18, జూన్ 2014, బుధవారం

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

కపిల రాంకుమార్|\ సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

విప్లవాన్ని కవిత్వీకరించిన వాడు, కవిత్వాన్ని విప్లవీకరించనవాడు శ్రీశ్రీ అని నేటి యువకవులకు స్పూర్తిదాయకమైన ఆందించాడని, సముద్రమంత ముద్ర వేసిన కవి శ్రీశ్రీ అని, చరిత్రకు అర్థాన్ని '' ఏ దేశ చరిత్ర చూసిన యేమున్నది గర్వ కారణం ' అనే గేయం ద్వారా ఋజువు చేసాడు. చరిత్రకు నిజమైన అర్థాన్ని తన కవిత్వంలో తెలిపిన మార్గదర్శి. అని కొనియాడారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి. రౌతు రవి అధ్యక్షతన సాహితీ స్రవంతి ఆధయనవేదిక సమావేశం జూన్‌ నెల మూడవ ఆదివారం ప్రత్యేకంగా శ్రీశ్రీ వర్థంతి సమావేశంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు ఉదయం 10గంటలకు ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పట్టణంలోని కవులు మొవ్వా శ్రీనివాసరావు, సంపటందుర్గా ప్రసాదరావు, కపిల రాంకుమార్, రౌతు రవి, కె. ఆనందాచారి, ప్రముఖ విద్యా సంస్థల అధిపతులు రమణారావు, వీరారెడ్డి, రాఘవరావు, ప్రముఖ వైద్యుడు డా. భారవి, ఇతర సాహితీ అభిమానులు, పాల్గొన్నారు. సాయంత్రం బోడేపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయన వేదికలో భాగంగా సామావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశ్రీ గేయాలను ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సంపటందుర్గా ప్రసాదరావు ఆలపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి సంకలనంలోని కవితలు సునంద, శైలజ, . సునంద, శైలజ, టి.లక్ష్మి, జయప్రద మున్నగువారు చదివారు. శ్రీశ్రీపై నాగభైరవకోటేశ్వరావు రాసిన గేయాన్ని కపిల రాంకుమార్ చదివారుశ్రీశ్రీ సాహిత్య ప్రక్రియల అన్నింటిలోను ఆల్‌రౌండర్‌ అంటూ విమర్శ, అనువాదం, కవిత్వ, చందోరచన, వ్యాసాలు, కథలు, నాటికలు, అంతేకా విదేశీ భాషాలలో పట్టు, శాసనమండలి సభ్యుడిగా తన పాత్రను నిర్వహించాడని అన్నారు. కె.ఎల్‌.యూనివర్సిటి అనువాద విభాగంకు చెందిన మోహనాచార్యులు మాట్లాడుతు నేటి పాఠశాలల మరియు కళాశాల విద్యార్థులకు శ్రీశ్రీ కవిత్వాన్ని పరిచయం చేయవలసివుందని తెలిపారు. నేటి సాంకేతిక విజ్ఞాన సంపాదన మాటున సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం లోపించిందని, దానిని అధిగమించేలా ఎంతో కృషిచేయాలిసివుందని అన్నారు. డా. పి. సుబ్బారావు గారు మాట్లాడుతూ కవిత్వాన్ని విశ్వజనీనం చేయటంలో అతని కృషి అనితర సాధ్యం, దానిని ఎవరూ అధిగమించలేదు. విశ్వనాధను గౌరవించినట్లే, గురజాడను, తిక్కనను, వేమనూ గౌరవించాడు. పద్య చందస్సు, మాత్రాచందస్సు, గేయం, వచన కవిత,అంతే కాక కవిత్వంలో విభిన్న ధోరణులను సృజించినవాడు. అధివాస్తవికత, సర్రలియజం, లాంటి ప్రక్రియలు, లిమరిక్కులు, ప్రాసక్రీడలు ఇలా చెప్పుకుంటేపోతే సమయం చాలదు. మహా ప్రస్థానం ఒక భగవద్గీతలా కొత్తగా కవిత్వం రాసేవారు చదవాల్సివుందని నొక్కివక్కాణించారు. డా.||కవితాంజనేయులు శ్రీశ్రీ కవితలలోని కొన్ని సోదాహరణగా వివరించారు. ఎం.శేషగిరి '' ఏ దేశ చరిత్ర చూసినా ''గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేసారు.

17.6.2014

14, జూన్ 2014, శనివారం

కపిల రాంకుమార్ || చమక్‌||

కపిల రాంకుమార్ || చమక్‌||

గరుకు కాగితం
చిట్లిన పాళీ
చిద్రమైన బతుకు!

14.6.2014 ఉదయం 5.51

9, జూన్ 2014, సోమవారం

కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ |

కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ ||
While wandering in terrace
A wonder ring on trees
made me surprise along with sunshine
Bird flow over head
stone fall on my shoulder
wounded me with shock
appeared an angel from heaven
recognised her to be my old friend
bend downwith love
__________________________________
**1604-1780 మధ్య ఓ కవి రాసిన పోయెం కు
నా స్వేచ్చానుసరణ కవి పేరు మరిచిపోయాను.
___________________________________
ఒక శుభోదయాన
అంతస్తులో సంచారం చేస్తూంటే,
చెట్లపై ఒక అద్భుతం వలయం
మెరుపులా కనపడింది సూర్యరశ్మి పాటు
ఆశ్చర్యచకితుడయ్యాను
నా తలపై ఓ పక్షి ఎగిరినట్లైంది
ఇంతలో నా భుజం మీద
రాతిముక్క బలంగా తాకినట్టుంది
దిగ్భ్రాంతి తో నేను గాయపడ్డాను
తేరుకుని చూస్తే
స్వర్గం నుండి దిగివస్తున్న
ఒక దేవదూత కనిపించింది
ఆమె నా పాత స్నేహితురాలై ఉందని గుర్తించా!
నా తనువు ఒంగిపోయిది ప్రేమతో!
________________________
9 జూన్‌ 2014

5, జూన్ 2014, గురువారం

కపిల రాంకుమార్ || జై తెలంగాణ సిరుల గిరుల కోన ||

కపిల రాంకుమార్ || జై తెలంగాణ సిరుల గిరుల కోన ||

జై తెలంగాణ - సిరుల గిరులకోన - జై తెలంగాణ - నదుల నిధులసీమ
వడివడిగా ఎదగాలి కలలన్ని నెరవేర - సకల జనులు మెచ్చేలా మా తెలంగాణ !

గలగల మంజీర పెన్‌గంగ ప్రాణహిత- ఇంద్రావతినాట్యాన జూరాల తుంగభద్ర
కిన్నెరసాని హొయలై ఉరకెత్తే గోదారై, - పాలేరుతొ మున్నేరుగా కృష్ణవేణి పరవళ్ళై !

శాతవాహన కాకతీయ బహమనీ కుతుబ్‌షాహీ - రాజ్యమేలిన నేలరా! వీరులకు పుట్టిల్లురా!
కవులకు కాణాచిరా నా తెలంగాణ - జానపద కళల నెలవురా నా తెలంగాణ

నల్లమల గిరుల లోయల సహజీవనాలు - పాపికొండల రమణీయ దృశ్యాలు
నల్లపసిడికి సింగరేణి నేల కొలువు - శైవ, వైష్ణవ బౌద్ధ జైనాల ఆనవాలురా!

చారిత్రిక సురవరం - సదాశివ సంగీతం - అచ్చ తెలుగు పాలకురికి సోముడు
హలం పట్టిన భాగవతకవి పోతన - పల్లెపదాల హనుమంతు సుద్దులు


ఆడుబిడ్డల బతుకమ్మలాటతో - బంజారడప్పుల రంగేళి హోలిరా
ఆదివాసీకూనలలరారు తల్లిరా - రేలపాటలతొ పులకించు నేలరా

ఏ యోధుని కదిపినా చాలు - బందగీ ఐలమ్మ త్యాగాల కతలు
నైజాము నెదిరించి సాగినా సమరం - ఒగ్గుకథలాగ కదలాడు కనువిందు

కాలాలు గడిచినా మారని బతుకుల - నీటి మూటల గత నేత చేతలు
అరువదేండ్ల పట్టుదల సాక్షిగా - రాష్ట్రమై తెలంగాణ అవతరించెరా!

నీటమునిగే ఆటపాటల నేల - సంకటాల బారిపడకుండ
గిరిపుత్రుల సంప్రదాయ గురుతులు - పదిలింగా నిలిచేలా

పథకాల మార్పుతో పరిసరాలు పరిమళించ - కాకుల తరిమి గద్దల మేపే లోక కంటక పద్ధతులాపి
పోలవరం పేర జనపదం నీటిపాలు కాకుండ - అనవతరం పచ్చదనపు పంట సిరులవాన కురిసేలా

గతకాలపు నష్టాలను దోషపు చట్టాలను - సవరించుకు ముందుకు సాగేందుకు
ఆశలు, తీరేలా విరామమెరుగక - అనునిత్యం పోరాడుట తెలంగాణ ఆన!

అమరుల త్యాగాలు మనమున నిడుకొని - బడుగుల బతుకువీణ కొత్తరాగాలెత్త
చేయి చేయి కలిపి చేవతనమూచూపి - నిర్మించుకుందాము మనదైన తెలంగాణ!

01.06.2014/5.6.2014

31, మే 2014, శనివారం

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||
**
అందం ఆస్వాదించు కాని
ఆబగా దోచుకోవాలనుకోకు!
నోటిని దురుసుగా వాడకు!
అదుపు తప్పి కలాన్ని వదలకు!
చేతితో కరవాలమైనా, కార్యస్పూర్తిగానైనా
చక్రం తిప్పటంలో అశ్రద్ధ వద్దు!
మగతనముందని విర్రవీగకు!
దేనినైనా ఉపయోగించే ముందు
అలోచనాల మథనం జరగాలి!
**
నిప్పుల వానలో తడవకుండా
తప్పించుకోగల మాద్రికుమారుడవైనా కావాలి!
రుధిర సంద్రపు ఔపోసన పట్టగల శక్తికి
అగస్త్యముని శిష్యరికమైనా వుండాలి!
జ్వాలాముఖ ప్రవేశం చేయడానికి
జలధరుని సౌదామినీ దుప్పటి వుండాలి!
అత్యాచారాల అభినివేశ నిపుణతలో
చుట్టాలకు, చట్టాలకు చిక్కని చక్కని
పథక రచయితవ్వకలగాలి
లేశమైనా అనావాళ్ళ జాగిలాలకి
చిక్కకుండా పూడ్చగల తవ్వుకోల
కలిగుండాలి !
**
పాలకుల పాలకడలి
పాపాల నివారిణి కాకూడదు
చాటుమాటు వ్యవహారాలు
చక్కబెట్టే వేశ్యాగృహంలో
అధికారపు మబ్బులచాటున
ఘీంకారాలన్నివేళల సాగవు!
**
చుండూరు నేరగాడు
నిర్దోషిగా బయటపడినా
జాతీయ రహదారిమాత్రం
ప్రమాదంపేర మరణశిక్ష
పొందలేదా? కాకతాళీయమైనా
కాకి మాత్రం పిండాలనే కోరుతుంది కదా!
**
31.05.2014

9, మే 2014, శుక్రవారం

కపిల రాంకుమార్ || వేసవితో వాదం!||

కపిల రాంకుమార్ || వేసవితో వాదం!||

వేసవితో వాదం
అందరి తరఫున వకాల్త పుచ్చుకున్న
నేలతల్లికి వందనం!
'' ఎంత తీక్షణుడవైతే
క్షణం కూడ వ్యవధివ్వకుండా
నాలోని జలరాశిని ఆసాంతం ఆపోసనపట్టి
నీవొక్కడివే లాగేసుకుంటే యెలా?
జీవరాశుల దప్పిక రోదన చూడవయ్యా
సప్తారథగమనానంద పురుషుడా! ''
దాడికి లేదా వాదానికి దిగింది ధరిత్రి!

'' తాపానికి తాళలేక,
నా వేడికి నేనే చావలేక
దాహంతో ఆస్వాదించినా,
నా పిడికెడు పొట్టలో ఆ కడివెడు పట్టవుగా
వల్లూ చల్లబరచుకుని మిగిలినది
జలధరుడితో పంపుతాలే పో
ఈ లోగా యేం కొంపలు మునగవు! ''
అంటూ పొగరుగా వడగాలి జవాబు!

'' జనాలకు గొతెండుతోంటే ఎకసెక్కంగా వుందా
బాబ్బాబు పార్వతి చాలు గంగను విడువమనగానే
కరుణించిన శివుడే నయం!
నువ్వు మరీ పడమటి దేశపు గాలిసోకినవాడివికదా!
మరీ మండిస్తున్నావు! నిద్రించేది సహ్యాద్రిలోనే కదా!
గ్లొబరీకరణతో కిరణాలు ప్రపంచీకరించబడ్డయిగా!
ముసలీ ముతక, లేలేత మొగ్గలనీ పాడెక్కిస్తున్నావు ''
ధరిత్రీ ధర్నా మొదలెట్టింది!
**
దాని ప్రభావం -
మారుతం షికారు ప్రారంభమైంది కామోసు
ఆకాశంలో నల్లటి మబ్బు దబదబా గుండెలు బాదుకుంటోంది
ఎవరో చేసిన హడవుడికి నాకేమీ తెలియదన్నటు
బిక్కమొగమేసి, చెల్లాచెదరై
దారి తప్పి జారిపడితున్నాయి సన్నగా చినుకులు!
తలలూపుతూ తరువులూ కిలకిలనవ్వుతూ,
నేలంతా పులకింత మట్టివాసన నలుదిశలా
జీవరాశి కేరింత!
పోరాటం అనివార్యం ఎప్పుడైనా ఎక్కడైనా!
**
8.5.2014

3, మే 2014, శనివారం

కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||


కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||
**
కంచు మోగునట్లు కనకంబు మోగదని
వేమన మాట అక్షరాలా నిజమని తెలుస్తుంది
న.మో. రాజకీయ రంకెలు ఆలకిస్తే.
దేశానికే కళంకమంటించిన హత్యాకాండలో
తడిసిన చేతులు రుద్రాక్షలతో
జతగటితే పవిత్రమైనట్టు
కాల్పనిక ఉదాహరణలే అభివృద్ధంటూ
ఎన్నికల ప్రచారాలపై ఊరేగుతున్నారు.
తిరుగులేని నాయకుడైనట్టు
స్వార్థపరుల అండతో
అస్తిత్వాన్ని కాపాడుకోగలమనుకోవడం,
వీరోక్తుల గాలి భజనలో పరవశించి పోవడం
అంతా ప్రహసన ప్రాయం.
పర్యటనా ప్రసంగాలలో
ఊకదంపుడుపన్యాసాలలో,
ఇదే వైరుధ్యం ప్రత్యక్షమవుతుంది.
రాష్ట్ర విభజన తమ వల్లనేనని చెప్పుకునే
ఈయన '' తల్లిని చంపి బిడ్డను బతికించాల '' ని
మాటలు చెప్పడం ఎవరిని నమ్మించడానికి?
మతాల మంటలు పెట్టడంలో ఆరితేరిన నేత
పదేపదే విభజన రాజకీయాలు తగవని
చేసే హితబోధ పుర్రెలతో భగవన్నామస్మరణ
చేసే కుహనా సాధువులా బహిరంగ రంగ ప్రదర్శన
చేస్తూ '' కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిన చందమే ( చంద్రమే) '' కాదా?
**
అధికారం కోసం తహతహలాడుతూ
కాంగ్రెస్‌పై విమర్శించటం అర్థమైనదే కాని
ఆ సాకుతో మతతత్వాన్ని
బాబు నెత్తినెత్తుకోవడం ఎలా సమంజసం?
తెలుగువారి ఆత్మగౌరవం సంగతి
అటుంచి దేశం ఆత్మగౌరవానికే
ఇది తప్పనిసరిగా భంగకరం.
తనను విస్మరించినా పట్టుకు వేళ్లాడే దుస్థితి
అవకాశవాదమే కాదు
తప్పిదపు స్వయం కృతాపరాధం కూడ
ప్రభంజనం ఇక్కడ ఎంత ప్రహసన ప్రాయంగా
ముగిసేదీ త్వరలోనే విదితమవుతుంది.
**
25.4.2014 **/ 3.5.2014 ( ఒకానొక విశ్లేషణకు స్పందన)

23, ఏప్రిల్ 2014, బుధవారం

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? |

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? ||
ఊళ్ళో పెళ్ళైతే
కుక్కలకు హడవుడని
ఎందుకన్నారో కాని
కాట్లాడుకుంటున్నప్పుడు
కుప్పతొట్టి రణరంగమైంది
అయినా అది
నాకు ఆశ్చర్యమనిపించలేదు!
పక్కనేవున్న సర్కారీ హాస్టలు పోరగాళ్ళు
ఫంక్షన్‌హాలు గేటువద్ద
పడిగాపులు కాస్తూ బతిమాలుకుంటుంటే
వాచ్‌మన్‌ పొండిరా పొండని అరుస్తుంటే
ముక్కున వేలుపడింది!
సర్కారు వాళ్ళ కడుపులను
అర్థాకలి గురిచేసి
మిగిలిన దానిని అర్థంగా మార్చి
బొక్కసానికి బొక్కపెట్టి
తమ బొక్కసం నింపుకుంటున్నపుడు
ఆశ్చర్యమేసింది!
అందుకేనేమో
ఆ పోరళ్ళప్పుడప్పుడు
బడికెళ్ళే దారిలో వంకర చూపులతో
ఇండ్ల దొడ్లో కొబ్బరికాయలకో
జామకాయలకో గోడలు దూకి
రాళ్ళు రువ్వుతుంటే గమనించాను
కొండకచో గద్దించే వాడిని!
పల్లెటూళ్ళో అమ్మ అయ్య
వీరి బాగుకోసం తాపత్రయంతో
హాస్టల్‌కు తోలితే
అజమాయిషీ లేని వీళ్ళు
యిలా అర్థాకలితోనో
బాల్య చాపల్యంతోనో
పొరుగువాడి వస్తువులపై
కన్నేస్తున్నారంటే.... ఏమటర్థం?
సంక్షేమం ఇలా
సంక్షోభాల్ని
సంక్లిష్టతలని
పురుడుపోసుకుంటుంటే
సమాధానం ఎక్కడ దొరుకుతుంది!
రేపు బాల నేరస్తులగానో,
కరుడుగట్టిన నేరగాళ్ళైతే
సమాధానం ఏది?
23.04.2014

20, ఏప్రిల్ 2014, ఆదివారం

వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం|

కపిల రాంకుమార్|| వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం||

ఆమని '' ఉగాది కవితా సంపుటాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పిదప సంపాదకత్వం వహించిన బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ మాట్లాడారు. . జయనామ వత్సరానికి స్వాగతం పలుకుతూ '' మన తెలుగువారికి ప్రధానమైన సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా కుటుంబ యావత్తు ఆనందంగా కోటి ఆశలతో, కొత్తపథకాల రూపకల్పనతో కొంగ్రొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలతో జరుపుకునే పర్వదినం ' ఉగాది ' కి విశిష్ట స్థానం వుంది అని '' తదనంతరం, కపిల రాంకుమార్ తన సంపాదకీయాన్ని కొనసాగిస్తూ '' మన భాషా సంస్కృతులు, మానవ సంబంధాలు ప్రస్తుతం పడమటిగాలి వడదెబ్బ కు సోలిపోకుండా, ప్రపంచం మొత్తం ఆవహించిన మత ఛాందస వాదానికి, ఉగ్రవాదానికి,ప్రపంచీకరణ ముసుగులో ముంచుకొస్తున్న గ్లోబలీకరణకి తట్టుకుని నిలబడాలనే తలంపుతోనే భావ సారూప్యం కల కవులు, కళాకారులు 1999 జనవరి 26 తేదీన ఖమ్మం పట్టణంలో సాహితీ స్రవంతిని ఒక వేదికగా ఏర్పాటుచేసుకుని గత 15 సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకుంటూ,కేవలం ఖమ్మంలో ఆవిర్భవించి నా, రాష్ట్ర షాయి సంస్థగా ఏర్పడటానికి, అంతేకాక, దాని ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం అనే సాహిత్య మాస పత్రికగా జనాదరణ పొందటానికి కొద్దో గొప్పో ఖమ్మం పాత్ర గణనీయమైనదేనని చెప్పుకునేందుకు నయంగానే గర్వపడుతున్నామని, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహిస్తూనే ఒక గుర్తింపు పొందామని, దానిని నిలబెట్టుకోవాలని, అందుకు నిబద్ధత, నిమగ్నత కలిగిన సాహితీ కార్యకర్తల కృషి అవసరం ఎంతైనావుందని, కొత్త వారిని ప్రోత్సహించటం. మెలుకువలు నేర్పటం సదస్సులు, శిక్షణాతరగతులు నిర్వహించటంలాంటి కార్యక్రమాలు చేస్తూనేవున్నామని,. ఇంకా మరిన్ని అలాంటివి కొనసాగించాలనే కృత నిశ్చయంతో వున్నామని, అందులో భాగంగానే గత సంవత్సరం జూలై నెల నుండి మూడవ ఆదివారంలో ప్రతి నెల సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తూ, దాదాపు 20 నుండి 35 మంది దాక హాజరవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక, కవిత్వ పఠనం, చర్చ, సాహిత్య ప్రసంగములు నిర్వహిస్తున్నామని, ఇది ఒక అపూర్వ ప్రయోగంగానూ, ఉపయుక్తంగానూ, వుందని తెలిపారు.ఈ సంవత్సరం సాహితీ స్రవంతి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సాహితీ సంచిక ప్రత్యేకంగా తేవాలని అనుకుంటున్నామన్నారు . ఆప్రయత్నంలో భాగంగానే ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలను మీ ముందుంచుతున్నానని, సలహాలు, సూచనలు కోరారు. ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయని, వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో యేమాత్రం సాఫల్యం చెందామో కాని, ఒక చిన్న సంతృప్తి మాత్రం కలుగుతోంది. ఆదరించి, అహ్వానించిన వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుముందు కూడ ఇలానే ఇదే స్ఫూర్తితో తోడ్పడాలని వేడుకుంటూ, పేరుకే సంకలనకర్తనే కాని యిది అందరి సమిష్టి కృషి అనిమాత్రం చెప్పక తప్పదు. మరొక్కమారు అందరికి నూతన సంవత్సర అభినందనలు తెలియచేసారు.ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించగా, సాహితీ స్రవంతి జిల్లాకార్యదర్శి రౌతు రవి, అతిథులను వేదికపకి అహ్వానించి తన నివేదిక సమర్పించచారు
ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. బాణాల కృష్ణమాచారి, కోటీ శశిశ్రీ, కపిల రాంకుమార్, వురిమళ్ళ సునంద, టి.ఎల్. లక్ష్మీనరసయ్య, డా. పొత్తూరి సుబ్బారావు, డా.కావూరి పాపయ్య శాస్త్రి, డా.కవితాంజనేయులు, మొదలగు వారు సన్మానంపొందిన వారిలోవున్నారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరో పదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిపల్ చైర్ పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు నాయకులు ఎర్రా శ్రీకాంత్, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్, బి.వి.కె. డిప్యూటి జనరల్ మేనేజర్ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు.

పండుగ బలహీనతని రాజకీయ నాయకులు ఎలా అవకాశంగా తీసుకుని సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో, ఆశపడి, బోర్లపడిం సామాన్యుని వేదన తన కవితలో రాంకుమార్, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఒట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా, కాలాన్ని నిర్వ్చిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిసిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ, ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, '' జయాలనిచ్చే ఉషోదయానికై '' అంటూ గేయ రూపంలో ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుమంకున్న ఉగాదే అంటూ చతుర్తలు కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్, కోకొఇల స్వరాలకు బదులు కాకుర స్వరాలు.. పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం కవితతో బూడిద అరుణ గౌడ్, షడ్రుచులతో కృష్ణవేణి, కొత్త ఆశలతో సీతారామారావు, పాడవే కోయిలా గొంతెత్తి యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా.పొత్త్రి సుబ్బారావు, డా. పాపయ్య శాస్త్రి, తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు, పండుగ హడావుడి - హాస్య రూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా - ఎన్నీకలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదిన్నం పేరుతో నైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు. ఇచేఏ పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు , మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహార వచ్చిన వారందరికి పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం.శేషగిరి , కన్నెగంటి వెంకటయ్య, మరియు కళానిలయం బృందం వారు తమ గీతాలాతో అలరించారు.
**
--కపిల రాంకుమార్ 9849535033 (4.4.2014/19-4-2014)

సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క|


కపిల రాంకుమార్ || సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క||

అనునిత్యం పోరుబాట వెన్నుదట్టు అమ్మమాట
ఆశయాల పెనుకోట త్యాగధనుల పూదోట
ఎరుపంటే వెలుగె ఎరుపంటే జయమే
ఎరుపంటే పతాకం విజయానికి సంకేతం

సుందరయ్య ఆచరించి బంధుత్వం కలిపాడు -
కూలిరైతు సంఘాలకు ఒక మార్గం నెరిపాడు

బెదిరే జింకలను కుమిలే జనాలను -
ఆపదల ఆగడాల తట్టుకోను బలమిచ్చి
ప్రశ్నించే తత్వాన్ని కొనసాగే ధైర్యాన్ని -
చీకటిని పారదోలే ఎర్రజెండా మనకిచ్చి

అరకపట్టి చెమెటోద్చే పనివాడిదే పొలమంటూ -
చాకిరిలి సరిపోయే రూకలు పొందాలంటూ
ఆరుగాలపు కష్టాన్నీ బుర్ర మీసం దోచుకునే -
పాతకాల దొరతనం కలకాలం సాగదని

అతివలు అనాథలు బడుగులు బలహీనులు -
హక్కులకై ఉద్యమించ ఎలుగెతే గళమిచ్చి!
కదం కలిపి నడిచేలా ముందువరుస తానుండి -
లాఠీలకు తూటాలకు వెరవులేక ఎదురొడ్డగ

జనం తెరువు కొరకు బతుకు వెలుగు కొరకు -
పొద్దు పొడిచిన సూరీడై ఆదరించు చెలికాడై
సుత్తికొడవలి చుక్కరా దారిచూపు వేగు చుక్కరా! -
వేలు పట్టి నడిపించే కన్నతల్లి చేయిరా!

కపిల రాంకుమార్ - 20.4.2014

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఓటుబద్ధ హెచ్చరిక

కపిల రాంకుమార్|\ ఓటుబద్ధ హెచ్చరిక ||

పార్టీ మారిన నేతకెన్ని కష్టాలో
దుమ్మెత్తిపోసేటప్పుడు జాగ్రతలెన్నో
తీసుకోక పాత పాటే పాడితే
ఓట్లు రాలకపోగా తాటతీసి తన్ని తగలేయగలరు
యింటికి పంపుతారు జనాలు
మారేటప్పుడు వళ్ళు దగ్గరపెట్టకున్నా
ఇప్పుడుమాత్రం జర భద్రం!
సీటు గెలవాలంటే!
**
గుర్తు తప్పు చెప్పినా
అధినాయకుడి పేరు మర్చిపోయినా
ప్రస్తుతాన్ని స్తుతించిక పోయినా
ఏ యెండకా గొడుగు పట్టకున్నా
సమావేశాల్లో, ప్రెస్ మీట్లో నోరు పారేసుకున్నా
జోరువాన పడ్డట్టు
చెప్పులు పడొచ్చు
కుర్చీలు మీద పడొచ్చు
అలో లక్ష్మణా అని
తప్పించుకోలేక
యే సోదరి కోక కట్టుకోక తప్పదు!
ఆకట్టుకోక తప్పదు!
**
ఇన్నాళ్ళు నమ్మిన జనాన్ని
మోసగించడానికి
సిగ్గు తీసి ఇంట్లోపెట్టి
మనస్సాక్షిని హత్యచేసిన రక్తపు చేతితో
రెండు వేళ్ళూపుతూండాలి
అవలక్షణాలన్నీ వంటబట్టకున్నా
మనుగడకే తిప్పలొస్తాయి
మళ్ళీ కొత్త గెంతు వేయాలి !
**
తెలివైన కుందేలు ముతరాసోని వలలో పడ్డట్టు
మతతత్వమంటూ రంకెలేసి
మఠాధిపతుల ఒళ్ళో వాలాలి కదా
కాలు విరగ్గొడతానన్నవాడివి
వాని కాళ్ళకాడికే చేరాలికదా
యేమొ
జనం తెలివితో
ఓటిది కాని ఓటుతో
బలంగా ఓ పోటు పొడిస్తే
కాటుకు తట్టుకోలేకపోతే
గోచి సర్దుకుని గోడ దూకటానికి సిద్ధపడాలి కదా!
**
దాదాపు పార్టీలన్ని
బారులు తెరిచి బార్లా తెరిచి
అహ్వానిస్తాయని యెల్లపుడు కలగనకు!
ఒక్కొక చోట గడీలమించిన
అడ్డుగోడలు లోపలిలి రానీవు
అప్పుడు నీగతి అధోగతి
పేడకళ్ళు, చీపురు దెబ్బలు
తప్పించుకోకలగాలి
మద్దతిచ్చే పర్టీలు
ముద్దకుడుములు పెడతాయనుకోకు
బూడిదలో పన్నిన కుక్క వైరాగ్యంలా
పాతవి గుర్తుకొస్తే
మడత పేచీలు పెట్టి
నీ బతుకు సంకరం చేసి
శంకరగిరిమాన్యాలు పట్టిస్తాయి!
**
పదవే పరమావధికాదు
ప్రజలకొరకు పనిచేయ
నియమబద్ధ, నిబద్ధత కలిగి
నాయకత్వం వహిస్తే చాలు
గౌరవాలు పొందటానికి
అంతే కాని వంకలేనమ్మ డొంకట్టుకు
యేడ్చినట్లు కబుర్లు చెప్పకు!
అజెండాలకు నీళ్ళొదిలి
జెండాలట్టుకు తిరుగకు!
ఇది ఓటుబద్ధ హెచ్చరిక!
**
11.4.2014 సాయంత్రం 5.55

10, ఏప్రిల్ 2014, గురువారం

కపిల రాంకుమార్|| మినీలు|\

కపిల రాంకుమార్|| మినీలు|\
1. ఆపదలో - ఆదుకునేందుకు
బురద బాధించదు!
అపవాదు మీదపడ్డపుడు
మనసు దేనిని భరించదు!

2. పుట్టుకతో వచ్చిన బుద్ధులు
పుడకలతో కాని పోవు!
వ్యక్తిత్వానికి పడ్డ మచ్చలు
గతించినా తొలగవు!
10.4.2014 సాయంత్రం 6.30

3, ఏప్రిల్ 2014, గురువారం

|ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు

కపిల రాంకుమార్ ||ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు||
**
అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు గుబులెన్నో
అంతులేని నేతల గొంతెమ్మ కోరికలెన్నో!
**
పనితనం బేరీజులో నూటికినూరు సున్నాలే
ఎవరి పుస్తకం తెరిచినా మసిబారిన పేజీలే!
**
లాభ సాటి స్థానం శక్తికి మించినదే
గెలుపు మేతకు యుక్తిలెన్ని పన్నాలో!
**
గతచరిత్ర విలువ మచ్చుకైనా లేకపోయె
చీకటి కోణపు కతలన్నీ చూస్తే తన్నులే!
**
ధనం మద్యం ముందు ఉద్రేకం ఆవేశం పనిచేస్తాయా?
ఉపాయం అలోచన శూన్యం కుర్ర, కర్ర పెత్తనం గెలిస్తుందా?
**
జుట్టు రంగు మారిస్తే జట్టుకు హంగులొస్తాయా?
బట్టతల ఎత్తుగడలకు పుట్టగతులున్నాయా?
**

తిట్టిన వాని పక్కనె చేరి జైకొట్టాలన్నా!
పెంచినవాణ్ణి నెట్టగ గోడలెన్నో దూకాలి
**
సిగ్గులెగ్గులొదిలేయాల్సిందే సీటుకై
తొడుగు విముఖమైనా చేరాల్సిందే!
**
వంటలు చేసో బట్టలుతుకో
కాళ్ళు పిసికో కాయం శ్రమించాల్సిందే!
**
చేరిన వాడి అవినీతి మచ్చ గోప్యమవుతుంది
వాడుకొట్టిన దెబ్బ మానుతున్న మచ్చవుతుంది!
**
వచ్చినవాడి నాలుక (నోరు) నరంలేనిదైనా
ఇచ్చవచ్చినట్లు మాట కుట్టేయాల్సిందే!
**
పార్టీ చెక్‌లలో బొక్కపెట్టి చక్కగ చెక్కులు ఫోర్జరీ భోజ్యం
కోటావాటా చాటుమాటైనా సూటుకేసులు సర్దే లౌక్యం!
**
నిలబడతానని మాటిచ్చి రాబట్టాల్సినదంతా నొక్కేసి
చివరిక్షణంలో వెధవ్వేషం త్రేంచుకుంటూ పలాయనం!
**
బతిమాలితే బిర్ర బిగుస్తారు
అర్థణాకి చెల్లనోడు బోషాణం కోరుతాడు!
**
రాష్ట్రం బ్రష్టు పడ్డా నాకేమి కేంద్రం చేరితే చాలు
వక్రమార్గం నడవాలంటే చక్రం తిప్పేది అక్కడే!
**
అమ్మకు అన్నంపెట్టనోడు అత్తకు మంచం వేస్తాడు
ఆలికి అన్యాయం చేసైనా అంగడిబొమ్మ చేరతాడు!
**
పార్టీలు మారేటోడికి జాతి లేదు! నీతి లేదు!
గెలిచామా లేదా అంతే ఎవరేమనుకుంటే ఏమి?
**
కట్టి పడేస్తే వెట్టి చాకిరి
మెతకవహిస్తే అసరుకెసరు!
అసలు సరుకే కొసరు మోసం!
పిల్లి పెసరతో పాల ఫాక్టరి!
**
ఐకమత్యం అందమైన నినాదం!
రంగులోరంగు ఆనదని
(రం) గులతో ఆరంగ్రేటం!
ఓటేసేటోళ్ళు ఓటి వెధవలా?
నోటాతో నోటుని, నోటిని సాగనంపరా!
**
3.04.2014 11.06 am

|| గాదికింది పందికొక్కు ||

|| గాదికింది పందికొక్కు ||

సుప్రభాతవేళ కోకిల పాట కోసం
మావిడిచెట్టుకేసి చూసా!
కర్ణకఠోరంగా ప్రహరీగోడమీద
కాకి గోల మాత్రం చికాకు పెడుతోంది!
కిటికీ భళ్ళున మూసిన శబ్దం విని
'' కాకి అరుపు విన్నారుగా -
ఇక ఎవరో కొంపకు దిగేటట్టున్నారు!''
మా ఇంటావిడ శరసంధానానికి
'' అదొక్కటే తక్కూవైంది మనకి,
నా మొహాన కాస్త టీ నీళ్ళు పోస్తావూ ''
అన్నమాట వినిపించుకోకుండా
'' పండుగ నెత్తిమీద పడింది దాని సంగతి
దేవుల్లాడరా? '' ఎదురు దాడి టీ తోనే!
'' అందుకోలేనంత ఎత్తులో ధరలున్నపుడు
కొన్నింటిని పక్క వారినుండి అడుక్కోక తప్పదు గాని -
సంచి యిటు యివ్వు '' అన్నా
అడుగునబడ్డ బడుగు జాతి వాళ్ళం కదా
అడుక్కోటానికి సిగ్గులొదిలేసిన వాళ్ళం కూడ!
ముక్తసరిగా ముగించి టీ చప్పరించి
రోడ్డెక్కాను కొనేవి యేమిటి, అడుక్కునేవేమిటి
నెమరువేసుకుంటూ
'' వేప పూవు, మామిడాకు, మామిడిపింది
బెల్లం ముక్క, చింతపండు '' ఉగాది ప్రసాదానికి!
''ఈ మాయదారి పండుగలు
నెలాఖరునే రావాలా? వేతన జీవుల వెతలు మాటటుంచితే
బోడి విశ్రాంత బడుగుజీవి గతేమిటీ '' అనుకుంటు
మోహనరావు అంగడి చేరాను
అడగలేక చేతులు నలుపుకుంటుంటే
'' పాత బాకీ ఎప్పుడు చెల్లుబాటు
పండగ సరుకులకు పొద్దున్నే దాపురించారు?''
మునిసిపాలిటీ వారి ఇంటిపన్ను నోటీసులా!
లేని నవ్వు తెచ్చుకుని '' నిజమే దండగే అదే పండగ ''
నా సంజాయిషి పూర్తికాకుండా, నా మీద జాలో,
నానుండి అతను వసూలు పెరుగుతందనే ఆశో! నాకు తెలీదు కాని
'' పట్టండి తప్పుతుందా. .’’ విసుక్కుంటూ యిస్తుండగా
నా దృష్టి మాత్రం ఇంకెక్కడో..... అటు పక్కో జీపు యిటుపక్కో జీపు
''మాతో వస్తే 100 రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యాని పొట్లం ''
చెరో పక్కనుంచి నన్ను లాగుతున్నటనిపించింది!
'' ఆఁ...మాతో వస్తే 100 రూపాయలు, రెండు
బిర్యాని పొట్లాలు ''
ఎన్నికల ప్రచారానికి కూలివాళ్ళ వేటలో నా దగ్గరకే వచ్చినట్టుంది!
'' ఇటు చూస్తే బాదం హల్వా అటు చూస్తే ఇడ్లీ సాంబారు ''
ఎదో అవే మాటలు శ్రీశ్రీ అన్నట్లు గుర్తుకొచ్చి,
సంచి అందుకుంటూండగా
'' ఈ బాకీ, పాత బాకీ చెల్లింపు ఎప్పుడు.''
వెంటనే జవాబు చెప్పలేను......ఎదురుగావున్న అహ్వానాన్ని
అందుకుని, మౌనంగానే ఇంటి ముఖం పట్టాను!
చలపతి దొడ్లోంచి మామిడాకులు, మామిడిపిందెలు,
వెంకట్రావు దొడ్లో వేపపూవు సేకరించి
హడవుడిగా అడుగుపెట్టానో లేదో
ఇల్లు కడిగిన బురదలో జారి బొక్క బోర్లపడ్డాను
సరుకులన్నీ బురద, రెండు బిర్యాని పొట్లాలు వెక్కిరిస్తూ!
దులుపుకుని లేచాను, హతవిధీ అనుకుంటూ,
పండుగ సంబరం మాట అటుంచి
అటు వెతికి, యిటు వెతికి (పోపుల డబ్బా, చెక్కా బీరువా వెతకగా)
యాభై జమకూడితే సరితా క్లినిక్‌కు వెళ్ళి
ఇంజెక్షన్‌ చేయించుకుని
మంచం మీద విశ్రాంతి తీసుకుని
నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో కాని
'' నాన్నా! పండుగపూట దెబ్బలు తగిలాయా? ''
అంటూ మా అమ్మాయి పలుకరింపుతో
నా బాధలు, నొప్పులు మటుమాయమైనాయంటే నమ్మండి
అలా పలకరించిన మా అమ్మాయి అభిమానానికి
అన్నీ చికాకులు మటుమాయమయ్యాయి!
''పరామర్శలు ఆపితే ఉగాది పచ్చడి తీసుకొని
అన్నం తిందురుగాని రండి '' హోం మినిస్టర్ కేకతో
ఒక్కొక్కప్పుడు గాదికింది పందికొక్కు శబ్దాలు కూడ
సుమధుర కోకిల స్వరాలవుతాయని నన్ను నేను
సముదాయించుకున్నాను! **

కపిల రాంకుమార్ 9849535033

27, మార్చి 2014, గురువారం

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

పదవి రాదని - పరువు కోసం 
ప్రజల సైతం- మభ్యపెట్టి
లాభ నష్టపు - లెక్కలేస్తూ
గోతికాడి - నక్కలాగ
అదునుకోసం - ఎదురుచూసే
దొంగచూపులు - పట్టుకుని
చేరేదీసే - బుజ్జగింపులు .1

ఇంతకాలం - అంటకాగి
కొంతమూల్యం - వెనకవేసి
కంటకాలను - తాళలేక
సొంత గూటిని - కూల్చివేయ
పరుల పంచకు పరుగులిడుతు
గొర్రె దాటు సాకుల వెన్నుపోట్లు! .2

తెలిసి తెలిసి బూదిలోనె
పడుకొనే కుక్కవోలె
ముక్కచూసి తోకవూపులు
మొక్కవోని నమ్మకాలతో
చొంగకార్చె కేతిగాళ్ళు
ఎన్నికల కలలలోనే
పగటివేషగాళ్ళు
ఎన్నికలవేళలోనే
మన్నికైన నృత్యాలు
ఖర్చులేని వినోదంనీలి చలన చిత్రం!
కొత్తబిచ్చగాడు
పొద్దెరుగని చందాన
ఎక్కే గుమ్మం - దిగే గుమ్మం!
ఎక్కడో పడతాడు
తాతీసిన గోతిలో
కోలుకోలేని మచ్చలా!
మిగిలిపోతాడు! 3.

ప్రమాణాలు పాటించడు
ప్రణామాలు పెడుతుంటడు!
పరిణామాలూహించడు
పరిమాణమే హద్దంటడు! .4
నే చెప్పింది వేదంనన్ను అనుకరిస్తే పాపం!
మీరెట్టపోతే నాకెందుకు
అడ్డదారైనా సిగ్గువదిలైనా
గద్దెక్కటమే నా గురి!
తెగ బొక్కటమే తదుపరి! .5

చొక్కా మార్చటం
చక్కగా యేమార్చటం
చెక్కభజన చేయటం
తార్చైనా కుర్చీ ఎక్కటం!
రానివాడికి చోటులేదు
రాక్షసత్వం అబ్బనోడికి
రాజకీయ మనుగడుండదు! .6

27.3.2014

21, మార్చి 2014, శుక్రవారం

ఎవరు? అమ్మ కొడుకు||

కపిల రాంకుమార్|| ఎవరు? అమ్మ కొడుకు||

మానవ జన్మ మహత్తరమైనదని
వచిస్తూనే తోటి మానవులకు
ద్రోహం చేయడమేమిటి?


అక్షరాలను నేర్చిన పాఠశాలనే
పాంథశాలగానో, పానశాలగానో మార్చటమేమిటీ?
గురువులకే వంగి నమస్కరించిన వాడే
పంగనామాలెట్టడమేమిటి?

ప్రజల మద్దతుతో పదవులందుకొని
ప్రజలను నట్టేట ముంచడమేమిటీ?
అమ్మ పాలు కమ్మగా తాగి
రొమ్ములు కోసే నైజమేమిటీ?
గ్రామస్థాయి నుండి పార్లమెంటు మెట్లెక్కి
గ్రామసింహ స్థాయికి దిగజారుడేమిటి?
అంటే వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడేనా?

సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పక్షాన అత్యున్నత స్థాయికెదిగి
చొక్కా మార్చిన చందాన పార్టీలు మార్చి
నిన్న పొగిడి,
నేడు తెగనాడు వాడు
లం........కొడుకు కంటె హీనమగుటేమిటి?

చెట్టుపేరు చెప్పుకొని,
తాతల ప్రవరలు చెప్పుకొని
పబ్బం గడపటానికి ఈ వేదికే దొరొకిందా!
నిత్య కృత్య రాజకీయ వ్యభిచారమాచరిస్తూ
నికృష్ట బతుకులో
పందిలాగ బురదలో పొర్లుతూ
నీతి సూత్రాలు వల్లించుటేమిటి?

ఓటేసే ప్రజలు దేవుళ్ళంటూ దేవురించి
గట్టేక్కిన పిదప గద్దెక్కి వాళ్ళ
కూడు, గూడు, గుడ్డ గుంజుకుని
వివస్త్రులుగా, నిర్వాసితులుగా, ఆకటి కేకలకెరచేయుటేమిటి?

ఎత్తిన జెండా కడకంటా
మోయండం గొప్ప!
చచ్చిన పిదప కప్పించుకునే
గౌరవం పోగొట్టుకుంటే ఎలా?

ఇది రాజకీయమా?
అరాచకీయమా
''రా''క్షసంగా ''జ''నాలకు ''కీ''డుచేయు ''యం''త్రాంగ నైపుణ్యంతో
పదవీ కామ ప్రకోపాన
ప్రతాపాలు చూపువారు లం............కొడుకులు!

21.3.2014

|\అక్షర క్షిపణి|\

కపిల రాంకుమార్|\అక్షర క్షిపణి|\
ఓ అక్షరానికి మరో అక్షరం పేర్చటం కాదు
అది క్షిపణిలా పేలినపుడే కవిత్వం!
పళ్ళగొర్రుతో దమ్ము చేసిన చేలో వరినాట్లు
చదరంగపు గళ్ళున్నట్టుండాలి!
గాలికి వూగే జొన్నకంకులమీద వాలిన పిట్టలాగుండాలి
మబ్బులను అహ్వానిస్తూ ఆకాశంలో విన్యాసం చేసే తూనీగల్లాగుండాలి!
కొండరాళ్ళ మధ్య సెలయేటి సవ్వడిలా
నాట్యమయూరి సిరిమువ్వల ఝరిలా
యుద్ధభేరీ నినాదంలా వుండాలి కవిత్వం!
నైపుణ్యం సంతరించుకున్న శిల్పంలా
విప్లవ శంఖంలా
వసంతకాలపు వెచ్చని సూర్యోదయంలా
శారద రాత్రుల మలయ మారుతంలా
కొబ్బరిచెట్టునీడలో వాల్చిన పడకుర్చీలా
గండుతుమ్మెద రెక్కల సవ్వడిలా
పొగరెక్కి పొలంగట్టుమీద రంకేలేసే ఒంగోలు గిత్తలా!
ఎలకోయిల మధుర గానంలా!




జామాకు వగరులా!
వేపాకు చిగురు అనుపానంలా!
చెరుకుపానకంలో అద్దుకునే మినప రొట్టెలా!
రోమాంచిత సాహితీ స్పర్శలా!
వీర తిలకం దిద్దే పత్నిలా!
ధైర్యపు  భుజంమీది సంధించిన ఆయుధంలా!
శత్రు స్వప్న  సింహంలా !
జతగూడే అక్షరమే జతగాడౌతుంది!
పదాలతో పదాతిదళానికి మొనగాడైన అధిపతౌతుంది!
అసమర్థిని ఎంపికకు విరోధి అవుతుంది!
సమర్థునికి జయకేతనమౌతుంది!
నిత్య ప్రకాశ సత్యమై
నిబద్ధత కలిగివుంటుంది!
జన చైతన్య వికాసమై
ఎగిరే ఎర్రజెండాలా
భూతకాలపు జల్లెడై
వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ

భవిష్యత్తరుణ పతాకమౌతుంది.!

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక |

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక ||
ప్రతినెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక సమావేశం బి.వి.కె.  గ్రంథాలయంలో కపిల రాంకుమార్ మాట్లాడుతూ కవిత్వం - శిల్పం అధ్యయనంలో భాగంగా సుధామ వ్రాసిన  చిత్రగ్రంథి సంకలనం నుండి వివరన అనే కవితను  వినిపించారు. ఈ సమావేశం కపిల రాంకుమార్ అధ్యక్షత వహించగా డా.పొత్తూరు వేంకట సుబ్బారావు అతిథిగా విశ్లేషణ చేయటానికి, చర్చను కొనసాగించటానికి కన్నెగంటి వెంకటయ్య, రౌతు రవి వేదిక అలంకరించారు. చర్చను ప్రారంభిస్తూ డా.సుబ్బారావు గారు సుధామ కవిత్వం చిత్రగ్రంథి అనేపేరే శిల్పానికి సంబంధించినదని, శ్రీహర్షుడు  తన హర్ష నైషధంలో గ్రంథిస్ అనే పదాన్ని ఉపయోగించాడని, అది యోగవిద్యకు సంబంధించదని తెలిపారు. కవికి ప్రతిభ, ఉత్పత్తి పుష్కలంగా వున్నపుడు అద్భుతమైన కవిత్వాన్ని సృష్టిస్తాడని, లోక దృష్టి, లోక స్వభావం తెలుసుకోటం ద్వారానే అటువంటి అసమాన సృజన జరుగుతుందని తెలిపారు. పఠన, పాఠనం  ద్వారానే  సాహిత్యాన్ని సృష్టించకలుగుతాడని తెలుసుకోవాలన్నారు. సంవిధానం(శిల్పం)లో శ్రీశ్రీ దిట్ట. 
పద లక్షణాలు సుష్టుగా ఉపయోగించగలనేర్పరి కాబట్టి ఆయన పఠన, పాఠనాన్ని బాగా అల్లగలిగాడు. బ్రహ్మ గ్రంఠి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి  అనేవి మూడు యోగానికి చెందినవి. ఒక కవి యొక్క పూర్వాపరాలు తెలుసుకుంటే ఆ కవి హృదయలోకి మనం వెళ్ళవచ్చు, రూపం, బాహ్యం రసం అంతర లక్ష్యణం. రూపం అనేది భావాన్ని బట్టి వస్తుంది. కవిత్వం లోకానికి అద్దం వంటిది. అందుకే లోకాన్ని కవి నిశితంగా పరిశీలించాలి. అప్పుడే వస్తువుకు తగ్గ సరియైన 
రూపాన్ని ఇచ్చినపుడే మంచి కవిగా రాణిస్తాడు. ఆశ్చర్య చకితులను చేసేదే చిత్రం అంటాము ( రూపమే శిల్పం కదా) నీది కాని విషాదం లేదా ఆనందాలను నీలో ప్రేరేపింపకలిగించడమే కవిత్వం, లేదా కవిత్వ గొప్పదనం.  ప్రతిభ కవికి, చిత్రకారుడికి, గాయకుడికి వుండాలి. Imaginations are two  అందులో ఒకటి primary రెండోది secondary .  ఆకారమును చూసి మోసపోకూడదని  అని మనం గుర్తించాలి. అందుకే కవి అనధికార శాసనకర్త అని
 కూడా నిర్వచించారు. జీవితం మీద ప్రేమను పెంచాలి కవిత్వం.   స్వాంతనమైన సాంత్వనము కలిగించాలి ( ఓదార్చే హృదయాన్ని) అంటూ చక్కటి సోదాహరణలతో వారి విశ్లేషణ ముగిసింది. కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ చిత్రగ్రంథి పై చక్కటి విశ్లేషణ చేసారు. మాకు తెలియని విషయాన్ని విడమర్చి చెప్పారు. చాల కొత్త విషయాలను కూడా సుబ్బారావు గారి ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అంటూ కవి లక్షణాలు, కవిత్వ లక్షణాలు వివరించిన ర్తీరు బావుందని శిల్పంపైనే ఇవాళ చర్చ బాగ జరిగిందని అభిప్రాయం తెలిపారు.చర్చలో పాల్గొన్న సాహితీ స్ర్వంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి '' చిత్ర గ్రంథి ' పై చక్కటి విశ్లేషణ చాల బావుంది అంటూ '' మాక్సిమ్‌ గోర్కీ '' చెప్పినట్లు అవబోధనా శక్తి, బోధనాశక్తి ప్రతి మనిషిలో వుంటాయని, అవి మనిషి తనను తాను కాపాడుకోటానికి, పరిశీలనకు, మరింత లోతైన అవగాహనకు దోహదపడటాయని చెప్పాడన్నారు.   ఊహించటం,  అనుభూతిగా మార్చుకోటం, సత్యంగా ఆవిష్కరించడం ఎవరు నేర్పుగా చేస్తారో వారు తమ కవిత్వం ద్వారా లోకాన్ని ప్రభావితం చేస్తారని, జీవితం నవనవోన్మేషaగావుండే రీతిలోనే శిల్పానికి వుండే ప్రధాన్యత తెలుసుకొని బాగా అభ్యాసం చేయాలని, నిత్యం మారుతున్న సమాజాన్ని నిశితంగా పరిశీలించనిదే సజీవ సాహిత్యం రాదని తన చర్చను ముగించారు.  చర్చపై  సునంద,  సంపటం దుర్గా ప్రసాద్, బండారు రమేష్, డా. ఆంజనేయులుం ఎం. శేషగిరి,  శైలజ, బషీర్ మొదలగు వారు తమ తమ అభిప్రాయాలు చెప్పారు.  సంపటం దుర్గా ప్రసాదు వందన సమర్పణ చేస్తూ 31.1.2014 ఉగాది కవి సమ్మేళనం ఉదయం 10 గంటలకు నిర్వహించాలని అనుకుంటున్నామని. సమాచారాన్ని త్వరలో తెలియపరుస్తామని, సాహితీ అధ్యయన వేదిక ఈ సమావేశం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత జరుపుకుంటున్న మొదటి సమావేశమని అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

5, మార్చి 2014, బుధవారం

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!: బూచి..! పుట్ట్టల్లో,పిట్టల్లో,పువ్వుల్లో,నవ్వుల్లో కలిసిపోయి ఆడుకుంటూ..., గాలిలో,దూళిలో కలతిరుగుతూ, పావురంలా,పాలపిట్టలా ,గా...

|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||

కపిల రాంకుమార్|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||
రక్తం సూర్యుడ్ని ఆవిష్కరించి, చర్యల ప్రతిచర్యల పరిష్వంగంలో నేత్ర ధనుష్ఠంకారం చేసి, భారమితి తో తులనాత్మకం చేసి, మోహనమైన కవిత్వాన్ని భూనభోంతరాలు దద్దరిల్లచేసిన కవిత్వ సంపుటిని తన మాటలతో సంజాయిషి తనకు తానే యిచ్చి, కవి ప్రపంచాన్ని మెప్పించి, ఎందరో నూతన కలాలకు చక్కటి ఒరవడ్డి దిద్దే ఆంగ్లోపాధ్యాయుని తెలుగు కవితా విశ్వరూపం అలా ఓ చిన్న నేతిబొట్టులా కవితా భోజన ప్రియులకు అందిస్తున్నాను......
'' రక్తం /చుక్క
వీగిపోయి / చెమట
చుక్కగా రూపందింది
చెమట చుక్క్క తకెత్తదు!
ప్రశ్నించదు!
నమ్మకంగా పంజేస్తుంది ''
**
'' కాని
సిరా చుక్కవుంది చూశావ్
విద్యుదాగారంవిప్లవా వాసం!
సిరా చుక్క స్పర్శ
చెమట చుక్కని రక్తం చేస్తుంది
కల్తీ లేని కణకణలేని / నిప్పులాంటి రక్తాన్ని చేస్తుంది! '' అందుకే / రక్తం సూర్యుడు! రక్తం ప్రతిచర్య!
**
శివారెడ్డి ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టడం కోసమో, లేదా మెప్పు సంపాదించటానికో కవిత్వ రాయలేదు. తనని తాని చీల్చుకుని, మధించి, మదించి, విశ్లేషించి, దహించికొని, పుటం పెట్టుకొని, నికార్సయిన సమాధానంలా, ఒక నిజాయితీ నింపుకొన్న, ధర్మంగానే రాసానన్నారు. తాను నమ్మకుండా, ఆసాంతం దాని లోతు తెలుసుకోకుండా, ప్రలోభాలతోనో, ఊసుపోకో మాత్రం రాయలేదంటారు. తరిచి, శోధించి, పరీక్షించి, ఫలితం వస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత కవిత్వంతో అడుగుల పిడుగులు కురిపించారు. తన చిన్నతనంలో పడిన జీవన వాస్తవాల ఒడుదుడుకులను, బాల్యంలోని అన్ని అవస్థలను మరిచిపోలేదు కాబట్టే, ఆ ప్రభావం తన కవిత్వంలో పారదర్శకంగా చూపించకలిగారు. అమ్మ గతించిన బాధకాని, పల్లెటూరి పిల్లగాడి సహజ భయాలు, ఆందోళనలు జ్ఞప్తికి తెచ్చుకుని, జానపదులు పాడిన కీర్తనలు, తత్వాలు, బుడబుక్కలవాని ఆటపాట, గారడీవాని జిమిక్కులు, తొలకరి వానజల్లుల్లో తడిసి జలుబు చేసిన రోజులు, పశులకొట్టంలోని పేద, గొడ్లు తొక్కిన గడ్డి, రొచ్చు, అక్కడక్కడ తాను చూచిన ఎత్తు అరుగుల వాకిళ్ళు, కిచకిచమని సవ్వడిచేసే పిచుకలు, తాడిచెట్ల విహారం, వాగుల్లోని యిసుకతిన్నెలపై కట్టుకున్న గుజ్జగూళ్ళు, బడికి వెళ్ళేరోజుల్లో చేసిన అల్లరి, పడ్డ వేదనలు, రాత్రుల్లో గుడిసెలో కిటికి వద్ద ఎగిరే మిణుగురుల వెలుగు, వెన్నెల రాత్రులు, ఉక్కపోతల మండువేసవి, కాలువల్లో ఈతలు, అనాధ బాల్యాలు పరిశీలనలు, ఏకాకితనాలు, కేరింతలు, ఏడుపులు, ఫిర్యాదులు, యెన్నో అంతర్లోకాన్ని గుర్తుతెచ్చుకుంటూ, వాటి తాలూక శకలాలు వెంటాడాయి కాబట్టే మనకు ఇలాంటి కవిత్వాన్ని అందించాడేమోననిపిస్తుంది. ఒక దశలో ఆంగ్ల కవులను చదివినా, అప్పకవీయం ఔపోసన పట్టినా, ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలను సమాంతరంగా సవసాచిలా నడిపినవారు శివారెడ్డి.అందులో అతిశయోక్తిలేదు. '' చర్య - ఇన్నాళనుండి చావిట్లోనేవుందట! పుట్టిన దగ్గరనుండి మేకుకు కట్టేయబడేవుండట!
కోడేదూడ!
బయట కట్టేద్దామని తీసుకొస్తుంటే ఓక గుద్దు గుద్ది ఎత్తిపడేసి దేశాలమీద పాడిందట!....
స్వేచ్చలో స్వేచ్ఛగా స్వేచ్చకై ....
కట్టెయటమంటే - తెంపుకుపొమ్మనే....
అణిచిపెట్టటమంటే ఎదురుతిరిగమనే ....
అసంకల్పిత ప్రకార చర్యని చాల హృద్యంగా చెప్తారు '' చర్య '' లో.
పరిశీలనం, జ్ఞాన సముపార్జనం, తులనాత్మకం కవనానికి అవసరం ప్రపంచపు పోకడేమిటి? ఎటుపోతోంది? మానవుడి స్థితి గతేమిటీ? రష్యా యేమిటి, చైనా యేమిటి, రాజకీయాలమేటీ, అన్యాయాలేమీటి, నిజాయితీ యేమిటీ. ఆర్థిక సంక్షోభాలేమిటి, ధంస్వామ్యం యేమిటీ, భూస్వామ్యం యేమిటీ, చరిత్ర, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, నష్టాలు, మతాలు, కులాలు, హిందూ, బౌద్ధ, జైన, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య బోధనలేమిటీ. రాహుల్ సాంకృత్యాయం ఎవరు? యిలాంటి ప్రశ్నలు, సందేహాలు తీర్చుకోలేకపోతే కవిత్వానికి సరుకెక్కెడిది? అందుకేనేమో అధ్యయనం అవసరమని నొక్కి చెబుతారు. ఆర్థిక విధానాలు మిశ్రమ ఆర్థిక విధానాలు, స్వాతంత్ర్యం ఎందుకు, దాని లక్ష్యం యేమిటీ ఇలాంటి పెక్కు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకోవాలి కదా కవి అన్నవాడు. క్రాంతి దర్శకుడు కావాలి కదా! సాహిత్యంలో వస్తున్న విభిన్న ధోరణులెందుకు ఉత్పన్నం అయ్యాయి. ఒక దానిని మించి యింకొకటా? ప్రత్యామ్నాయమా? వక్రధోరణా, అరసం యేమిటీ, విరసం యేమిటీ, కవిత్వాభివృద్ధికి యేది దోహదపడుతుంది. యిలా తర్జమ భర్జన పడితేనే నికార్సయిన సాధన ద్వారానే కలకాలం నిల్చేకవిత్వం తిక్కన లాగ గురజాడలాగ, వేమన లాగ శ్రీశ్రీ లాగ, ఆరుద్రలాగ, కుందుర్తిలాగ, సృజనచేసే ప్రజ్ఞాపాటవం అలవడాలంటే నిరంతర అధ్యయనం, అనుసరణ, అవగాహన యెంతో అవసరం అంటారు శివారెడ్డి.
భారమితి - కొలమానం కావొచ్చు - మరేదయినా కావొచ్చు కాని - '' కవిత్వానికి కాలం చెల్లిందనో, ఇది కవిత్వానికి కాలం కాదనో, అంతా స్థబ్దత యేర్పడిందనో.....చాలా మంది చేతులెస్తేసారట..... కాని శివారెడ్డి ఒప్పుకోరు కాబట్టే చేత్తో తలుపుమీద గుద్దటం కవిత్వం అంటారు. బోర్లా పడుకుని భూమిని వాటేసుకుంటే కవిత్వం, ముక్కుతో గాలిని వలేసి పట్టడం కవిత్వం, అప్రయత్నంగా చేయి మీసం మీదకి వెళ్ళి, గడ్డాన్ని సవరించుకోటం కవిత్వం, లేదా ఎర్రబడిన ఉదయం, శ్రీకాకుళ పోరాటం, జగిత్యాల జముకల కథ, శిర్సెత్తిన ధర్మపురి, అర్కాటి జిల్లాల్లో నినదించిన వాహకం కవిత్వం.... ముడి యినుము నల్లని రేయిని ఎర్రగా కాల్చి సాగ్గొట్టిన ఆయుధం చేస్తున్న అరణ్యమూ కవిత్వమే అంటూ చేతులన్నీ ఒక్కసారి లేచి ' ఇంక్విలాబ్ ' అంటే ఆకాశమంతా కవిత్వమే, ఈ విశ్వంలోని గాలి, భూమి కవిత్వమే! అంటారు శివారెడ్డి. ఏ విషయాన్నైనా కుండ బద్దలకొట్టి నిర్భయంగా చెప్పటం శివారెడ్డికి అలవాటు. తాను ఏ వామపక్ష పార్టీ సభ్యుడు కాకపోయినా శ్రీశ్రీ మాటల్లోంచి మంచి కమ్యూనిస్టుగాను, మార్క్సిస్టుగాను ఒప్పుకుంటారు. కమ్యూనిజం పట్ల యితర సభ్యులకంటే అపారమైన అవ్యాజ ప్రేమ, గౌరవం వుందని చెబుతారు.. తాను నమ్మాడు కాబట్టి ఒకరి మెప్పుకోసమో, ప్రేరేపించడానికో సంతోషపెట్టడానికో కాకూండా, అధ్యయన మాత్రాన మాత్రమే ప్రపంచ రాజకీయాల్ని లోతుగా పరిశీలించిన ఫలితంగానే తన వాజ్ఙ్మూలం ఇచ్చారు శివారెడ్డి.
మోహనరాగం ఆలపించన శివారెడ్డి
'' నాకింద పక్కలాగో / నావకింద నీళ్ళలాగో / కళ్ళకీంద నీడలాగో / ఆకాశంకింద పక్షి లాగో/ ఆకు సందుల్లో నర్తించే కిరణపుంజంలాగో / ఎండాకాల గాలి నుండి పైకి లేచినప్పుడు నువ్వుకనబడతావు/ వీధిలో ఎర్రటి సూర్యుడు రాయి నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినబడతావు ''.....అంటూ తనకవితలో /'' చేదైనా వేపచెట్టు చిగురించిన వసంత కాలంలా నువ్వు అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు '' అంతకుముందు కవితలలో నిప్పులు కురిపించిన శివారెడ్డి లాలిత్యమైన పదాలను మోహనా! మోహనా! అంటూ కొత్త కోణం ఆవిష్కరించారు. '' దయలేని విధి నిర్వహణలో / రోజుకో అంగం తర్పణ గావించాలికదా /బతుకు మోహనా బతుకు! /బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన / బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన / బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!........తన ఆశంసను వ్యక్తపరచటంలో సఫలీకృతుడైనారు. తన పరిమితులకు లోబడి ఉద్యమాలలో తన కున్న సంబంధాల పరిమితులకు లోబడి తన శక్త్యానుసారం, సమాజ సందర్భంగా తాను తనను వ్యక్తీకరించుకుంటానంటూ, చేసే ప్రయత్నమే శివారెడ్డి కవిత్వం! ప్రజలకేనిటో చెప్పేప్రయత్నమే తన కవిత్వం! తన జీవితం నుండి తనను విడదీసినా, ఈ సమాజం నుండి కాని కాలాన్నుండి కాని విడదీసినట్లైతే తన కవిత్వమే మిగలదని, తనకవిత్వమే కాదు అసలు యే సాహిత్యమూ మనజాలదు, మిగలదు. అందుకే వారి మాటల్లోనే
'' నా సోదరులకి కళ్ళిచ్చాను
నా కామ్రేడ్స్‌కి చేతులిచ్చాను
నా దేశానికి నా దేహానిచ్చాను
కాదు నాదేశమే నాదేహం ''
నేను తుడుం తయారు చేసే వాణ్ణి, నేను ఆయుధాలు తయారుచేసే వాణ్ణి, నేను పాటలు కట్టేఏ వాణ్ణి. మీ అనేకానేక కాంక్షలకి, ఆశలకి, ఊహలకి తగినట్టుగా పాటలు కట్టే వాణ్ణి
- నేను పాటలు కట్టే వాణ్ణి...కె. శివారెడ్డి. ''

ఇది శివమెత్తిన కె. శివారెడ్డి గురించిన స్వల్ప పరిచయం
4.3.2014