Saturday, August 31, 2013

కపిల రాంకుమార్ || చిలీ మరో సెప్టెంబర్ 11 ||పుస్తకపరిచయం||

కపిల రాంకుమార్ || చిలీ మరో సెప్టెంబర్ 11 ||పుస్తకపరిచయం||
1. ''ఒక మనిషి చిత్ర పటం'' - పాబ్లో నెరుడా - గేయం

స్వీయ అభద్రతా భావంతో
హత్యాకాండకి తెగబ్డి
చనిపోయినవారి రక్తంతో
పంకిలమైన ఆ చేతులని
విచారించవలసినదే
అమరులు ఈ భూమిలో నుండి
విషాదపు విత్తనాలవలె మొలకెత్తుతున్నావు
ఎందుకంటే మున్నెన్నడూ
ఇలాంటి కాలాన్ని కూడా ఉఓహించలేదు
బోనులో చిక్కిన ఎలుక మాదిరి
భయంతో ఇంతలేసి పెద్దవైన కళ్ళతో 'నిక్సన్‌'
తుపాకితో కాల్చేసిన జండాలు
పునరుద్ధానం అవడాన్ను చూస్తున్నాడు!
అతని అహంకారాన్ని క్యూబా తరిమికొట్టింది
ఇప్పుడీ సంధ్యా సమయం అస్తమించాక
ఆ కరకు కోరల పశువు కొరుకుడుపడని
' చిలీ' ని నమిలెయ్యాలని చూస్తుంది!
బహుశా అతగాడికి తెలిసివుండకపోవచ్చు
అంతగా పేరు ప్రఖ్యాతులులేని ఈ చీలీ దేశ ప్రజలు
అతనికి గౌరవంగా ఒక గుణపాఠం నేర్పించనున్నారు!
**
2. ప్రతి కార్మికుడు, ప్రతి రైతు చేతుల్లో తుపాకి ఉండివుంటే
ఫాసిస్టు తిరుగుబాటుకి ఆస్కారమే ఉండేది కాదు '' - ఫైడల్ కాస్ట్రో
**
3. '' విప్లవ క్రమాన్నీ నిక్కచ్చిగా, గౌరవప్రదంగా నిలబెట్టేదానికి
పరిరక్షించేదానికి మీరు కట్టుబడివుండండి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా
సిద్ధపడితే - మీరు అందుకు సమర్థులని కూడా తెలిసిందే -
మీతోపాటు ఆ పోరాటంలో చీలీ దేశ ప్రజానీకాన్నీ భాగంచేసే
వీలుంటుంది. ఇవాళవున్న పరిస్థితుల్లో మీ మాతృదేశం ముందున్న
చారిత్రక విభాతసంధ్యలో - మీ ధైర్యసాహసాలు స్థిరమైన, దృఢమైన
మీ వీరోచిత నాయకత్వం ఎంతైనా అవసరం. మీ ఈ క్యూబా స్నేహితులు
మీకు ఎలాంటి సాయం అందించగలరో కార్లోన్‌, మాన్యుయల్ మీకు
స్వయంగా తెలియజేస్తారు. మా ప్రజల అచంచల విశ్వాసాన్ని అపారమైన
ప్రేమని పునరుద్ఘాటిస్తూ ...మీ సహచరుడు - ఫైడల్ కాస్ట్రో...జూలై 29 1973
ఒక లేఖలో మద్దతు.
**
సెప్టెంబరు 11 అనగానే మనకు అమెరికాపై దాడి జరిగిన 2001
సెప్టెంబరు 11 గుర్తుకొస్తుంది. కాని అదే రోజు 1973 లో చీలీలో
జరిగిన ఘోర ఉదంతం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సాల్వెడార్
అలేండీ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని అమెరికా ప్రోద్బలంతో
పినోచెట్ కూల ద్రోసి సైనిక నియంతృత్వాఅన్ని నెలకొల్పాడు. దేశాన్ని
రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. సాల్వెడార్ అలెండీ, పాబ్లో నెరూడాలతో
పాతు ఈ ఘోరకలికి ప్రత్యక్ష సాక్షులైనవారు రాసిన వ్యాసాలు, గేయాలు
ప్రసంగాల సంకలనమే ఈ '' చిలీ మరోసెప్టెంబరు 11 '' హవానాలో జరిగిన
సంఘీభావ సభలో ఫైడల్ కాస్ట్రో, అలెండీ త్యాగాన్ని, ధీరత్వాన్ని
శ్లాఘిస్తూ ఎంతో ఉత్తేజకర ప్రసంగం చేశారు. ఇందులో ఏరియల్
డార్ఫ్మన్‌, సాల్వెడార్ అలెండీ, పాబ్లో నెరుడా, జోన్‌ జారా, ఫైడల్ కాస్ట్రో,
బియాట్రిస్‌ అలెండీ, జోన్‌ జారా, విక్టర్ జారా, మురీల్ రూక్యేసర్, డెవిడ్రే,
మెటిల్డా నెరుడా, ఎ. ఎప్పర్ సెల్లె లాంటి ప్రముఖుల వ్యాసాలు, గేయాలు,
వున్నాయి. దీనిని కె. సత్యరంజన్‌ అనువదించారు. ప్రజాశక్తి ప్రచురణ
ప్రథమ ముద్రణ మే.2005 వెల. 30/-
_______________________________________
28.8.2013 మ2.15

No comments: