Tuesday, October 1, 2024

జాగోం సబ్ లోగోం

 జాగో సబ్ లోగోం


ఎందుకండీ ఆచరణకు నోచుకోని

ప్రతిజ్ఞ రోజూ  వల్లెవేయిస్తారు బడిలో

అన్నదమ్ములనే బోధనచేస్తుంటారు

కాని దేశంలో భాషలు జాతులు  

భిన్నత్వంలో ఏకత్వం అనేది

ఒక కుహనా భావనే తప్ప నిజంకాదు

ఎందుకో కొంతమంది 

పాలకుల పుణ్యమా అని

వాస్తవానికి దానికి విలోమంగా ఉన్నాయన్నది నగ్న సత్యం

చెప్పేవి శ్రీరంగనీతులు 

దూరేవి...గుడెసలన్న చందాన రాజ్యమేలే

కమలనాథుల ప్రభుత్వ పాలనలో

రాజ్యాంగానికి చిల్లులు పెడుతు

కాలంచెల్లని మనుస్మృతిని అంటుపెడుతుంటే

లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉరేసుకోబోతుంటే

స్తోత్రాలు వల్లిస్తూ గమ్మునుండటం కాదు

అనివార్యంగా

పిడికిలి బిగించి ప్రజాపోరుకు సిద్ధపడాలి...


No comments: