Wednesday, September 12, 2012

ఎవరికీ పట్టదా?

కపిల రాంకుమార్// ఎవరికీ పట్టదా?

'' ఏం తినేటట్లు లేదు, యేం కొనేటట్టు లేదు ''
పాట విని బావుందని చప్పట్లు కొడతాం!
కాని.........
డీజిల్, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నా,
విద్యుత్ కోత చాల్దన్నట్లు ధరల్ వాత పెడుతున్నా,
కిలో సరుకులు సగానికి తగ్గించినా
ఖర్చు రెట్టింపైనా, జేబు చిల్లు పడినా.
కూలిపెరిగి, కూటికి చాల్కపోయినా,
దోమ కాట్లకు జనం చస్తున్నా,
కాకుల తరిమి గద్దల్ని మేపుతున్నా,
ఎవరూ మట్లాడరేం???
పీక తెగకోస్తున్నా స్పర్శలేని మౌనమేమిటో???

ఎవరికి పుట్టిన బిడ్డో వెక్కి వెక్కి యేడ్చినట్లు
ధర్నాలు, రాస్తా రోకోలు ప్రతిపక్షాలకే పట్టిందా???
లాఠీలు, టియర్ గ్యాస్ల్ -కాల్పులు మామూలేనని వూరుకుత్టారేం???
చానళ్ళకు చేతినిండా పనేగానా?
ఏం - ఓట్లప్పుడు వొళ్ళు తెలవదా??
నోటుకు--నాతుకు--ముక్కకు పడి దొర్లటమేనా?
ఘాటుగా ఒక్క గట్టి గుద్దు గుడ్డె చేవలేనితనం!
పిరికితనం ఆవిరిస్తే
వెనకబాటుతనం ఎప్పుడు పోద్ది!
చేతులతో గుద్ది, చేతులు కాలిన తరువాత
యే ఆకులు పట్టుకుని యేం లాభం!!!
ఐదేళ్ళు ఆగాల్సిందేగా???
కత్తిలాంతిది చేతిలోవుంచుకొని
ఉపయోగించలేని ఓటరుని
ఆపుతున్నదేమిటి???

పైగా ప్రజలు చైతన్యవంతులంటారేం! ఏది ఆ చేతనైనతనం?
మొలబంటి లోతులో దిగబడ్డ బుద్ధి రాదా???
నిండ మునిగిన తరువాత చలేమి్ వుండకపోవచ్చు!
మునిగే వుంటే శ్వాసే ఆగుతుందికదా!
ఆమాత్రం యింగితం కూడలేదా!
తిరుగుబాటు ధ్యాస కలుగదా!
లేక
శ్వాసే ఆపుకుంటారా!
మైకం నుండి ప్రజలు కోలుకోవాలని
మేలుకొని, వారి మేలుకొరకు
చర్నాకోలా ఝళిపించాలని కోరుకుంటూ.........!!!!!????

12912

No comments: