకాలను కలిగిస్తున్నదని. అందుకే మనం అలాంటి మూఢ సంప్రదాయాలమీద, పసలేని దుష్ట సంస్కృతులపైన కవులుగా స్పందిస్తూ ప్రజలను చైతన్యపరచడమే తక్షణకర్తవ్యమని చెప్పారు. ఆసుప్రసాద్‌, శేషగిరి బృందం బతుకమ్మ పాటలను వినిపించారు. కపిల రాంకుమార్ రాసిన గేయాన్ని మేడగాని శేషగిరి ఆలపించారు. తదుపరి బండి ఉష, సునంద, బండారు రమేష్, చాగంటి కృష్ణమూర్తి, ఆదాం (విశ్రాంత జూనియర్‌ కళాశాల ప్రధానాచార్యులు) ,దేవులపల్లి హనుమంతరావు, మాటేటి శ్రీరామారావు, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్, నల్లమోతు శ్రీనివాసరావు, నారాయణ, మొదలగు వారు బతుకమ్మ కవితలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలని నిరసిస్తూ కవితా గానం చేసారు. సదానందం బృందం సునంద రాసిన బతుకమ్మ పాటను పాడి అందరిని అలరించారు. మే్డగాని శేషగిరి వందన సమర్పణ చేస్తూ, బతుకమ్మంపండుగ సాక్షిగా '' ఆడపిల్లని పుట్టనిద్దాం, ఎదుగనిద్దాం, చదవనిద్దాం, ఆత్మ గౌరవంతో బతుకనిద్దాం '' అనే అంశాల ప్రాతిపదికగా ప్రత్యామ్నాయ సంస్కృతినిని ప్రజలలోకి తీసుకువెడదామని, దానికి మరింతగా మనం ప్రోత్సహించవలసివుందని తెలియచేసారు. .
21.9.2014/4-10-2014

No comments: