16, ఫిబ్రవరి 2014, ఆదివారం

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

సారస్వత స్రవంతి - కవి గాయక విపంచి
వచన పద్య కవితల - గేయ వ్యాస కళాకేళి!

అదును పదును కల్పించి
అంకురాలుమొలకెత్త
సాహిత్యపువన సొబగులు
గుబాళించు పూదోట!

మత తత్వం - కుల తత్వం
ఉగ్రవాద విధ్వంసాలను
నిలువరించు సంకల్పం
నిలుపుకున్న దీరత్వం!

చిరుజల్లులా, వానలా
వాగులా, జీవ నదిలా
అనునిత్యం పారేందుకు
పచ్చదపు గీతంలా!

కవిత్రయ కరచాలన స్పర్శతో
గురజాడ శ్రీరంగం కాళోజిల
ఆదుగుజాడలలో బడుగులకై
మా నడకలు సాగిస్తూ!

కొత్త కొత్త వాదాలకు
వైరుధ్యపు భావాలకు
సమతుల్యం పాటిస్తూ
సంయమనం నెరపుతూ!

సహకారం పొందుతూ
సహజీవన సాగిస్తూ
'' సాహితీ స్రవంతి'' గా
ప్రస్థానం చేరేలా!

అంతరంగ విస్తరణతో
అంతర్జాల వ్యాప్తితో
కొనసాగుట మా లక్ష్యం
నూతన అరుణోదయం!

( ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి - ఆవిర్భవించి 15 వ వార్షికోత్సవానికి
సన్నిద్ధం అవుతున్న సందర్భంగా జయప్రదమైన 16.2.2014 నాటి విస్తృత
సమావేశానికి నా కవితాశంస ) సా.6.30

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కపిల రాంకుమార్ |"MY MUM"||

కపిల రాంకుమార్ |"MY MUM"||

Where did it go?
My mother once asked
As the clock tick-tucked
And her life flew past
In the race against time
She led for most of the way
But the track was endless
Unlike her last day
(Take care of your father
Promise you will
As she passed on the baton
She would never spill)
So polish the stars
And fire up the sun
And put out some slippers
To welcome my mum
Find a new galaxy
And light up her name
Because life on planet Earth
Just won't be the same
--- |Michael Ashby|
(స్వేచ్చ్హనువానువాదం)
నా తల్లి ఒకసారి
గడియారం టిక్ టిక్‌ సవ్వడి ఆగినపుడు
అది ఎక్కడికెళ్ళిందని ప్రశ్నించి
ఆమె జీవితం గతించటానికి వెళ్లింది
కాలానికి వ్యతిరేకంగా పరుగుల దిశలో
ఆమె విధంగా అత్యంత చివరి కాలం కోసం దారితీసింది
కానీ మార్గం అంతులేని ఉంది
ఆమె చివరి రోజు కాకుండా
(మీ తండ్రి సంరక్షణ తీసుకుంటానని
వాగ్దానం చేయాలంది
ఆమె రంగంనుడి నిష్క్రమిస్తుండగా )
కాబట్టి నక్షత్రాలు మెరుగును
సూర్యకాంతి తేజస్సును ఆర్పేందుకు
మా అమ్మకు స్వాగతం పలుకుతున్నట్లు
ఒక కొత్త పాలపుంత
ఆమె పేరు దేదీప్యమానంగా వెలగించటం కోసం
ఎందుకంటే భూమిపై అన్ని జీవితాలు
కేవలం ఒకేలా ఉండవని తెలియచెప్పినట్లుంది.
14.2.2014

10, ఫిబ్రవరి 2014, సోమవారం

|| సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||

కపిల రాంకుమార్ || సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||
'' అధునికత '' పదనిర్వచనానికి , '' సమకాలిక '' పద నిర్వచనానికి తేడా వుంది. ఆధుని క కాలవాచికా చెప్పుకునే అర్థం. ఒక కాలానికి ' ఆముక్త మాల్యద ఒక ఆధునిక గ్రంథం అని చిన్నయసూరి అంటారు. కొన్ని విలువల సంప్రదాయం, చారిత్రికనేపథ్యం మార్పులతొ మరికొన్నింటిని అభ్యుదయ కావ్యాలు అంటాము. సమకాలిక అంటే ఏక కాలంలోవచ్చిన కావ్యాలకు విశ్వనాథ, చలం,శ్రీశ్రీల రచనలను సమకాలిక సాహిత్యం అంటాం. రెండూ భిన్న ధోరణులను,వాదాలను, ప్రతిబింబిస్తూ సాహిత్య సృజనతో ముందుకొస్తాయి. సాహిత్య దృక్పథం దృష్ట్యా విశ్వనాథ ఆధునికుడు కాదు.
సమకాలీనత:- ఈ దృష్టితో చూస్తే ఆ కాలంలో వచ్చిన ఏ సాహిత్యమైనా సంప్రదాయం
గానీ, నవీనంకాని ఆధినికతే అనిపించుకుంటుంది.
ఆధినికత:- కాలంలో వచ్చే ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులను గమనిస్తూ,
కాస్త దృక్కోణంలో కవితసృజనలో కావించడమే ప్రత్యేకతను సంతరించుకోవటంద్వారా
ఆఢునికతగా గుర్తింపబడుతుంది. కొన్ని విలువలు, తత్త్వాలు కలిగివుంటుంది. సామాజిక
ప్రయోజనం, హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథం వాస్తవికతలపైఆధారపడటం అనే అంశాలను
ముడివేసుకుని సహిత్య దృక్పథం కలిగిన తాత్త్వికతతో నిలడేదే ఆధునికత.
***
అభ్యుదయవాదం, విప్లవ వాదం వాస్తవికతావాదాలు కొంతవరకు హేతు వాదాలు ఈ
కోవలోకే వస్తాయి.ఆధినికతాతత్త్వం పరకాష్ట చేరిన దశలో సింబాలిజం, ఇమేజిజం,
ఇంప్రెషనిజం, ఫ్యూచరిజం, డాడాయిజం, సర్రియలిజం, నేచురలిజం అనే ధోరణల
సమూహమే '' ఆధునికతకు '' మారుపేరులయ్యాయి.ప్రపంచంలో 1748 లో వచ్చిన వైజ్ఞానిక పారిశ్రామిక విప్లవం, 1780 లో వచ్చిన రాజకీయ ఫ్రెంచ్ విప్లవం 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధ నేపథ్యాలలో ఈ సాహిత్య ప్రపంచంలో కవిత్వం కొత్తపుంతలు తొక్కింది. కాల్పనిక వాదం, సాంప్రదాయికతా వాదం, హేతువాదం లాంటివి 18, 19 శతాబ్దంలో మానవుడికీ ప్రకృతికి మధ్యగల సంబంధాలు, వైరుధ్యాల నేపథ్యంలోనే ఉద్భవించాయి. తదుపరి స్వేచ్ఛావాదం, ఫ్రాంస్‌ లోను, ఆదర్శవాదం జర్మనీలోనూ, సౌందర్యవాదం బ్రిటన్‌లోనూ పుట్టాయని తెలుస్తోంది.
***
మన తెలుగునాట కాల్పనిక వాదానికి ఆర్థిక పునాదులు లేవు. అర్థ ధనస్వామ్య, అర్థ భూస్వామ్య విధానాలు కొనసాగి భావ కవిత్వం పురుడుపోసుకుంది. పై పాశ్చాత్య ధోరణులు ప్రభావంతో, భిన్న ధోరణులతో భావ కవిత్వంలో చోటుచేసుకున్నాయి. స్వీయ నియంత్రణ ద్వారా అమలిన శృంగారం, విషాదం,నిరాశ, పునరుద్ధరణ, జాతీయోద్యమం, దేశభక్తిలాంటివి భావ కవిత్వంలో మార్పులు మనం గమనించవచ్చును.అలాగే సామ్యవాద వాస్తవికతకు, కాల్పనంకతను జోడించినపుడే సాహిత్యం ప్రజలకు చేరువౌతుంది అని విప్లవవాదుల భావన. తాత్వికంగా ఆధునికతలో భాగంగా తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న ధోరణి వాస్తవికతావాదం సహజవాదం(నేచురలిజం)పేర అమెరికా రష్యాలలో 19 వ శతాబ్దం చివరిలో విరివిగా కనిపించింది. వాస్తవికతా వాదంలో (క్రిటికల్ రియలిజం) సవిమర్శక వాస్తవికత(సోషలిస్టు రియలిజం) సామ్యవాద వాస్తవికత ప్రధాన అంశాలుగా పేర్కొనవచ్చును. వాస్తవికతను ప్రతిబింబించడంతోపాటు సామాజిక జీవిత సమస్యలకూ పరిష్కారం సూచించడం ఒక భాగమని తెలుస్తుంది. సమాజ చరిత్ర దృష్టితో చిత్రీకరించడం కూడ వాస్తవికతలోని భాగమే. '' కమ్యూనిస్టు అన్విక్షకి విషయంలో అచంచల నిష్ట, ప్రజాసేవానిరతి, పాక్షికత,శ్రామికజన సమరశీల పోరాటాల సంబంధం, మానవీయ
సోషలిజం'' సామ్యవాద వాస్తవికతకి అద్దం. ఈ పరిస్థితిని వివరించేది మాత్రం గతితార్కిక
భౌతిక వాద సిద్ధాంతమే. ఆ సిద్ధాంతమే అభ్యుదయ సాహిత్యానికి పునాది. త్రిపురనేని రామస్వామి చౌదరి రచనల్లు రేషనలిజం ఆధారంగా వుంటాయి. పాశ్చాత్య దేశాలలో

17 వ శతాబ్దంలో ఆరంభమై మనదేశానికి 20 శతాబ్దానికి మాత్రమే యిది మొగ్గతొడిగింది. కాల్పనిక వాదానికి సమాంతరంగా హేతువాదం ఆరంభమైంది. ముద్దుకృష్ణ '' అశోకుడు ''- చలంగారి '' సావిత్రి ''- పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి '' మహాభారత విమర్శనం'' - నార్ల వారి '' జాబాలి '' - త్రిపురనేనివారి '' ఖూని. భగవద్గీత, '' లాంటివి ఉదహరించుకోవచ్చు.
***
తరువాతి పరిణామాలు అధివాస్తవికత, అస్తిత్వవాదం, అనుభూతివాదం, చైతన్య స్రవంతి, విప్లవ వాదం సంప్రయదాయవాదం, రూపవాదం, జనామోద వాదంలాంటీ ధోరణులు శాఖోపశాఖలుగా వాదాలు, వివాదాలు నినాదాలు ఉద్ధానకతనాలతో సాగింది. సాహిత్యోద్యమం దిగంబరకవిత్వం, దళిత వాదం, స్త్రీవాదం, అంటూ ఎన్నో రకాలుగానూ సాగింది. అరసం, విరసం, సరసం..ప్రరసం...అంటూ సంఘాలూ వచ్చాయి.సాహితీకృషి విరివిగా జరిగింది.
ఉపసంహారం:
దేవీప్రియ ఒక వ్యాసంలో '' రచయితలకేమైనా చెబితే లెక్చరిచ్చినట్టుంటుంది. జనామోదం కోసం యేదిపడితే అది రాయకండి. జనానికేమి అవరమో? ఎటువంటి జాగృతి అవసరమో? అది రాయటానికి మాత్రమే ప్రయత్నించండి! కె.వి.రమణారెడ్డి చెప్పినట్లు '' మార్క్సిజమే '' వల్లెవేయాల్సిన పనిలేదు. కాని, కావలసింది జీవిత వాస్తవాన్ని కాస్త చైతన్యవంతంగా అర్థంచేసుకుని, స్పష్టమైన అవగాహనతో సాహిత్య రూపంగా ( కథ/కవిత/పద్యం.గేయం/వ్యాసం/రూపకం)రూపమేదైనా దాన్ని లోకానికి చేరేలా చేయగలిగితే - ఆ సాహిత్యానికి అసలు సిసలు జనామోదం లభించి తీరుతుంది ''
Betrot Bretcht అభిప్రాయం ప్రకారం '' Popular means intelligible to broad
maasses, taking over their own forms of expression and enriching them (by adopting and consolidating their stand point) representing most progressive section of the people in such a way than it can take over to leadership.''

***
ఇవాళ కొత్త ధోరణి ప్రబలింది. మార్క్సిస్టు సిద్ధాంత నినాదాలు, విప్లవ అలంకారికత వాడే
రచయితల తెగ యింకొకటి పుట్టుకొచ్చి, '' కవిత్వ పదార్థం '' యెక్కడున్నా అస్వాద యోగ్యమే! మార్క్సిస్టు సిద్ధాంతం పోరాట ప్రవచనాలు తమకీ తెలుసు. అచరణకీ సిద్ధాంతనికీవున్న మార్క్సిస్టు నిబంధనని విస్తృతం చేయడమే వారి లక్ష్యం. ఆంధ్ర దేశంలో యీనాడు వెలువడుతున్న సాహిత్యాన్నీ పలాయనవాద సాహిత్యం, బూర్జువా సిద్ధాంత పునాది అధారంగా వున్న సాహిత్యం అతి '' వామ '' పక్ష సిద్ధాంత ప్రేరిత సాహిత్యంగా స్థూల విభజన చేసుకోవచ్చు.పై తరహాలన్నీ కూడ ప్రయోజనపుష్టమైన సాంస్కృతిక రంగాన్ని యేర్పాటు చేయవు. ఫెడ్రిక్ ఎంగిల్స్చెప్పినట్టు '' Freedom is recognition of necessity '' ఇదే అంశం మీద క్రిస్ట్‌ఫర్‌ కాడ్వెల్‌ అన్నమాట గుర్తు
తెచ్చుకుందాం '' Art is the expression of man's freedom in the world of feeling, just as science is the expression of freedom in the world of sensory perception, because both are conscious of the necessities of their worlds and can change them-art the world of feeling of inner reality, science the world of phenomena of outer reality'' (Illusion and reality - Christfer Caudwel)

(ఆర్వీఆర్ వ్యాాసాల నుండి సేకరణ )

10.2.2014 ఉ.7.30

1, ఫిబ్రవరి 2014, శనివారం

కపిల రాంకుమార్|| మచ్చ ||

కపిల రాంకుమార్|| మచ్చ ||

ఒంటరి గది, చిన్న కిటికి
రెండో మనిషికి నిలబడె చోటులేని
ఇరుగు గది...
ఆ గదిలో దాదాపు ఐదేళ్ళు బందీని!
అదీ పెళ్ళయ్యే వరకు!
తలచుకుంటేనే భయం! భయం!
రజస్వలైన 12 ఏటనుండి
తిండికి స్నానానికి తప్ప - బయటిలోకం తెలియకుండా
నిర్బంధానికి గురిచేసిన - సంప్రదాయపు సంకెళ్ళు!
మరువలేని కరాళ నృత్ర్యం! కళ్ళల్లో శూలాల్లా గుచ్చుకుంటూ
కంటి నిండా నిద్రలేని రోజులెన్నో
కన్నీటి చారికలతో చెంపలు - బిగిసిన విషాదపు ఘాతాలెన్నొ!
చదువు చంకనాకి - గుణింతాలు మరిచిపోయే
మైమరుపు ఆవహించినట్లు - అక్షరాలు తడుముకుంటూ
పనికిరాని కాగితాలపై - కాటుకలో ముంచిన చీపురుపుల్లతో
రాసుకున్న పిచ్చి భావనాగీతాలెన్నో!
***
ముక్కు మొహం యెరుగని
కొత్త వ్యక్తితో ముడిపడేవరకు లభించని విముక్తి
అది స్వేచ్చ మాత్రం కాదు
మరో బందిఖానాకు బదిలీ మాత్రమే
అక్కడా ఎన్నో నిబంధనలు,
నియమాలు కట్టుబాట్లు ....
చదువుకు మాత్రం పుల్‌స్టాప్‌ పెట్టిన వైనం!
కోరిక కొంత కాలనాళికలో స్థాపితం కాబడిన కొత్త కారాగారం
అత్తవారిల్లు!
***
ఒక రోజు పెద్ద ఉరుము మీద పడ్డట్టు మా వారి గొంతు
ఎవరో చెప్పితే, విని ముక్కోపంతో
రాక్షసుడిలా ఘర్జన...
'' చదువురాదను కుంటే
కవితలు, కథలు కూడానా....అదీ
పురుషాహంకారాన్ని సవాలు చేసేలానా? ''
అంటూ తన నడుము బెల్టుతో
విశ్వరూపం నా వీపుమీద!
కళ్యాణమైన తదుపరి సుఖపడింది లేదు
పైపెచ్చు ఆంక్షలు! పాబందీలు!
పెళ్ళికాకముందు చిత్తుకాగితాలపై రాసిన భావనలు
మా తమ్ముడు జాగ్రతగా వివిధ పత్రికలు పంపినట్టున్నాడు
నా కర్మకాలి అచ్చవటం - మా యముడి దృష్టికి రావడం!
ఈ రసాభాసకు ఆజ్యం అయింది!
మళ్ళీ నాలుగేళ్ళు మౌనం!
మా యమునిలో మార్పు వస్తుందేమోనని
అదీ ఒక కొడుకుపుట్టిన తరువాతనైనా
అడియాసే మిగిలింది.....
ఆంక్షలు యథాస్థితే కొనసాగింది!
రెండో సంతానం ఆడపిల్ల కలగగానే
నాలో పట్టుదల ఎక్కువైంది!
నాలా నా బిడ్డ నిర్బంధాలకు గురికాకూడదనుకున్నా!
గట్టి నిర్ణయం తీసుకున్నా
యముడ్ని సమధానపరచాలని చూశా! -
ఊహూఁ . ససేమిరా అన్నాడు!
నా అత్త మామలు అదే దారి
తీవ్ర సంఘర్షణానంతరం విడాకుల వరకువెళ్ళింది!
కొంత కాలానిలి మా ఆమ్మ, నాన్న గతించారు,
ఇక నాకు పెద్ద దిక్కుగా ఒకే ఒక వితంతు సోదరి,
తను మాత్రం నా భావాలకు విలువిచ్చి
ప్రోత్సహించింది కాబట్టి
మీ ముందు ఓ రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్టుగా
ఒక తల్లిగా, ఒక ఉద్యమ కార్యకర్తగా ...నిలబడ్డాను.!
అందుకు నా లాగే మచ్చలనుభవించిన మా అక్క
నన్ను ఇంత దానిని చేసింది....ఆమెకు ఎల్లపుడూ
ఋణపడివుంటా నేనెల్లపుడూ.....
నా బిడ్డ, నాకొడుకు ఇద్దరు చదువుకుంటున్నందుకు
ఆనందం, సంతోషం,
నేపుట్టిన 33 సంవత్సరాలనంతరం
నాలో కొత్త సమరోత్సాహం !
వంటి మీద మచ్చలుగా మిగిలినా,
మనసుమీది మచ్చను తొలగించాలని
మచ్చరాలిక రాకుండా నిలువరించాలని!

***.....
ఒకానొక దృశ్యం దీనికి ప్రేరణ .....
1.2.2014 సాయంత్రం 4.10

28, జనవరి 2014, మంగళవారం

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||
'' మెజారిటీ మతానికి చెందిన మత తత్వాన్ని, జాతీయవాదంగా భావించే ప్రమాదం నిరంతరం పొంచి
వుంటుంది ''  - నెహ్రూ - 1961 జనవరి 5న చెప్పిన మాటలు.

'' ఒకేసారి కేంద్రంలో అధికారాన్ని రుచి చూసిన హిందూత్వ శక్తులు యిప్పుడు మరోసారి ఎలాగైనా,
అవసమైతే మోడీ వాచాలతను ఉపయోగించుకునైనా, లేక గుజరాత్ అల్లర్లలో అతని పాత్రను చూపించైనా
లేక ఆర్.ఎస్.ఎస్. హిందూత్వకు ఆయన తిరుగులేని మద్దతును చూపించైనా అధికారంలోకి
రావటానికి ప్రయత్నిసుతున్నారు. వారి ఈ స్కీములో వల్లబ్‌భాయ్‌పటేల్ వ్యక్తిత్వం వారికి సరిగ సరిపోతుంది.''

'' హిందూ జాతీయవాదిగా పేరుపొందిన పటేల్‌కు  అర్.ఎస్.ఎస్. తో రహస్య, వ్యక్తిగత సంబంధాలూ.
ఏర్పాట్లు వుండేవి. భారత్‌, బ్రిటిష్‌ వ్యాపాద ప్రపంచంతో మంచి సంబంధాలుండేవి. ఆయనకు విజ్ఞాపనలు
చేసుకుంటుండేవారు.  సనాతన హిందువుగా ఆయన తన మత తత్వ సానుభూతులను కప్పిపుచ్చుకునేవారు దాదు ''

'' కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించే ' పాన్‌సుఖ్‌లాల్‌ మఫత్‌లాల్‌ ' ఈతకొలను ముంబాయిలోని
మెరేన్‌డ్రైవ్ వద్ద ఇప్పటికీవుంది. దానిని సర్దార్‌ పటేల్‌ ప్రారంభించారు. ''

'' మహాత్మా గాంధీ హత్యకు జరిగిన కుట్రపై '' విచారణ కమిటీ నివేదిక '' సమర్పించిన జస్టిస్‌ జె.ఎల్‌.కపూర్ ..
మహాత్ముని ప్రాణం తీసిన ఈ హత్యపై విచారణ జరగాల్సిన రీతిలో జరుగలేదనీ, అడుగడుగున అధికారుల
నిర్లక్ష్యం కనిపించిందని చెబుతూ '' విచారణకు ఇంచార్జి మంత్రిగావున్న హోమ్‌ మంత్రి వల్లభ్‌భాయ్‌ పటేళ్
కూడ దీనిపై ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు '' అని చెప్పారు కపూర్.

'' భారత తొలి గవర్నర్  జనరల్ రాజాజీ లౌకిక వాది కనుక అతనిని రాష్ట్రపతి కాకుండ పటేల్ అడ్డుపడ్డాడని తెలుస్తుంది.''

'' 1848 జనవరి 6న పటేల్‌ ఒకవైపు అబ్దుల్ కలామ్‌ అజాద్‌  దేశభక్తిని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్.
వాళ్ళను కాంగ్రెస్‌లో చేరాలని అహ్వానించారు. పచ్చి మతతత్వ వాదులు మాత్రమే ఆ పనిచేయగలరు

'' నేను భారతీయ ముస్లిమ్‌లను  ఒకేఒక ప్రశ్న వేస్తున్నాను. ఇటీవల జారిగిన అఖిల భారత ముస్లిమ్‌ కాంఫెరెన్స్ లో
మీరు కాశ్మీరుపై ఎందుకు నోరు మెదపలేదు? పాకిస్థాన్‌ చర్యలను ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ ప్రజలమనసులో
సందేహాలు లేవనెత్తుతున్నాయి. దేశభక్తిలేనివారు పాకిస్థాన్‌ వెళ్ళిపోవచ్చు '' - పటేల్

'' పటేల్‌ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరులైన  రఫి అహ్మద్‌ కిద్వాయ్ వంటివారిపైనా, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీమీద
గూఢచారి శాఖ యిచిన ' రహస్య నివేదికకాపీ 'ని 1948 ఫిబ్రవరి 6న నెహ్రూకు పటేల్‌ పంపారు. తనను మంత్రి
వర్గం నుండి తొలగించడానికి కాంగ్రెస్‌ సోషలిస్ట్ పార్టీ కుట్ర పన్నినట్లు సృష్టించిన నివేదిక అది ''

' ఉప ప్రధాన మంత్రిగా, హోమ్‌ మంత్రిగా పటేల్ కాశ్మీర్ మహారాజును సమర్థించేవారు. మహారాజుకు వ్యతిరేకంగా
పోరాడే ప్రజానాయకుడైన షేక్ అబ్దుల్లాను, ప్రజా ట్రిబ్యునళ్ళను పటేల్ వ్యతిరేకించేవారు. భారత్ యూనియన్‌లో
కలసిపోడానికి కాశ్మీర్ మహారాజును ఒప్పించేందుకు ప్రయత్నించే వారు. చివరికి 1948 జనవరి 31 న
కాశ్మీర్ రాజు తాను స్వతంత్ర దేశంగా విడిపోతానని బెదిరించినప్పటికీ, ఆయనపట్ల సానుకూలంగానే వ్యవహరించాడు. ''
__________________________________________
22.1.2014 సాయంత్రం 4.10
__________________________________________
పేజి 9 నుండి 15 జనవరి నెల 2014 మార్క్సిస్టు పత్రికలో ఎ.జి.సూరానీ వ్యాసంలో ముఖ్య అంశాలు.


కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

దండలో దారంగా ఉండి, నేర్పరితనం కలిగివుండటమే శిల్ఫం అని కన్నేగంటీ వెంకటయ్య సాహితీ స్రవంతి 6వ అధ్యయనవేదిక ప్రతీనెల మూడవఅదివారంలో భాగంగా ది.19.1.2014 సమావేశానికి తన అధ్యక్షోపన్యాసంలో అన్నారు. తొలుత ఇటీవల మరణించిన  ప్రముఖ కళాకారులు, చలన చిత్ర  ప్రముఖలకు సంతాప తెలుపుతూ ఒక నిముషం మౌనం పాటించారు. బి.వి.కె. విద్యార్థి ఆసు ప్రసాద్ గీతాలాపనతో కార్యక్రమం ఆరంభమయింది. ముఖ్యాంశం  '' కవిత్వం - శిల్పం '' - వాస్తవంగా ఆనందాచారి ప్రసంగించవలసివుంది. కారణాంతరాలవల్ల వారు హాజరు్కాలేకపోయారు. అదే అంశంపై డా.పి. సుబ్బారావు గారిని ప్రసంగించవలసినదిగా కన్నెగంటి వెంకటయ్య కోరారు. మరొక కవి జీవన్‌, కపిల రాంకుమార్ గార్లను కూడ  దానిపై మాట్లాడవలసినదిగా వేదికపైకి పిలిచారు. శిల్పంపై పట్టు సాధించిన వారు అద్భుత కవితా సృష్టికర్తలుగా పేర్కొంబడతారని, ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసములు ఎంతో సహకరిస్తాయని వివరించారు.డా.పి. సుబ్బారావు గారు మాట్లాడుతు కవిత్వ భాష ఒక ప్రత్యేక భాష అని, మన 20 శతాబ్ద కవులు అభిభాషించారని తెలిపారు. కవిత్వం శిల్పం పరస్పరాధారితాలని, పద్యం రాసేటప్పుడు కవి తన భాషనుంచి పక్కకు తొలుగుతాడని, దానికొక ప్రత్యేక శైలిలో నేర్పుగా సృజనచేస్తాడని అన్నారు. ,వ్యాకరణం మొదట సంస్కృతలో మొదట వ్రాయబడి, తదనంతరం తెలుగులోకి వచ్చింది. నన్నయ వ్యాకరణం అందుకుదాహరణ.  బాల వ్యాకరణం
ప్రౌఢ వ్యాకరణం, అప్పకవీయం, ఇలా పరిణామ క్రమం.  కాకువు - నిత్య జీవితంలో ఉపయోగించే భాషలోవాడబడేదని అన్నారు. ధని, రసం ప్రధానంగా కవిత్వం సాగాలని దానికి తోడుగా అలంకారాలు సొగసునిస్తాయని చెబుతూ ధ్వని ప్రధానంగా 1. డినొటేషన్‌ 2. కనొటేషన్‌ 3. సజెషన్‌ లపై అధారపదివుంటుందనిదీనికి అదనంగా ఉక్తి వైచిత్యం , సర్వకాలీనత (విశ్వజనీనత)....ఇప్పటికి చెప్పకోతగిన మంచి ఉదాహరణ యెండ్లూరి సుధాకర్  కొత్త గబ్బిలం .  ఛందస్సు -అంటే  (అంద చందాలకు దగ్గర సంబంధం) అందం అని అర్థం. సమాజం లేక పోతే (ప్రపంచం) కవిత్వం లేదు. ఒక్క అడుగు ముందుకు వేయించేదే కవిత్వం. లోక పరిశీలన లేక కవిత్వం మనజాలదు. కవితలో ఓక మెరుపు, ఒక ఉరుము, ఒక స్వాంతనం, ఒక వేదన, అలోచన మిళితమైవుండాలి. - '' బాలపు బస్తాలను మోస్తున్న ఆ స్త్రీలు - గ్లోబును  ఎత్తుకున్న  అట్లాసు '' అని సుధాకర్ అన్నారు తన కొత్త గబ్బిలంలో సందర్భానికి తగ్గ పద ప్రయోగం, చేసి శ్రోతను/ పఠితను ఆకట్టుకునేదే శిల్పం అది నింపునున్నదే కవిత్వం.ఓ తిక్కన, ఓ వేమన ఓ గురజాడ అంటే నాకిష్టం ఆధునిక కవిత్రయం అని శ్రీశ్రీ అన్నారని చెపారు. కవిత్వం ఒక ఆల్కెమీ అంటాడు ' తిలక్ ' నిజమే కదా! ..ఫిలాసఫీ ఆఫ్ కాంపొజిషన్‌ అనే గ్రంథం తప్పక చదవండి అని సలహా యిచ్చారు. భాస, పదజాలం, ఊహ కలిగివుండాలి.  పప్రబంధ, ఆశు, బంధ, చాటు కవిత్వాలు కవిత్వంలో వచ్చిన పరిణమాలనే తెలుసుకోండి. కావ్య పఠన పునాది కావాలి. అదే అధ్యయనం,అభ్యసనం, సృజనం గా మార్పుచెందాలి.  పురాణ, ఇతిహాస, చారిత్రిక, సాంఘిక, పద్య, వచన కవిత్వం పరిచయం చేసుకుంటేనే కొత్త పోకడలు కవిత్వంలో చూపించగలం. కొన్ని సోదాహరణలుగా పద్యాలు, కవితలు చదివివినిపించారు. సమావేశానికి హాజరయిన వారి కోరికపై ఇదే అంశం వచ్చే మూడవ ఆదివారం కొనసగించాలని తీర్మానించారు.
మరొక ప్రముఖ కవి జీవన్‌ దీర్ఘ ఉపన్యాసం జోలికి వెళ్ళక కొన్ని కవితలను ఉదహరిస్తూ ఆయా కవుల కవిత్వ శిల్ప చాతుర్యాన్నివివరించారు. తెలంగాణా రైతంగ సాయుధపోరాట కాలంలో ఎంతో అభ్యుదయ సాహిత్యం వచ్చింది కుందుర్తి ' తెలంగణా 'సోమసుందర్ ' వజ్రాయుధం ' ఆరుద్ర  ' త్వమేవహం' గంగినేని ఎర్రజెండాలు, అవేకాక వాటినేపథ్యంలో నవలా సాహిత్యంకూడ వచ్చింది. దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి లాటి వారు ప్రసిద్ధులు.వాటిలో కవిత్వం, శిల్పం, శబ్దం, ధ్వని, రసం,చక్కగా అలరించాయి.  దర్మిలా నేటి  తెలంగాణ ఉద్యమకాలంలో కూడ చక్కటి కవిత్వం ప్రపంచంలో ఎప్పుడూ రానంతవిరివిగానూ వచ్చింది. కవిత్వం ఒక హృదయంనుండు మరొక హృదయంలోకి ప్రవేశిస్తేనే - అది కవిత్వమై తీరుతుంది అని చలం అంటూండేవారని చెప్పారు అంటూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్ది కవితలు, విశ్లేషణలు క్లుప్తంగా తనప్రసంగాన్ని ముగించారు జీవన్‌.
గ్రంథాలయ నిర్వాహకుడు, కవి కపిల రాంకుమార్ మాట్లాడుతూ కాలాన్ని హరించ కుండా, కొన్ని ముఖ్యమైన అధ్యయన చేయవలసిన పుస్తకాలుగా  హరగోపాల్ -''రూపం సారం '',  కె.కె.రంగనాథాచార్యులు ''సాహిత్యంలో విభిన్న ధోరణలు ''  సాహిత్య  శిల్ప సమీక్ష లాంటివి బాగా ఉపయోగపడతాయన్నారు. శ్రీశ్రీ కవితలను ఉదహరించినంతగా విమర్శకులు ఉదహరించే కవి అలిశెట్టి ప్రభాకర్, తెలంగాణకు చెందినవాడవటం గర్వించతగిన విషయమని తెలిపారు.హాజరైన కవులలో సునంద, శైలజ, బండారు రమేష్, షేక్ బషీర్ కవితలు చదివారు. రౌతురవి వందన సమర్పణ చేస్తూ మరల ఫిబ్రవరి నెల మూడవ ఆదివారం తిరిగి ఇదే అంశం కొనసాగుతుందని తెలిపారు..


24.1.2014 సాయంత్రం  2.50

26, జనవరి 2014, ఆదివారం

|| బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

కపిల రాంకుమార్ || బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

ఒకప్పటి మా ఫ్రెండ్ 
పాపం! వాడు పిచ్చి వాడో
మద బిచ్చగాడో తెలీదు 
అచ్చం చూడ్డానికలావుంటాడు...
కాని బాగా చదువుకున్నవాడు
విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు కూడానట!
అదేమి పొయేకాలమో
పెడధోరణో....లేక
పెర్వర్టెడ్ ఇంటిల్‌జెన్‌సీయేమో  తెలియదు కాని
రాతలనీండా రోతలే
నోటితో ఉచ్చరించే మాటలన్నీ విషయించాలనే కూతలే
మత్తులోవుంటాడో? మదంతో వుంటాడో?
బోధపడడు.....వేషం ఆచార్య దేవునిది కదా!
ఏమీ అనలేము, ఏమీ అనకుండాను వుండలేము!
ప్రేలాపనలు చూస్తుంటే
ఒక సారి ఫ్రాయిడ్ సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి!
ఒక సారి మరీ పైత్యం తలకెక్కి
కైపులో వుంటాడో
పక్కవాడికి కైపెక్కిస్తాడో కాని
ఒకపట్టానా అర్థం కాడు!
స్నేహితుడ్ని రెచ్చకొడతాడో, హేళన పట్టిస్తాడో
అంతరంగం పరీక్షించాలనుకుంటాదో కాని
'' మా శ్రీమతి అందంగా వుంటుంది!
అంత అందంగాను వంట చేస్తుంది!
మరి మై డియర్ గే నీకేమైనా కోరిక పుడుతోందా
ఓపిక చేస్తావా, నా బదులు షేర్ చేసుకో చూద్దాం! ''
అనే తలతిక్క మాటలకి
స్నేహితుడనేవాడు....నిజంగా స్నేహితుడైతే
స్నేహాన్ని వదులుకుంటాడు కాని
స్నేహితుని పైత్యపు కోరికకు ఊఁ కొట్టడు!
మీరేమంటారు?
26.1.2014 ..... 7.35 pm
_______________________________________
అలాంటివాడొకడు నాకు తారస పడితె లాగి చెంపమీదొకటిచ్చి, వాని భార్యతో చెప్పితే
ఆమె చాల బాధపడి....తన వెర్రి వేషాలు స్నేహితులమధ్యకు తెచ్చాడూ అంటూ
కలత చెంది, గత అనుభవాలను జత చేసి ....న్యాయస్థానం ద్వారా వానినుండి విడాకులు
తీసుకొని సజావుగా తన బతుకు గడుపుతోంది.
___________________________________

17, జనవరి 2014, శుక్రవారం

27, డిసెంబర్ 2013, శుక్రవారం

- ||అంకురం ||

కపిలరాంకుమార్ - ||అంకురం ||

'' ప్రణయాంకురం - మోదం ''
'' ప్రళయాంకురం - ప్రమాదం '' -

27.12.2013

22, నవంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

ఆప్ కే కద్మోం మేఁ
షుక్రియా ఆదా కరతా హూఁ హుజూర్
మగర్ కభీభి నజర్
బేజార్ మత్‌కరో!
హజార్ బార్ విచార్‌కె బినా బాత్ మత్ కరో!
తంద్రుస్తు దిమాక్‌సే పైదా హోకర్
ఖుల్లా సఫర్‌మే క్యా ఫాయిదా?
అర్జ్‌ క్యా హైకీ బినా వాయిదా
కామ్‌ సఫల్‌ హుయేతో
సబ్ లోక్ హోతా ఫిదా!
యే మొహబత్ కా వజీర్
స్వీకార కరో హమారా షర్త్
చమక్‌తే రహో సితారా జైసే
హోషియార్‌సే జీత్ హాసిల్‌కరో!
అబ్‌ ఆవో మేరేపాస్
ముజేఁ లేజానేకిలియే
తబ్‌ తక్‌  ఇంతజార్ కరూంగా!
ఆదాబ్ ...జనాబ్‌ ...ఫిర్‌ మిలేంగే!

22.11.2013 సాయంత్రం 3.32

21, నవంబర్ 2013, గురువారం

కపిల రాంకుమార్|| మినీలు ||

కపిల రాంకుమార్|| మినీలు ||

మంచిని పేంచేలోగా - నీ
పంచన  చేరినవారే
వంచనతో
ముంచుతారు!          1

పొట్ట కొట్టే వారిపై
దట్టించి ఎదురుతిరగ
జట్టుకట్టేదెపుడో
పట్టుచిక్కేదెపుడో
పొట్టకూటిగాళ్ళ
గట్టి  సవాలప్పుడే!       2

ఎంతమంది చీ కొట్టినా
ఎంతమంది అభిశంసించినా
కుక్కతోక వంకర తీయలేం కాని
కత్తిరంచవచ్చుగా
ఉన్మాదులాగడాలు
ఆగాలంటే!                   3

10.11.2013 ఉదయం 9.45

15, నవంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్|| మనచేతిలోనే - మన చేతల్లోనే ||

కపిల రాంకుమార్|| మనచేతిలోనే -  మన చేతల్లోనే ||

మంత్రాలర్థంకాకపోయినా
సూత్రాలకు తలవంచే మగువ
సూత్రబద్ధ సంసారంలో
తగు పాత్ర పోషణ చేయడంలో
చెలికాని సహకారముంటే
గృహమే స్వర్గసీమవుతుంది!
ప్రేమైతేనేమి, పునాది లేకపోతే
పురిటిలోనే సంధికొట్టి
పురికొస విడిపోదా!
స్పర్థలు మొలకెత్తి
సౌధం పగుళ్ళు వారితే
పగలే చీకటై
పొగలు, పగలు కమ్ముకోదా
ఒప్పందాలు రద్దై నడిరోడ్డున సంసారం పడదా?
విచ్చిన్నాలకాలవాలమై
కుండ పగిలినట్లు
గుండె పొగిలిపొగిలి విలపించదా!
తెగిన గాలిపటమై
అగమ్యగోచరమై
అభాసుపాలు కాకుండా కాపాడుకోకపోతే
కుక్కలు చింపిన విస్తరి కాదా జీవితం?
ఊకగా మారిన ఊసులకు
చేసుకున్న బాసలకు
కాపుదల లేకపోతే
వృక్షం కూలిపోదా!
వేరు పురుగు చేరి కుళ్ళిపోదా!
అటు యిటు తరాల
అంతరాలు - అంతరంగాలు
బేరీజువేసే కొలమానం లేకపోతే
పర్వవసానం యిదేగా!
సాప్తపదీనం, ఐరేని కుండలు,
మోటైనా, మాట కట్టుబడి
సంబంధాలను కొనసాగించలేకపోతే
కొసలు పురి వీడినట్టే
వివాహబంధం విడిపోదా?
వైవాహిక విధానం యేదైనా
జతగా అడుగులు కలిస్తేనే
సంసారపు మనుగడ
నవ యువ దంపతుల చేతిలోనే
చేతల్లోనే వుందనేది  
మాత్రం నిర్వివాదాంశం!

13.11.2013 సాయంత్రం  3.53

కపిల రాంకుమార్|| మొగ్గలు ||

కపిల రాంకుమార్|| మొగ్గలు ||
పిల్లి మొగ్గలు వేస్తుంటే సరదానే
కాని ( ఆడ) పిల్లకి మల్లె  మొగ్గలిస్తే
బుగ్గలు వాస్తాయిరోయ్!

పిల్లలూ అల్లరి వారు కాకండి
నలుగురిలో పేరు తెచ్చుకునే మెలగండీ!
చదువు, జ్ఞానం యిచ్చే వెలుగులో
పదుగురికి ఆదర్శంగా ఎదగండి!

**
అమ్మా నాన్న లేని అనాథలకు
ఆశ్రయం కల్పించే ఆశ్రమాల
నిర్వహణలో అలసత్వం వహిస్తే
జాతికి ద్రోహం చేసే వారవుతారు!

క్రమశిక్షణపేరుతో క్రమంగా
ప్రమాణాలు దిగజార్చకండి
నిబద్ధత, నిమగ్నత గాలికొదిలి
బిక్షగాళ్ళుగా, సోమరులుగా చేయకండీ

**

బతికే నైపుణ్యం నేర్పండి
బరువుల మోత తగ్గించండి
పరువుగా పేరు నిలిపేలే
పాదుచేసి, నీరుపోసి పెంచండి!

పోకిరీలుగా, దొంగలుగా
జూదరులుగా చేయకండి
అమ్మ, నాన్న, గురువు,
సమాజం ఉమ్మడి బాధ్యత!

**
పసిమొగ్గలను వికసించనివ్వండి
మసిబొగ్గులు కానివ్వకండి
నేటి బాలలే రేపటీ పౌరులు
ఉత్తమ ఉన్నత విలువలందించండి!

కుప్పతొట్టిపాలై
మురికి కూపపు స్నేహంతో
క్రూర నేర లోకంలోకి 
జరకుండా జారులు కాకూడదని కోరుకుందాం!

**( ఇదో పిచ్చి  కోరిక - నెరవేరాలని తపన )

14.1.12013 ఉదయం  10.30

కపిల రాంకుమార్|| చోటీసి బాతేఁ అర్జ్ కర్‌రహాహూఁ ||

కపిల రాంకుమార్|| చోటీసి బాతేఁ అర్జ్  కర్‌రహాహూఁ ||

చోటీసీ బాతేఁ అర్జ్ కర్‌రహాహూఁ
సునో తండా దిమాక్‌సే యే భాయ్!
గుస్సా మత్ కరో
మేరే యారో, జర సునో!

కిసీ పర్ న వజేసే ఉంగ్లీ మత్ ఉఠావో
ఆప్‌కో ఆప్ బేషర్త్  పరదా ఉఠావో!

ఆజ్‌ కల్‌ కీసీ పర్ ' దావా కర్నా '
బహుత్ ఆసాన్‌ హైఁ
మగర్ దియా హువా ' వాదా నిభానా '
బేషక్‌ న ఆసాన్‌ హైఁ

సోచేకె బినా గుస్సా మత్‌కరో
ములాఖత్‌ సే  ఆపస్‌మే సంజోతాకరో

మహబత్‌ కేల్నేకీ కిలోనా నహీఁ
మగర్ మజ్‌బూత్ కర్ నేమే దిల్‌కా తాఖత్ జరూరీహైఁ

ఆదాన్‌ ప్రదాన్‌సే జోడీ హమేషా కాయమ్‌ రఖో
నా మానేసే మజ్‌బూర్‌ హోకర్‌ టూట్‌ మత్ కరో!

గిరావుహా దిల్‌సే కిసీ కో ధోకా మత్‌కరో
పరంతు  ఫూలోంకి కుషుబూ తరహా సహమత్ సీఖో!

15.11.2013 ఉదయం 5.04

10, నవంబర్ 2013, ఆదివారం

కపిలరాంకుమార్|\ సేకరణ ||నజరానా ! (ఉర్దూ కవితలు)

కపిలరాంకుమార్|\ సేకరణ ||నజరానా ! (ఉర్దూ కవితలు)

*ఎంత పదిలంగా చూసుకున్నా
నా హృదయం నాది కాలేకపోయింది
ఒక్క నీ ఓర చూపు తోనే
అది నీ వశమైపోయింది .

-జిగర్ మురాదాబాదీ

*ఎదురు చూపులకైనా
ఓ హద్దంటూ ఉంటుంది
కడకు వెన్నెల కూడా
కరకుటెండలా మారుతోంది.

-బిస్మాల్ సయూదీ

*ఆమె నా ప్రేమ లేఖ చదివి
అది ఇచ్చిన వాడితో ఇలా అంది
'ఈ జాబుకు బదులివ్వక పోవడమే
నా జవాబ'ని చెప్పింది.

-అమీర్ మీనాయీ

*తనని చూడగోరే వారికి
తరుణం లభించింది
ఆమె తన మేలి ముసుగు
అర మోడ్పుగా తొలగించింది

-అర్ష్ మల్సియాని

*నా కెవరైనా ఎరుక పర్చండి
ఆమెకెందుకు జవాబు చెప్పాలని?
ఆమె నన్ను అడుగుతోంది
'తనని ఎందుకు కోరుకున్నాన'ని ?

- షకీల్ బదాయునీ

*వలపు దారిలో అలసి పోయి
ఎక్కడ నేను చతికిలబడ్డానో
అక్కడ నాకంటే ముందే వచ్చిన
బాటసారుల్ని చూశానెందరినో

- బహదూర్ షా జఫర్

అనువాదం : ఎండ్లూరి సుధాకర్
 http://sudhakaryendluri.blogspot.in/2009/01/2.html

shot

Kapila Ramkumar || short shoot shots||

Right
fight
lights.

read
feed
leads.

our
hour
honours.

Lead
Plead
Im-pleads.

Let
In let
Out lets.

Come
Become
Out comes.

Go
Forgo
Logos.

Air
Fair
Affairs.

Wind
Mind
Binds.

Brain
Rain
Drains.

short
shoot
shots.
........
(continued)
2/11/2013 ....6.29 am

shorts

Kapila Ramkumar || shorts ||
Leisure
assures
pleasure!    .1

Will avoids
pill and reduce
bill              . 2

We
at
her
Weather!     .3

At
ten
dance
Attendance!....4

***
9.11.2013 4.19 pm

కపిల రాంకుమార్|| మినీలు ||

కపిల రాంకుమార్|| మినీలు ||

మంచిని పేంచేలోగా - నీ
పంచన  చేరినవారే
వంచనతో
ముంచుతారు!          1

పొట్ట కొట్టే వారిపై
దట్టించి ఎదురుతిరగ
జట్టుకట్టేదెపుడో
పట్టుచిక్కేదెపుడో
పొట్టకూటిగాళ్ళ
గట్టి  సవాలప్పుడే!       2

ఎంతమంది చీ కొట్టినా
ఎంతమంది అభిశంసించినా
కుక్కతోక వంకర తీయలేం కాని
కత్తిరంచవచ్చుగా
ఉన్మాదులాగడాలు
ఆగాలంటే!                   3

10.11.2013 ఉదయం 9.45

5, నవంబర్ 2013, మంగళవారం

కపిల రాంకుమార్|| అలుపెరుగని ప్రస్థానం||

కపిల రాంకుమార్|| అలుపెరుగని ప్రస్థానం||

అలుపెరుగని ప్రస్థానం - వైఆర్కే ప్రయాణం
ఆదర్శం ఆకర్షణ నింపుకున్న మూర్తిమత్వం
రూపాయి వైద్యుడిగా పేరుపొందినాడు
ఖమ్మానికి వన్నెతెచ్చి ప్రజాసేవకుడైనాడు

నిబద్ధత నిపుణత మేళవింపు వ్యక్తిత్వం
రాజ్యసభలో ప్రజావాణి పాలకులు వణికేలా
సమస్యల జాబులు అందించిన నిగర్వి!
నాయకుడిగా నిలచిన దీటైన చిహ్నం!

సారస్వతం రాదంటూ సాహిత్యపు వేదికపై
సాహిత్యపు మూలాలను తడిమిన  దర్శకుడై
అసామాన్య వీక్షకుడిగా వాసిగాంచి
పదవులకే వన్నె తెచ్చిన ఉపన్యాసకుడు

వినమ్రంగానే ఒదిగిపోతూ - తీక్షణంగానే విమర్శిస్తూ
పాలకులపై రాజీలేని - సమర శీల యోధుడై
ఎందరికో మార్గాలను - సైద్ధాంతిక పాఠాలను
నిర్బంధాలకు వెరవక -అందించిన ఒజ్జయతడు 

నమ్మినదానికై నిలబడి - పౌరహక్కులకై శ్రమించి
శ్రామిక పక్షపాతిగానే సూచనలూ సలహాలిస్తూ
కడకంటా ఆకట్టుకునే ప్రాసంగీకుడిగా
మది దోచిన డా.వై.ఆర్.కే.స్మరణీయుడు

        ***
- కపిల రాంకుమార్
గ్రంథాలయ నిర్వాహకుడు
బి.వి.కె. ఖమ్మం 20.10.2013

కపిల రాంకుమార్|| సమస్యలుంటే సాకులు వెతుకుతుంటారా??||

కపిల రాంకుమార్|| సమస్యలుంటే సాకులు వెతుకుతుంటారా??||

పరిస్థితులను అంచనావేసి
పరిష్కరించే బదులు
మరింత జటిలపరచటంలో
రాజకీయులు బహు దిట్టలు!
ఒకరినిమించొకరు ఎత్తులు వేస్తూ
చిత్తు బొత్తులాటలాడుకుంటూ
కాలయపనచేసి
ఎవరికెంత లాభమో యోచనే తప్ప
అస్తవ్యస్థ వ్యవస్థను సరిదిద్దకపోగా
మరింత అధ్వాన్నంచేయటంలో
సిద్ధహస్తులు!
రాజకీయ ప్రత్యర్థులపై కక్షతో
అమాయక ప్రజలపై
తీసుకుంటారు!
అకాల వర్షాలైనా,
గృహ దహనాలైనా
కుమ్ములాటలైనా
కలహాలేవైనా
కులపంచనామా చేసేందుకు
పావులు కదుపుతారు
బలగాలను మోహరిస్తారు!
అందుకే వారు సమస్యలు పొంగుతుంటే
సాకులు వెతుకుంటారు!
ఎవరైనా నోరెత్తితే దానికో రంగు పూస్తారు
ఎవరితోనో రంకు అట్టకడతారు!
ఎవరైనా ఎదురు తిరిగితే
అట్టడుక్కు అదిమేయచూస్తారు
ఆ సమాధులపునాదులపై కట్టడాలు నిర్మిస్తారు!
ఎంతసేపు ఓట్లు, సీట్ల లెక్కల్లో
నోట్ల ఫీట్లల్లో పడరాని పాట్లు పడతారే తప్ప
జనసామాన్యపు పాట్లు చూడరు!
గోడమీద పిల్లిలా అదునుకోసం చూస్తారే తప్ప
ఎవరికి ఆసరా యివ్వరు పైగా అసహనం చూపుతారు!
నిన్న పొగిడి, నేడు తిట్టి, రేపు గుట్టుగా కౌగలించుకుంటారు
పైపై మరమతులుచేసి తమ గరిసెలు నింపుకుంటారేకాని
శాశ్వత నిర్మాణాలు చేయరు
గుత్తేదారు పదికాలాలు బాగుంటేనే కదా
తమ పబ్బం గడిచేది!
వితరణలో తస్కరణలు చేస్తూ
పారితోషకాలు బొక్కుతారు
ముక్కిన బియ్యం పంచి,
చేతులు దులుపుకుంటారు
జేబులు నింపుకుంటారు!
బక్కజనం యేమైనా వారికి పట్టదు
రాజకీయ అరాచకీయానికి భరత వాక్యం పలికేదెన్నడు?
జనం యోచనతో సొంత బుర్ర పెట్టి
వాళ్ళ బుర్ర రామకీర్తన పాడించేదెన్నడు?
అందుకు ప్రజల సంసిద్ధం చేసే బాధ్యత
కవుల కలాలదే -కళాకారుల గళాలదే!

30,10.2013 ఉదయం 10.30