Monday, February 18, 2013

|ఎర్రపిడికిలి|| కె.వి.రమణారెడ్డి||| పుస్తకపరిచయం||


కపిల రాంకుమార్|| పుస్తకపరిచయం||
||ఎర్రపిడికిలి|| కె.వి.రమణారెడ్డి||
________________________________
విరసం – ప్రచురణ సెప్టెంబర్ 1972 వెల రు.3/=
బాలాజీ పబ్లిషర్స్ – బజారు వీధి – తిరుపతి
_______________________________ ముందుమాట త్రిపురనేని మధుసూదనరావు ” ఎప్పూదూ, ఇప్పుడులోనే”
1.కొంత మంది కవులు కలం పట్టుకున్న రోజునే ముసలాళ్ళు. సావిత్రో, ఊర్వశో, రాముడో అవేశించి (ఆవహించి ) పాత కాలాన్ని నెమరేస్తూ భూతకాలపు కవిత్వాన్ని రాస్తారు. శవ వాహకులుగా మిగుల్తారు. నిన్నటి గురించి రాయగలరు కాని నిన్నలా జీవించి రాయటం సాధ్యంకాని పని.”
2.ఇంకో రకం ఆధునికత పేరుకోసం ఒక రోజున ఆ రోజు గురించే కవిత రాస్తారు. జీవిత కాలలెండరులో ఆరోజు తొలిగిపోయినా అందులోనే కూరుకుపోతారు. వెనక్కి పరిగెత్తటంలో వీళ్ళు భూతకవులు (పై వారితో) పందాలు కాస్తారు, వేస్తారు–అవకాశవాద కవులౌతారు.”
3. నిజమైన కవులు ఎప్పుడు, ఇప్పుడులోనే జీవిస్తారు. పాతబడిన ఆయుధాలను విసిరి కొత్త కొత్త గతుల్ని, కత్తుల్ని వెతుక్కుంటారు. గమ్యం చేరేదాకా, శిఖరాన్ని అధిరోహించేదాకా ముందుకే నడుస్తారు.
కటకటాలు కరకరమంటున్నా,తుపాకులు మ్రోగుతున్నా..ముందుకే..పరుగెత్తే వాడే ప్రజాకవి..రమణారెడ్డి యీ కోవకు చెందిన ప్రజాకవి. ప్రజా వుద్య్మాల్ను అనుసరిస్తూ, ప్రజాస్వామ్య వలలు పన్ని మభ్యపెట్టె పార్లమెంటరీ విధానాన్ని
యెదురొడ్డి, బలికాకుండ, నిజమైన ప్రజా వైఖరిని సమర్థిస్తూ సందేశిస్తూ,అక్షర శక్తి సమర్పించాడు.రెండు దశాబ్దాల నుండి నవ కవే, యువకవే (1972 నాటి వ్యాఖ్యలో) అడవి, భువనఘోష, అంగారవల్లి రాసి..యిపుడు ‘ ఎర్ర పిడికిలి ‘ బిగించాడు……
రమణారెడ్డి కవి కాడనే అర్భకులున్నారు (నిరాకరించే అర్చకులూ వున్నారు) వాళ్ళ ప్రమాణాలకు సరితూగే కవికాకపోవటమే గొప్ప విషయం. ” నీ శత్రువు అభినందిస్తున్నాడంటే నీలో నిస్సందేహంగా లోపం వున్నట్లే ” అయితే సాను భూతి పరులు కూడ ఆ మాట అంటే అది వారి తప్పు కాదు. ఆదిలో రేమణరెడ్డి కవిత్వంలో శిల్ప వ్యామోహం, భాషా భేషజం మెండు, పండితులని మెప్పించాలనే పరోక్ష కాంక్ష వున్నందున, అభ్యుదయ కవిత్వ పాఠకులకు కొంత దూరమయ్యాడు. దాన్ని అధిగమించే రీతిలో సంస్కరించుకున్నాడు కాబట్టే ‘ ఎర్రపిడికిలి ” యెత్తాడు, ప్రజా హృదయాలమీద ముద్ర వేసే స్థాయిలో>>>>>
కత్తుల చక్రం – తిప్పుతూ ‘ అయ్యా! కవి వర్యా/ కొయ్య లాగుంటే మొయ్య బరువయ్యా!/కత్తిలాగుంటేనే ఘనమయ్యా! ” 9/1972
స్వాహాతంత్రం – మంత్రం జపిస్తూ (1) ఎట్లాగైతే వచ్చింది/బేరమాడితే అచ్చింది / ఎవరు తెస్తేనే వచ్చింద్/అట్లా యిస్తే వచ్చింది/ యెప్పుడైఅతేనేం వచ్చింది – చచ్చి చేదుగా వచ్చిందీయెవ్విధమైతేం వచ్చింది – విప్లవాన్ని చంపి తాను వచ్చింది ”
2) ” ద్వీపాంతర వాసాల ముగింపుపై/ ఉరి చెర శిక్షల కెల్లా తుడుపై/ విప్లవకారుల గోరీ రాయై/ పితూరిదారుల శవాల గోయ్యై, రక్తం పంటల నింపిన గాదై/ ధూర్తుడెక్కి కూర్చున్న గాడిదై/ పెత్తందారుల ఉంపుడుగత్తై/ హంగు చేసుకుని వచ్చింది ” 8/72
….
” ఎర్రపిడికిలి ” లో
కలలు కంటు కవిత రాస్తూ
కలను మెలుకువతో పెనవేస్తూ!
అడవి పిట్టలు బదులు చెబుతూ
పాడుతూ పోరాడుతుంటివిగా!
పళ్లలోపల దొండపండూ – పూవుల్లో మందారపువ్వూ
పేరు నీది తలచుకొంటె – గుర్తువస్తై ఎర్రయెర్రంగా!
….
ఒంటి నిండా యెర్ర్ జెండా
ఉదయసంధ్యే కప్పివేస్తే!
గాయమే కనిపించకుండా
అడవికొమ్మలు రెమ్మలిచ్చిందా!
ఒత్తుకున్నం కంటిలో తడి – ఎత్తుకున్నాం ఎర్రపిడికిలి!
సత్యమెన్నడు చావదంటున్నాం – నీకీర్తి మూర్తే తరగదంటున్నాం ” 21.5.72
________________________________________________
ముక్తాయింపు నాది.
యిలా ఎన్నో యెన్నెన్నో………చదవాలని కోరుకుంటాను.
18.2.2013 ఉ. 1016

No comments: