Sunday, November 18, 2012

మా మట్టివేళ్ళకు స్వాగతమిస్తూ ! ! !

కపిల రాంకుమార్//మట్టి వేళ్ళు//

మా మట్టివేళ్ళకు స్వాగతమిస్తూ ! ! !
ఈ మట్టిలో వేళ్ళూనికొని చెట్లపై మొన్నటిదాకా
కి్చ కిచలాడిన ఓ పూరేడు పిట్ట
సత్తుపల్లి నుండి భాగ్యనగరానికి వలసెళ్ళింది!
సంచిలోని విత్తుకు తడి తగిలిందేమో
చిన్నమొక్కైంది!

గతంలో సత్యాన్వేషిగా మొదలై
సాహితీ స్రవంతి నీడలో కాస్త సేదతీరి
ఇక్కడి రాత కోతల్నీ దాచుకున్న కవితల్నీ
కట్టకట్టిన దస్త్రాన్ని విప్పీ
తోటి పక్షులకు ఎరవేసే క్రమంలో
కారేపల్లి యాకూబ్ పిలుపు బుజానవేసుకొని
కాశీరాజు తోడుచేసుకొని విత్తనాలు ఎరగాచల్లింది
ఆదర్వు దొరకాలేకాని వలలో వాలిన  పిట్టలను కూడేసి
కవి సంగమంలొ  కట్టిపడేసేలా
ఫంజరం ఏర్పాటుచేస్తే అంతర్జాలంలో చిక్కుకొని
అంతర్థానమై పోతున్న గమ్యరహిత కొత్త పిట్టల్ని
సాన పట్టలని తలచి, వారికి తోడుగా చేయి తిరిగినవాళ్ళను
జతకలిపే క్రమంలో ఓ చోటుకు చేర్చి,
ఇప్పుడు తన మట్టివేళ్ళ సత్తువని సత్తుపల్లిలో
వ్యంగ్య, హాస్య, అభ్యుదయ భావజాలాన్ని
చూపించడానికి
ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు
కష్టపడి, కట్టుబడిచేస్తున్న
కట్టానికి తొ్లి ఫలం
గట్టి వేళ్ళూనుకోవాలని ఆశిస్తూనే
ఆ వాసన ఖమ్మం బోడేపూడి విజ్ఞానకేంద్రంలో
గ్రంఠాలయంలో గ్రంథం పరిచయవవడం
ఆనందకరం! ఆభినందనీయం!

18.11.2012 ఉ.6.27.
ఈ రోజు సాయంత్రం ఖమ్మం మిత్రులు పరిచయ సభను బొడెపుడి విజ్ఞాన కెంద్రం లొ ఎర్పాటు చెసారు.. అందుబాటులోవున్న వారందరికి స్వాగతం!



No comments: