Friday, January 18, 2013

||శ్రీశ్రీ యుగం ||అరుదైన పుస్తక పరిచయం

|శ్రీశ్రీ యుగం ||అరుదైన పుస్తక పరిచయం

ImageImage
(ఆధునిక కవితా సంపుటి) చిత్ర భారతి పబ్లికేషను 10-ఎ. పిళ్ళయార్ కోయిల్ స్ట్రీట్ , మద్రాసు 78
వెల :రు.1-25 సంపాదకుడు-నిర్వాహకుడు : కాపుగంటి వి. రమణరావు
1-10-1961
ఇందులో మొదట ఆరుద్ర – యుగక్ర్త చరిత్ర రాయగా,శ్రీశ్రీ, -శరచ్చంద్రిి దీర్ఘ కవిత రాసాడు. అంజలిని – ఎస్.వి.జోగారావు, తర్వాత పుస్తకాన్ని శ్రీశ్రీకి అంకితం చేస్తూ అక్షర లక్షాధికారి మాటల కోటీశ్వరుడు అని పేర్కొన్నారు. ఎర్ర మందారాలు – ఆదుర్తి వెంకటనరసింహమూర్తి మొదటి కవిత, వరుసగా తిలక్, సంపత్, నారాయణ్రెడ్డి, దాశరథి, సోమసుందర్, శశాంక, ఏల్చూరి, ఒఉరిపండా, కాళోజీ, ఆనిసెట్టి, కుందుర్తి, రెంటాలం బెల్లంకొండ, పఠాభి, ్బైరాగి, కె.వి.రమణారెడ్డి, అజంతా, రాజశ్రీ, పాంచాలి, తెన్నేటి సూరి, తెన్నేటి హేమలతాదేవి, మాదిరాజు రంగారావు, చిరంజీవ్, సారథు, మధుబాబు మున్నగు వారి కవితలు చోటు చేసుకున్నాయి, ఇది అరుదైన పుస్తకం. దొరికితే చదవండి జిల్లా గ్రంథాలయాల్లో.
18.01.2013 (ఇది మా గ్రంథాలయంలో ఉన్నది) ఉ.10.50

No comments: