Monday, September 30, 2013

|| శకునపక్షి నాటికలో సామెతలు - నార్ల వెంకటేశ్వరరావు ||

కపిల రాంకుమార్| శకునపక్షి నాటికలో సామెతలు  - నార్ల వెంకటేశ్వరరావు ||
నార్ల వెంకటేశ్వర రావు రాసిన శకున పక్షి నాటిక ఒక రైతు కుటుంబ నేపథ్యమ్ళొ రాసినదైనా
సంభాషణలలో తెలుగు సామెతలు మెందుగా ప్రతీ పాత్ర ద్వారా పలికించిహాస్యం పండింది.
పొద్దున్నే వచ్చావేమిటన్న రామయయ్యతో సీతాపతి '' పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుపోయి 
వచ్చిన చుట్టం పోయేదిలేదని '' దిగులుగావుందా అంటాడు. అయినా నువ్వు వూరికినే రాలేదని
అన్నప్పుడు నీ కొకరి అంటూ సొంటూ గిట్టదు కదా అంటూ సీతాపతి '' నన్ను ముట్టుకోకు నామాల
కాకి '' అంటావు అనే సామెత వాడతాడు. యేం పనిమీదొచ్చావో చెప్పవయ్యా అన్నపుడు '' చల్ల 
కొచ్చి ముంత దాస్తున్నాననేగా'' నీచోద్యం! వూరికినే రావులేవయ్యా వచ్చిందెందుకో చెప్పు అన్నపుడూ
మళ్ళి సామెత వేస్తాడు సీతాపతి రామయ్యతో '' లాభంలేని  సెట్టి వరదను పోడంటావ్ '' బాగా
మాటలు నేర్చావనగానే '' వలచి వస్తే మేనమామ కూతురు వరస కాదనే రకం ' నీది  అని సమాధా
నమిస్తాడు . మనసులో మాట బయట పెడ్తున్నట్లనిపించేలా ' రోహిణీ కార్తెలో రోళ్ళు బద్దలుతా'యని
వురకే అన్నారా. తాగటాని చల్లబొట్టు కూడ లేదేమో అని రామయ్య భార్యతో అంటాడు.  అయ్యో
పాడిలేదేమీ అన్నయ్యా అనగానే '' పాడిలేని యిల్లు పాతాళలోకం కదూ''ఎక్కడైనం వాదికపీటుకో
వచ్చుగా అనగానే  యేమోనమ్మా '' అమ్మాబోతే ఆదివి  కొనబోతే కొరివి '' లాతెచ్చుకున్న అణా
పెరుగుతో కాలం గడువదుకదా. అయినా మీ పాలెం పడ్డ యీనిందనుకుంటాను, మర్మగర్భంగా
ఆరా తీయాలని ఆంటాడు. అందుకు  ''యీని యేం లాభంలే అన్నయ్యా నిన్న పక్కింటావిడ
దిష్టితగిలనట్టుంది ఒక్క చుక్కైఅనా విడివలేదు . వెంటనే అందుకుంటాదు ' నరుడి కంట
నల్లరాయైనా పగుల్తింది ' అని పాటిమీద సాయెబును పిలిచి తావెత్తు కట్టించు సలహా యిస్తాడు.
పిలిపిద్దామని పాలేరుని వెళ్ళమంటే కుదర్దు అని మొరాయించాడు. అంది ఇలాలు.  అలాగటమ్మా
' తిండికి తిమ్మ రాజు పనికి పోతురాజు '' పిదప కాలంలో పాలేరుమాట వినటంలేదు.' పత్తి గింజలు
తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట, మరి గంత కట్టనా అంటే ఊహూ అన్నాడాట '
అలావుమొదన్నమాట వాళ్ళపని. సాయెబుని నే వెళ్ళిపిలుచుకొస్తాగాని ఆ చల్లనీళ్ళు నువ్వే పోద్దువుగాని
 చెల్లమ్మా! అంటాడు. అదా ఆపనిమీద వచ్చావన్నమాట అని రామయ్య అనగానే ఆ ' అయినోళ్ళకు
ఆకుల్లో, కానోళ్ళకు కంచాల్లోను ' అని ఆర్.ఐ.కి సమర్పించుకున్నావు కాని నాకు కుండనీళ్ళడిగితే
ఎలా చదువుతున్నాడో బావ చూడమ్మా అని దెప్పుతాడు. అందుకు రామయ్య '' కాలికేస్తే
మెడకి, మెడకేస్తే కాలి ' వేస్తావు మాటలు నేర్చావుకదా, చల్లకొచ్చాననే విషయం ముందే చెప్పొచ్చుగా
అంటాదు.ఆ వెనుకటికెవడో'' కడుపులో లేందిం కావిలించుకుంటే వొస్తుందా ' అని సమాధానం
వెంటనే అందుకుంటాడు సితాపతి. ఇంకో సందర్భంలో పిల్లవాడు ఇంటికిరాలేదని ఇంటావిడ అనగానే
అందుకుని సీతాపతి '' సముద్రం యీదవచ్చు కాని సంసారం ఈదరాదు. ' ఈ కాలం పిల్లలకి యేం
తెలుస్తాయి, సంసారమ్ళొణి సాధక బాధకాలు వూరిమీద పడి తిరగటమేకదా. ఇంకో సందర్భంలో
సీతాపతీ నువ్వే నయం ఐదురూఅడపిల్లలకి పేళ్ళిళ్ళుచేసావు పైసా అప్పులేకుండా, అని రామయ్య
అనగానే  ఇక నామాటే చెప్పుకోవాలీ ' వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల
కామమ్మ వంకా్యల భారం తూగిందట '  నీకంటే నాలుగెకరాలుపంచుకున్నానే కాని  నాపని
'' నానాటికి తీసికట్టు నాగంభట్లు ' అన్నట్టుగావుంది, చ్వరికి పుగాకు తుంపుకు కూడా ఠికాణా లేదు.
వెనకటికి నాబోటివాడెవదొ '  దశాదశా రమ్మంటే, దరిద్రాన్ని పిలవమన్నదట!.'' దశంటే నీది
పుగాకుకాడొకటి పారెయ్ బావ!, అని మరొక కోరిక వెళ్ళబుచ్చుతాడు సీతాపతి.......
______________________________________________
....నాటిక ఆసాంతం కథా సంవిధానం తో పాటు, సంభాషణలు గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది.
నార్లవారి రచనలు వాల్యూం 2 - సంపాదకుడు :వెలగా వెంకటప్పయ్య- ప్రచురణ- నార్ల కుటుంబం
2004 వెల.200-/- అన్ని పుస్తక విక్రయకేంద్రాలలో
___________________________________________
27-9-2013 - సా. 5.30

No comments: